
సాక్షి, హైదరాబాద్ : మణికొండలోని భాష్యం బ్లూమ్స్ పాఠశాలలో అయిదవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జాతీయస్థాయిలో సత్తా చాటిన క్రీడాకారులను సత్కరించారు. మెరిట్ విద్యార్థులతో పాటు తల్లిదండ్రులను కూడా సత్కరించారు. స్కూల్ ప్రిన్సిపల్ పాల్ ఆధ్వర్యంలో కొనసాగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు దేశభక్తిని చాటిచెప్పేలా సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. వీటిలో చిన్నారులు చేసిన నృత్యాలు, కరాటే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో దాగున్న సృజనాత్మకతను వెలికితీసేందుకు దోహదపడతాయని ముఖ్య అతిధులు పేర్కొన్నారు.


Comments
Please login to add a commentAdd a comment