Excise Department
-
మద్యం షాపులపై... బార్ ఓనర్స్ వార్
నరసరావుపేటటౌన్: మద్యం దుకాణాల యజమానులు అనధికారికంగా పర్మిట్ రూములు ఏర్పాటుచేసి నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా అమ్మకాలు సాగించడంపై బార్ అండ్ రెస్టారెంట్ల యజమానులు ఆందోళనబాట పట్టారు. అధికార కూటమి నేతలకు లబ్ధి చేకూర్చేందుకు ఎక్సైజ్ అధికారులు తమను నిండా ముంచేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు శనివారం పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో బార్ అండ్ రెస్టారెంట్లను మూసివేసి యజమానులు ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. తాము బార్లు నిర్వహించలేమని తాళాలను అధికారులకు అప్పగించారు. ఇప్పటికే నరసరావుపేట పట్టణంలో 17 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం మరో 11 వైన్ షాపులకు అనుమతులు ఇచ్చింది. ఆ వైన్ షాపుల్లో అనధికారికంగా పర్మిట్ రూములు ఏర్పాటుచేసి బార్ అండ్ రెస్టారెంట్లకు దీటుగా నిర్వహిస్తున్నారు.మాంసం, బిర్యానీ, ఇతర తినుబండారాలను అందుబాటులో ఉంచుతున్నారు. అక్కడ అన్ని సదుపాయాలు ఉండటం, మద్యం కూడా బార్ అండ్ రెస్టారెంట్ల కన్నా తక్కువ ధరకు వస్తుండటంతో ఎక్కువ మంది వైన్ షాపుల వద్దకే వెళుతున్నారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి పెట్టిన బార్ అండ్ రెస్టారెంట్లు వెలవెలబోతున్నాయి. కూటమి నేతలకు మేలు చేసేలా అధికారుల తీరు ఎక్సైజ్ శాఖ ఆడుతున్న ఆటలో తాము బలైపోతున్నామంటూ నరసరావుపేటలోని బార్ అండ్ రెస్టారెంట్ల యజమానులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. తమ బార్ అండ్ రెస్టారెంట్లకు తాళాలు వేసి ఎక్సైజ్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. బార్ల తాళాలను ఎక్సైజ్ శాఖ సీఐ సోమయ్యకు అందజేసి తాము వ్యాపారం చేయలేమని తేల్చి చెప్పారు. వైన్ షాపుల్లో అక్రమ విక్రయాలపై చర్యలు తీసుకునేవరకు తాము బార్లు తెరవబోమని స్పష్టం చేశారు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బార్లు ఏర్పాటు చేసుకుంటే తమకు నెలకు రూ.5లక్షల వరకు నష్టం వస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేక పోతున్నామన్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎక్సైజ్ శాఖాధికారులు పట్టించుకోవడం లేదని చెప్పారు. కూటమి నేతలకు మేలు చేసేలా అధికారుల తీరు ఉందని, ఇలాగైతే వ్యాపారం చేయలేం మహాప్ర¿ో... అంటూ రెండు చేతులెత్తి దండం పెట్టారు. రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని ఎక్సైజ్ సీఐ హామీ ఇవ్వడంతో బార్ అండ్ రెస్టారెంట్ల యజమానులు ఆందోళనను విరమించి వెనుదిరిగారు. -
‘మార్జిన్’లో చీర్స్! బాబు చీర్స్!
సాక్షి, అమరావతి: మద్యం దందా దోపిడీ ఇచ్చే కిక్కు ‘ముఖ్య’నేతకు తెలిసినంతగా మరెవరికీ తెలీదు..! అందుకే మద్యం విధానం ముసుగులో భారీ దోపిడీకి ఎప్పటికప్పుడు కొత్త కుతంత్రాలు పన్నుతూనే ఉంటారు..! 40 ఇయర్స్ ఇండస్ట్రీ దోపిడీ అంటే ఏమిటో మరోసారి చేతల్లో చూపించారు! ఇప్పటికే రాష్ట్రంలోని మద్యం దుకాణాలను టీడీపీ(TDP) సిండికేట్కు ఏకపక్షంగా కట్టబెట్టేసి భారీ దోపిడీకి పాల్పడ్డారు. మద్యం దుకాణాలకు ఇతరులెవరూ టెండర్లు వేయకుండా బెదిరించి సీఐల నుంచి పోలీసు యంత్రాంగం మొత్తాన్ని మోహరించి పచ్చ ముఠాలకే షాపులు దక్కేలా చేశారు. అయినా సరే ‘ముఖ్య’నేత అంతటితో సంతృప్తి చెందలేదు. మద్యం సిండికేట్తో మరో డీల్ చేసుకుని ఏటా అదనంగా రూ.వందల కోట్లు కమీషన్ వసూలు చేసుకునేందుకు ‘ఛీర్స్’ చెప్పారు! ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి తన జేబులోకి ఏటా ముడుపుల వరద పారించే చానల్ను ఏర్పాటు చేసుకున్నారు. మార్జిన్ 14 శాతానికి పెంచేందుకు ‘పచ్చ’జెండా ఊపారు! ఈమేరకు ‘ఏఆర్టీ’ని సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో మద్యం ధరలు(liquor prices) భారీగా పెరగనున్నాయి. చీప్ లిక్కర్ మినహా అన్ని బ్రాండ్ల మద్యం ధరలు 10 – 20 శాతం వరకు పెరగనున్నాయి. క్వార్టర్ మద్యం బాటిల్ ధర రూ.20 నుంచి రూ.30 వరకు పెరగనుంది. అంతిమంగా మందుబాబులపై ఈ భారం పడనుంది. ఒక్క డీల్తో ఈ కుతంత్రం కథను నడిపించిన తీరు ఇదిగో ఇలా ఉంది...ముందస్తు పన్నాగం..అటు నుంచి నరుక్కురావడం అంటే ఏమిటో ‘ముఖ్య’నేత మరోసారి చేతల్లో చూపించారు. మద్యం దోపిడీ కోసం టీడీపీ కూటమి ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరించిన తీరే అందుకు తాజా నిదర్శనం. కూటమి సర్కారు గతేడాది అక్టోబరు నుంచి రాష్ట్రంలో ప్రైవేట్ మద్యం దుకాణాల వ్యవస్థను మళ్లీ అమలులోకి తెచ్చింది. ఇతరులు ఎవరూ టెండర్లు దాఖలు చేయకుండా పోలీసులతో అడ్డుకుని టీడీపీ సిండికేట్కు మద్యం దుకాణాలను ఏకపక్షంగా కట్టబెట్టింది. 2024 అక్టోబరు నుంచి రెండేళ్లపాటు లైసెన్సులు కేటాయించేందుకు భారీ ముడుపులు కొల్లగొట్టారు. మద్యం దుకాణాల్లో విక్రయించే ప్రతి సీసాకు రూ.5 చొప్పున కమీషన్ కింద లెక్కించి ముందుగానే రెండేళ్ల మద్యం అమ్మకాలపై ఏకమొత్తంగా భారీ కమీషన్ల మూటలు కరకట్ట బంగ్లాకు చేరేలా కథ నడిపారు. అనంతరమే మద్యం దుకాణాలకు లైసెన్సులు జారీ చేశారు. ‘ముఖ్య’నేత అంతటితో ఆగలేదు. మద్యం దందాలో మరింత పిండుకోవాలని ఎత్తుగడ వేశారు. ఈ క్రమంలో.. మద్యం విక్రయాలపై తమకు మార్జిన్ పెంచాలని సిండికేట్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. తమకు మద్యం అమ్మకాలపై వాస్తవంగా వస్తున్న 10 శాతం లాభం మార్జిన్ సరిపోవడం లేదనే వాదనను అందుకుంది. తమకు వాస్తవంగా 14 శాతం మార్జిన్ వచ్చేలా చూడాలనే డిమాండ్ను తెరపైకి తెచ్చింది.మూటలు ఇస్తేనే మార్జిన్ పెంచుతాం...– మెలిక పెట్టిన ‘ముఖ్య’ నేత మార్జిన్ పెంచాలని మద్యం సిండికేట్ నుంచి డిమాండ్ మొదలైన తరువాత ‘ముఖ్య’నేత అసలు విషయాన్ని చల్లగా బయటపెట్టారు. మరి మార్జిన్ పెంచితే ‘నాకేంటి..?’ అని ఆయన సూటిగానే అడిగేసినట్లు సమాచారం. దీంతో ‘ముఖ్య’నేత ఆంతర్యం ఏమిటన్నది మద్యం సిండికేట్కు అర్థమైంది. ఈ అంశంపై తర్జన భర్జనల తరువాత ‘ముఖ్య’నేతతో డీల్ కుదుర్చుకున్నారు. తమ మార్జిన్ను వాస్తవంగా 14 శాతానికి పెంచితే అందుకు తగిన కమీషన్ ఇస్తామంటూ మంతనాలు సాగించారు. ‘ముఖ్య’నేత కోరుకున్నదీ... సిండికేట్ ఇస్తానన్నది ఒకటే కావడంతో డీల్ కుదిరింది. దాంతో మద్యం అమ్మకాలపై మార్జిన్ను వాస్తవంగా 14 శాతం వచ్చేలా చేసేందుకు నిర్ణయించారు. ఈ నిర్ణయానికి కేబినెట్ ఆమోదం కూడా పొందారు.‘ముఖ్య’నేతకు ఏటా మూట..!మద్యం అమ్మకాలపై పన్నుల ద్వారా ప్రభుత్వానికి ఏటా దాదాపు రూ.30 వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. అయితే మద్యం దుకాణదారులకు మార్జిన్ 14 శాతం వచ్చేటట్లు చేస్తే ప్రభుత్వ ఆదాయం దాదాపు రూ.3 వేల కోట్ల మేర తగ్గుతుందని ఎక్సైజ్ శాఖ వర్గాలు అంచనా వేశాయి. ఆ మేరకు మద్యం దుకాణదారులకు ఏటా రూ.3 వేల కోట్ల ఆదాయం పెరుగుతుంది కాబట్టి అందులో మూడో వంతు తనకు కమీషన్గా ఇవ్వాల్సిందేనని ‘ముఖ్య’నేత పట్టుబట్టారు. అందుకు మద్యం సిండికేట్ సమ్మతించింది. అంటే మద్యం సిండికేట్ ‘ముఖ్య’నేతకు ఏటా రూ.వెయ్యి కోట్ల మూట ముట్టజెప్పనుందన్నది స్పష్టమవుతోంది. ఈ డీల్ ద్వారా ‘ముఖ్య’నేత సొంత ఖజానాకు ఏటా రూ.వెయ్యి కోట్లు చేరనుండగా టీడీపీ మద్యం సిండికేట్ రూ.2 వేల కోట్ల వరకు అదనపు లాభం కొల్లగొట్టనుందన్నది తేటతెల్లమవుతోంది. డీల్ కుదరడంతో ఈ పన్నాగానికి ముగింపుగా మద్యం ధరలపై అదనపు రీటైల్ ఎక్సైజ్ పన్ను (ఏఆర్టీ)సవరిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. తద్వారా మద్యం దుకాణదారులకు 14 శాతం మార్జిన్ వచ్చేలా చేశారు.ధరలు భారీగా పెంపు...రాష్ట్రంలో రూ.99కి అమ్ముతున్న చీప్ లిక్కర్ బ్రాండ్పై మినహా మిగిలిన అన్ని మద్యం బ్రాండ్లపై ధరలను మూడు కేటగిరీల కింద పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా అన్ని బ్రాండ్ల మద్యం ధరలు 10 – 20 శాతం వరకు పెరగనున్నాయి. క్వార్టర్ మద్యం బాటిల్ ధర రూ.20 నుంచి రూ.30 వరకు పెరిగే అవకాశం ఉంది. మొత్తం మీద మద్యం ధరల పెంపు ప్రభావం భారీగా ఉండనుంది. అంతిమంగా మందుబాబులపై భారీగా భారం పడనుంది. ఈ ఏడాది రాష్ట్రంలో 4.25 కోట్ల లిక్కర్ కేసులు, 3.25 కోట్ల బీరు కేసుల విక్రయాలు జరగనున్నట్లు ఎక్సైజ్ శాఖ అంచనా వేసింది. ఆ ప్రకారం క్వార్టర్ బాటిల్పై రూ.20 నుంచి రూ.30 వరకు పెంపు అంటే మద్యం ప్రియులపై భారీ ఆర్థిక భారం పడనుందన్నది సుస్పష్టం. ‘ముఖ్య’ నేత కమీషన్ల కోసం ఇంత కథ నడిపించడం పట్ల ఎక్సైజ్ శాఖ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఆయన దోపిడీ కోసం అటు ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి... ఇటు మద్యం సిండికేట్ నుంచి భారీ కమీషన్లు వసూలు చేస్తూ... మరోవైపు మద్యం ధరలు పెంచి మందు బాబుల జేబులు గుల్ల చేసేందుకు సిద్ధమయ్యారు. -
కొత్త కంపెనీలను పిలవండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మద్యం సరఫరా చేయడం కోసం కొత్త కంపెనీలను ఆహ్వానించాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. మద్యం సరఫరా కంపెనీలను ఎంపిక చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసి, దరఖాస్తులు స్వీకరించాలని.. ఇందుకోసం కనీసం నెల రోజులు గడువు ఇవ్వాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న కంపెనీల నాణ్యత ప్రమాణాలు, సరఫరా సామర్థ్యాన్ని పరిశీలించి పారదర్శకంగా ఎంపిక చేయాలని.. ఇప్పటికే సరఫరా చేస్తున్న కంపెనీల కోసం సులభతర వాణిజ్య విధానం అనుసరించాలని స్పష్టం చేశారు.మద్యం విషయంలో ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా వ్యవహరించవద్దని హెచ్చరించారు. శనివారం సాయంత్రం జూబ్లీహిల్స్లోని క్యాంపు కార్యాలయంలో ఎక్సైజ్ శాఖపై సీఎం రేవంత్రెడ్డి సమీక్షించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. యునైటెడ్ బ్రూవరీస్ (యూబీ) కంపెనీ బీర్ల ధరల పెంపు డిమాండ్, బకాయిలు చెల్లించనందున తెలంగాణలో తమ బ్రాండ్ మద్యాన్ని సరఫరా చేయబోమని ప్రభుత్వానికి లేఖ రాసిన అంశంపై చర్చించినట్టు తెలిసింది.కంపెనీల ఒత్తిడికి తలొగ్గేది లేదుయూబీ కంపెనీ వాదనను అధికారులు వివరించగా.. మద్యం కంపెనీల ఒత్తిడికి తలొగ్గేది లేదని సీఎం స్పష్టం చేశారు. ఈ క్రమంలో పొరుగునే ఉన్న ఏపీ, మహారా ష్ట్రలతోపాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న రేట్లను పరిశీలించాలని సూచించారు. కంపెనీలకు ఇచ్చే రేట్లను హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని ధరల నిర్ణాయక కమిటీ నిర్ధారిస్తుందని, ఆ కమిటీ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని గుర్తు చేశారు. ఆ కమిటీ తన నివేదికను త్వరగా ఇచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి క్రమం తప్పకుండా ఎక్సైజ్ బిల్లులు చెల్లిస్తున్నామన్నారు.గత ప్రభుత్వ హయాంలోని బకాయిలను కూడా క్రమంగా క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించారు. గతంలో మద్యం తయారీ, సరఫరా కోసం ఐదు సంస్థలకు అనుమతినిచ్చి, నిలిపివేసిన నేపథ్యంలో ఇప్పుడు వాటి గురించి పరిశీలించాలని సీఎం సూచించినట్టు సమాచారం. అయితే ఈ ఐదు సంస్థల్లో ఒక సంస్థకు డిస్టిలరీ ఏర్పాటు తోపాటు మద్యం తయారీకి గతంలో అనుమతినిచ్చారు. విమర్శలు రావడంతో అనుమతులను నిలిపివేశారు. ఇప్పుడు సీఎం ఆదేశాలతో పునః పరిశీలించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.హైదరాబాద్ అంతటా భూగర్భ విద్యుత్ కేబుల్స్గ్రేటర్ హైదరాబాద్లో, ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రాంతమంతా పూర్తిగా భూగర్భ విద్యుత్ కేబుళ్లు వేసే అంశంపై అధ్యయనం చేయాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనితో విద్యుత్ చౌర్యాన్ని అరికట్టడమేకాక, విద్యుత్ అంతరాయాలను కూడా అధిగమించడానికి వీలవుతుందని సూచించారు. దీనికి సంబంధించి వివిధ దేశాల్లోని ఉత్తమ విధానాలను పరిశీలించాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. రాష్ట్ర రాజధాని నగరంలో వేసే భూగర్భ విద్యుత్ కేబుల్ వ్యవస్థ దేశంలోనే అత్యు త్తమంగా ఉండాలని పేర్కొన్నారు. విద్యుత్ మాత్రమే గాక.. వివిధ రకాల కేబుళ్లు కూడా అండర్ గ్రౌండ్లోనే ఉండేలా ప్రత్యామ్నాయాలను పరిశీలించాలని ఆదేశించారు. శనివారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ‘క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ– 2025’ పాలసీని ఆవిష్కరించిన అనంతరం విద్యుత్ రంగంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు.ప్రభుత్వ భవనాలపై సోలార్ ప్లాంట్లురాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలు, పాఠశాలలపై సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు వెంటనే చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఈ మేరకు కంపెనీలను ఆహ్వానించి, ఏ విధానంలో వారికి పనులు అప్పగించాలనే అంశంపై ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆదివాసీ గూడేలలో గృహాలకు సోలార్ విద్యుత్, సోలార్ పంపుసెట్లు ఉచితంగా అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అటవీ, గిరిజన సంక్షేమం, ఇతర శాఖలతో సమావేశమై నివేదిక రూపొందించాలన్నారు. ఇక రానున్న వేసవిలో విద్యుత్ సరఫరాకు ఇబ్బంది లేకుండా పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. గత ఏడాది మార్చిలో రాష్ట్రంలో విద్యుత్ గరిష్ట(పీక్) డిమాండ్ 15,623 మెగావాట్లకు చేరిందని.. అది ఈసారి 16,877 మెగావాట్లకు చేరుతుందని అంచనా వేశామని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దీనితో గరిష్ట విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా విద్యుదుత్పత్తి, సరఫరా ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని సీఎం సూచించారు. -
కేఎఫ్ బీర్లు బంద్
సాక్షి, హైదరాబాద్: ఎ క్సైజ్ శాఖకు యునైటెడ్ బ్రూవరీస్ (యూబీ) కంపెనీ ఝలక్ ఇచ్చింది. తాము తయారు చేసే బీర్లను ఇక నుంచి తెలంగాణలో సరఫరా చేయబోమని ఆ కంపెనీ ప్రకటించింది. బేసిక్ ధరలు పెంచలేదని, బిల్లులు పెండింగ్లో ఉన్నందున బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్టు కంపెనీ నిబంధనల ప్రకారం...ఎన్ఎస్ఈ(నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజ్), బీఎస్ఈ (బాంబే స్టాక్ ఎక్స్చేంజ్)లకు సమాచారం ఇచ్చింది. రాష్ట్రంలో నాలుగైదు బ్రాండ్ల బీర్లకు మంచి మార్కెట్ ఉంది. అందులో యూబీ తయారు చేసే కింగ్ఫిషర్ బీర్లదే సింహభాగం. మొత్తం తెలంగాణ మార్కెట్లో 72 శాతం వరకు ఈ బ్రాండ్దే ఉంటుందని అంచనా. ఈ బీర్లు తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీబీసీఎల్)కు సరఫరా చేసినందుకుగాను కేస్కు రూ.289 చొప్పున తయారీదారులకు చెల్లిస్తారు. ఈ బేసిక్ ధర పెంచాలన్న డిమాండ్ ఎక్సైజ్ శాఖలో చాలా కాలంగా వినిపిస్తున్నా, అమల్లోకి రాకపోవడంతో తాజా సమస్య ఏర్పడింది. తక్షణమే నిలిపివేస్తున్నాం...యూబీ కంపెనీ సెక్రటరీ నిఖిల్ మల్పానీ పేరుతో బుధవారం స్టాక్ ఎక్సే్చంజ్లకు ఇచ్చిన సమాచారాన్ని జాతీయ మీడియా బహిర్గతం చేసింది. ఈ లేఖలో పేర్కొన్న ప్రకారం యూబీ తయారు చేసే బీర్ల సరఫరాను తెలంగాణలో తక్షణమే నిలిపివేయనుంది. 2019–20 నుంచి కంపెనీకి చెల్లించే బేసిక్ ధరలను తెలంగాణ ప్రభుత్వం సవరించలేదని, దీని కారణంగా భారీ నష్టాలు వస్తున్నాయని ఆ లేఖలో వెల్లడించారు. టీజీబీసీఎల్ చెల్లించాల్సిన పెద్ద మొత్తం పెండింగ్లో ఉందని, ఈ కారణంగానే తాము బీర్లు సరఫరా చేయడం లేదని స్పష్టం చేసింది.పలుమార్లు విజ్ఞప్తులుఐదేళ్లుగా బీర్, లిక్కర్ తయారీదారులకు బేసిక్ ధరలను రాష్ట్ర ప్రభుత్వం సవరించలేదు. ముఖ్యంగా బీర్ తయారీదారులకు ఎప్పటి నుంచో కేస్కు రూ.289 మాత్రమే చెల్లిస్తున్నారు. బీర్ల తయారీకి ఉపయోగించేముడి పదార్థాల ధరలు పెరిగినందున బేసిక్ ధరలు పెంచాలని యూబీతోపాటు అనేక కంపెనీలు కూడా ప్రభుత్వాన్ని కోరాయి. కొద్ది రోజుల క్రితం ఆలిండియా బీర్ అసోసియేషన్ ప్రతినిధులతో ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ శ్రీధర్ చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది. సీఎంతోపాటు ఎక్సైజ్ మంత్రి వద్ద జరిగిన అంతర్గత చర్చల్లోనూ లిక్కర్ కంపెనీల బేసిక్ ధరలు పెంచేది లేదని కరాఖండిగా తేల్చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే యూబీ కంపెనీ తమ ఉత్పత్తులను రాష్ట్రంలో సరఫరా చేయరాదని నిర్ణయించింది. వారం రోజులు ఓకే..బీర్ల సరఫరా తక్షణమే నిలిపివేసినా, మార్కెట్లో బీర్ల కొరత ఇప్పటికిప్పుడే రాదని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే యూబీ కంపెనీ నుంచి టీజీబీసీఎల్కు అందిన బీర్లు మరో ఆరేడురోజుల పాటు మార్కెట్లో అందుబాటులో ఉంటాయని, అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతేనే ఫలానా బ్రాండ్ బీర్ల కొరత ఏర్పడుతుందని చెబుతున్నాయి. అయితే వైన్షాపుల యజమానులు అప్రమత్తమయ్యారు. వీలున్నంత ఎక్కువగా కింగ్ఫిషర్ బీర్లకు ఇండెంట్ పెట్టినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో డిపోల వద్ద రేషన్ విధించే యోచనలో ఎక్సైజ్ శాఖ ఉన్నట్టు తెలుస్తోంది. చర్చలకు సిద్ధంగా ఉన్నాం : టీజీబీసీఎల్ ఎండీకి యూబీ కంపెనీ లేఖధరల పెంపు, బకాయిల విషయంలో నిర్ణయం తీసుకోనందునే తాము బీర్ల సరఫరాను బుధవారం నుంచి నిలిపివేసినట్టు, ఈ ప్రతిష్టంభనను తొలగించకుకోవడానికి టీజీపీసీఎల్తో చర్చలకు సిద్ధమని యూబీ కంపెనీ ప్రకటించింది. ఈ మేరకు టీజీ బీసీఎల్ ఎండీ, ఎక్సైజ్ డైరెక్టర్ చెవ్వూరి హరికృష్ణకు యూబీ కంపెనీ చీఫ్ కార్పొరేట్ ఎఫైర్స్ ఆఫీసర్ గరీమాసింగ్ లేఖ రాశారు. ఏప్రిల్ 1, 2024 నాటికి తమకు రూ.702 కోట్లు బకాయిలు రావాల్సి ఉందని, గత ఏడాది అక్టోబర్ నుంచి ఎలాంటి చెల్లింపులు జరగలేదని ఆ లేఖలో తెలిపారు. బేసిక్ ధర పెంపు నిర్ణయం జరిగిన వెంటనే బీర్ల సరఫరాను యథాతథంగా కొనసాగిస్తామని వెల్లడించారు. తమ బకాయిలు సెప్టెంబర్ 2025 లోపు దశలవారీగా చెల్లించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని టీజీ బీసీఎల్కు రాసిన లేఖలో గరీమాసింగ్ స్పష్టం చేశారు.ధరలు పెంచడమే న్యాయం ముడిసరుకుల ధరలు పెరిగిన నేపథ్యంలో బీర్ తయారీ కంపెనీలకు బేసిక్ ధర పెంచడమే న్యాయం. ఈ క్రమంలో స్థానిక అసోసియేషన్లతో సంప్రదింపులు జరిపి పెంచితే మంచిది. ప్రభుత్వం రమ్మంటే వెళ్లి చర్చిస్తాం. యూబీ కంపెనీ ప్రతినిధులతో కూడా మాట్లాడతాం. కానీ, న్యాయమైన ధర మాత్రం ఇవ్వాల్సిందే. – ఎం.కామేశ్వరరావు, అసోసియేషన్ ఆఫ్ లిక్కర్ అండ్ బీర్ సప్లయర్స్» స్టాక్ ఎక్స్చేంజ్లకు ఇచ్చిన సమాచారంతో ఎక్సైజ్ వర్గాల్లో అలజడి» మార్కెట్లో 72 శాతానికి పైగా వాటా ఉన్న కింగ్ఫిషర్ బ్రాండ్ తయారు చేసేది యూబీనేధరల పెంపుపై ఒత్తిడి తేవడం పద్ధతి కాదు: జూపల్లిబీర్ల ధరల పెంపు అంశంపై రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని కమిటీ నిర్ణయం తీసుకోకముందే యునైటెడ్ బ్రూవరీస్ (యూబీ) కంపెనీ తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్పై ఒత్తిడి తేవడం పద్ధతి కాదని ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. గుత్తాధిపత్యంతో బీర్ల ధరలు పెంచాలని యూబీ కంపెనీ చూస్తోందని విమర్శించారు. ఒత్తిళ్లకు తమ ప్రభుత్వం తలొగ్గే ప్రశ్నే లేదన్నారు. బుధవారం సచివాలయ మీడియా పాయింట్లో మంత్రి మాట్లాడారు. ఒక్కో బీరుపై దాదాపు 33.1 శాతం పెంచాలని కంపెనీ అడుగుతోందని, అలా చేస్తే బీరు ధర రూ.150 నుంచి రూ.250 వరకు పెరుగుతుందన్నారు. బీర్ల ధరల పెంపుపై హైకోర్టు రిటైర్డ్ జడ్జితో గతంలోనే కమిటీ వేశామని, కమిటీ నివేదికను సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. యూబీ కంపెనీ మార్కెట్ షేర్ 72 శాతం ఉంది కదాని.. ప్రజలు డిమాండ్ చేస్తారు కదాని ఇష్టానుసారంగా ధరలు పెంచాలని కోరడం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.1,130 కోట్లు చెల్లించామని, ఇంకా రూ. 658 కోట్లు చెల్లించాల్సి ఉందని, కానీ కంపెనీ రూ.702 కోట్లు అని తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. బీఆర్ఎస్ హయాంలోని బకాయిలే రూ.407 కోట్లు ఉన్నాయన్నారు. పక్క రాష్ట్రాల కంటే తెలంగాణలో తక్కువ రేట్లు ఉన్న విషయం వాస్తవమేనని, కర్ణాటకలో రూ.190, ఏపీలో రూ.180 ఒక్కో బీరు ధర ఉంటే, తెలంగాణలో రూ.150 ఉందన్నారు. 14 లక్షల కేసుల స్టాక్ ప్రస్తుతం ఉందని, సంక్రాంతి పండుగకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పైసా కూడా ట్యాక్స్ పెంచలేదని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. -
కిక్కుతో వీడ్కోలు!
సాక్షి, హైదరాబాద్: కొత్త సంవత్సరానికి మందుబాబులు ఘన స్వాగతం పలికారు. డిసెంబర్ నెలలో రాష్ట్రవ్యాప్తంగా రూ.3,523 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగ్గా, చివరి ఆరు రోజుల్లోనే రూ.1,220 కోట్ల మద్యం అమ్ముడుపోయింది. అంటే నెల మొత్తంలో విక్రయించిన దాంట్లో చివరి ఆరు రోజుల్లో దాదాపు 40 శాతానికి పైగా అమ్మకాలు జరిగాయి. దీన్ని బట్టి 2024 సంవత్సరానికి మందుబాబులు మంచి కిక్కుతో వీడ్కోలు పలికినట్లు అర్థమవుతోంది. ఎక్సైజ్ గణాంకాల ప్రకారం ఒక్క సోమవారమే (డిసెంబర్ 30) రికార్డు స్థాయిలో 7.7 లక్షలకు పైగా కేసుల మద్యం, బీర్లు డిపోల నుంచి షాపులకు వెళ్లాయి. ఆ మద్యం విలువ రూ. 402 కోట్ల పైమాటే. ఈ ఏడాది డిసెంబర్ నెలలో సగటున రోజుకు రూ.117 కోట్ల విలువైన మద్యం అమ్ముకాలు జరగ్గా.. సోమవారం దాదాపు నాలుగింతలు అమ్ముడయిందని గణాంకాలు చెబుతున్నాయి. అంతకుముందు ఆదివారం (డిసెంబర్ 29) కూడా మద్యం డిపోలు తెరచే ఉంచారు. బ్యాంకులు లేకపోయినా వైన్షాపుల యజమానులు తీసుకున్న పాత డీడీలతో రూ.50 కోట్లకు పైగా విలువైన మద్యాన్ని డిపోల నుంచి తీసుకెళ్లారు. ఇక, గత ఆరు రోజుల విక్రయ గణాంకాలు 2023 సంవత్సరం డిసెంబర్లోని చివరి ఆరు రోజులతో పోలిస్తే దాదాపు ఒకే స్థాయిలో ఉన్నాయి. డిసెంబర్ నెల మొత్తంతో పోలిస్తే మాత్రం 2023 కంటే ఈసారి లిక్కర్ అమ్మకాలు భారీగా పడిపోవడం గమనార్హం. 2023, డిసెంబర్ నెలలో రూ.4,147.18 కోట్ల విలువైన మద్యం అమ్ముడు పోగా, ఈ డిసెంబర్లో రూ.3,523 కోట్లకే పరిమితమైంది. -
వేసవి వస్తోంది.. బీర్ల ఉత్పత్తి పెంచండి
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఏటా వేసవిలో బీర్ల కొరత ఏర్పడుతుంది. ఎండల తీవ్రతను తట్టుకునేందుకు మద్యం ప్రియులు బీర్ల వైపు మొగ్గు చూపుతారు. సాధారణ రోజుల్లో కంటే ఎండాకాలంలో బీర్ల అమ్మకాలు రెట్టింపు స్థాయిలో ఉంటాయి. ఏటా ఫిబ్రవరి వచ్చిందంటే చాలు క్రమంగా బీర్లకు డిమాండ్ పెరుగుతుంది. ఏప్రిల్, మే మాసాల్లో బీర్ల కొరత ఏర్పడుతుంది. ప్రధానంగా బ్రాండెడ్ బీర్లు దొరక్క బీరు ప్రియులు అల్లాడుతుంటారు. రానున్న వేసవిలో ఈ సమస్య తలెత్తకుండా ఎక్సైజ్శాఖ ము(మ)ందస్తు జాగ్రత్త తీసుకుంటోంది. బీర్ల ఉత్పత్తిని పెంచాలని బెవరేజెస్ కంపెనీలపై ఇప్పటి నుంచే ఒత్తిడి పెంచుతోంది. రాష్ట్రానికి బీర్లు సరఫరా చేస్తున్న యూనిట్లలో ఉత్పత్తి పెంచాలని ఎక్సైజ్శాఖ బెవరేజెస్ విభాగం అధికారులు ఆయా బీర్ల కంపెనీలను ఆదేశించారు.డిమాండ్కు సరిపడా ఉత్పత్తి.. సంగారెడ్డి సమీపంలో ఉన్న ఓ బెవరేజెస్ కంపెనీలో నెలకు సుమారు మూడు లక్షల కేసుల నుంచి నాలుగు లక్షల కేస్ల బీర్లు ఉత్పత్తి ఉంటుంది. ఎక్సైజ్ అధికారుల ఒత్తిడి మేరకు ఈ కంపెనీ తన ఉత్పత్తిని ఏకంగా ఐదు లక్షల కేస్లకు పెంచింది. ఒక్కో కేస్లో 12 సీసాలు (650 ఎంఎల్) ఉంటాయి. మరో మల్టీనేషనల్ బెవరేజెస్ కంపెనీ నెలకు సుమారు 25 లక్షల కేస్ల బీరు ఉత్పత్తి చేస్తుంది. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని ఈ ఉత్పత్తిని సుమారు 30 లక్షల కేస్ల వరకు పెంచినట్టు ఎక్సైజ్వర్గాలు చెబుతున్నాయి. లిక్కర్ మాదిరిగా కాకుండా, బీర్లకు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఉత్పత్తి జరిగిన తేదీ నుంచి ఆరు నెలల లోపే వినియోగం జరగాలి. దీంతో ఇప్పటి నుంచి ఉత్పత్తిని పెంచుకుంటూ వెళితేనే వేసవి డిమాండ్కు సరిపడా స్టాక్ అందుబాటులో ఉంచొచ్చని ఎక్సైజ్శాఖ భావిస్తోంది.డిమాండ్కు తగినట్టుగా ‘బీర్ల డిమాండ్ను ముందుగా అంచనా వేసి బెవరేజెస్ కంపెనీలు ఉత్పత్తిని పెంచుకుంటాయి. సాధారణంగా బ్రాండెడ్ బీర్లకు వేసవిలో డిమాండ్ అధికంగా ఉంటుంది. ఈ డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని ఉత్పత్తిని పెంచుకుంటాయి’అని ఎక్సైజ్శాఖ బ్రూవరీస్ విభాగం అధికారి తెలిపారు.సంగారెడ్డి నుంచే రాష్ట్రమంతటికీ సరఫరా.. సంగారెడ్డి జిల్లాలో ఆరు కంపెనీలకు చెందిన బీర్ల తయారీ యూనిట్లు ఉన్నాయి. యూబీ కంపెనీకి చెందినవి రెండు, కల్స్బర్గ్, క్రౌన్, లీలాసన్స్, ఏబీ ఇన్బీవ్ అనయూసర్–బుష్, వంటి బ్రీవరేజెస్ కంపెనీలు ఇక్కడ బీర్ల ఉత్పత్తి చేస్తాయి. రాష్ట్రమంతటికీ బీర్ల సరఫరా సంగారెడ్డి జిల్లా నుంచే జరుగుతుంది. ఎక్సైజ్శాఖ గణాంకాల ప్రకారం జిల్లాలో ఉన్న బెవరేజెస్ కంపెనీల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి 6,800 లక్షల లీటర్లు. అయితే ఈ బీర్ల తయారీకి అవసరమైన నీటి కోసం ఆయా కంపెనీలు ఏకంగా పైప్లైన్లనే వేసుకున్నాయి. కొన్ని కంపెనీలు మంజీర నదీ జలాలనే వినియోగిస్తున్నాయి. -
మద్యం డిపోల్లో ఉద్యోగులపై వేటు
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగుల ఉసురుతీస్తోంది. ప్రధానంగా ఎక్సైజ్ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ మద్యం దుకాణాల్లోని 15వేల మంది సూపర్వైజర్లు, సేల్స్మెన్ను చంద్రబాబు ప్రభుత్వం తొలగించింది. కలెక్టర్ల ఆధ్వర్యంలోని జిల్లా ఎంపిక కమిటీలు ద్వారా పారదర్శకంగా నియమితమైన తమను తొలగించవద్దన్న వారి విజ్ఞప్తిని ప్రభుత్వం పెడచెవిన పెట్టింది.తమను ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాలన్న వారి వినతిని తిరస్కరించింది. తాజాగా రాష్ట్రంలోని మద్యం డిపోల్లో విధులు నిర్వహిస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లు, స్కానర్లను తొలగించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒక్కో డిపోలో పది నుంచి 15మంది చొప్పున మొత్తం 400మందికిపైగా ఆపరేటర్లు, స్కానర్లు పదేళ్లుగా విధుల్లో కొనసాగుతున్నారు. వారిలో 50శాతం మందిని నవంబరు 1 నుంచి తొలగించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఎక్సైజ్ శాఖ 200మందిపై వేటు వేసింది. ఇక రెండో విడతలో మిగిలిన 200మందిని కూడా తొలగించాలని ప్రభుత్వం భావిస్తోంది. మద్యం డిస్టిలరీల్లో సీఐడీ సోదాలురాష్ట్రంలోని పలు మద్యం డిస్టిలరీల్లో సీఐడీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. మొత్తం ఎనిమిది బృందాలుగా ఏర్పడిన అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నారు. బీరు తయారీ కంపెనీలు, మొలాసిస్ యూనిట్లలోనూ తనిఖీలు నిర్వహించారు. గతేడాది కాలంలో ఆ కంపెనీల ఉత్పత్తులు, సరఫరా రికార్డులను పరిశీలించారు. పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. జత్వానీ కేసు విచారణ చేపట్టిన సీఐడీహనీట్రాప్ కేసుల్లో నిందితురాలైన కాదంబరి జత్వానీ ఇచ్చిన ఫిర్యాదుపై నమోదు చేసిన కేసు దర్యాప్తును సీఐడీ చేపట్టింది. ఆ కేసును ఇప్పటివరకు విజయవాడ పోలీసులు దర్యాప్తు చేసిన సంగతి తెలిసిందే. -
రమణ కేసు క్లోజ్..?
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: మొత్తం మీద ఒంగోలులోని ఎలైట్ మాల్స్లో రూ.2.35 కోట్ల గోల్మాల్ చేసిన ఎక్సైజ్ కానిస్టేబుల్ రమణ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. వారం రోజులుగా సరికొత్త డ్రామాలు తెరపైకి వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం అధికార టీడీపీకి చెందిన కీలక నేత రంగప్రవేశం చేసి రమణ ఎపిసోడ్కు ముగింపు పలికేందుకు తెరవెనుక మంత్రాంగం జరుపుతున్నట్టు సమాచారం. ఫలితంగా ఎక్సైజ్ శాఖలో రూ.2.35 కోట్ల ప్రభుత్వాదాయానికి కన్నం వేసిన దొంగలెవరో తేల్చకుండానే కేసు నీరుగారిపోనుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం... జిల్లా తెలుగు దేశం పార్టీలో కీలకపాత్ర పోషిస్తున్న ఒక నాయకుడి తరఫున టంగుటూరు నుంచి వచ్చిన పెద్ద మనిషి రెండు రోజులుగా ఇక్కడే తిష్టవేసి జిల్లాలోని పలువురు ఎక్సైజ్ అధికారులతో చర్చలు జరిపినట్టు తెలిసింది. పోయిన సొమ్మును రికవరీ చేయడం ద్వారా ఎవరి చేతులకు మట్టి అంటకుండా బయటపడేందుకు కొన్ని ప్రతిపాదనలు చేసినట్టు సమాచారం. కేసు నమోదైతే రమణ మాత్రమే కాకుండా అతడికి సహకరించిన ఉన్నతాధికారులకు, సహోద్యోగులకు, సేల్స్మెన్లకు కూడా శిక్ష పడడం ఖాయమని నచ్చ చెప్పారు. ఎవరికీ నష్టం, కష్టం కలగకుండా ఈ కేసు నుంచి బయటపడేందుకు తలా ఒక చేయి వేసేలా ఒప్పందం కుదిర్చారు. ఈ రాజీ ప్రకారం కేసులో ప్రధాన నిందితుడైన రమణ 60 శాతం డబ్బులు చెల్లించేలా, మిగతా సొమ్మును ఇంతకు ముందు ఇక్కడ పనిచేసివెళ్లిన ఇద్దరు అధికారులు, ప్రస్తుతం పనిచేస్తున్న అధికారి, సేల్స్మెన్లు వేసుకొని చెల్లించేలా ఒప్పందం కుదిరినట్టు ఎక్సైజ్ శాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ప్రతిపాదనలతో సదరు పెద్ద మనిషితో కలసి కొందరు మంగళవారం ఎక్సైజ్ కమిషనర్ నిషాంత్ కుమార్ను కలిసేందుకు విజయవాడ వెళ్లినట్లు సమాచారం. అయితే అక్కడ ఆయనను కలిసేందుకు కుదరకపోవడంతో కమిషనర్ కార్యాలయంలో ఇతర అధికారులను కలిసి మాట్లాడి వచ్చినట్లు చెబుతున్నారు. రేపో మాపో కమిషనర్ అపాయింట్మెంట్ తీసుకొని కలిసి రికవరీ చేసేందుకు మార్గం సుగమం చేస్తున్నట్లు తెలుస్తోంది.తలా పాపం తిలా పిడికెడు...ముందు నుంచి అనుకున్నట్లే భారీ మొత్తంలో ప్రభుత్వాదాయానికి కన్నం వేసిన వ్యవహారంలో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్న రమణ మీద పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. కేసులో ప్రధాన పాత్రధారిగా చెప్పుకుంటున్న రమణ పరారైనా ఉలుకు లేదు పలుకు లేదు. అతను పరారీలో ఉన్నాడని చెబుతున్నారే కానీ పట్టుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేసిన దాఖలాలు లేవు. ఈ కేసులో రమణతోపాటుగా మిగిలిన ఉద్యోగుల పాత్రపై విచారణ చేసినట్లు కూడా కనిపించలేదు. రమణ భాగోతంపై ఎస్పీ ఏఆర్ దామోదర్కు ఫిర్యాదు చేసిన సేల్స్మెన్లు కలెక్టరేట్ వద్ద ధర్నా కూడా చేశారు. రమణను అరెస్టు చేయాలని వారు ఆందోళన చేసినా అధికారుల నుంచి పెద్దగా స్పందనలేదు.పెద్ద చేపల సంగతేంటి...ఈ కేసు మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఎక్సైజ్ శాఖలో చిరుద్యోగి అయిన కానిస్టేబుల్ రమణ ఒక్కడే ఈ అక్రమానికి పాల్పడడం అంత సులువుకాదని తెలుస్తోంది. పెద్ద చేపల ప్రోత్సాహంతోనే ఆయన కోట్ల రూపాయల స్కాంకి పాల్పడినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో ఎస్ఐ, సీఐల గురించి ఎక్కడా ప్రస్తావించడం లేదు. నిబంధనలకు మించి స్టాకు సరఫరా చేసిన డిపో మేనేజర్ గురించి కూడా అధికారులు పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. కేసు నమోదైతే వారందరూ శంకరగిరి మాన్యాలు పట్టాల్సి వస్తుందన్న భయంతోనే ఎక్సైజ్ శాఖ ఉన్నతోద్యోగులంతా ఒక్కటయ్యారు. తలా కొంచెం వేసుకొని గట్టుమీద పడేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. -
మద్యం ధరలు పెంపు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మద్యం ధరలు పెరిగే అవకాశాలున్నాయి. ఎప్పటి నుంచి పెరిగేది ఖరారు కాకపోయినా కచ్చితంగా మద్యం ధరలు పెంచాల్సిన పరిస్థితి ఎక్సైజ్ శాఖకు ఏర్పడింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది రాబడి తగ్గిపోవడం, గత ఏడాదిలో మద్యం ధరలు తగ్గించిన కారణంగా ఏర్పడిన లోటును ఇప్పుడు పూడ్చుకునే యోచనలో ఎక్సైజ్ యంత్రాంగం ఉంది. ఈ మేరకు మద్యం ధరల పెంపు ద్వారా రూ.2వేల కోట్ల మేర అదనపు ఆదాయం సమకూర్చుకోవాలని యోచిస్తోంది. సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో మద్యం ధరల పెంపుపై ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి గ్రీన్సిగ్నల్ ఇవ్వడమే తరువాయి క్వార్టర్ లిక్కర్కు రూ.20, బీరు సీసాపై రూ.10 పెంచేందుకు ఎక్సైజ్శాఖ సర్వం సిద్ధం చేసుకుంది.గత ఏడాది రూ.2వేల కోట్ల వరకు అదనపు ఆదాయంఎన్నికల షెడ్యూల్ వస్తుందనే ఆలోచనతో గత ఏడాది ముందస్తుగానే వైన్షాపుల టెండర్ల ప్రక్రియ నిర్వహించారు. లైసెన్సు ఫీజులు, దరఖాస్తు రుసుం రూపేణా రూ.2వేల కోట్ల వరకు అదనపు ఆదాయం వచ్చింది. దీంతో ఇప్పుడు రూ.2,500 కోట్లు లోటు చూపెడుతోందని, అమ్మకాల వారీగా చూస్తే గత ఏడాదితో పోలిస్తే తగ్గలేదని ఎక్సైజ్ శాఖ వర్గాలంటున్నాయి. మరోవైపు గత ఏడాది మేలో ప్రతి క్వార్టర్ బాటిల్పై రూ.10 తగ్గించడంతో రూ.800 కోట్లు లోటు వచ్చిందని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో గత మేలో తగ్గించిన రూ.10తో పాటు మరో రూ.10 పెంచితే రూ.1600 కోట్లు, బీర్ల రేటు రూ.10 పెంచడం ద్వారా రూ.300 కలిపి మొత్తం రూ.1900 కోట్ల వరకు నష్టాన్ని పూడ్చుకోవచ్చని భావిస్తోంది. ఇటీవల సీఎం సమక్షంలో రాబడి శాఖలపై జరిగిన సమీక్షలో మద్యం ధరల పెంపు గురించి ఎక్సైజ్ శాఖ ప్రతిపాదించినట్టు తెలిసింది. అయితే, సీఎం రేవంత్ ఇందుకు అంగీకరించలేదని, ఈ ప్రతిపాదనపై మరోమారు చర్చిద్దామని వాయిదా వేసినట్టు సమాచారం.ఎలైట్ బార్లకు ‘నో’...గత ప్రభుత్వ హయాంలో అమల్లోకి వచ్చిన ఎలైట్ బార్ల విధానానికి రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి పలకబోతోంది. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న సాధారణ బార్అండ్ రెస్టారెంట్లకు తోడు గత మూడు, నాలుగేళ్ల కాలంలో 89 ఎలైట్ బార్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లైసెన్స్ ఫీజు 10 శాతం అదనంగా ఉండే ఈ షాపుల కోసం మరో 50 వరకు దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ దరఖాస్తులన్నింటిని రద్దు చేయాలని, ఇప్పటివరకు అనుమతి వచ్చిన ఎలైట్ బార్లు మినహా భవిష్యత్లో అనుమతులు ఇవ్వొద్దని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి స్థానంలో ఎలైట్ వైన్షాపుల విధానాన్ని తీసుకురావాలని యోచిస్తోంది. నగరపాలికలతో పాటు కీలకమైన మున్సిపాలిటీల్లో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 25 వరకు ఎలైట్ వైన్షాపులకు అనుమతిచ్చే విషయాన్ని పరిశీలిస్తోంది. త్వరలోనే దీనిపై నిర్ణయం వెలువడుతుందని, ఈ మేరకు న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా ఎలైట్ వైన్షాపులకు త్వరలోనే టెండర్లు పిలుస్తామని ఎక్సైజ్శాఖ వర్గాలు చెబుతున్నాయి. -
దౌర్జన్యంగా అగ్రిమెంట్లు!
సాక్షి నెట్వర్క్: మద్యం దుకాణాల లాటరీ తంతు ముగియడంతో అక్కడక్కడా స్వల్పంగా షాపులు దక్కించుకున్న ఇతరులకు టీడీపీ సిండికేట్ చుక్కలు చూపిస్తోంది. రాష్ట్రంలో 3,396 మద్యం దుకాణాలకుగానూ లాటరీ ముసుగులో 80 శాతం షాపులను ఏకపక్షంగా దక్కించుకున్న టీడీపీ సిండికేట్ మిగిలిన 20 శాతం షాపుల లైసెన్సులు పొందిన వారిని నయాన భయాన దారికి తెచ్చుకుంటోంది. తమను ధిక్కరించి వ్యాపారం చేయలేరని.. వాటాలు చెల్లిస్తారో, దుకాణాలు అప్పగిస్తారో తేల్చుకోవాలని లేదంటే ఎక్సైజ్, పోలీసు దాడులు తప్పవని తీవ్ర బెదిరింపులకు గురి చేస్తోంది. టీడీపీ మద్యం సిండికేట్ దందాకు అధికార యంత్రాంగం జీ హుజూర్ అనడంతో రాష్ట్రంలోని 26 జిల్లా కేంద్రాల్లో సోమవారం నిర్వహించిన లాటరీ ప్రక్రియ ఓ ప్రహసనంగా ముగిసిన విషయం తెలిసిందే. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు టీడీపీ ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే ఈ ప్రక్రియ కొనసాగింది. మంత్రి జనార్ధన్రెడ్డి వర్గం బెదిరింపులు..⇒ బనగానపల్లె నియోజకవర్గంలో మద్యం దుకాణాలను దక్కించుకున్న ఇతరులు గుడ్విల్ తీసుకుని తమకు అప్పగించాలని లేదంటే 25 శాతం వాటా ఇవ్వాలని టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు. తమ మాట వినకుంటే అద్దెకు గదులు కూడా దక్కకుండా చేస్తామని మంత్రి బీసీ జనార్ధన్రెడ్డి వర్గం హెచ్చరిస్తోంది. ⇒ డోన్లో 16 దుకాణాలు ఉండగా ధర్మవరం సుబ్బారెడ్డికి 3, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ వర్గానికి 2, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత వర్గానికి రెండు, ఎస్సీవై రెడ్డి కుమారైకు ఒకటి, మిగతా 8 దుకాణాలను ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి వర్గం దక్కించుకుంది. ⇒ కోడుమూరులో టీడీపీ ఇన్చార్జీ విష్ణువర్దన్రెడ్డి ఆధ్వర్యంలో సిండికేట్గా ఏర్పడి తమ వర్గంలో చేరాలని ఇతరులను ఒత్తిడి చేస్తున్నారు. ⇒ నంద్యాలలో 30 శాతం కమీషన్ ఇవ్వాలని మంత్రి ఫరూక్ కుమారుడు ఫిరోజ్ బెదిరిస్తున్నారు. దీంతో ఇద్దరు వ్యక్తులు దుకాణాలను టీడీపీకే గుడ్విల్కు ఇచ్చేశారు. ఒక్కో షాపు రూ.20 లక్షల చొప్పున విక్రయించినట్లు సమాచారం. ⇒ శ్రీశైలంలో 25 శాతం వాటా లేదంటే గుడ్విల్కు దుకాణాలు తమకు ఇవ్వాలని ఎమ్మెల్యే బుడ్డా వర్గీయులు చెబుతున్నారు. ⇒ పత్తికొండలో దుకాణాలు దక్కించుకున్న వారికి ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు వర్గీయులు ఫోన్ చేసి వాటిని తమకు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. లేదంటే తమతో ఉండాలని చెబుతున్నారు. కప్పం కట్టలేక షాపు వదిలేసి..చిత్తూరు జిల్లా పలమనేరులో వైఎస్సార్సీపీకి చెందిన కల్లు బాల, కృష్ణారెడ్డి, కర్ణాటకకు చెందిన దుర్గాప్రసాద్కు లక్కీడిప్లో మద్యం దుకాణాలు దక్కాయి. అయితే ఎమ్మెల్యే అమరనాథ్రెడ్డి సోదరుడు విష్ణువర్థన్రెడ్డి బెదిరించి వారి నుంచి వాటిని లాక్కున్నారు. కల్లు బాల సతీమణి ఎస్ భారతి పేరున బైరెడ్డిపల్లి మద్యం దుకాణం లాటరీ ద్వారా వచ్చింది. షాపును దక్కించుకున్న కల్లు బాలను ఎమ్మెల్యే సోదరుడు ఇంటికి పిలిపించుకుని అనుచరులతో దాడి చేశాడు. తమను కాదని మరెవరూ షాపు నడపటానికి వీల్లేదని, స్థలం ఎవరు ఇస్తారో చూస్తామంటూ హెచ్చరించాడు. రూ.కోటి కప్పం కట్టాలని ఆదేశించడంతో లాటరీ ద్వారా వచ్చిన దుకాణాన్ని కల్లు బాల వదులుకున్నారు. కృష్ణారెడ్డి తనకు లాటరీలో వచ్చిన మద్యం దుకాణాన్ని వదిలేసుకున్నారు. వారిని బెదిరించి మద్యం దుకాణం పర్మిట్ అమ్ముకున్నట్లు బలవంతంగా అగ్రిమెంట్ రాయించుకున్నారు. కర్ణాటకకు చెందిన దుర్గాప్రసాద్ ఆచూకీ తెలియరాలేదు. ⇒ పూతలపట్టులో ఎమ్మెల్యే మురళీమోహన్ వర్గీయులు స్థానిక సీఐ ద్వారా టెండర్లు దక్కించుకున్న మద్యం వ్యాపారులతో మంతనాలు నెరిపారు. దుకాణాలను వదులు కోవాలని లేదంటే వాటా ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేశారు. మరో నలుగురు ఎమ్మెల్యేలు లక్కీ డిప్ తీసే రోజు నేరుగా కలెక్టర్కే ఫోన్ చేసి తమ వారికే దుకాణాలు దక్కేలా చూడాలని కోరినట్లు తెలిసింది. కలెక్టర్ స్పందించకపోవటంతో టెండర్లు దక్కించుకున్న వారిని ఎక్సైజ్ పోలీసుల ద్వారా బెదిరిస్తున్నారు. ⇒ తిరుపతిలో 32 దుకాణాలకు జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు బినామీ పేర్లతో 350 దరఖాస్తులు చేయగా ఆరు షాపులు దక్కాయి. దుకాణాలు నడవాలంటే తమకు వాటా ఇవ్వాల్సిందేనని ఇతరులను బెదిరిస్తున్నారు. శ్రీకాళహస్తి, గూడూరులో దరఖాస్తు దారులను ముందే పిలిచి ఎమ్మెల్యేలు అడిగినంత వాటా ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. కడపలో నేరుగా బేరసారాలు..⇒ వైఎస్సార్ కడప జిల్లాలో మద్యం షాపు సవ్యంగా నిర్వహించుకోవాలంటే 50 శాతం భాగస్వామ్యం ఇవ్వాలని కొందరు హెచ్చరిస్తుండగా పూర్తిగా తమకే అప్పగించాలని మరికొందరు అల్టిమేటం జారీ చేస్తున్నారు. కడపలో టీడీపీయేతర వర్గీయులకు చెందిన మద్యం షాపులల్లో 50 శాతం వాటా ఇవ్వాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి బేరసారాలకు దిగారు. జనసేన వర్గీయులకు మూడు మద్యం దుకాణాలు లభించగా ఒక్కొక్కటి రూ.15 లక్షలు చొప్పున గుడ్విల్కు అప్పగించారని సమాచారం. జమ్మలమడుగులో ప్రతి షాపులో 30 శాతం వాటా ఇవ్వాలంటూ టీడీపీ ఇన్చార్జీ దేవగుడి భూపేష్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ముద్దనూరు షాపు పూర్తిగా తమకే ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారు. కమలాపురంలో పునీత్ బార్ అండ్ రెస్టారెంట్ను ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డి మూసివేయించారు. తాము వారించినా వినకుండా చెన్నూరు మద్యం షాపు కోసం దరఖాస్తు చేశారంటూ దౌర్జన్యానికి దిగినట్లు సమాచారం. ధర్మవరంలో పరిటాల వర్గం పర్యవేక్షణ.. ⇒ శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో మద్యం దుకాణాలను దక్కించుకున్న తటస్థులు కూటమి నాయకుల బెదిరింపులతో షాపులను అప్పగించినట్లు సమాచారం. ఈ సిండికేట్ టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరాం ఆధ్వర్యంలో జరుగుతోంది. సోమందేపల్లిలో లైసెన్స్దారు దీక్షితను బెదిరించి గుడ్విల్కు షాపు దక్కించుకున్నారు. సీకే పల్లి స్టేషన్, కదిరి పరిధిలో దుకాణాలకు సంబంధించి పంచాయితీ కొనసాగుతోంది. హిందూపురం నియోజకవర్గం లేపాక్షిలో షాపు దక్కించుకుని ఆన్లైన్లో డబ్బులు చెల్లించిన రంగనాథ్ నుంచి దుకాణం లాక్కునేందుకు టీడీపీ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ⇒ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో 127వ మద్యం షాపును దక్కించుకున్న హోటల్ నిర్వాహకుడు దినేష్ కుమార్ నాయుడు లొంగకపోవడంతో టీడీపీ నేతలు మునిసిపల్ అధికారులను ఉసిగొల్పి హోటల్లో తనిఖీలు జరిపి నోటీసులు ఇప్పించారు. చేయి కలిపితేనే సహకారం..⇒ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురం కొత్తపేట, ముమ్మిడివరం పరిధిలో సిండికేట్ ప్రాబల్యం అధికంగా ఉంది. దుకాణాలు దక్కించుకున్నవారు ఇతరులు తమతో చేయి కలపాలని ఒత్తిడి చేస్తున్నారు. రావులపాలెం మండలం ఈతకోటలో మద్యం షాపు ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న ఇతరులను సిండికేట్ ఒత్తిడితో స్థానికులు అభ్యంతరం చెబుతున్నారు. ముమ్మిడివరంలో దుకాణాలు పొందిన మిగిలినవారిని తమ సిండికేట్లోకి తెచ్చుకునేందుకు టీడీపీ ముఖ్య ప్రజాప్రతినిధి అనుచరులు సామ, దాన, భేద, దండోపాయాలు ప్రదర్శిస్తున్నారు. ⇒ పశ్చిమ గోదావరి జిల్లాలో 20 మండలాలకు గాను ఒక్కో చోట నాలుగు నుంచి తొమ్మిది వరకు షాపులు ఏర్పాటు అవుతున్నాయి. కొత్త పాలసీ ప్రకారం షాపులు దక్కినవారు మండలంలో ఎక్కడైనా షాపు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. దీంతో అమ్మకాలు ఎక్కువగా జరిగే మండల కేంద్రాలు, మేజర్ పంచాయతీల్లో షాపుల ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ⇒ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వర్గానికి 11 దుకాణాలు దక్కాయి. మిగిలిన షాపులు పొందిన వారు 25 శాతం కమీషన్ ఇవ్వాలని పట్టుబడుతున్నట్టు సమాచారం. నిడదవోలులో మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, మంత్రి కందుల దుర్గేష్ వర్గం ఇతరుల నుంచి 25 శాతం కమీషన్ డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ⇒ కాకినాడ జిల్లాలో కొత్తగా మద్యం వ్యాపారంలోకి ప్రవేశించిన వారిని సిండికేట్ నయానా భయానా దారిలోకి తెచ్చుకుంటోంది. తొండంగి, కోటనందూరు, తునిలో ఏడు షాపులు దక్కించుకున్న వారు కౌన్సెలింగ్లో మాట వినకపోవడంతో వ్యాపారాలు ఎలా చేస్తారో చూస్తామంటూ బెదిరింపులకు దిగారు. ఎక్సైజ్ పోలీసులు మీకు ఎలా సహకరిస్తారో చూస్తామంటూ హెచ్చరిస్తున్నారు. కాకినాడ సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో ఒక్కో షాపులో 20 శాతం వాటా ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. వెనిగండ్ల వర్గం వార్నింగ్లు⇒ కృష్ణా జిల్లా పామర్రులో 75 శాతం షాపులను దక్కించుకున్న టీడీపీ నేతలు మిగిలిన వారిని వాటాలు ఇవ్వాలని ఫోన్లు చేస్తున్నారు. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సోదరుడు షాపులు దక్కించుకున్న వారిని తన అనుచరులతో కలసి బెదిరింపులకు గురి చేస్తున్నట్లు సొంత పార్టీ నాయకులే చెబుతున్నారు. వంగవీటి రాధా, కాజ రాజ్కుమార్ వర్గీయులు గుడివాడలో ఐదు షాపులు దక్కించుకున్నారు. ఎమ్మెల్యే వర్గానికి వారు ఎదురు తిరిగినట్లు సమాచారం. ఉదయభాను వర్గం ఒప్పందాలు.. గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు మండలాల్లో టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సిండికేట్ 11 షాపులను దక్కించుకుంది. మిగిలిన 12 దుకాణాలను టీడీపీ నేతలు, గతంలో మద్యం వ్యాపారంలో ఉన్న వ్యక్తులు దక్కించుకున్నారు. పెనుగంచిప్రోలులో విజయవాడకు చెందిన ఓ వ్యక్తి దుకాణాన్ని దక్కించుకోగా గుడ్ విల్ కింద జనసేన నేత ఉదయభాను వర్గం రూ.90 లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. జగ్గయ్యపేటలో దుకాణం పొందిన తెలంగాణ వాసితో ఎమ్మెల్యే సోదరుడు గుడ్విల్ చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. తిరువూరులో తెలంగాణ వ్యాపారులే ఎక్కువ షాపులు దక్కించుకున్నారు. మైలవరంలో 15 షాపులకుగానూ టీడీపీ సిండికేట్కే 14 దక్కాయి. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ బావమరిది పోసాని కోటేశ్వరరావు కనుసన్నల్లో టీడీపీ నాయకులు సిండికేట్గా ఏర్పడ్డారు. నందిగామలో షాపులన్నీ ఎంపీ, ఎమ్మెల్యే అనుచరులకే దక్కాయి. పల్నాడులో డబ్బులు కడితేనే..⇒ పల్నాడు జిల్లాలో తాము చెప్పిన మొత్తం తీసుకొని దుకాణాలు అప్పగించాలని లేదంటే 50 శాతం వాటా ఇవ్వాలని సిండికేట్ బెదిరిస్తోంది. నరసరావుపేట నియోజకవర్గంలో మద్యం పంచాయితీ ఇంకా తేలలేదు. సత్తెనపల్లిలో రూ.30 లక్షలు కట్టిన తరువాతే దుకాణాలు తెరుచుకోవాలని ఓ టీడీపీ నేత అల్టిమేటం జారీ చేశారు. పెదకూరపాడులో ప్రతి దుకాణంలో 20 వాటా ఇవ్వాలని లెక్క తేల్చారు. ⇒ బాపట్ల జిల్లాలో టెండర్లకు ముందే రేపల్లె, వేమూరు, పర్చూరు, అద్దంకి నియోజకవర్గాల్లో సిండికేట్ ఏర్పాటైంది. తమతో కలవకుంటే షాపులు నిర్వహించలేరంటూ బెదిరింపులకు దిగుతున్నారు. టెక్కలిలో ఏకఛత్రాధిపత్యం⇒ టెక్కలి నియోజకవర్గంలో ప్రత్యర్థులే లేకుండా పోవడంతో కీలక నేత సోదరుడి కనుసన్నల్లోనే షాపులన్నీ నడుస్తున్నాయి. ⇒ నరసన్నపేట నియోజకవర్గం పోలాకి మండలంలో నాలుగు షాపులు దక్కించుకున్న ఇతరులకు ఫోన్ చేసిన ఓ ఎమ్మెల్యే ఒక్కో దుకాణానికి రూ.25 లక్షలు చొప్పున ఇస్తానంటూ ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ⇒ నరసన్నపేటలో 76వ నెంబర్ షాపు అప్పగించినందుకు ఏడాదికి రూ.20 లక్షలు చెల్లిస్తామన్న టీడీపీ ప్రజాప్రతినిధి ఆఫర్కు అంగీకరించినట్లు తెలుస్తోంది. ⇒ పాతపట్నంలో పలు దుకాణాలు ఒడిశాకు చెందిన వ్యాపారులకు దక్కడంతో వారికి ఎమ్మెల్యే అనుచరులు ఫోన్ చేసి గుడ్విల్కు ఇచ్చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. పలాస, ఇచ్ఛాపురం, ఆమదాలవలసలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. -
సర్కారు వారి కమీషన్ 30%
సర్కారు వారి కమీషన్ 30 శాతం.. ప్రస్తుతం ఇది ఏపీలో ట్రెండింగ్లో ఉన్న మాట.. ‘సర్కారు వారి పాట’ అంటే తెలుసు కానీ ‘సర్కారు వారి కమీషన్’ అంటే ఏంటనేది మీ సందేహమా? రాష్ట్రంలో ఏర్పాటవుతున్న ప్రతి మద్యం షాపు నుంచి అధికార పార్టీ నేతలకు అందే మామూళ్లన్న మాట.. నేడు నిర్వహించే మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియలో టీడీపీ సిండికేట్ కుట్ర ఇది.. ఇది తమను కాదని షాపులు దక్కించుకున్న వారు చెల్లించాల్సిన సొమ్ము గురించి హెచ్చరిక.. కమీషన్ ఇస్తారో.. లేక దుకాణాలు వదలుకుంటారో తేల్చుకోండని ఎమ్మెల్యే, ఎంపీల హుకుం..సాక్షి, అమరావతి: మద్యం దుకాణాల లైసెన్సులను ఏకపక్షంగా దక్కించుకునేందుకు టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు బరితెగించి బెదిరింపులకు దిగుతున్నారు. చాలా చోట్ల టీడీపీ సిండికేట్ సభ్యులు కానివారు కూడా ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసినట్టు టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు గుర్తించారు. వారిని బెదిరించి పోటీ నుంచి తప్పుకునేలా చేసేందుకు తమ మనుషులను వారి ఇళ్లపైకి పంపించారు. అప్పటికీ చాలా మంది దరఖాస్తుదారులు అందుబాటులో లేకపోవడంతో లాటరీ ప్రక్రియకు రెండు రోజుల ముందు నుంచి కొత్త ఎత్తుగడ వేశారు. లాటరీ ద్వారా ఎవరికి మద్యం దుకాణం లైసెన్స్ దక్కినా సరే.. వచ్చే ఆదాయంలో 30 శాతం వరకు తమకు కమీషన్ ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నారు. ‘అలా అయితేనే మద్యం దుకాణం నిర్వహించుకోగలరు.. లేదంటే మీ దుకాణం ఉండదు.. మీరూ ఉండరు’ అనే రీతిలో హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే మొత్తం మద్యం దుకాణాల లైసెన్సులన్నీ తమకే దక్కేలా దరఖాస్తుల ప్రక్రియను టీడీపీ సిండికేట్ హైజాక్ చేసింది. టీడీపీ ఎమ్మెల్యేలు చెప్పిన వారు మినహా ఇతరులను దరఖాస్తులు వేయనివ్వకుండా అడ్డుకుంది. అక్కడక్కడా ఎవరైనా దరఖాస్తులు వేసి ఉంటే.. వారినీ బెదిరించి తప్పుకునేలా చేసేందుకే తాజాగా కమీషన్ల పేరుతో బెదిరింపులకు బరి తెగించింది. తద్వారా భయపడి లాటరీ ప్రక్రియకు ముందే పోటీ నుంచి తప్పుకునేలా చేయడమే టీడీపీ సిండికేట్ ఎత్తుగడ. ఒక వేళ లాటరీలో లైసెన్స్ వస్తే.. ఆ లైసెన్స్ ఫీజు చెల్లించకుండా పోటీ నుంచి తప్పుకునేలా చేయాలన్నది లక్ష్యం. దాంతో సహజంగానే ఆ మద్యం దుకాణం లైసెన్స్ టీడీపీ సిండికేట్కే కేటాయిస్తారు. అలా లాటరీ ద్వారా గానీ, ఇతరత్రాగానీ మొత్తం 3,396 మద్యం దుకాణాలన్నీ తమ గుప్పిట్లోనే ఉండేట్టు సిండికేట్ కుట్రను అమలు చేస్తోంది. నా కొ..ల్లారా.. కమీషన్ ఇవ్వాల్సిందే: జేసీ బూతుపురాణం ⇒ అనంతపురం జిల్లా తాడపత్రి నియోజకవర్గంలో టీడీపీ మద్యం సిండికేట్ తరఫున టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి తండ్రి, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి తనదైన శైలిలో మరోసారి పచ్చి బూతులతో విరుచుకుపడ్డారు. నియోజకవర్గంలో మద్యం, ఇసుక, ఇతర వ్యాపారాలన్నీ తామే నిర్వహిస్తామన్నారు. అలా కాకుండా ఇతరులు ఎవరైనా సరే మద్యం, ఇసుక, ఇతర వ్యాపారాలు చేయాలంటే తమకు 15 శాతం కమీషన్ చెల్లించాలని, దాంతోపాటు తమకు 20 శాతం వాటా ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేశారు. ⇒ అసలు తమ నియోజకవర్గంలో మద్యం, ఇసుక దుకాణాల కోసం దరఖాస్తులు చేయడం ఏమిటని జేసీ ప్రభాకర్రెడ్డి ఆగ్రహంతో చిందులు తొక్కారు. అలా దరఖాస్తు చేసిన వారి పేర్లను ప్రస్తావిస్తూ.. ‘నా కొ..ల్లారా.. అందర్నీ కాల్చి పార..’ అంటూ’ పచ్చి బూతులు తిట్టారు. ⇒ రామకృష్ణారెడ్డి.. దాచేపల్లి రామచంద్రారెడ్డి.. వేములపల్లి ప్రకాశ్రెడ్డి.. ఇలా పేర్లు చదువుతూ.. ముందు మీకు అవుతుంది. మిమ్మల్ని అసలు ఊర్లోకి రానివ్వను. అసలు ఎవడు సారా అంగడికి అప్లికేషన్ వేసిన నా కొ.. ఎవడు వాడు.. అని వీరంగం వేశారు. ‘ఎవరు సారా అంగడి పెట్టాలన్నా మండలానికి 15 శాతం కమీషన్ ఇవ్వాల్సిందే. దాంతోపాటు తనకు (ప్రభాకర్ రెడ్డికి) 20 శాతం వాటా ఇవ్వాల్సిందే అని ఆదేశించారు. తాడిపత్రి నియోజకవర్గంలో తాము చెప్పిందే జరుగుతుందన్నారు. అంతటా అవే బెదిరింపులు ⇒ నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ వర్గం మద్యం దుకాణాల ఆదాయంలో 30 శాతం కమీషన్ చెల్లించాలని హుకుం జారీ చేసింది. సమ్మతించకుంటే అసలు మద్యం దుకాణమే నిర్వహించలేరని హెచ్చరించింది. ⇒ నంద్యాల జిల్లా శ్రీశైలంలో టీడీపీ మద్యం సిండికేట్ తమ కమీషన్ రేటు 25 శాతం అని ప్రకటించింది. అందుకు సమ్మతిస్తేనే సోమవారం లాటరీ ప్రక్రియలో పాల్గొనాలని టీడీపీ ఎమ్మెల్యే వర్గీయులు హుకుం జారీ చేశారు. ⇒ ఉమ్మడి విశాఖలో మద్యం సిండికేట్ కింగ్గా గుర్తింపు పొందిన విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ మరోసారి తన దాదాగిరీ చూపిస్తున్నారు. విశాఖపట్నం– భీమిలి బీచ్రోడ్డుతోపాటు నగరంలోని ప్రధాన జంక్షన్లలో అన్ని మద్యం దుకాణాల లైసెన్సులు తామే దక్కించుకునేలా బెదిరింపులకు దిగుతున్నారు. విశాఖలోని ఇతర ప్రాంతాలతో పాటు, అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాలు తమ సిండికేట్ సభ్యులకేనని స్పష్టం చేస్తున్నారు. కాదని ఎవరైనా లైసెన్స్ దక్కించుకుంటే 30 శాతం కమీషన్ ఇవ్వాల్సిందేనని సిండికేట్ స్పష్టం చేసింది. ⇒ శ్రీకాకుళం జిల్లాలో మంత్రి అచ్చెన్న వర్గం నేతృత్వంలోని టీడీపీ.. సిండికేట్కు నేతృత్వం వహిస్తోంది. ఇచ్ఛాపురం నుంచి ఎచ్చెర్ల వరకు మద్యం దుకాణాలన్నీ తమ సిండికేట్ గుత్తాధిపత్యంలో ఉండాల్సిందేనంది. శ్రీకాకుళం, నరసన్నపేట, టెక్కలి, పాతపట్నం, పలాస, ఇచ్ఛాఫురం నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యే వర్గీయులు ఇతర వ్యాపారులను బెదిరించి బెంబేలెత్తించారు. ఇతరులకు లైసెన్స్ దక్కితే 25 శాతం కమీషన్ చెల్లించాలని రేటు ఫిక్స్ చేశారు. ⇒ విజయవాడలో ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు కనుసన్నల్లోనే టీడీపీ మద్యం సిండికేట్ దందా సాగిస్తోంది. ఇతరులకు లైసెన్స్ దక్కితే 30 శాతం కమీషన్గా నిర్ణయించింది. ఒక్క మాటలో చెప్పాలంటే అసలు లాటరీ ప్రక్రియలో పాల్గొనేందుకే బెంబేలెత్తాల్సిన అగత్యం కల్పించారు. ⇒ దెందులూరు, ఉండి నియోజకవర్గాలు మినహా ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో టీడీపీ ఎమ్మెల్యే వర్గీయులు ఏక మొత్తంగా 25 శాతం కమీషన్ ఖరారు చేశారు. ఆ మేరకు చెల్లిస్తేనే మద్యం దుకాణాలు నిర్వహించేందుకు అనుమతిస్తామని తేల్చి చెప్పారు. ఉండిలో టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు వర్గం మాత్రం తమకు 30 శాతం చెల్లించాలని చెప్పింది. దెందులూరు నియోజకవర్గంలో అన్ని మద్యం దుకాణాలు తమ సిండికేట్కు దక్కాల్సిందేనని, ఇతరులకు లాటరీలో లైసెన్సులు దక్కినా దుకాణం ఏర్పాటు చేయనివ్వమని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వర్గం తేల్చి చెప్పింది. ⇒ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో దరఖాస్తు చేసేందుకు వచ్చిన వారిపై టీడీపీ ఎమ్మెల్యే బొజ్జా సు«దీర్ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. దరఖాస్తుదారులు డిపాజిట్ చేసేందుకు తెచ్చిన డీడీలనూ చింపి వారిని వెనక్కి పంపేశారు. ఇక లాటరీ ద్వారా ఇతరులకు మద్యం దుకాణాల లైసెన్సులు దక్కితే.. నెలకు రూ.20 లక్షలు కమీషన్గా చెల్లించాలని ఎమ్మెల్యే వర్గం రేటు నిర్ణయించింది. అదీ రోజు వారీగా వసూలు చేస్తామంది. గూడూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే పాశం సునీల్వర్గం మరో ఎత్తుగడ వేసింది. దరఖాస్తు చేసిన వారందరూ తమతోపాటు తమ వాహనాల్లోనే లాటరీ నిర్వహించే తిరుపతిలోని శిల్పారామం ప్రాంగణానికి రావాలని ఆదేశించింది. దుకాణానికి 26 దరఖాస్తులే..రాష్ట్రంలో 3,396 మద్యం దుకాణాలకు మొత్తం 89,832 దరఖాస్తులొచ్చాయి. గడువు 11 సాయంత్రం 7 గంటలతో ముగిసింది. కానీ అప్పటికి క్యూలో ఉన్న వారికి కూడా అనుమతించామని చెబుతూ మొత్తం దరఖాస్తుల తాజా గణాంకాలను ఎక్సైజ్ శాఖ ఆదివారం విడుదల చేసింది. 11న మొత్తం దరఖాస్తులు 87,116గా పేర్కొనగా.. ఆదివారం మొత్తం దరఖాస్తులు 89,832 అని ప్రకటించింది. అయినా దుకాణానికి సగటున కేవలం 26.45 దరఖాస్తులే రావడం గమనార్హం. దరఖాస్తుల ద్వారా∙రూ.1,797.64 కోట్ల ఆదాయం వచ్చింది.‘లాటరీ’ అంతా వారి కనుసన్నల్లోనే..మద్యం దుకాణాల లైసెన్సుల కేటాయింపునకు సోమవారం లాటరీ ప్రక్రియ నిర్వహించనున్నారు. కలెక్టర్ల పర్యవేక్షణలో నిర్వహించే ఈ లాటరీ ప్రక్రియ కోసం అన్ని జిల్లా కేంద్రాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ లాటరీ తతంగం అంతా తమకు అనుకూలంగా నిర్వహించేలా టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. లాటరీ ప్రక్రియ నిర్వహించే కేంద్రం పూర్తిగా టీడీపీ సిండికేట్ సభ్యులతో కిక్కిరిసిపోయేట్టుగా చేయాలని ఆదేశించారు. ఇతరులు ఎవరొచ్చినా బెదిరించి వెనక్కి పంపాలని, అప్పటికీ ఎవరైనా వస్తే ఘర్షణకు దిగేందుకూ వెనుకాడొద్దని స్పష్టం చేశారు. అవసరమైతే అధికారులపైనే ఆగ్రహావేశాలు వ్యక్తం చేయాలని, ఇతరులపై దాడులు చేయాలని చెప్పడం గమనార్హం. తమకు లైసెన్స్ రానప్పుడు ఘర్షణ వాతావరణాన్ని సృష్టించి లాటరీ ప్రక్రియను అడ్డుకోవాలని టీడీపీ సిండికేట్ కుట్ర. రెండు జిల్లాల్లో మంత్రి కొల్లు వర్గం వీరంగం ⇒ ఎక్సైజ్ శాఖ మంత్రిగా టీడీపీ మద్యం సిండికేట్లో తమదే సింహభాగం అని మంత్రి కొల్లు రవీంద్రవర్గం వీరంగం సృష్టిస్తోంది. అందుకే ఏకంగా ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎంపిక చేసిన ప్రధాన కేంద్రాల్లో మద్యం దుకాణాలను ఏక మొత్తంగా దక్కించుకునేందుకు రంగంలోకి దిగింది. దరఖాస్తు చేసిన వారికి మంత్రి వర్గీయులు రెండు రోజులుగా ఫోన్లు చేసి మరీ తమదైన శైలిలో బెదిరిస్తుండటం గమనార్హం.⇒ మద్యం దుకాణాల్లో తమకు 50 శాతం వాటా ఇవ్వాలి.. లేదా మద్యం ఆదాయంలో 25 శాతం కమీషన్ అయినా ఇవ్వాలని తేల్చి చెబుతున్నారు. మచిలీపట్నం నియోజకవర్గంలో 100 శాతం మద్యం దుకాణాలను మంత్రి వర్గీయులే ఏకపక్షంగా దక్కించుకోవడం ఇప్పటికే ఖాయమైంది. కాగా విజయవాడ, గన్నవరం, గుడివాడ, పామర్రుతోపాటు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రధాన కేంద్రాల్లో దరఖాస్తులు చేసిన వారికి ఫోన్లు చేసి హెచ్చరిస్తున్నారు. ⇒ తాడేపల్లిలో మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసిన వారికి కూడా మంత్రి కొల్లు రవ్రీంద వర్గీయులు ఫోన్లు చేసి బెదిరించడం గమనార్హం. మంత్రి లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో వారిని కూడా బెదిరించడం ప్రాధాన్యం సంతరించుకుంంది. అంటే మంత్రి లోకేశ్ అండతోనే కొల్లు వర్గం రెచ్చిపోతోందని స్పష్టమవుతోంది.భారీ దోపిడీకి పక్కా డీల్భారీ దోపిడీకి ప్రభుత్వ ముఖ్య నేతతో పక్కాగా డీల్ కుదరడం వల్లే టీడీపీ మద్యం సిండికేట్ బరితెగిస్తోంది. ప్రైవేటు మద్యం దుకాణాల్లో ఎంఆర్పీ కంటే అధిక ధరతో విక్రయించేందుకు ముఖ్య నేత ఇప్పటికే పచ్చ జెండా ఊపారు. ఒక్కో బాటిల్పై మద్యం దుకాణంలో రూ.15 అధికంగా.. బెల్ట్ షాపుల్లో అయితే రూ.25 అధికంగా విక్రయించేందుకు అనుమతించారు. అందులో ఒక్కో బాటిల్పై కరకట్ట బంగ్లాకు రూ.3 చొప్పున కప్పం కట్టాలన్నది డీల్లో ప్రధాన అంశం. మిగిలింది టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి ఆధ్వర్యంలోని సిండికేట్ సభ్యులకు దక్కుతుంది. పక్కాగా డీల్ కుదరడంతో టీడీపీ సిండికేట్ రాష్ట్రంలోని 3,396 మద్యం దుకాణాలను ఏకపక్షంగా దక్కించుకునేందుకు అక్రమాలు, బెదిరింపులకు తెగించింది. -
