celebrartions
-
విదేశాల్లోనూ ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
సాక్షి, అమరావతి : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను అనేక దేశాల్లోని ఎన్నారైలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం అక్కడి బే ఏరియా, డల్లాస్, అట్లాంటా, న్యూయార్క్, న్యూజెర్సీ తదితర ప్రాంతాల్లో ఎన్నారైలు వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా భారీఎత్తున కేక్లు కట్చేసి.. విందు భోజనాలతో ఘనంగా నిర్వహించారు. అలాగే.. బ్రిటన్లోనూ అంగరంగ వైభవంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు జరిగాయి. లండన్ ఈస్ట్ హాంలో వైఎస్సార్సీపీ యూకే కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్చింతా ప్రదీప్, ఓబుల్రెడ్డి పాతకోట అధ్యక్షతన నిర్వహించిన జగన్ జన్మదిన వేడుకల్లో ఆ దేశం నలుమూలల నుంచి జగన్ అభిమానాలు భారీఎత్తున పాల్గొని అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా చింతా ప్రదీప్ మాట్లాడుతూ.. ఒకటే జీవితం, ఒక్కటే రాజకీయ పార్టీ, ఒక్కడే నాయకుడు వైఎస్ జగన్ అని చెప్పడంతో జై జగన్ నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది. దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైఎస్ విమలారెడ్డి తనయుడు యువరాజ్రెడ్డి ఆన్లైన్లో యూకేలోని అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. ఎన్నారైలకు అభినందనలు : చెవిరెడ్డిఅనేక దేశాల్లో భారీఎత్తున వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు నిర్వహించిన ఎన్నారైలను ఆ పార్టీ అనుబంధ విభాగాల ఇన్చార్జ్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అభినందించారు. జగన్ పాలనలో సంక్షేమాభివృద్ధి పథకాలతో రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించడం తథ్యమని.. జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయమని చెప్పారు.సింగపూర్లోనూ సంబరాలు..వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు సింగపూర్లో కూడా ఆదివారం ఎన్నారైలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సింగపూర్ వైఎస్సార్సీపీ కన్వీనర్ మురళీకృష్ణారెడ్డి, అడ్వైజర్ కోటిరెడ్డి, మలేసియా కన్వీనర్ భాస్కర్రెడ్డిలతో పాటు పెద్ద సంఖ్యలో జగన్ అభిమానులు పాల్గొన్నారు. సంక్షేమ పాలన అందించడంలో తండ్రిని మించిన తనయుడిగా.. అన్ని వర్గాల ప్రజలకు ఆప్తబంధువుగా.. విద్య, వైద్యం, పోర్టులు నిర్మించి అభివృద్ధికి బాటలు వేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపారని జగన్ను కొనియాడారు.మరిన్ని ఎన్ఆర్ఐ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి! దుబాయ్లో అత్యంత వైభవంగా..ఇక యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్లో మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరావు, వైఎస్సార్సీపీ ఎన్నాౖరె కమిటీ సలహాదారు ప్రసన్న సోమిరెడ్డి, వైఎస్సార్సీపీ యూఏఈ కో–కన్వీనర్ మైనర్ బాబు, తదితరుల ఆధ్వర్యంలో దుబాయ్లోని హోటల్ విస్తాలో నిర్వహించిన వేడుకల్లో ఆ దేశం నలుమూల నుంచి అభిమానులు భారీఎత్తున పాల్గొన్నారు. అనంతరం.. కారుమూరి నాగేశ్వరావు తదితర వక్తలు జగన్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిలా శక్తివంచన లేకుండా పనిచేసి వైఎస్సార్సీపీని అఖండ మెజార్టీతో గెలిపించుకుని.. వైఎస్ జగన్ను మళ్లీ సీఎంగా చేద్దామని పిలుపిచ్చారు. మరోవైపు.. కెనడా, ఖతార్, నెదర్లాండ్, ఐర్లాండ్, ఆస్ట్రేలియా (మెల్బోర్న్, సిడ్నీ, బ్రిస్బేన్), జర్మనీ తదితర దేశాల్లోనూ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారుగ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మృణాల్ ఠాకూర్ ఇంట్లో పండుగ.. ఆ పాత ఫోటోలను షేర్ చేసిన బ్యూటీ
-
డాలస్లో ఘనంగా అక్కినేని శతజయంతి వేడుకలు..!
దాదాసాహెబ్ పురస్కార గ్రహీత, పద్మవిభూషణ్, నట సామ్రాట్, డా. అక్కినేని నాగేశ్వరరావు గారి జన్మదినమైన సెప్టెంబర్ 20న డాలస్ నగరం (యాలెన్, రాధాకృష్ణ టెంపుల్ ఆడిటోరియం) లో క్రిక్కిరిసిన అక్కినేని అభిమానులందరి మధ్య అక్కినేని శతజయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.అక్కినేని ఫౌండేషన్ అఫ్ అమెరికా వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, పూర్వాధ్యక్షులు రవి కొండబోలు, రావు కల్వాల, శారద ఆకునూరి, చలపతిరావు కొండ్రకుంట, డా. శ్రీనివాసరెడ్డి ఆళ్ళ, ధామ భక్తవత్సలు వేడుకల ఏర్పాట్లను పర్యవేక్షించారు.ఏఎఫ్.ఏ ప్రస్తుత అధ్యక్షులు మురళి వెన్నం అందరికీ స్వాగతం పలికి డా. అక్కినేనితో ఉన్న సన్నిహిత అనుబంధాన్ని, గత పది సంవత్సరాలగా ఫౌండేషన్ ద్వారా జరుగుతున్న కార్యక్రమాలను ఉదాహరణంగా వివరించారు.ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ సినదర్శకులు వి.ఎన్ ఆదిత్య డా. అక్కినేనికి తొలిసారి తాను రాసుకున్న సినిమాకథను వినిపించడం, ఆయన కథ విని ఇచ్చిన సలహాలు, తన జీవితాంతం పాటించే విలువైన అంశాలు అన్నారు. విశిష్టఅతిథిగా పాల్గొన్న తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ ఛైర్మన్ మోహన్ శ్యాం ప్రసాద్ మునగాల మాట్లాడుతూ స్వయంకృషితో ఎవ్వరూ ఊహించని ఎత్తుకు ఎదిగిన ఏ.ఎన్.ఆర్ జీవితం అందరికీ ఆదర్శప్రాయం అన్నారు.ప్రత్యేక అతిథులుగా హాజరైన పంచ సహస్రావధాని డా. మేడసాని మోహన్, అచ్చతెలుగు అవధాని డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ లు డా. అక్కినేనితో తమ అనుభవాలను పంచుకుంటూ ఆయన పెద్దగా చదువుకోలేక పోయినప్పటికీ ఆయన చేసిన విద్యాదానం ద్వారా ఎంతోమంది విద్యావంతులను సృష్టించిన మేధావి అక్కినేని అంటూ కొనియాడారు.ఈ కార్యక్రమ ముఖ్యపోషకులు, ఏ.ఎన్.ఆర్ కళాశాల, గుడివాడ పూర్వవిద్యార్ధి అయిన కిషోర్ కంచర్ల తన కళాశాల అనుభవాలను పంచుకున్నారు. అక్కినేని ఫౌండేషన్ అఫ్ అమెరికా వారి ఆధ్వర్యంలో ‘సినీ విజ్ఞాన విశారద’ ఎస్.వి రామారావు రచించిన “అక్కినేని ఆణిముత్యాలు” (అక్కినేని శతజయంతి – శతచిత్ర విశేషాలు) అనేగ్రంథాన్ని వి.ఎన్ ఆదిత్య ఆవిష్కరించారు. అక్కినేని శతజయంతి సందర్భంగా వెలువరించిన ప్రత్యేక సంచికను మోహన్ శ్యాం ప్రసాద్ ఆవిష్కరించి తొలిప్రతిని అవధాని డా. పాలపర్తికి అందజేశారు. ఈ సందర్భంగా అక్కినేని కుటుంబసభ్యులు అక్కినేని నాగార్జున, వెంకట్, నాగసుశీల, సుమంత్, సుశాంత్ లు అక్కినేని ఫౌండేషన్ అఫ్ అమెరికా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకలు విజయవంతం కావాలని శుభాకాంక్షలు అందజేసిన వీడియో సందేశాలను ప్రదర్శించారు.అక్కినేని చిత్రాలలోని కొన్ని పాటలకు స్త్రీ వేషధారణలో నృత్యం చేసిన పురుషుడు చంద్రశేఖర్ రెడ్డి లోకా, రషీద్ల జంట అందరినీ ఆకట్టుకుంది. అక్కినేని చిత్ర గీతాంజలి పేరిట మాయాబజార్, దొంగరాముడు, మాంగల్య బలం, ఆత్మీయులు, అనార్కలి, సుమంగళి, కులగోత్రాలు, ఆత్మబలం, శ్రీ రామదాసు, మనసు మాంగల్యం, రావణుడే రాముడైతే, ఇద్దరు మిత్రులు, పెళ్లి కానుక, ఏడంతస్తుల మేడ, ఆలుమగలు, ప్రేమ మందిరం, డాక్టర్ చక్రవర్తి, గాండీవం మొదలైన చిత్రాలనుండి అనేక మధురమైన గీతాలను శారద ఆకునూరి, చంద్రహాస్ మద్దుకూరి, రవి తూపురాని, నాగి పార్థసారథి, శ్రీకాంత్ లంకా, జయకళ్యాణి, సృజన ఆదూరి బృందం శ్రావ్యంగా పాడి అందరినీ అలరించారు. క్కినేని శతజయంతి ప్రత్యేక సంచికను రూపకల్పనచేసి, తీర్చిదిద్దడంలో ఎంతో సమయాన్ని వెచ్చించిన కమిటీ సమన్వయకర్త సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, చినసత్యం వీర్నపు, లెనిన్ బాబు వేముల మరియు దయాకర్ మాడలను పాల్గొన్న అతిథులందరినీ, నృత్య కళాకారులను, గాయనీ గాయకులను ఎ.ఎఫ్.ఎ బోర్డు సభ్యులు ఘనంగా సన్మానించారు.అక్కినేని ఫౌండేషన్ అఫ్ అమెరికా వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “డా. అక్కినేనిలో ఉన్న నటనకన్నా ఆయనలోని విశిష్ట లక్షణాలను అధ్యయనంచేసి అనుసరించ వలసినవి, ఏ రంగంలో ఉన్నవారికైనా ఉపయోగపడేవి ఎన్నో ఉన్నాయన్నారు.” శారద ఆకునూరి తన వందనసమర్పణలో షడ్రుచుల విందు భోజనం అందించిన బావర్చి రెస్టారెంట్ యజమాని, ఈ కార్యక్రమ ముఖ్యపోషకులు అయిన కిషోర్ కంచర్ల, మంచి వేదికను కల్పించిన రాధాకృష్ణ టెంపుల్ యాజమాన్యానికి, వీడియో, ఆడియో, ఫోటోగ్రఫీ సహకారం అందించిన వారికి, కార్యకర్తలకు ఎఎఫ్ఎ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.(చదవండి: అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో ఏఎన్ఆర్ శతజయంతి వేడుకలు) -
సింగపూర్లో ఘనంగా ఉగాది వేడుకలు!
తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (టీసీఎస్ఎస్) ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలను సెంగ్ కాంగ్లోని అరుళ్ముగు వేలు మురుగన్ జ్ఞానమునీశ్వర్ ఆలయంలో కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ క్రోధి నామ సంవత్సరంలో అందరికి మంచి జరగాలని సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. ఈ వేడుకల్లో బాగంగా పేరి కృష్ణ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. ఆ తరువాత సింగపూర్ స్థానిక కాలమాన ప్రకారం ప్రత్యేకంగా వ్రాయించిన గంటల పంచాంగాన్ని సభ్యులకు అందజేయడం జరిగింది. ఈ గంటల పంచాంగాన్ని ప్రముఖ జ్యోతిష పండితులు, పంచాంగ కర్తలు కప్పగన్తు సుబ్బరామ సోమయాజులు, మార్తి శివరామ యజ్ఞనారాయణ శర్మ గార్లు సిద్ధం చేయడం జరిగింది. ఈ వేడుకల్లో సుమారు 500 వరకు ప్రవాస తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాసులతో పాటు ఇతర రాష్ట్రాల వారు పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొన్న వారందరికి సాంప్రదాయ ఉగాది పచ్చడి పులిహోర మొదలగు ప్రసాదం పంపిణి చేయడం జరిగింది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా తెలంగాణ కల్చరల్ సొసైటీ వారు చేస్తున్న కార్యక్రమాలు స్ఫూర్తి దాయకం అని వేడుకల్లో పాల్గొన్న భక్తులు కొనియాడారు. ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా నంగునూరి సౌజన్య, జూలూరు పద్మజ, మాదారపు సౌజన్య, దీప నల్లా మరియు బసిక అనిత రెడ్డి, వ్యవరించారు. ఈ ఉగాది వేడుకలు విజయవంతంగా జరుగుటకు, అలాగే ప్రసాదానికి సహాయం అందించిన దాత లకు, స్పాన్సర్సకు, సంబరాల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి టీసీఎస్ఎస్ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ కుమార్ కోశాధికారి జూలూరి సంతోష్ కుమార్, సొసైటీ ఉపాధ్యక్షులు దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, గోనె నరేందర్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి, కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొందుగుల రాము, నంగునూరి వెంకట రమణ, నడికట్ల భాస్కర్, రవి కృష్ణ విజాపూర్ మరియు కార్యవర్గ సభ్యులు కార్యవర్గ సభ్యులు రోజా రమణి, రాధికా రెడ్డి నల్లా, శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు, సంతోష్ వర్మ మాదారపు, శశిధర్ రెడ్డి, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి మొదలగు వారు భక్తులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా ఈ వేడుకలు ఇంతలా ఘనంగా జరగడానికి చేయూతనందించిన మై హోమ్ కంస్ట్రక్షన్ వారికి, చమిరాజ్ రామాంజనేయులు (టింకర్ టాట్స్), మన్నము శ్రీమాన్ (గరంటో అకాడమీ), రాజిడి రాకేష్ రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఉగాది వేడుకల్లో పప్పు దుర్గా శర్మ గారి వద్ద సాంప్రదాయ నృత్యం నేర్చుకుంటున్న విద్యార్థులు రామిరెడ్డి శ్రేష్ఠ రెడ్డి, శ్రీవర్షిత రెడ్డి బండి, కంభంపాటి సాయి శాన్వి, లేష్ణ లలిత అన్నం, దేవగుప్తపు సమన్విత, కుప్పం వైష్ణవి సహస్ర, కొండపల్లి చిశితలు అష్టలక్ష్మి, దేవ దేవం భజే కీర్తనలతో ప్రదర్శించిన సాంప్రదాయ నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. (చదవండి: వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఉగాది ఉత్తమ రచనల పోటీ!) -
యుకెలో అంబరాన్నంటిన గోదారోళ్ళ సంక్రాంతి సంబరాలు
ఈ సంవత్సరం యుకెలో జరిగిన సంక్రాంతి సంబరాలు సుమారు 1300 మంది ఆహూతులతో లండన్ హారో లీజర్ సెంటర్లో అత్యంత వైభవంగా నిర్వహించారు. గత కొద్ది సంవత్సరాలుగా యుకెలో తెలుగువారు నిర్వహించుకునే వేడుకలలో గోదారోళ్ళ సంక్రాంతి సంబరాలకు ప్రత్యేక స్థానం ఉంది. గోదావరి రుచులకు, అక్కడి పిండివంటలకు, ఆప్యాయతలకు, ఆచారాలకు, సంస్కృతికి ప్రాధాన్యతనిస్తూ భోగిపళ్ళతో మొదలుకొని, గొబ్బిళ్ళు, హరిదాసు, ముగ్గులు ఇంకా ఎన్నో పాటలు, నృత్యాలు, నృత్యరూపకాలు ఆద్యంతం అలరించాయి. సంబరానికి హాజరైన వారందరినీ పేరుపేరునా మర్యాదపూర్వక పిలుపులతో ఆహ్వానించి గ్రూప్ సభ్యులు తమదైన శైలిని చాటిచెప్పారు. అరిటాకులలో సహబంతి భోజనాలు, అన్నవరం ప్రసాదం, పనసపొట్టు పులావు, కొబ్బరన్నం, మామిడికాయ పనసగింజల కూర, పొన్నగంటి పప్పు, వంకాయ పకోడీ కూర, ములక్కాడ జీడిపప్పు కూర్మ, బెల్లం మాగాయి, మజ్జిగ పులుసు, ఉసిరికాయ చారు, కంద ఆవకాయ, సొరకాయ రోటి పచ్చడి, గారెలు, పెరుగు చట్నీ, కోడి కూర, మటన్ ఫ్రై, రొయ్యల ఇగురు మొదలైన వివిధ రకాల వంటకాలను గోదారోళ్ళ గ్రూప్ సభ్యులు స్వయంగా వండి వడ్డించడం ఇందులో విశేషం. ఇవేకాక రాజమండ్రి రోజ్ మిల్క్, జున్ను వంటివి అందరినీ ఆశ్చర్యపరిచి కొస మెరుపుగా నిలిచాయి. ఈ వేడుకలకు హాజరైన వివిధ ప్రాంతాల వారు గోదారోళ్ళ రుచులతో పాటు వారి సహకారాన్ని, వెటకారాన్ని, మమకారాన్ని మెచ్చుకోవడమే కాక అక్కడ నిర్వహించిన లక్కీడ్రాలో బంగారం, వెండి మొదలైన బహుమతులను గెలుచుకొన్నారు. జంతికలు, మైసూరుపాకు మరియు కరకజ్జంతో కూడిన సారెను అందరికీ పంచడంతో ఈ వేడుకలు ఘనంగా ముగిసాయి. -
నేత్రపర్వంగా మైసూరులో దసరా
మైసూరు: కర్ణాటకలో మైసూరు పట్టణంలో దసరా ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన జంబూ సవారీ ఏనుగుల ఊరేగింపు మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రముఖుల పూజలు, వేలాది మంది జనం మధ్య గజరాజులు ప్యాలెస్ నుంచి బన్ని మండపం వరకూ సుమారు 5 కిలోమీటర్లు ఊరేగింపుగా వెళ్లి వచ్చాయి. చాముండేశ్వరి అమ్మవారి విగ్రహంతో కూడిన 750 కిలోల బరువైన బంగారు అంబారీని అభిమన్యు ఏనుగుపై ప్రతిష్టించారు. మరో 13 ఏనుగులకు సీఎం సిద్దరామయ్య, మైసూరు రాజవంశీకులు తదితరులు ప్యాలెస్ వద్ద పూజలు చేసి మధ్యాహ్నం ఊరేగింపునకు నాంది పలికారు. అంతకుముందు, సీఎం సిద్దరామయ్య నంది ధ్వజ పూజలో పాల్గొన్నారు. సాయుధ బలగాల కవాతు, మేళతాళాలు, కళాకారుల ప్రదర్శనలు, 31 జిల్లాకు చెందిన శకటాల నడుమ ఏనుగులు ముందుకు సాగాయి. కర్ణాటక ప్రభుత్వం రాష్ట్ర ఉత్సవం(నాదహబ్బ)గా దసరా వేడుకలను నిర్వహిస్తుంది. 10 రోజులపాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటయ్యాయి. వీటిని తిలకించేందుకు విదేశాల నుంచీ జనం తరలివచ్చారు. Glimpse of Jumboo Savari reaching Bannimantapa and Ambaari taken back to Mysuru Palace 🙏🙏 VC : Suhas Shivaay#MysuruDasara2023 pic.twitter.com/gX3ykOOn3K — Mysuru Memes (@MysuruMemes) October 25, 2023 -
సింగపూరులో ఘనంగా తెలుగుతోరణం వేడుకలు
సింగపూరు తెలుగు టీవీ వారు నిర్వహించిన తెలుగుతోరణం తెలుగు నీతిపద్యాల పోటీ చివరి వృత్తం దాదాపు మూడు వందల ప్రేక్షకుల నడుమ, ప్రత్యక్ష ప్రసారంగా ఘనంగా నిర్వహించారు. సింగపూరు తెలుగు ప్రముఖులు డా. బి. వీ. ఆర్. చౌదరి, రాజ్యలక్ష్మి దంపతులతో పాటుగా సింగపూరు నందు ఉన్న తెలుగు సంస్థలు సింగపూరు తెలుగు సమాజం, తెలంగాణా కల్చరల్ సొసైటీ సింగపూరు, కాకతీయ సాంస్కృతిక పరివారము, శ్రీ సాంస్కృతిక కళా సారధి, పోతన భాగవత ప్రచార సమితి సంస్థల ప్రతినిధులతో పాటుగా తెలుగు సమూహాలు అయిన మనం తెలుగు, అమ్ములు, తెలుగు వనితలు, ప్రాడ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు హాజరయ్యి ఈ కార్యక్రమం ఆసాంతం వీక్షించి తమ అభినందలను తెలియచేసారు. కార్యక్రమ తదనంతరం నిర్వహకులు వారిని కృతజ్ఞతా జ్ఞాపికలతో సత్కరించారు. అదే విధంగా కార్యక్రమం అనుకున్నది మొదలు ఎందరో తమంత తాముగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమ నిర్వహణకుగా తమ వంతు సహాయ సహకారాలు అందించారు. వారిని కూడా ఈ వేదిక మీద సత్కరించడం జరిగింది. సుమారు 20 మంది చిన్నారులతో పది వారాల పాటు జరిగిన ఈ పద్యాల పోటీ సింగపూరులోనే మొట్టమొదటి తెలుగు రియాలిటీ షోగా నిలిచి ఇక్కడ ఉన్న చిన్నారులలోని తెలుగు ప్రతిభా పాటవాలను వెలుగులోకి తీసుకొచ్చింది. ఎన్నెన్నో పద్యాలు నేర్చుకుని, పద్యం చెప్పడమే కాకుండా దాని భావాన్ని, అర్ధాన్ని ఉదాహరణలతో, చిన్ని చిన్ని నీతి కథలతో సహా వివరించడం ఈ పోటీపై వారికున్న ఇష్టాన్ని, శ్రద్దను తెలియ చేసింది, ప్రేక్షకులను అలరించింది. చిన్నారుల తల్లి తండ్రులు మాట్లాడుతూ ఈ పోటీ వల్ల తమకు కూడా మరొక్కసారి ఈ నీతి పద్యాలను చదువుకునే అవకాశం కలిగిందన్నారు. దాని అర్ధాలు ఇప్పటి సమాజానికి ఎలా వర్తిస్తాయో కూడా అన్వయించుకోవడం వల్ల ఈ పోటీ తమకు కూడా జీవితానికి ఒక రివిజన్ లా అనిపించిందని చెబుతున్నారు. అలాగే ఈ కార్యక్రమం చూసిన స్పూర్తితో ఇంటి వద్ద తమ చిన్నారులు కూడా తెలుగు నీతి పద్యాలను నేర్చుకుంటున్నారు అని కార్యక్రమానికి హాజరైన తెలుగు వారు తెలియచేయడం జరిగింది. ఈ పోటీలో మొదటి స్థానంలో ఓరుగంటి రాధా శ్రీనిధి, రెండవ స్థానంలో సూదలగుంట ఆరాధ్య మూడవ స్థానంలో సింగిరెడ్డి శ్రీనిత విజేతలుగా ఎన్నికయ్యారు. విజేతలతో పాటుగా కార్యక్రమంలో పాల్గొన్న పోటీదారులందరికీ తెలుగు ప్రముఖులలు జ్ఞాపికలు అందించడంతో పాటుగా దాదాపు 3 వేల డాలర్ల వరకూ నగదు బహుమతులు కూడా అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన వారికీ అలాగే సాంస్కృతికి కార్యమాలు ప్రదర్శించిన వారు అందరికీ తెలుగు ప్రముఖుల చేతుల మీదుగా జ్ఞాపికలు ప్రధానం చేయడం జరిగింది. అదే విధంగా కార్యక్రమాన్ని, పోటీలో పాల్గొన్న చిన్నారులనూ దీవిస్తూ శసాయి కుమార్, తనికెళ్ళ భరణి, రారాధికా, భువన చంద్ర వంటి సినీ ప్రముఖులు పంపిన వీడియో సందేశాలను కూడా వేదిక మీద ప్రదర్శించడం జరిగింది. కార్యక్రమ నిర్వాహకులు రాధా కృష్ణ గణేశ్న, కాత్యాయని గణేశ్న మాట్లాడుతూ సింగపూరు నందు ఉన్న అన్ని తెలుగు సంస్థలూ అలాగే అందరు తెలుగు ప్రముఖులూ ఒకే సారి ఈ వేదిక మీదకు వచ్చి తమకు ఆశీర్వాదాలు అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అన్ని తెలుగు సంస్థల ఆశీస్సులతో ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం తమ కల అని అది ఈ రోజు నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు. అలాగే తమ తమ చదువులతో బిజీగా ఉన్నా తెలుగు భాష మీద మక్కువతో పద్యాలు నేర్చుకుని కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు, వారికి శిక్షణ ఇచ్చిన తల్లి తండ్రులకు కృతజ్ఞతలు తెలియచేసారు నిర్వాహకులు. ఇది తెలుగు భాషకు తమ వంతుగా చేసుకున్న ఒక చిన్న సేవ అని సగర్వంగా చెప్పారు. ఇంత పెద్ద వేదిక మీద ఇంతటి పెద్ద కార్యక్రమం పది భాగాలుగా నిర్వహించగలగడం అందరి తెలుగు వారి సహకారంతో మాత్రమే సాధ్యమైందన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం స్పూర్తితో ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు సింగపూరు నుంచి వస్తాయని ఆశిస్తున్నామని వాటికి తమ వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని అన్నారు. ఈ నీతి పద్యాల పోటీకి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన రాంబాబు పాతూరి, అపర్ణ గాడేపల్లి మరియు సౌభాగ్యలక్ష్మి తంగిరాల వారికి ధన్యవాదాలు తెలిపారు. ఆ న్యాయ నిర్ణేతలు ఈ కార్యక్రమ ప్రణాళికలో పాలుపంచుకుని పిల్లలకు అనువైన పద్యాలను ఎంపిక చేసి అందించడమే కాకుండా పిల్లలు చెప్పిన ప్రతి పద్యానికీ వివరణాత్మకమైన విశ్లేషణ చేయడమే గాక మరింత కొత్తదనంతో ఎలా నేర్చుకోవచ్చో సలహాలు అందించి వారిని ప్రోత్సహించారు. అలాగే వ్యాఖ్యాతలుగా కవిత కుందుర్తి, సుబ్బు పాలకుర్తి చిన్నారులు వేదిక మీద భయం లేకుండా పద్యాలు చెప్పేలా వారిని ఉత్సాహ పరిచి సరదా సరదా సంభాషణలతో కార్యక్రమాన్ని దిగ్విజయంగా జయప్రదం చేశారన్నారు నిర్వాహకులు రాధ కృష్ణ గణేశ్న, కాత్యాయని గణేశ్నలు. (చదవండి: యూకేలో గాన గంధర్వునికి ఘనంగా సంగీత నివాళి!) -
ఏపీ భవన్లో ఘనంగా వైఎస్ జయంత్యుత్సవాలు
సాక్షి, న్యూఢిల్లీ: మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 73వ జయంతి, రైతు దినోత్సవ ఉత్సవాలను శుక్రవారం ఢిల్లీలోని ఏపీ భవన్లో ఘనంగా నిర్వహించారు. అఖిల భారత రైతు సమాఖ్య కార్యదర్శి మదన్మోహన్రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సమాఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి వైఎస్ అని ఆయన కొనియాడారు. తండ్రి అడుగుజాడల్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా రైతు సంక్షేమానికి కృషి చేస్తున్నారని అన్నారు. వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానించేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. ఇది కూడా చదవండి: 2024 తర్వాత బాబు ఏమైపోతాడోనని భయమేస్తోంది -
తెలంగాణలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు
-
పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
న్యూఢిల్లీ: పార్లమెంటు సెంట్రల్ హాల్లో శుక్రవారం రాజ్యాంగ దినోత్సవం ఘనంగా జరుగుతోంది. ఈ వేడుకలకు ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు పలువురు కేంద్రమంత్రులు, ఇతర ప్రముఖులు, ఎంపీలు కూడా పాల్గొన్నారు. ఈ వేడుకలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నాయకత్వం వహించారు. వేడుకలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విశిష్ట సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కాగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ప్రతిపక్షాలు బహిష్కరించాయి. 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన సందర్భంగా ప్రతి ఏటా దేశవ్యాప్తంగా ఆ రోజున రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నాం. చదవండి: మొదటిసారి ప్రయోగాత్మకంగా.. తగ్గేదే లేదంటున్న కర్ణాటక మహిళా పోలీసులు -
దిగ్విజయంగా కొనసాగుతున్న ఆటా నాదం పాటల పోటీలు
అమెరికా తెలుగు సంఘం (ఆటా) నిర్వహిస్తోన్న ఆటా నాదం పాటల పోటీలు దిగ్విజయంగా జరుగుతున్నాయి. ఆటా జూమ్ ద్వారా ఈ పోటీలు నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన దాదాపుగా 200 మంది గాయని గాయకులు ఈ పోటీలో పాల్గొన్నారు. అక్టోబర్ 23న ప్రిలిమినరీ రౌండ్ తో ప్రారంభించి సెమి ఫైనల్స్ నవంబర్ 6 న ముగిశాయి. సంగీత దర్శకులు, ప్లేబాక్ సింగర్ నిహాల్ కొందూరి , ప్లేబాక్ సింగర్ విజయ లక్ష్మి, సంగీత దర్శకులు సాయి శ్రీకాంత్ వెళ్లల, ప్లేబాక్ సింగర్ నూతన మోహన్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు నవంబరు 13న ఇరు తెలుగు రాష్ట్రాలనుండి పదకొండు మంది గాయని గాయకులు అభినవ్ అవసరాల, గీత మహతి పిసుపాటి, జ్యోస్న నిమ్మలపాడి, లక్ష్మి శ్రీవల్లి కాందూరి, లేఖ సదా ఫణిశ్రీ వీర,మేఘన నాయుడు దాసరి, నిగమ నెల్లుట్ల, ప్రణతి కే , సాయి శృతి పొలిశెట్టి, సాకేత్ కొమ్మజోస్యుల,వెంకట సాయి లక్ష్మి హర్షిత పాసాల ఫైనల్ రౌండ్ కు ఎంపిక అయ్యారు. గెలుపొందిన ఈ గాయని గాయకులు మ్యూజిక్ డైరెక్టర్ కోటి ప్రధాన న్యాయనిర్ణేతగా 2021 నవంబర్ 13న జరిగే ఫైనల్స్ లో పోటీపడబోతున్నారు. ఈ పోటీలో విజేతలకు 2021 డిసెంబరు 26 సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో జరిగే ఆటా వేడుకలు గ్రాండ్ ఫినాలేలో పాడే అవకాశం కల్పిస్తున్నారు. మొదటిసారి ఉత్తరాధ్యక్షులు మరియు ఆటా సేవ డేస్ మరియు ఆటా వేడుకల చైర్మన్ మధు బొమ్మినేని, పాలకమండలి సభ్యులు , సంయుక్త కార్యదర్శి, ఆటానాదం కోఆర్డినేటర్ రామకృష్ణా రెడ్డి ఆల , పాలక మండలి సభ్యులు సేవ డేస్ & ఆటా వేడుకల కో చైర్ అనిల్ బొద్దిరెడ్డి , పాలక మండలి సభ్యులు సేవ డేస్ & ఆటా వేడుకల కో చైర్ శరత్ వేముల, పాలకమండలి సభ్యులు ఆటా నాదం కోఆర్డినేటర్ శారద సింగిరెడ్డి మాతృదేశంలో ఇరు తెలుగురాష్ట్రాలలో ప్రతిభఉన్న గాయనిగాయకుల కోసం మొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. -
అదరహో సదర్ సందడి.. విన్యాసాల దున్నల హడావుడి
-
ప్రముఖుల ఇంట కృష్ణాష్టమి వేడుకలు
-
హీరో సుధీర్ బాబు ఇంట్లో కృష్ణ పుట్టిన రోజు వేడుకలు, ఫొటోలు వైరల్
అల్లూరి సీతారామ రాజుగా తెలుగు వారి గుండెల్లో నిలిచిపోయిన సూపర్ స్టార్ కృష్ణ నేటితో 78వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. హీరోగా వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుని సాహసానికి మారుపేరుగా నిలిచారు ఆయన. నేడు (మే 31) ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు సినీ ప్రముఖులు, సన్నిహితులు బర్త్డే విషెష్ తెలుపుతున్నారు. అలాగే ఆయన తనయుడు, సూపర్ స్టార్ మహేశ్ బాబు తన తండ్రికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. ఇదిలా ఉండగా కృష్ణ చిన్నల్లుడు, హీరో సుధీర్ బాబు ఆయన జన్మదిన వేడుకలను తన ఇంటిలో గ్రాండ్గా ఏర్పాటు చేశాడు. కృష్ణ సతీమణి ఇందిర, మిగతా కుటుంబ సభ్యులు సమక్షంలో ఆయన కేక్ కట్ చేసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు, పెద్ద అల్లుడు గల్లా జయదేవ్, నటుడు నరేష్ తదితరులు పాల్గొన్నారు. View this post on Instagram A post shared by Padmini Priyadharshini (@padmini.priyadharshini.5) ఇక మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ద్వారా కృష్ణకి శుభాకాంక్షలు తెలియజేశారు. “సాహసానికి మారుపేరు, మల్లెపువ్వు లాంటి మనిషి సూపర్ స్టార్ కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వారు సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను. హ్యాపీ బర్త్ డే సార్” అంటూ ట్వీట్లో రాసుకొచ్చాడు. సాహసానికి మారుపేరు,మల్లెపువ్వు లాంటి మనిషి సూపర్ స్టార్ కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు.సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వారు సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను. Happy Birthday Sir! — Chiranjeevi Konidela (@KChiruTweets) May 31, 2021 -
గెలుపు సంబరాలపై కీలక ఆదేశాలు జారీచేసిన ఈసీ
న్యూఢిల్లీ : ఎన్నికల ఫలితాల అనంతం జరిపే విజయోత్సవాలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. కరోనా ఉధృతి నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఐదు రాష్ట్రాల సీఎస్లకు భారత ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. కాగా నేడు (మే 2) నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో కొన్ని రాష్ట్రాల్లోని ప్రాంతాల్లో గెలిచిన అభ్యర్థుల మద్దతుదారులు విజయోత్సవ ర్యాలీలు, రోడ్షోలు జరుపుకుంటున్నారు. కౌంటింగ్లో డీఎంకే, టీఎంసీ పార్టీ ముందజలో కొనసాగుతుండటంతో ఆ పార్టీ మద్దతుదారులు కోల్కత్తా, చెన్నైలలో వేడుకలు జరుపుకుంటున్నారు. ఈనేపథ్యంలో కోవిడ్ నిబంధనలు పక్కాగా అమలయ్యేలా చూడాలని, అతిక్రమించినవారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. పనిలో అలసత్వం వహించిన సంబంధిత ఎస్హోచ్ఓను సస్పెండ్ చేయాలనే ఆదేశించింది. ప్రతి ఎఫ్ఐఆర్పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఐదు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు ట్విటర్లో పేర్కొంది. చదవండి: మే 2న ఎన్నికల కౌంటింగ్పై ఈసీ కీలక నిర్ణయం తమిళనాడు అసెంబ్లీ ఫలితాలు: సంబరాల్లో డీఎంకే కార్యకర్తలు -
శివనామస్మరణతో మారుమోగుతున్న కీసరగుట్ట
-
ఫ్యాషన్ 2021: సౌకర్యమే స్టైల్
కరోనా కారణంగా దాదాపు పది నెలలు ఇంటి పట్టునే ఉన్నవారు కాస్తా ఇప్పుడిప్పుడే చిన్న చిన్న వేడుకలకి హాజరవడానికి సిద్ధపడుతున్నారు. 2020లో పండగలు, పార్టీలు, వేడుకలు, వైవిధ్యాలు.. అన్నీ ఇంట్లోనే. కంఫర్ట్ కోసం క్యాజువల్స్కే పరిమితం అయినా ఇక నుంచి గతం నేర్పిన పాఠాలతో కొత్తదనం నింపుకోక తప్పదు. 2021లో దుస్తుల ఎంపిక ప్రత్యేకంగా ఉంటుందనే ఆలోచనతో డిజైనర్లు సైతం ఆ దిశగా ఆలోచిస్తూ అడుగులు వేస్తున్నారు. ఫ్యాషన్ పోకడల్లోనూ మార్పులు సంతరించుకోనున్నాయి. ఎంపికలు ప్రత్యేకంగా ఉండనున్నాయి. స్వీయ సంరక్షణ పేరిట తీసుకునే జాగ్రత్తల్లో మొదటి ఎంపిక ధరించే దుస్తులదే కాబట్టి మోర్ కేర్.. కంఫర్ట్ స్టైల్ ఈ సంవత్సరమంతా ట్రెండ్లో ఉండనుంది. మహమ్మారి సమయంలోనూ రాబోయే ట్రెండ్ను దృష్టిలో పెట్టుకొని ప్రముఖ డిజైనర్లైన తరుణ్ తహిలియాని, సబ్యసాచి, రోహిత్బాల్ వంటివారే కాకుండా వర్ధమాన డిజైనర్లు సైతం చేనేతలకు, హస్తకళలకు ప్రాముఖ్యమివ్వడం విశేషం. దేశవాళీ ఫ్యాబ్రిక్కే మొదటి స్థానం ఆభరణాల ఊసు లేకుండా ప్రింట్లున్న చేనేత దుస్తులు ఏ సీజన్కైనా నప్పుతాయన్నది డిజైనర్ల అభిప్రాయం. ఈ విధంగా చూస్తే దేశవాళీ కాటన్తో తయారైన ఫ్యాబ్రిక్ ఎంపిక పట్ల ఈ ఏడాది మరింత ఆసక్తి పెరగనుంది. ఒంటికి హాయిని, చెమటను పీల్చుకోదగినవి ఎంపికలో ముందండబోతున్నాయి. కాంతిమంతమైన రంగులు ఎంచుకున్నప్పటికి సౌకర్యానికి ప్రాధాన్యమిచ్చేలా వదులుగా ఉండే దుస్తులకే ఓటు వేయనున్నారు. లేత రంగులకే ప్రాధాన్యం.. ఇంటికే పరిమితమైన ప్రాణం బయటకు వచ్చినా కొన్నాళ్లపాటు ఇంకా సౌకర్యాన్నే కోరుకుంటుంది. అందుకే ఈ ఏడాది లేత రంగుల దుస్తులకే ప్రాధాన్యత పెరగనుంది. కంటికి, ఒంటికి హాయినిచ్చే రంగు దుస్తులు ట్రెండ్ కాబోతున్నాయి. అంతేకాదు, జెండర్ ప్రమాణాలను స్పష్టంగా చూపే గులాబీ, బ్లూ, పచ్చ, లావెండర్ రంగులు మరింత వెలుగులోకి రానున్నాయి. దుస్తుల్లో బేబీ పింక్ కలర్ ఈ దశాబ్దంలోనే ముందంజలో ఉంది. ప్రముఖ బ్రాండెడ్ కంపెనీలు సైతం బేబీ పింక్లో డ్రెస్సులు, ఇతర ఉపకరణాలను రూపొందించాయి. ఇక ముందు ఇదే రంగు ముందంజలో ఉండబోతోంది. మళ్లీ మళ్లీ వాడదగిన వాటికే ఓటు గత సంవత్సరం ఫ్యాషన్ పోకడలను అప్పుడప్పుడే వదలలేం. అలాగని ఫ్యాషన్కి తగ్గట్టుగా మారకుండా ఉండలేం. అందుకే, సౌకర్యంతోపాటు వాడిన డ్రెస్సులను తిరిగి వాడుకునేలా చిన్న చిన్న మార్పులు చేసుకోదగిన దుస్తుల ఎంపిక ఈ ఏడాది ఉంటుంది. ఇప్పటికే వాడని దుస్తులను కొద్దిపాటి మార్పులు చేసుకుంటూ మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తూ ధరించవచ్చు. పండగలు, పెళ్లి వేడుకలనూ ఈ మిక్స్ అండ్ మ్యాచ్తోనే గ్రాండ్గా రూపుకట్టనున్నారు. ఖర్చును కట్టడి చేయడానికి మిక్స్ అండ్ మ్యాచ్ ఒక ట్రెండ్గా మారనుంది. దీంట్లో భాగంగానే రెట్రో ట్రెండ్ ఉంటుంది. జిమ్ వేర్ టు క్యాజువల్ వేర్ ఆరోగ్యంగా ఉండటం, ఆరోగ్యాన్నిచ్చే ఆహారాన్ని తినడం, వ్యాయామశాలలకు వెళ్లడం వంటివి అత్యవసరం అయ్యాయి. దీంతో ఫ్యాషన్ వర్కౌట్ డ్రెస్సులకు డిమాండ్ పెరిగింది. వీటిలో గ్రాఫిక్ నమూనాలు, నాణ్యత గల డ్రెస్సుల ఎంపికవైపు జనం ఆసక్తి చూపుతున్నారు. వ్యాయామం కోసమే కాకుండా క్యాజువల్ వేర్గానూ విభిన్నంగా ఉపయోగించే దుస్తులు కూడా ఈ సంవత్సరం ట్రెండ్లో ఉండబోతున్నాయి. డిజైనర్ మాస్కులు డ్రెస్కి తగిన మాస్క్ అనేది జాబితాలో మరింత గ్రాండ్గా చేరిపోనుంది. కాటన్ డ్రెస్ వేసినప్పటికి, ముక్కును, నోటిని కవర్ చేసే మాస్క్ కొత్త కొత్త రూపాల్లో, డిజైనర్ టచ్తో వెలిగిపోనున్నాయి. ఎక్కడకు వెళ్లాలన్నా ముందు మాస్క్ తప్పనిసరి కాబట్టి వీటిమీద డిజైనర్లు ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. డెనిమ్స్ ఫిట్ టు కంఫర్ట్ జీన్స్ గురించి ఆలోచన రాగానే చాలా మందిలో స్లిమ్ ఫిట్, టైట్ ఫిట్ అనేవే మెదులుతాయి. ఇక నుంచి డెనిమ్లోనూ కొంత వదులుగా ఉండేవి, సాగేవి, సౌకర్యానికి ప్రాముఖ్యాన్ని ఇచ్చేవాటి సంఖ్య పెరగనుంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ ఖాదీ ఫ్యాబ్రిక్కు మంచి డిమాండ్ ఉంది. ఈ విధంగా మన దేశీయ చేనేతలతో రూపొందించిన దుస్తుల మీద మందంగా ఉండే డెనిమ్ లేదా ఖాకీ కలర్ జాకెట్స్ ఇండోవెస్ట్రన్ స్టైల్తో ఆకట్టుకోనుంది. – నిర్మలారెడ్డి -
ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు
-
మంగళగిరిలో వైఎస్సార్ జయంతి వేడుకలు
-
టాంటెక్స్ ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు
డల్లాస్: సూర్యుడు మకరరాశిలో చేరగానే వచ్చే పెద్ద పండగ సంక్రాంతి. ఈ పండగ తెలుగువాళ్లకు ఎంతో ఇష్టం అన్న విషయం తెలిసిందే. భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగను ప్రజలు ఎంతో ఘనంగా జరుగుపుకుంటారు. అమెరికాలోని తెలుగువారి కోసం.. అతిపెద్ద తెలుగు సంస్థలలో ఒకటైన ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించింది. స్థానిక నిమిట్స్ హైస్కూల్లో అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో, చూడముచ్చటైన సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ కార్యక్రమంలో అచ్చమైన తెలుగు వాతావరణాన్ని ప్రతిబింబించేలా పాటలు, సంగీత, సాంస్కృతిక, నృత్య కార్యక్రమాలు అందరిని అలరించాయి. ఈ సంక్రాంతి సంబరాలను ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) అధ్యక్షులు కృష్ణారెడ్డి కోడూరు ఆధ్వర్యంలో కార్యవర్గ, పాలకమండలితో పాటు సమన్వయ కర్తలు తోపుదుర్తి ప్రబంద్, జొన్నలగడ్డ శ్రీకాంత్, సాంస్కృతిక సమన్వయ కర్త స్రవంతి యర్రమనేని నిర్వహించారు. ఈ కార్యక్రమం చిన్నారులు ఆలపించిన అమెరికా జాతీయ గీతంతో ప్రారంభమైంది. ఈ వేడుకలల్లో ముద్దుగారే యశోద, వందే మీనాక్షి, కృష్ణాష్టకం, మాస్ ఈజ్ గ్రేట్, చరణములే నమ్మితి అనే స్థానిక కళాకారుల నాట్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అదేవిధంగా ఈ కార్యక్రమనికి ప్రధాన వ్యాఖ్యాతగా వ్యవహరించిన సమీర ఇల్లెందుల ఆద్యంతం నవ్వుల పువ్వులు పూయించారు. గాయని, గాయకులు దామిని భట్ల, ధనుంజయ్ పాడిన పాటలు అరించాయి. టాంటెక్స్ తక్షణ పూర్వాధ్యక్షులు చినసత్యం వీర్నపు మాట్లాడుతూ.. గత ఏడాది నిర్వహించిన కార్యక్రమాల గురించి వివరించారు. సంస్థకి సేవ చేయడం తన అదృష్టమని ఆయన అన్నారు. అనంతరం 2020వ సంవత్సరానికి టాంటెక్స్ అధ్యక్షులుగా ఉన్న కృష్ణారెడ్డి కోడూరు మాట్లాడుతూ.. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) సంస్థని సాంస్కృతిక కార్యక్రమాలకే పరిమితం చేయకుండాదన్నారు. తమ కార్యవర్గం, పాలకమండలి, సంస్థ సభ్యులని కలుపుకొని ఈ సంస్థను సేవారంగంలో కూడా ముందుంచి ఘన చరిత్రని కాపాడడానికి నిరంతరం శ్రామికుడిగా కష్టపడతానని తెలిపారు. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్)ను తనకున్న అనుభవంతో, సమాజంలో ఉన్న పరిచయాలతో మరింత సేవాతత్పరత కలిగిన సంస్థగా తీర్చిదిద్దుతానని ఆయన తెలిపారు. తర్వాత 2020 కార్యవర్గం, పాలక మండలి బృందాన్ని ఆయన సభకు పరిచయం చేశారు. సంక్రాంతి సంబరాలకి పసందైన పండుగ భోజనాన్ని వడ్డించిన బావార్చి అర్వింగ్ వారికి ఉత్తర టెక్సాస్ కార్యవర్గం, పాలక మండలి తరుఫున ఆయన కృతఙ్ఞతలు తెలిపారు. టాంటెక్స్ వారి సంక్రాంతి సంబరాలకి విచ్చేసి ఎంతో ఓపికగా నాలుగు గంటల వినోదాన్ని ఆస్వాదించిన ప్రేక్షకులకి, అతిధులకి, పోషకదాతలకి అధ్యక్షుడు కృష్ణారెడ్డి కోడూరు ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం ఈ కార్యక్రమ నిర్వహణకు స్పాన్సర్లుగా వ్యవహరించిన నిజెల్ భవన నిర్మాణ సంస్థ, శరత్ యర్రం, రాం మజ్జి, టాంటెక్స్ సంస్థ డైమండ్ పోషకదాతలైన తిరుమల్ రెడ్డి కుంభం, ప్లాటినం పోషక దాతలైన బావార్చి అర్వింగ్ ఇండియన్ రెస్టారెంట్, క్వాంట్ సిస్టమ్స్, ప్రతాప్ భీమి రెడ్డి, విక్రం జంగం, డా. పవన్ పామదుర్తి, శ్రీకాంత్ పోలవరపు, అనిల్ యర్రం, ఆనంద్ దాసరి, డీఎంఆర్ డెవలపర్స్ , గోల్డ్ పోషకదాతలైన పసంద్ విందు, మై ట్యాక్స్ ఫైలర్, రాం కొనారా, స్వదేశి రమేష్ రెడ్డి , బసేరా హరి, కిషోర్ చుక్కాల ,టెక్ లీడర్స్ దేవేంద్ర రెడ్డి, సిల్వర్ పోషకదాతలైన మురళి వెన్నం, డా.భాస్కర్ రెడ్డి సానికొమ్ము, పెంటా బిల్డర్స్, ఒమేగా ట్రావెలర్స్, అవాంట్ టాక్స్, విశ్వభారత్ రెడ్డి కంది, శ్రీకాంత్ గాలికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సంకక్రాంతి వేడుకులకు సహకరించిన మీడియా పార్ట్నర్స్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన గాయని, గాయకులు దామిని భట్ల, ధనుంజయ్లతో పాటుగా వ్యాఖ్యాత సమీర ఇల్లందుని సన్మానించారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా తెరవెనుక నుంచి సేవలందించిన కార్యకర్తలందరికీ తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం భారతీయ జాతీయగీతం ఆలాపనతో అత్యంత శోభాయమానంగా సాగిన సంక్రాంతి సంబరాలు ముగిశాయి. -
ఘనంగా భాష్యం బ్లూమ్స్ వార్షికోత్సవ వేడుకలు
సాక్షి, హైదరాబాద్ : మణికొండలోని భాష్యం బ్లూమ్స్ పాఠశాలలో అయిదవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జాతీయస్థాయిలో సత్తా చాటిన క్రీడాకారులను సత్కరించారు. మెరిట్ విద్యార్థులతో పాటు తల్లిదండ్రులను కూడా సత్కరించారు. స్కూల్ ప్రిన్సిపల్ పాల్ ఆధ్వర్యంలో కొనసాగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు దేశభక్తిని చాటిచెప్పేలా సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. వీటిలో చిన్నారులు చేసిన నృత్యాలు, కరాటే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో దాగున్న సృజనాత్మకతను వెలికితీసేందుకు దోహదపడతాయని ముఖ్య అతిధులు పేర్కొన్నారు. -
అట్లాంటాలో ఘనంగా సంక్రాంతి సంబరాలు
అట్లాంటా: అమెరికాలోని గ్రేటర్ అట్లాంటా తెలుగు సంఘం (గాటా) ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. దేసానా మిడిల్ స్కూల్ల్లో ఆదివారం గాటా సంక్రాంతి సంబరాలను నిర్వహించింది. ఈ కార్యాక్రమంలో గాటా వ్యవస్థాపకులు గిరీష్ మేకా, కో ఆర్టీనేటర్ సాయి గొర్రేపాటితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. ఈ సంబరాల్లో భాగంగా మహిళాలకు ముగ్గుల పోటీలు, పిల్లలకు కైట్ పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అదేవిధంగా పలు డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ల ద్వారా నృత్య కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. కాగా, ఈ కార్యక్రమంలో పిల్లలు చేసిన నటరాజా నాట్యంజలి, కూచిపూడి నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక గాటా చీఫ్ కో ఆర్డినేటర్ సాయి గొర్రేపాటి మాట్లాడుతూ, తమ కొత్త కార్యనిర్వాహక బృందం సభ్యులు నవీన్ మర్రి, ఉదయ్ ఏటూరు, సుబ్బారెడ్డి, కిషన్ దేవునూరి, సిదార్థ అబ్బాగారి, స్వప్న కాస్వా, లక్ష్మి సానికొమ్ము, సరిత చెక్కిల్ల, సరిత శనిగరపు, వాసవి చిత్తలూరిలను సభకు పరిచయం చేశారు. చివరగా గాటా వ్యవస్థాపకులు గిరీష్ మేకా మాట్లాడుతూ, రంగోలి, కిడ్స్ కైట్ ఫ్లయింగ్ విజేతలకు బహుమతులను స్పాన్సర్ చేసిన నవీన్, కిషన్, సుబ్బారెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా కార్యక్రమానికి వాలంటీర్లుగా వ్యవహరించి విజయవంతం చేసిన గోవర్ధనానంద్ జగన్నాథ్ బృందానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మే నెలలో జరగబోయే గాటా పదవ వార్షిక వేడుకలను ప్రతిఒక్కరూ రావాలని ఆహ్వానం పలికారు. అనంతరం భారత జాతీయ గీతం ‘జన గణ మన’ తో కార్యక్రమాన్ని ముగించారు. -
విఘ్నేష్కు థ్యాంక్స్ చెప్పిన నయనతార
నయనతార తన బాయ్ఫ్రెండ్ విఘ్నేష్ శివన్తో కలిసి అమెరికాలో చక్కర్లు కొడుతున్నారు. అయితే నయయనతార సోషల్మీడియాకు కాస్త దూరంగా ఉంటారన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా వీరిద్దరు కలిసి అమెరికాలో తమ స్నేహితులతో కలిసి ఉత్సాహంగా గడిపిన ఫోటోలను విఘ్నేష్ శివన్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. డెనిమ్ బ్లూ షర్ట్, బ్లాక్ లెదర్ స్కర్ట్, లూస్ హెయిర్తో ఉన్న నయన్ కొత్త లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అంతేగాక విఘ్నేష్, నయన్లు తమ స్నేహితులతో గడిపిన క్షణాలను వీడియో రూపంలో పంచుకున్నారు. 'థాంక్యూ అండ్ లవ్ యూ విఘ్నేష్. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. స్నేహితులతో కలిసి వేడుకను జరుపుకోవడం ఆనందం పంచిందని' నయన వెల్లడించారు. అయితే కొన్ని రోజుల క్రితం నయనతార పుట్టినరోజును న్యూయార్క్ సిటిలో ఘనంగా జరుపుకున్నారు. ఆమె పుట్టినరోజును పురస్కరించుకొని కాబోయే భర్త విఘ్నేష్ నయన్ వేలికి డైమండ్ రింగ్ను తొడిగారు. ఈ సందర్భంగా వారిద్దరు కలిసి న్యూయార్క్లో దిగిన ఫోటోను కూడా షేర్ చేశారు. ' న్యూయార్క్ సిటీ ఈరోజు నాకు చాలా అందంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు నా దిల్ కా లవ్ నయన్ బర్త్డే. ఆమె నవ్వు నా మదిని దోచుకుంటుందని ' విఘ్నేష్ పేర్కొన్నారు. మిలింద్ రౌ దర్శకత్వం వహించనున్న నేత్రికన్ తమిళ చిత్రంలో నయనతార నటిస్తుండగా, ఈ చిత్రానికి ఆమె బాయ్ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ మొదటిసారి నిర్మాణ బాధ్యతలు చూసుకుంటున్నారు. మరోవైపు విఘ్నేష్ శివన్ తన తదుపరి చిత్రాన్ని శివ కార్తికేయన్తో చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశారు. -
కార్తీక వెలుగుల్లో ఇంద్రకీలాద్రి
సాక్షి, విజయవాడ: కార్తీక పౌర్ణమి సందర్భంగా పలు దేవాలయాలు దీపాలు వెలిగించే భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అందులో భాగంగా ఇంద్రకీలాద్రి కోటి దీపకాంతులతో వెలిగిపోతుంది. మల్లిఖార్జున మహామండపం నుంచి కనకదుర్గానగర్ మాడవీధుల వరుకు భక్తులు దీపాలతో అలంకరించారు. కోటి దీపోత్సవంలో వందలాది భక్తులు పాల్గొన్నారు. దుర్గామల్లేశ్వర స్వామి వారికి పూజారులు ఘనంగా జ్వాలాతోరణం నిర్వహించారు. రాజమండ్రిలోని పుష్కర్ ఘాట్ వేద మంత్రాల ఘోషతో మారుమోగుతోంది. కార్తీక పూర్ణిమ హారతి కార్యక్రమాన్ని బుద్ధవరుపు చారిటబుల్ ట్రస్ట్ నిర్వహించింది. గోదావరి హారతి కార్యక్రమనికి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామిజీ హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు, పలువురు ప్రజాప్రతిధులు పాల్గొననున్నారు. -
వీళ్లు చాలా స్మార్ట్ గురూ..!
-
విజయనగర ఉత్సవాలు ప్రారంభం
సాక్షి, విజయనగరం: విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు శనివారం పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ రావు ప్రారంభించారు. ఆలయం నుంచి ర్యాలీగా ప్రారంభమైన ఉత్సవాలు నేటి నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. జిల్లాలోని ఆనంద గజపతి ఆడిటోరియం ఆవరణలో ఉన్న తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి, అనంతరం జ్యోతి ప్రజ్వలనతో ఉత్సవ కార్యక్రమాలను మంత్రులు ప్రారంభించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న వివిధ కళారూపాల ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ఉత్సవ ర్యాలీలో ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు కోలగట్ల వీరభద్రస్వామి, సంబంగి చిన అప్పలనాయుడు, అప్పల నరసయ్య, రాజన్న దొర, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్రావు మాట్లాడుతూ.. విజయనగరం ఉత్సవం నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఉత్సవాల నిర్వహణకు పర్యాటక శాఖ నుంచి రూ.50 లక్షలు ఇస్తూ జీవో విడుదల చేయటంపై హర్షం వ్యక్తం చేశారు. విద్యల నగరంగా విజయనగరం వర్ధిల్లుతోందన్నారు. సంస్కృతి సంప్రదాయాలు భావితరాలకు అందేలా ప్రభుత్వం కార్యాచరణ చేస్తుందని పేర్కొన్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక అకాడమీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారని తెలిపారు. అభివృద్ధి కోసం నిరంతరాయంగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఒక్క అక్టోబర్ నెలలోనే వాలంటీర్ల నియామకం, ఆటో డ్రైవర్లకు చేయూత, కంటి వెలుగు, రైతు భరోసా కార్యక్రమాలు ప్రారంభించామని గుర్తు చేశారు. దీపావళికల్లా ఇసుక కొరత తీర్చడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. -
నాష్విల్లేలో ఘనంగా శ్రీనివాస కల్యాణం
టేనస్సీ : నాష్విల్లేలోని గణేష్ ఆలయంలో శ్రీనివాస కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఇండియన్ కమ్యూనిటీ ఆఫ్ నాష్విల్లే(ఐసీఓఎన్)ల ఆధ్వర్యంలో ఈ నెల 17న నిర్వహించిన ఈ కల్యాణ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాస ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పుష్పాలతో విగ్రహాలను అలంకరించి శ్రీనివాస కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం వచ్చిన భక్తులకు కల్యాణ కమిటీ సభ్యులు తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో కల్యాణ కమిటీ సభ్యులు ఆళ్ల రామకృష్ణ రెడ్డి, నరెందర్రెడ్డి నూకల, సుషీల్ చంద, కిషోర్రెడ్డి గూడూరు, ప్రకాశ్రెడ్డి ద్యాప, రాధిక రెడ్డి, లావణ్య నూకల, కళ ఉప్పలపాటి, ప్రశాంతి, మంజు లిక్కి, దీప, శిరీష కేస తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కల్యాణ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. శ్రీనివాస కల్యాణాన్ని వైభవంగా పూర్తి చేసినందుకు భక్తులకు, అతిథులకు, దాతలకు, ఆలయ పూజారి, ఆలయ బోర్డు సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
ఘనంగా రైతు దినోత్సవం
సాక్షి, అమరావతి/సాక్షి, నెట్వర్క్: మహానేత, రైతు బాంధవుడు, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 70వ జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో, దేశ, విదేశాల్లో సోమవారం ఘనంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్సార్ జయంతిని ‘వైఎస్సార్ రైతు దినోత్సవం’గా ప్రకటించిన సంగతి తెలిసిందే. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులోని కన్నెలూరులో సోమవారం జరిగిన రైతు దినోత్సవం ప్రధాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. రైతులు, పేదలు, వృద్ధులు, విద్యార్థులు, మహిళలు, తదితర వర్గాలకు లబ్ధి చేకూర్చే నవరత్నాలకు కడప గడప నుంచే శ్రీకారం చుడుతున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో ఊరూవాడా అనే తేడా లేకుండా ప్రజలు వైఎస్సార్ను స్మరించుకుంటూ, ఆయన ప్రవేశపెట్టిన పథకాలను గుర్తు చేసుకుంటూ నివాళులర్పించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలను నిర్వహించాయి. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆయా నియోజకవర్గాల వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు, జిల్లా ముఖ్య నేతలు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అదేవిధంగా విజయవాడలో రాష్ట్ర పార్టీ కార్యాలయంలో అట్టహాసంగా వైఎస్సార్ జయంతిని నిర్వహించారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తన క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు. సంక్షేమ పథకాల సృష్టికర్త.. వైఎస్సార్ సంక్షేమ పథకాల సృష్టికర్త వైఎస్సార్ అని మంత్రి శంకర్ నారాయణ కొనియాడారు. రాప్తాడు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన రైతు దినోత్సవ కార్యక్రమంలో మంత్రి శంకర్ నారాయణ, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. రాయదుర్గం, శింగనమల, గుంతకల్లు, మడకశిర, కల్యాణదుర్గం, తాడిపత్రి, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కాపు రామచంద్రారెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి, వై.వెంకటరామిరెడ్డి, డాక్టర్ తిప్పేస్వామి, ఉషశ్రీ చరణ్, పెద్దారెడ్డి, శ్రీధర్రెడ్డి, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, డాక్టర్ సిద్ధారెడ్డి, అనంతపురంలో ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్రెడ్డి, ఉరవకొండలో మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, హిందూపురంలో పార్టీ నేత, రిటైర్డ్ ఐజీ ఇక్బాల్ ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతపురం జిల్లా చిలమత్తూరులో వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎన్.హరీష్ కుమార్ యాదవ్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. కర్నూలు జిల్లాలో కర్నూలు, ఆలూరు, ఆళ్లగడ్డ, బనగానపల్లె, శ్రీశైలం, నందికొట్కూరు, పాణ్యం, ఎమ్మిగనూరు, కోడుమూరు, ఆదోని, మంత్రాలయం, పత్తికొండల్లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. చిత్తూరు జిల్లాలో గంగాధర నెల్లూరు, చంద్రగిరి, మదనపల్లె, నగరి, పలమనేరు, పీలేరు, పూతలపట్టు, సత్యవేడు, తంబళ్లపల్లె, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో రైతు దినోత్సవం ఘనంగా జరిగింది. ఆదర్శ రైతులను సన్మానించారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, రైతులకు రుణాలు, విత్తనాలు, అర్హులకు పింఛన్లు, విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేశారు. సిడ్నీ, దుబాయ్ల్లో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు వైఎస్సార్సీపీ సిడ్నీ విభాగం ఆధ్వర్యంలో ప్రవాసాంధ్రులు వైఎస్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిచారు. తొలుత రెడ్క్రాస్ సంస్థలో పలువురు రక్తదానం చేసి తర్వాత కేక్ కట్ చేశారు. పార్టీ సిడ్నీ విభాగం గౌరవాధ్యక్షుడు రంగారెడ్డి, సభ్యులు గోవిందరెడ్డి, దామోదర్, భారతి, మను, సుజాత, అరవింద, లత, స్రవంతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే దుబాయ్లోనూ ప్రవాసాంధ్రులు వైఎస్సార్ జయంతిని ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం, అనంతపురం, వైఎస్సార్ జిల్లాలకు చెందిన ఎన్ఆర్ఐలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎన్ఆర్ఐ యూఏఈ వింగ్ టీమ్లీడర్ సోమిరెడ్డి, మహితరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, కోటేశ్వర్రెడ్డి, కార్తీక్, సుదర్శన్రెడ్డి, దిలీప్, కర్ణ, నరసింహ, నాగేంద్ర, ప్రతాప్, వెంకటరామిరెడ్డి, ఆచిరెడ్డి, శివానంద్, జగదీశ్, విజయ్రెడ్డి, విజయ, సునంద తదితరులు పాల్గొన్నారు. రైతు చాంపియన్ వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం అనేక పథకాలకు శ్రీకారం చుట్టిన రైతు బాంధవుడు డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి అని రాజ్యసభ మాజీ సభ్యుడు యలమంచిలి శిశాజీ కొనియాడారు. గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో వైఎస్సార్ జయంతి, రైతు దినోత్సవం సందర్భంగా రైతునేస్తం వ్యవసాయ మాసపత్రిక ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో ఎంపికైన ఉత్తమ రైతులకు సోమవారం వైఎస్సార్ రైతు నేస్తం పురస్కారాలను అందించారు. ఈ సభకు పత్రిక సంపాదకుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం రుణమాఫీ, పావలా వడ్డీ, పశుక్రాంతి, జలయజ్ఞం, ఉచిత విద్యుత్ వంటి ఎన్నో మహత్తర కార్యక్రమాలు ప్రవేశపెట్టి తాను మరణించే వరకు రైతు సంక్షేమ పథకాలను కొనసాగించారని గుర్తు చేశారు. వైఎస్సార్ నిజమైన రైతు చాంపియన్ అని అభివర్ణించారు. రాష్ట్రంలో వివిధ జిల్లాలకు చెందిన ఉత్తమ రైతులు ఎం.శ్రీదేవి, టి.శివరామిరెడ్డి, పి.భరత్, బి.శశిధర్, టి.మురళీరెడ్డి, ఎల్.అచ్చింనాయుడు, కె.క్రాంతికుమార్రెడ్డి, ఎం.రాంబాబు, కె.సంధ్య, పి.చిట్టిబాబు, టి.సాయినాథ్రెడ్డి, ఎ.బాలయ్య, ఆర్.జ్యోతి, డి.హన్మంతరాజు, కైలాష్సాహుకు వైఎస్సార్ రైతునేస్తం పురస్కారాలను ప్రదానం చేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా, శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్వలి, ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి, తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ మల్లంపాటి శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ జయంతి వేడుకలను గుంటూరు జిల్లాలో ఘనంగా నిర్వహించారు. వాడవాడలా ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రైతులకు రుణాలు, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, విత్తనాలు, అర్హులకు పింఛన్లు పంపిణీ చేశారు. మాట తప్పని మహనీయుడు ఏపీ గోపాలమిత్ర సర్వీస్ అసోసియేషన్ మాట తప్పని..మడమ తిప్పని రాజకీయ నేత దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని ఏపీ గోపాలమిత్ర సర్వీస్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు కె.వెంకటేశులు, రాష్ట్ర అధ్యక్షుడు సారికి మల్లయ్య, ప్రధాన కార్యదర్శి కె.వీరభద్రయ్య అన్నారు. సోమవారం తాడేపల్లిలోని తెలుగు తల్లి విగ్రహం సమీపంలో ఆంధ్రప్రదేశ్ గోపాలమిత్ర సర్వీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతిని ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి ఆయన సేవలు స్మరించుకున్నారు. ఈ సందర్భంగా వెంకటేశులు మాట్లాడుతూ.. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా తన పాలనను దేశానికే ఆదర్శంగా నిలిపారని, తండ్రి ఆదర్శాలను తనయుడు జగన్మోహన్రెడ్డి మాత్రమే అధిగమించగలరని చెప్పారు. గోపాలమిత్ర సమస్యలను సీఎం జగన్ తక్షణమే పరిష్కరించాలని కోరుతున్నామని అన్నారు. -
ఆస్ట్రేలియాలో వైఎస్ఆర్సీపీ విజయోత్సవ ర్యాలీ
-
న్యూజీలాండ్లో అట్టహాసంగా జరిగిన న్యూఇయర్ సంబరాలు
-
పోలీసు అమరులకు వందనం..
వరంగల్ క్రైం: విధి నిర్వహణలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటి వరకు 64 మంది పోలీసులు అమరులయ్యారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రాణత్యాగాలు చేసిన వారి కోసం ఏటా పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఈ నెల 15 నుంచి 21 వరకు నిర్వహించేందుకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసుల పని తీరును ప్రజలు, యువత, విద్యార్థులకు తెలియజేసేందుకు ప్రతి పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ నిర్వహించనున్నారు. ట్రైసిటీగా పేరుగాంచిన వరంగల్, హన్మకొండ, కాజీపేటలో విద్యార్థుల కోసం పోలీసు కమిషనరేట్లోని రాణిరుద్రమ దేవి ప్రాంగణంలో ఓపెన్ హౌస్కు ఏర్పాట్లు చేశారు. పోలీసులువిధి నిర్వహణలో ఉపయోగించే ఆయుధాలతోపాటు బాంబు డిస్పోజల్, క్లూస్, ఫింగర్ ప్రింట్స్, డాగ్స్క్వాడ్, కమ్యూనికేషన్ విభాగాలకు సంబంధించిన స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థులకు ప్రతిభా పోటీలు.. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా సోమవారం నుంచి 21వ తేదీ వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓపెన్ హౌస్ ప్రదర్శన కొనసాగేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా విద్యార్థులు, సిబ్బందికి వ్యాసరచన, వక్తృత్వం, చిత్రలేఖన పోటీలు నిర్వహించనున్నారుు. పోటీల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విజేతలకు ఈనెల 21న నిర్వహించే స్మృతి పరేడ్లో బహుమతులు అందజేయనున్నారు. రక్తదాన శిబిరాలు పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీసు కమిషనరేట్ పరిధిలోని డివిజన్ కేంద్రాల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఈ నెల 20న సాయంత్రం ఏడు గంటలకు హన్మకొండలోని అశోక జంక్షన్ నుంచి కమిషనరేట్ కార్యాలయం వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించనున్నారు. 21న అమరవీరుల స్థూపం వద్ద స్మృతి పరేడ్ నిర్వహించి పోలీసు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించడంతో వారోత్సవాలు ముగియనున్నాయి. విజయవంతం చేయాలి.. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రాణ త్యాగాలు చేసిన పోలీసు అమరవీరులను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉంది. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే ఓపెన్హౌస్, రక్తదాన శిబిరాలు, ప్రతిభా పోటీల్లో పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులు, అధికారులు, ప్రజలు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి. – డాక్టర్ విశ్వనాథ రవీందర్, వరంగల్ పోలీసు కమిషనర్ -
కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం
తిరువనంతపురం : ప్రకృతి సృష్టించిన విలయానికి గురైన కేరళకు పునర్వైభవం తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేసింది. భారీ వరదల కారణంగా కేరళ తీవ్ర నష్టానికి గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక ఏడాది వరకు ప్రభుత్వ ఆధ్వర్యంలో అధికారికంగా ఎలాంటి వేడుకలను జరుపుకోవద్దని నిర్ణయించింది. ప్రభుత్వం ప్రతి ఏటా అధికారికంగా నిర్వహించే ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళ, యూత్ ఫెస్టివల్ వంటి కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమాలకు వెచ్చించే నిధులను సీఎం రిలీఫ్ ఫండ్కు తరలించాలని నిర్ణయించింది. ఆ నిధులు కేరళ పునర్నిర్మాణంకు దోహదం చేస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. కేరళలో ఇటీవల సంభవించిన భారీ వదలకు 350పైగా పౌరులు మరణించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ అంచనా ప్రకారం దాదారు 30,000 కోట్ల ఆస్థి నష్టం వాటిల్లింది. ప్రకృతి విలాయానికి గురైన కేరళను ఆదుకునేందుకు దేశ వ్యాప్తంగా ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు చేయూతనిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు సీఎం రిలీఫ్ ఫండ్కు 1,036 కోట్లు విరాళాలు అందాయని ప్రభుత్వం వర్గాలు ప్రకటించాయి. వరదల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కేరళను మరో భయం వెంటాడుతోంది. రాట్ ఫీవర్తో సోమవారం మరో ఇద్దరు వ్యక్తులు మరణించారు. వరదలు తెచ్చిన కొత్త వైరస్తో కేరళ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక క్యాంపులను రంగంలోకి దింపింది. వైరస్ లక్షణాలతో భాదపడుతున్న వారికి ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది. Kerala Government has decided to cancel all official celebrations for one year. Programs including International Film Festival of Kerala and other youth festivals stand cancelled #KeralaFloods pic.twitter.com/r5aJGHYW8c — ANI (@ANI) September 4, 2018 -
పరభాష వద్దు.. తెలుగే ముద్దు
కోడుమూరు రూరల్ (కర్నూలు): పరభాషల వ్యామోహంలో పడి అమ్మలాంటి తెలుగు భాషకు విద్యార్థులు దూరమవుతున్నారని తహసీల్దార్ వేణుగోపాల్ అన్నారు. అంతర్జాతీయ క్రీడా దినోత్సవం, తెలుగు భాష దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో హాకీ క్రీడాకారుడు ధ్యాన్చంద్, తెలుగు భాషాకోవిదుడు గిడుగు వెంకటరామమూర్తి చిత్ర పటాలకు ఉపాధ్యాయులు, విద్యార్థులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పట్టణంలోని ఠాగూర్ విద్యానికేతన్లో నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తహసీల్దార్ మాట్లాడుతూ విద్యార్థులంతా తెలుగుభాష, సంస్కృతి సంప్రదాయలపై విద్యార్థులు అవగాహన ఉండాలని, కేవలం జీవించడానికి మాత్రమే పరభాషలు సరిపోతాయన్నారు. అనంతరం తెలుగు భాష గొప్పతనాన్ని వివరిస్తూ విద్యార్థినీలు సాంస్కృతిక కార్యక్రమాలు, భువన విజయం నాటికను ప్రదర్శించారు. కార్యక్రమంలో ఎంఈఓ అనంతయ్య, ఎస్ఐ రామాంజులు, రిటైర్డ్ ఎంఈఓ నాగరత్నం శెట్టి, పాఠశాల కరస్పాడెంట్ కృష్ణయ్య, హెచ్ఎం మధు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విశ్వవాణి హైస్కూల్లో.. తెలుగు భాష దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక విశ్వవాణి హైస్కూల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు తెలుగుతల్లి చిత్ర పటానికి పూలమాల వేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తెలుగు భాష గొప్పతనాన్ని వివరిస్తూ విద్యార్థులు ఆలపించిన గేయాలు, పద్యాలు ఏకపాత్రాభినయ సంభాషణలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాఠశాల కరస్పాడెంట్ ఖలీల్బాషా, డైరెక్టర్ శ్రీనివాసులు, హెచ్ఎం గిడ్డయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బాలికల హైస్కూల్లో.. అంతర్జాతీయ క్రీడా దినోత్సవం, తెలుగు భాష దినోత్సవం సందర్భంగా బాలికల హైస్కూల్లో హెచ్ఎం జ్యోతి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు హాకీ క్రీడాకారుడు ధ్యాన్చంద్, గిడుగు వెంకటరామమూర్తి చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమ్మభాష బతికించాలి సి.బెళగల్: ప్రతిఒక్కరూ మాతృభాషను బతికించాలని మోడల్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం, రచయిత రేవుల శ్రీనివాసులు అన్నారు. బుధవారం గిడుగు వెంకటరామూర్తి జయంతిని పురస్కరించుకొని హెచ్ఎం ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు కిష్టన్న, హరిబాబు, దుగ్గెమ్మలు అంతర్జాతీయ తెలుగుభాష దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు తెలుగుతల్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించి, విద్యార్థులతో కవి, కవితా సమ్మేళనం నిర్వహించారు. హెచ్ఎం రేవుల శ్రీనివాసులును పాఠశాల సిబ్బంది, విద్యార్థులలు శాలువ కప్పి, జ్ఞాపికలతో సత్కరించారు. అదేవిధంగా జెడ్పీ హైస్కూల్లో హెచ్ఎం సత్యనారాయణ అధ్యక్షతన తెలుగు ఉపాధ్యాయురాలు శ్యామల తెలుగ భాష దినోత్సవం సందర్ఢఃగా తెలుగు గొప్పతనాన్ని వివరిస్తూ కవిత్వాలు వినిపించారు. గూడూరు రూరల్: జూలకల్లోని ఆదర్శ పాఠశాలలో బుధవారం తెలుగు భాష దినోత్సవ కార్యక్రమాన్ని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనంగా జరుపుకున్నారు. గిడుగు వెంకటరామమూర్తి తెలుగు భాష అభివృద్ధికి చేసిన కృషి, తెలుగు ప్రాధాన్యతపై విద్యార్థులకు ప్రిన్సిపాల్ నిర్మలకుమారి వివరించారు. అనంతరం విద్యార్థినులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థినులు తెలుగుతల్లి వేషధారణతో పాటు తెలుగు సంప్రదాయాలు ప్రతిబిందించేలా వస్త్రాధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. -
ఘనంగా రాజీవ్గాంధీ జయంతి
గోదావరిఖని (కరీంనగర్): మాజీ ప్రధాని రాజీవ్గాంధీ జయంతిని సోమవారం గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. స్థానిక గాంధీనగర్లోని రాజీవ్గాంధీ విగ్రహానికి శాప్ మాజీ చైర్మన్, కాంగ్రెస్ నాయకులు రాజ్ఠాకూర్ మక్కాన్సింగ్, టీపీసీసీ సెక్రటరీ బడికెల రాజలింగం రాజీవ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. రాజీవ్గాంధీ ప్రధాని సమయంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు రూపొందించి, పంచాయతీ రాజ్ చట్టాన్ని ప్రారంభించారని తెలిపారు. 2019 ఎన్నికల్లో అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీని ప్రధానమంత్రిగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. బొంతల రాజేష్ ఆధ్వర్యంలో నాయకులు ఎం.రవికుమార్, ఎండీ ముస్తాఫా, శ్రీనివాసరావు, రాజేష్, యుగేంధర్, ఫకృద్దీన్, మధు, శ్రీనివాస్, లక్ష్మణ్, శేఖర్, నజీమొద్దీన్, ఎండీ రహీం, మహేష్, ఫయాజ్ అలీ, సర్వర్, శ్రీనివాస్, విజయ్, సూరి, సుల్తాన్కుమార్, సతీష్ పాల్గొన్నారు. రామగుండంలో.. రామగుండం: రామగుండం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు వాజీద్ఖాన్ రాజీవ్గాంధీ ప్రధాని హయంలో దేశానికి చేసిన సేవలను కాంగ్రెస్ పార్టీ నాయకులు కొనియాడారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. మైనార్టీ పట్టణ అధ్యక్షుడు రఫీఉద్దీన్, యాసిన్బేగ్, గౌస్బాబా, అజీంపాషా, నరేష్, యాదగిరి, జావీద్ఖాన్ తదితరులున్నారు. అంతర్గాం మండలంలో పార్టీ మండల అధ్యక్షుడు సత్తయ్యగౌడ్, రాజేంద్రప్రసాద్, రాజేందర్, శ్రీనివాస్, శ్రీనివాస్, పోశం, శ్రీనివాస్రెడ్డి, రత్నాకర్రెడ్డి, హన్మాన్రెడ్డిలున్నారు. ఎన్టీపీసీలో రాజీవ్ సద్భావనదివస్ ప్రతిజ్ఞ జ్యోతినగర్: ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు పరిపాలనా భవనంలో సద్భావన దివస్ ప్రతిజ్ఞ చేశారు. సోమవారం రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సద్భావన దివస్లో భాగంగా హిందీ, ఇంగ్లిష్ భాషలలో ఎగ్జిక్యూటివ్ రవీంద్ర సద్భావనా ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి సంవత్సరం ఆగష్టు–20 న ప్రతిజ్ఞ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు జాతీయ సమైక్యత, శాంతి, జాతీయ సమగ్రత, ప్రేమ కలిగి ఉం డాలన్నారు. జనరల్ మేనేజర్లు‡ బాబ్జి, యం.ఎస్.రమేశ్తో పాటు అధికారులున్నారు. ఇందిరమ్మకాలనీలో... పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ చీప్ ఆర్గనైజర్ గోలివాడ ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో రామగుండం కార్పొరేషన్ 3వ డివిజన్ ఇందిరమ్మకాలనీలో రాజీవ్గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళుర్పించారు. అనంతరం చిన్నారులతో కేక్ కట్ చేసి మిఠాయిలను పంచి పెట్టారు. అంగన్వాడీ కేంద్రం విద్యార్థులకు పలకలను అందజేశారు. సేవాదళ్ నాయకులు బొద్దున రాజేశం, జబ్బార్, శ్రీశైలం, చంద్రయ్య, చిలుక రాంమూర్తి, శ్రావణ్, లింగయ్య, కళ్యాణ్, కుమార్ నాయక్, సంపత్రావు, కల్వల రాజు, సత్యనారాయణ, సదయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు. -
ఘనంగా కేటీఆర్ జన్మదినం
నారాయణపేట రూరల్: ఐటీ రంగంలో వినూత్న ఒరవడి సష్టించి తెలంగాణ రాష్ట్రానికి మార్గనిర్ధేశనం చేస్తున్న మంత్రి కేటీఆర్ను యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని టీఆర్ఎస్వీ యువజన విభాగం అధ్యక్షుడు శ్రీపాద్ పిలుపునిచ్చారు. కేటీఆర్ జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. జిల్లా ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంచారు. పట్టణంలో మోటర్బైక్ ర్యాలీ చేపట్టారు. మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్నాగరాజు, వైస్ చైర్మన్ చెన్నారెడ్డి, టౌన్ అధ్యక్షుడు కోట్ల రాజవర్ధన్రెడ్డి, డాక్టర్ నర్సింహారెడ్డి, కృష్ణ కోర్వర్, కన్న జగదీష్, విజయ్సాగర్, ప్రతాప్రెడ్డి, వెంకట్, సుమిత్, రాజు, శివ, సిద్దు, వినోద్, అశోక్, ఫయాజ్, అనిల్, చరణ్, కష్ణనాయక్, నరేష్ పాల్గొన్నారు. -
వైఎస్సార్ సేవలు మరువలేనివి
పెందుర్తి: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి 69వ జయంతి వేడుకలు పెందుర్తి నియోజకవర్గంలో ఆదివారం వేడుకగా జరిగాయి. పెందుర్తి కూడలి వద్ద రాజశేఖర్రెడ్డి విగ్రహానికి వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్రాజ్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమానికి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్రెడ్డి చేసిన సేవలు మరువలేనివన్నారు. రాష్ట్రాన్ని దేశంలోనే రోల్మోడల్గా తీర్చిదిద్దిన ఘనత వైఎస్సార్దే అన్నారు. వైఎస్సార్ మరణానంతరం రాష్ట్రంలో పరిస్థితులు దిగజారాయని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం గద్దెనెక్కాక ఆ పార్టీ నాయకులు రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారని విమర్శించారు. మళ్లీ రాష్ట్రానికి సువర్ణ పాలన అందించాలంటే వైఎస్సార్ తనయుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డికే సాధ్యమన్నారు. ప్రజల కష్టాలు తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకే రాష్ట్రవ్యాప్తంగా ప్రజాసంకల్పయాత్ర చేస్తున్నారన్నారు. త్వరలో నియోజకవర్గంలో అడుగు పెట్టనున్న జగన్మోహన్రెడ్డి పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అక్కిరెడ్డిపాలెంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. 500 మంది పేదలకు చీరలు పంపిణీ చేశారు. సుజాతనగర్లో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నాయకులు, కార్యకర్తలకు మిఠాయిలు పంచిపెట్టారు. ముందుగా వేపగుంట నుంచి కృష్ణరాయపురం, పురుషోత్తపురం, సుజాతనగర్, చినముషిడివాడ, పెందుర్తి ప్రభుత్వ కళాశాల, పెందుర్తి కూడలి మీదుగా అక్కిరెడ్డిపాలెం వరకు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. పార్టీ జిల్లా కార్యదర్శి గొర్లె రామునాయుడు, వార్డుల అధ్యక్షులు ముమ్మన వెంకటరమణ, దాసరి రాజు, ఎల్బీ నాయుడు, మండల కన్వీనర్ నక్కా కనకరాజు, సర్పంచ్ గొరపల్లి సాంబ, నాయకులు శరగడం నరసింహమూర్తి, నడింపల్లి రామరాజు, వడ్డాది అప్పలరాజు, చిప్పల చందు, రాపర్తి మాధవరావు, వినోద్, వర్మ, నర్సింగ్, చందుయాదవ్, మండవ గౌరీ లక్ష్మి, కరక శ్యామల, చిరికి దేముడు తదితరులు పాల్గొన్నారు. పినగాడిలో వైఎస్సార్కు బాలరాజు నివాళి పినగాడిలో వైఎస్సార్ విగ్రహానికి మాజీ మంత్రి పి.బాలరాజు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బయిలపూడి భగవాన్ జయరామ్, నియోజకవర్గ సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్రాజ్, కాంగ్రెస్ నాయకుడు సతీష్వర్మ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అడవివరంలో.. సింహాచలం: భీమిలి నియోజకవర్గం 72వ వార్డు పరిధి అడవివరం మార్కెట్ కూడలిలో వైఎస్సార్ సీపీ వార్డు అధ్యక్షుడు కొలుసు ఈశ్వరరావు ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి చిత్రపటం వద్ద కేక్ కట్ చేశారు. మధ్యాహ్నం 1000 మందికి అన్నప్రసాదం అందజేశారు. వైఎస్సార్సీపీ భీమిలి సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల, విశాఖ పార్లమెంటరీ ఇన్చార్జి ఎం.వి.వి.సత్యనారాయణ మధ్యాహ్నం అడవివరం వచ్చి వైఎస్సార్కు నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ 72వ వార్డు నాయకులు నడింపల్లి రామరాజు, గుడ్ల గురునాథరెడ్డి, బోర కృష్ణారెడ్డి, దాసరి కనకరాజు, నగిరెడ్డి వెంకటరావు, కొణపల సత్యనారాయణ, బొట్టా శ్రీను, బంటుబిల్లి త్రినాథ్, ఆదిరెడ్డి, రాంభుక్త ప్రసాదరావు, చల్లా రాఘవ, రాపత్తి రాము, కె.అప్పలనాయుడు, మజ్జి అప్పలరమణ, దమ్ము ఎర్రాజీరావు, కరోతు రాము, మొయ్యి రమణ, మజ్జి శ్రీను, కంది అప్పారావు పాల్గొన్నారు. పరవాడ: జీవీఎంసీ 55 వార్డు దేశపాత్రునిపాలెంలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్రెడ్డి జయంతిని వైఎస్సార్సీపీ నాయకుడు కాసు అంజిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇక్కడి పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన వైఎస్సార్ కాంస్య విగ్రహనికి పార్టీ నాయకులు పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అంజిరెడ్డి కేక్ కట్ చేశారు. సీఈసీ సభ్యుడు పైల శ్రీనివాసరావు, పార్టీ పరవాడ మండల అధ్యక్షుడు సిరపరపు అప్పలనాయుడు, ఆర్ఈసీఎస్ మాజీ చైర్మన్ చల్లా కనకారావు, పార్టీ నాయకులు బండారు రామారావు, రాము, రమణ, వినోద్, నరేష్, వెంకటరావు పాల్గొన్నారు. పరవాడ: పరవాడలోని వైఎస్సార్ కాంస్య విగ్రహానికి పార్టీ సీఈసీ సభ్యుడు పైల శ్రీనివాసరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ వేడుకల్లో పార్టీ మండల అధ్యక్షుడు సిరపరపు అప్పలనాయుడు, పరవాడ సర్పంచ్ చుక్క రామునాయుడు, ఆర్ఈసీఎస్ మాజీ చైర్మన్ చల్లా కనకారావు, పార్టీ నాయకులు పైల అప్పలనాయుడు(జూనియర్), బండారు రామారావు, పైల హరీష్, బొద్దపు చిన్నారావు, పి.అప్పలనాయుడు, ఎస్.సూర్యనారాయణరాజు, పెదిశెట్టి శేఖర్, గోవిందు, వెన్నల నరసింగరావు, సన్యాసిరావు, కె.తాతాజీ, వాసు, బొంది మహేష్, సూరాడ ముత్యాలరావు, ఈరిగిల ప్రసాద్, అప్పారావు పాల్గొన్నారు. సబ్బవరం: సబ్బవరంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో వైఎస్ఆర్ చిత్రపటానికి పార్టీ సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్రాజ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కేక్ కట్ చేసి అందరికీ పంచి పెట్టారు. అనంతరం సబ్బవరం మూడు రోడ్ల కూడలిలోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు కొటాన రాము, పార్టీ మండల కన్వీనర్ తుంపాల అప్పారావు, సమన్వయ కమిటీ సభ్యులు వడ్డాది అప్పలరాజు, కొటాన వెంకటరమణ, బోకం శ్రావణ్కుమార్, మండల సేవాదళ్ అధ్యక్షుడు టి.శేఖర్, నాయకులు లకినేని కేశవరావు, పిల్లల అప్పలనాయుడు, కడియాల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. బాటజంగాలపాలెం శివారు అజయ్నగర్లో వైఎస్సార్ జయంతిని ఘనంగా నిర్వహించారు. -
అభివృద్ధికి చిరునామా వైఎస్సార్
రైల్వేకోడూరు : ప్రతి ఇంటికి తమ పథకాలతో చేరువై.. రాష్ట్రంలో అభివృద్ధికి చిరునామాగా నిలిచిన వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డినే అని వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పంజం సుకుమార్రెడ్డి పేర్కొన్నారు. వైఎస్ జయంతి సందర్భంగా ఆదివారం పట్టణంలోని టోల్గేట్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ పేద ప్రజల సంక్షేమం కోసం పాటుపడ్డారని, అందుకే ఆయన వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. తన ప్రాణం ఉన్నంత వరకు వైఎస్ ప్రజల కోసమే తపించారని పేర్కొన్నారు. మారుమూల గ్రామాల ప్రజలకు కూడా ఖరీదైన వైద్యం అం దాలనే లక్ష్యంతో రాజీవ్ఆరోగ్యశ్రీ,, 108 వంటి సౌకర్యాలను కల్పించారని తెలిపారు. దీంతో వైఎస్ దేశ, రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర ఏర్పరుచుకున్నారని వివరించారు. రైతులకు ఉచిత విద్యుత్పై ఆయన ముఖ్యమంత్రిగా తన తొలి సంతకం చేశారని తెలిపారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు, పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత వైఎస్సార్కే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి బండారు సుబద్రమ్మ, జెడ్సీటీసీ మారెళ్ల రాజేశ్వరి, పార్టీ వివిధ విభాగాల కన్వీనర్లు, నాయకులు సీహెచ్ రమేష్, కౌరెడ్డి సిద్దయ్య, మందల నాగేంద్ర, ముజీబ్, ఇనమాల మహేష్, అబ్దుల్ రౌఫ్, నారాయణరెడ్డి, సుబ్బరామిరెడ్డి, సీసీ చలపతి, తిరుపతి శేఖర్, రామచంద్రారెడ్డి, దొంతిరెడ్డి శ్రీనివాసులరెడ్డి, సుదర్శన్రాజు, రత్తయ్య, ఎంపీటీసీలు మందల శివయ్య, సుబ్రమణ్యం, రవిశంకర్, రమణారెడ్డి, ఏ సులోచన తదితరులు పాల్గొన్నారు. వాడవాడలా వైఎస్సార్ జయంతి మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో వైఎస్ జయంతి వేడుకలను ప్రజలు, వైఎస్సార్ అభిమానులు ఘనంగా నిర్వహించారు. తంబిళ్లవారిపల్లెలో పంజం విజయ రంగారెడ్డి, రక్కాసి సుబ్రమణ్యంరెడ్డి, మందపల్లె సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అలాగే తూర్పుపల్లెలో నీటి సంఘం అధ్యక్షుడు పంజం వేణుగోపాల్రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఆకేపాటి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
థ్యాంక్యూ సుచిత్రా
