ఎయిర్‌ ఏషియా విమానం అత్యవసర ల్యాండింగ్‌ | Air Asia Flight Emergency Landing At Shamshabad Airport | Sakshi
Sakshi News home page

ఎయిర్‌ ఏషియా విమానానికి తప్పిన ముప్పు

Published Tue, May 26 2020 5:26 PM | Last Updated on Tue, May 26 2020 5:58 PM

Air Asia Flight Emergency Landing At Shamshabad Airport - Sakshi

ఎ-320 విమానం పైలట్‌‌ ఒక ఇంజిన్‌లో ఫ్యూయల్‌ లీకేజీని గుర్తించారు. ముందు జాగ్రత్త చర్యగా దానిని నిలిపివేసి.. ఒకే ఇంజిన్‌పై రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండింగ్‌ చేశారు.

సాక్షి, హైదరాబాద్‌: జైపూర్‌ నుంచి హైదరాబాద్‌ వస్తున్న ఎయిర్‌ ఏషియా విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో విమానం అత్యవసరంగా ల్యాండింగ్‌ అయింది. మంగళవారం మధ్యాహ్నం ఈ సంఘటన జరిగింది. ఎ-320 విమానం పైలట్‌‌ ఒక ఇంజిన్‌లో ఫ్యూయల్‌ లీకేజీని గుర్తించారు. ముందు జాగ్రత్త చర్యగా దానిని నిలిపివేసి.. ఒకే ఇంజిన్‌పై రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండింగ్‌ చేశారు. విమానంలో 76 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎ-320 విమానంలో సాంకేతిక లోపంపై స్పందించిన ఏయిర్‌ ఏషియా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విచారణకు సహకరిస్తామని తెలిపింది. పైలట్ల‌ చాకచక్యంతో ప్రమాదం తప్పిందని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement