
34 కిలోల గంజాయి పట్టివేత
గంజాయిపై ‘సాక్షి’దినపత్రికలో వచ్చిన కథనాలతో నిర్మల్ జిల్లా పోలీసులు వేగంగా స్పందించారు.
ఈ క్రమంలో బుధవారం జిల్లా కేంద్రంలోని వైఎస్ఆర్ కాలనీలో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. వారు ఇచ్చిన వివరాలతో దిలావర్పూర్ మండలం గుండంపల్లిలో ఇద్దరిని, నిర్మల్లో ఒకరిని, ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండ మండలం కొరిటికల్(బి)లో ఒకరిని, ధార్మిక్నగర్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. వీరి వద్ద నుంచి మొత్తం 34కిలోల గంజాయిని సాగు చేసుకున్నామన్నారు. కాగా, నిర్మల్ జిల్లాలో గంజాయి సాగు, విక్రయాలు జోరుగా జరుగుతున్న విషయాన్ని ‘సాక్షి’ముందే చెప్పింది. ఈనెల 18న జిల్లా టాబ్లాయిడ్లో ‘మత్తు’గ గంజాయి సాగు!.. శీర్షికన కథనాన్ని ప్రచురించింది. అలాగే బుధవారం సాక్షి మెయిన్లో ‘గంజాయి ‘సాగు’తోంది!.. శీర్షిక నెట్వర్క్ కథనాలను ప్రచురించింది. ఈనేపథ్యంలో పోలీస్శాఖ వేగంగా స్పందించింది.
వారి సమాచారం మేరకు అఖిలా బీ ఇంటిపై దాడులు చేసి 13 కిలోల గంజాయిను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణాలో సయ్యద్ బషీర్ అల్లుడు సయ్యద్ కరీంకు సంబంధం ఉండటంతో ఆయనను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు డీసీ తెలిపారు. ఎక్సైజ్ పోలీసులు తమ ఇంటిపై దాడులు చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న భార్యభర్తలు అంతకు ముందే పారిపోయారు. వీరికి కోసం గాలిస్తున్నట్లు డీసీ తెలిపారు.