... అంటున్నారు మోహన్ లాల్. ఎవరీ సుచిత్రా అంటే.. ఆయన సతీమణి. బుధవారం మోహన్లాల్ 30వ వివాహ వార్షికోత్సవం. ఈ సందర్భంగా ‘‘నాకు అద్భుతమైన బిడ్డలను (కొడుకు ప్రణవ్, కూతురు విస్మయా) ఇచ్చావు. నువ్వు అద్భుతమైన భార్యవి. థ్యాంక్స్’’ అని భార్యను అభినందించారు మోహన్లాల్. కుమారుడు ప్రణవ్ సమక్షంలో ఈ జంట తమ వెడ్డింగ్ యానివర్శరీని సెలబ్రేట్ చేసుకున్నారు. ‘‘ఒకవేళ ఇది (తల్లిదండ్రుల పెళ్లిని ఉద్దేశించి) జరగకపోయి ఉంటే నాలాంటి కొడుకు మీకు ఉండేవాడు కాదు. మీ ఇద్దరికీ పెళ్లిరోజు శుభాకాంక్షలు’’ అన్నారు ప్రణవ్. కాగా, ప్రణవ్ హీరోగా నటించిన ‘ఆది’ ఈ ఏడాది జనవరిలో రిలీజైంది. నటుడిగా మంచి మార్కులు తెచ్చుకున్నారు. -
నాష్విల్లేలో ఘనంగా శ్రీనివాస కళ్యాణం
టేనస్సీ: నాష్విల్లేలోని గణేష్ ఆలయంలో శ్రీనివాస కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అమెరికా తెలుగు అసోసియేషన్(ఆటా), ఇండియన్ కమ్యూనిటీ ఆఫ్ నాష్విల్లే(ఐసీఓఎన్)ల ఆధ్వర్యంలో గత నెల 28న నిర్వహించిన ఈ కల్యాణ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాస ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పుష్పాలతో విగ్రహాలను అలంకరించి శ్రీనివాస కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళ్యాణ కమిటీ సభ్యులు ఆల రామకృష్ణా రెడ్డి, నూకల నరేందర్ రెడ్డి, సుషీల్ చందా, గుడూరు కిశోర్ రెడ్డి, దయప ప్రకాశ్ రెడ్డి, పునీత్ దీక్షిత్, రవి కిరణ్, రాధిక రెడ్డి, నూకల లావణ్య, మంజూ లిక్కి, బూస సునీత, అరమండ్ల రాధిక, రాచకొండ సాయిరాం, కేస సిరిషా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కల్యాణ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. శ్రీనివాస కల్యాణాన్ని వైభవంగా పూర్తి చేసినందుకు భక్తులకు, అతిథులకు, దాతలకు, ఆలయ పూజారి, ఆలయ బోర్డు సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నాష్విల్లేలోని గణేష్ ఆలయం విస్తరణ పనులను గత కొన్ని ఏళ్లక్రితమే ప్రారంభించారు. ఆలయ అభివృద్ధికి దాదాపు 4 మిలియన్ల డాలర్లను ఖర్చుచేశారు. అమెరికా తెలుగు అసోసియేషన్(ఆటా), ఇండియన్ కమ్యూనిటీ ఆఫ్ నాష్విల్లే(ఐసీఓఎన్) సభ్యులు పెద్ద మొత్తంలో ఆలయానికి విరాళాలు ఇచ్చారు. గత ఏడాది కూడా శ్రీనివాస కళ్యాణం వైభవంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. -
యూఎస్లో వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ వేడుకలు
సెయింట్ లూయిస్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 8వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా అమెరికా సెయింట్ లూయిస్లో పార్టీ ఆవిర్భావ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా కో ఆర్డినేటర్ పమ్మి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. వైఎస్ఆర్సీపీ, వైఎస్ జగన్ నినాదాలతో హోరెత్తించారు. వేడుకల అనంతరం సుబ్బారెడ్డి మాట్లాడుతూ కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగనేనంటూ వ్యాఖ్యానించారు. ఈ వేడుకల్లో గోపాల్ రెడ్డి, నవీన్ గూడవల్లి, పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
చదువుతో పాటు ఆటపాటల్లో రాణించాలి
నేరడిగొండ : విద్యార్థులు చదువుతో పాటు ఆటపాటల్లో రాణించాలని నేరడిగొండ సర్పంచ్ ఆడె విజయలక్ష్మి సూచించారు. నేరడిగొండలోని జిల్లా పరిషత్ సెకండరి పాఠశాల వార్షికోత్సవ వేడుకలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో వార్షికోత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తానని భరోసానిచ్చారు. ఎస్సై వెంకన్న మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదువుతూ ముందుకు సాగాలన్నారు. నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. హెచ్ఎం భూమారెడ్డి, వీడీసీ అధ్యక్షుడు ఏలేటి రవిందర్రెడ్డి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ రాథోడ్ కమల్సింగ్ ఉన్నారు. -
వేతన సంబురం
పరిగి : హోంగార్డుల్లో హర్షాతిరేకాలు.. వేతనం పెంచుతూ ప్రభుత్వం గత డిసెంబర్లో తీసుకున్న నిర్ణయం అమల్లోకి వచ్చింది. పెంచిన ప్రకారం నెలకు రూ. 20 వేల వేతనం గురువారం వారి ఖాతాల్లో జమ అయ్యాయి. ఈ ఆనందభరితమైన క్షణాలు వారు తోటి సిబ్బంది, పోలీసు అధికారులతో పంచుకున్నారు. మొదటి సారి రూ. 20 వేల వేతనం డ్రా చేసుకున్న వారు స్వీట్లు తీసుకువచ్చి అందరికీ పంచారు. ప్రభుత్వం పెంచుతున్నట్లు ప్రకటించిన రోజు కంటే తమ ఖాతాల్లో జజ అయిన క్షణాల్లో తమ ఆనందం రెట్టింపుయ్యిందని వారు తెలిపారు. పరిగి ఎస్ఐలు కృష్ణ, ఓబుల్రెడ్డి వారికి స్వీట్లు తినిపించారు. తమ పనికి తగిన గౌరవం లభించినట్లయ్యిందని సంతోషం వ్యక్తం చేశారు. ఇక ముందు మరింత ఆత్మ విశ్వాసంతో పనిచేస్తామని తెలిపారు. క్రమబద్ధీకరిస్తే బాగుండేదని మరికొందరు హోంగార్డులు అభిప్రాయం వ్యక్తం చేశారు. గడిచిన సంవత్సర కాలంలో రెండు సార్లు వేతనాలు పెంచటంతో పాటు హోంగార్డులకు ఆరోగ్యపరమైన, గృహాలు నిర్మించి ఇచ్చే విషయంలో ప్రభుత్వం వరాల జల్లు కురిపించిన విషయం తెలిసిందే. నెలకు రూ. 9 వేలుగా ఉన్న హోంగార్డుల వేతనాలు గత మార్చిలో రూ. 12 వేలకు పెంచగా ప్రస్తుతం రూ. 20 వేలకు పెంచింది. ఎంతో మంచి నిర్ణయం ఇప్పటి వరకు హోంగార్డులుగా అనేక సేవలు అందిస్తూ వచ్చాం. చాలిచాలని వేతనాలతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇప్పుడు సీఎం కేసీఆర్ హోంగార్డులకు వేతనాలు పెంచటంతో పాటు తగిన గుర్తింపు ఇచ్చారు. సంక్షేమంపై తీసుకున్న నిర్ణయంతో హోంగార్డుల కుటుంబాలకు ఎంతో మేలు జరగనుంది. – బిచ్చయ్య, హోంగార్డు, పరిగి. సమస్యలు తీరుతాయి సీఎం కేసీఆర్ తమకు వేతనాలు పెంచడంతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పటంతో చాలా సంతోషం. తమకు చాలా వరకు సమస్యలు తీరుతాయి. ఇదే సమయంలో కానిస్టేబుల్ నియామకాల్లో రిజర్వేషన్లు పెంచటం కూడా మంచి నిర్ణయమే. మరింత ఉత్సాహంతో పనిచేస్తాం. – యాదలక్ష్మి, హోంగార్డు, పరిగి -
జిల్లా అభివృద్ధికి పునరంకితం కావాలి
గణతంత్ర వేడుకల్లో కలెక్టర్ అరుణ్కుమార్ కాకినాడ సిటీ : సమైక్యత, సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుతూ జిల్లా అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్ కుమార్ పిలుపునిచ్చారు. గురువారం స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో 68వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాస్థాయి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీస్, ఎన్సీసీ దళాలు నిర్వహించిన సంప్రదాయ కవాతును తిలకించి, గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ ఈ ఏడాది కొత్తగా మూడు వేల ఎకరాల ఉద్యాన భూములకు మైక్రో ఇరిగేషన్ వసతులను విస్తరిస్తున్నామని తెలిపారు. కోడిగుడ్ల ఉత్పత్తిలో జిల్లా దేశంలోనే అగ్రస్థానంలో ఉండగా, సాలీనా 2 లక్షల టన్నుల ఉత్పత్తులతో రాష్ట్ర మత్స్యరంగంలో నాల్గో స్థానంలో నిలిచిందన్నారు. డ్వాక్రా సంఘాల మహిళలకు ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.81 కోట్లు వడ్డీ రాయితీ జమ చేశామని, రుణమాఫీ పథకం రెండో విడతగా రూ.258 కోట్ల పెట్టుబడి నిధిని 8 లక్షల 60 వేల మంది సభ్యులకు పసుపు–కుంకుమలుగా పంపిణీ చేశామన్నారు. ప్రతిష్టాత్మక పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా ఏలేరు పరిధిలో 67 వేల హెక్టార్లు, పిఠాపురం బ్రాంచి కాలువ పరిధిలో 20 వేల హెక్టార్లు ఆయకట్టు స్థిరీకరణలోకి రానుందన్నారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద రూ.367 కోట్ల వ్యయంతో కోటి 39 లక్షల మందికి ఉపాధి కల్పించామన్నారు. ఎన్.టి.ఆర్. గృహ నిర్మాణ పథకం కింద 24 వేల గృహాలు నిర్మాణం, 17 వేల ఇళ్ళకు మరమ్మతులు చేపట్టామన్నారు. రానున్న రెండేళ్ళలో 600 పాఠశాలల్లో 1200 డిజిటల్ తరగతి గదులు ప్రారంభిస్తున్నామని, 370 ఆదర్శ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధన ప్రవేశపెట్టామన్నారు.ఈ సంవత్సరం 96 కోట్ల నిధులతో షెడ్యూల్డ్ కులాలకు, రూ.6.62 కోట్ల నిధులతో షెడ్యూల్డ్ తెగలకు, రూ.44 కోట్ల నిధులతో విభిన్న ప్రతిభావంతులకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా రూ.162 కోట్ల నిధులతో రక్షిత తాగునీటి పథకాల నిర్మాణం, రూ.485 కోట్ల నిధులతో ఆర్అండ్బి రహదారుల అభివృద్ధి, రూ.325 కోట్ల నిధులతో పంచాయతీరాజ్ రోడ్ల అభివృద్ధి, రూ.126 కోట్ల నిధులతో విద్యుత్ సరఫరా విస్తరణ పనులు జరుగుతున్నాయన్నారు. జిల్లాలో వినూత్నంగా చేపట్టిన అంశాలు జిల్లాలో నగదు రహిత లావాదేవీల విస్తరణ, పర్యాటక అభివృద్ధిని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ నామన రాంబాబు, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఎన్.రవిప్రకాష్, జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్–2 జె.రాధాకృష్ణమూర్తి విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం వేడుకలకు హాజరైన స్వాతంత్య్ర సమరయోధుడు 98 ఏళ్ళ చోడిపల్లి హనుమంతరావును జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్, జెడ్పీ ఛైర్మన్ నామన రాంబాబు ఘనంగా సత్కరించారు. సంక్షేమాలు, ఆస్తుల పంపిణీ... గణతంత్ర దినోత్సవాల్లో భాగంగా ఆరు ప్రభుత్వశాఖల ఆధ్వర్యంలో 1,788 మంది లబ్ధిదారులకు రూ.55 కోట్ల 30 లక్షలు విలువైన ఆస్తులు, ఉపకరణాలను కలెక్టర్ పంపిణీ చేశారు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు అట్టహాసంగా నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో జాతీయ సమగ్రత పెల్లుబికింది. దేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే నృత్యాలు, దేశభక్తిని ప్రబోధించే గీతాలు, జిల్లా ప్రగతిని చాటిచెప్పే శకటాలు, ఒళ్లు గగుర్పొడిచే సాహస నృత్యాలు, ఆహుతులను కట్టిపడేశాయి. వివిధ శాఖలు, సంస్థలు ఏర్పాటు చేసిన స్టాళ్లు సందడితో గురువారం జిల్లా కేంద్రం కాకినాడ పోలీస్ పెరేడ్ మైదానంలో నిర్వహించిన 68వ గణతంత్ర వేడుకలు కనువిందు చేశాయి. ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సాగిన ఈ ఉత్సవాల్లో జిల్లాలోని వివిధ పాఠశాలకు చెందిన రెండు వేల మంది విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు. వేడుకల్లో 8 పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొని తమ నృత్యప్రదర్శనలతో అలరించారు. భరత ఖండమే నాదేశం.. అంటూ కాకినాడ ఎంఎస్ఎన్ ఎయిడెడ్ హైస్కూల్ జగన్నాథపురం, గణతంత్రానికి శుభోదయం.. అంటూ జెడ్పీహెచ్ తూరంగి పేట, వందేమాతరం... అంటూ జెడ్పీహెచ్ పవర, ఇండియా వాలే..అంటూ ఉమామనోవికాసం కేంద్రం మానసిక దివ్యాంగులు, సత్యమేవజయతే.. అంటూ జెడ్పీహెచ్ ఇంద్రపాలెం, క్విట్ ఇండియా.. అంటూ సెయింటాన్ ఎయిడెడ్ స్కూల్ జగన్నాథపురం, జయహో.. అంటూ నారాయణ ఇంగ్లిష్ మీడియం స్కూల్ రామారావుపేట, మేరాభారత్ మహా.. అంటూ గమ్యం స్కూల్ జి.మామిడాడ విద్యార్ధినీ,విద్యార్ధులు నృత్యప్రదర్శనలు ఇచ్చారు.