నాకేం తక్కువ..? నాకూ మద్యం షాపు కావాలి
బొబ్బిలి: ఆకలిగొన్న పులుల్లా మద్యం షాపు దక్కించుకోవడానికి అర్రులు చాస్తున్న సిండికేట్ వ్యాపారుల మధ్యలోని ఓ బామ్మ వచ్చి తనకూ మద్యం షాపు కావాలంటూ దరఖాస్తు చేసి అందరికీ షాక్ ఇచ్చింది. మద్యం షాపు కోసం దరఖాస్తు చేయడానికి కార్యాలయానికి వచ్చిన ఓ వృద్ధురాలిని చూసిన ఎక్సైజ్ అధికారులు ముసిముసి నవ్వులు నవ్వుతూ ముక్కున వేలేసుకున్నారు. బొబ్బిలి ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయంలో టెండర్ బాక్స్లో ఆఫ్లైన్లో దరఖాస్తు చేసేందుకు ఓ బామ్మ వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దత్తిరాజేరు మండలం పి.లింగాలవలసకు చెందిన పప్పల అచ్చయ్యమ్మ(85) ఎకై ్సజ్ అధికారులు నిర్వహిస్తున్న సమావేశాలకు హాజరవుతూ అందరినీ ఆలోచనలో పడేస్తోంది. బొబ్బిలి కార్యాలయానికి సోమవారం సాయంత్రం వచ్చిన ఆ బామ్మకు ఓ బల్ల ఇచ్చి స్నాక్స్ ఇచ్చి ఎక్సైజ్ అధికారులు కూడా మర్యాద చేయడం విశేషం. -
‘ఎల్లో’ సిండికేట్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మద్యం దందా ద్వారా అధికారికంగా భారీ దోపిడీకి తెర తీసిన నేపథ్యంలో ‘‘ముఖ్య’’నేత కనుసన్నల్లో జరుగుతున్న దుకాణాల కేటాయింపుల్లో టీడీపీ సిండికేట్కు రాచబాట పరుస్తున్నారు. టీడీపీ ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులు, బినామీలకే మద్యం దుకాణాలను కేటాయించేలా వ్యూహం రూపొందించి అమలు చేస్తున్నారు. మద్యం షాపుల ఏర్పాటుకు ‘‘ఆఫ్లైన్’’ ద్వారా వేల సంఖ్యలో అందుతున్న దరఖాస్తులు సిండికేట్ దందాకు పక్కా నిదర్శనంగా నిలుస్తోంది. ఆన్లైన్ ద్వారా అక్కడక్కడా అరకొరగా వచ్చిన దరఖాస్తులను సైతం సిబ్బంది ద్వారా కాగితాలపై నింపడం మద్యం అక్రమాలకు పరాకాష్ట. ఒక్కో మద్యం దుకాణానికి సగటున 20 –30 దరఖాస్తులు వస్తాయి. మారుమూల ప్రాంతాల్లోనూ కనీసం పది దరఖాస్తులు అందుతాయి. అలాంటిది మరో నాలుగు రోజుల్లో గడువు ముగుస్తున్నా ఒక్కో దుకాణానికి కనీసం మూడు దరఖాస్తులు కూడా రాకపోవటాన్ని బట్టి టీడీపీ మద్యం సిండికేట్ ఏ స్థాయిలో శాసిస్తోందో వెల్లడవుతోంది. రాష్ట్రంలోని 3,396 మద్యం దుకాణాలకుగానూ ఇప్పటివరకు 8,274 దరఖాస్తులు మాత్రమే అందడం.. అది కూడా దాదాపుగా అంతా ఆఫ్లైన్లోనే రావడం గమనార్హం. ప్రైవేట్ మద్యం దుకాణాల ద్వారా టీడీపీ సిండికేట్ దోపిడీకి కూటమి ప్రభుత్వం రాచబాట పరిచింది. టీడీపీ సిండికేట్ మినహా ఇతరులెవరూ దరఖాస్తు చేయకుండా అడ్డుకునేందుకు ఎక్సైజ్ శాఖ ద్వారా ఎత్తుగడ వేసింది. కేవలం ఎక్సైజ్ శాఖ కార్యాలయాలకు వచ్చి సమర్పించే దరఖాస్తులకే ప్రాధాన్యమిస్తోంది. ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణకు సాంకేతిక అడ్డంకులు సృష్టిస్తూ టీడీపీ సిండికేట్కు కొమ్ముకాస్తోంది. ఇతరులు ఎక్సైజ్ కార్యాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసేందుకు యత్నిస్తే బెదిరించి వెనక్కి పంపుతున్నారు.సిండికేట్.. ఆన్‘లైన్’రాష్ట్రంలో 3,396 ప్రైవేట్ మద్యం దుకాణాల లైసెన్స్ల కోసం ఎక్సైజ్ శాఖ టెండర్ల ప్రక్రియ చేపట్టింది. ఈ నెల 1 నుంచి 10వతేదీ వరకు లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లా ఎక్సైజ్ కార్యాలయాలకు వెళ్లి నేరుగా దరఖాస్తు (ఆఫ్లైన్) చేసుకోవడంతోపాటు ఆన్లైన్లో కూడా సమర్పించవచ్చని పేర్కొంది. మొదటి రోజైన మంగళవారం 200 దరఖాస్తులు అందగా ఆశ్చర్యకరంగా కేవలం రెండు మాత్రమే ఆన్లైన్లో రావడం గమనార్హం. తాజాగా ఆదివారం నాటికి మొత్తం 8,274 దరఖాస్తులు రాగా వీటిలో 6,520 ఆఫ్లైన్లోనే స్వీకరించడం గమనార్హం. 1,754 దరఖాస్తులు మాత్రమే ఆన్లైన్లో అందాయి.ఎక్సైజ్ కార్యాలయాల్లో తిష్టమద్యం దుకాణాల లైసెన్సులన్నీ గంపగుత్తగా టీడీపీ సిండికేట్కే దక్కాలని ప్రభుత్వ పెద్దలు ఎక్సైజ్ అధికారులకు స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే ఆన్లైన్ దరఖాస్తులకు ఎక్సైజ్ శాఖ సాంకేతికంగా మోకాలడ్డుతోంది. ఎంతోమంది ఆన్లైన్ ద్వారా మద్యం దుకాణాల లైసెన్స్ల కోసం ప్రయత్నిస్తున్నా సాధ్యపడటం లేదు. సాంకేతిక కారణాలు, సర్వర్ డౌన్ అంటూ దరఖాస్తులు అప్లోడ్ కావడం లేదని చెబుతున్నారు. ఎక్సైజ్ అధికారులను సంప్రదిస్తే కనీస స్పందన లేదని పేర్కొంటున్నారు. ఇదే అదునుగా టీడీపీ సిండికేట్ సభ్యులు నేరుగా ఎక్సైజ్ శాఖ కార్యాలయాలకు వచ్చి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేస్తున్నారు. వారంతా ఎక్సైజ్ కార్యాలయాల్లోనే ఉదయం నుంచి సాయంత్రం వరకు తిష్ట వేస్తున్నారు. ఇతరులు దరఖాస్తు చేసేందుకు ప్రయత్నిస్తే అడ్డుకుంటున్నారు. తమను కాదని దరఖాస్తు చేసినా లైసెన్సులు రావని, లాటరీ ద్వారా ఎంపిక అన్నది పూర్తిగా బోగస్ అని తేల్చి చెబుతున్నారు.దాడులు.. కేసుల బెదిరింపులుఆఫ్లైన్లో దరఖాస్తు చేస్తామని మొండికేస్తున్న వారిని టీడీపీ సిండికేట్ తీవ్ర బెదిరింపులకు గురి చేస్తోంది. ‘మమ్మల్ని కాదని దరఖాస్తు చేస్తే ఊళ్లో వ్యాపారం చేయగలవా? నీకు మద్యం దుకాణం కోసం షాపు ఎవరు అద్దెకు ఇస్తారో చూస్తాం. సొంత దుకాణంలో పెడితే ఎక్సైజ్ అధికారులతో దాడులు చేయిస్తాం. అక్రమ కేసులు బనాయిస్తాం.. ’ అని ఎక్సైజ్ అధికారుల సమక్షంలోనే హెచ్చరిస్తున్నారు. సిండికేట్కు సంబంధం లేని వ్యక్తులు దరఖాస్తు చేస్తే ఫోన్ నంబర్లు సేకరించి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇతరులు మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసేందుకు వెనుకాడుతున్నారు. మద్యం దుకాణాల కోసం వచ్చిన దరఖాస్తుల వివరాలను ఎక్సైజ్ శాఖ ఏ రోజుకు ఆ రోజు అధికారికంగా వెల్లడించకపోవడం గమనార్హం. తద్వారా పారదర్శకతకు పాతరేస్తూ ఏకపక్షంగా టీడీపీ సిండికేట్కు దుకాణాల లైసెన్సులు కట్టబెట్టేందుకు సహకరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. -
జీఎస్టీ పరిధిలో లేము.. రూపాయి పన్ను ఎగ్గొట్టలేము
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బ్రేవరేజెస్ కార్పొరేషన్ (టీజీబీసీఎల్) పరిధిలో ఎలాంటి పన్ను ఎగవేతకు ఆస్కారం లేదని ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. తాము ఒక్క రూపాయి కూడా నగదు లావాదేవీలు నిర్వహించట్లేదని.. మద్యం వ్యాపారుల నుంచి నేరుగా ఆర్థిక శాఖ ఖాతాలోకి నగదు జమ చేస్తున్నామని తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో కార్పొరేషన్ పరిధిలో పన్ను ఎగవేతకు ఆస్కారం లేదని తేల్చిచెప్పింది. ఈ మేరకు రూ. 400 కోట్ల పన్ను ఎగవేతకు సంబంధించిన వివరాలను పంపాలని వస్తు సేవల పన్ను (జీఎస్టీ) శాఖ రాసిన లేఖకు ఇటీవల ఎక్సైజ్ యంత్రాంగం సమాధానం ఇచ్చినట్లు సమాచారం. మద్యం వ్యాపారం జీఎస్టీ పరిధిలో లేదని... ఈ వ్యాపార లావాదేవీలపై విలువ ఆధారిత పన్ను (వ్యాట్)నే వసూలు చేస్తామని జీఎస్టీ శాఖకు పంపిన సమాధానంలో పేర్కొన్నట్లు ఎక్సైజ్ వర్గాలు చెప్పాయి.అలా వసూలు చేయడంలో లేదా మద్యం అమ్మకాలకు సంబంధించిన పన్నును ప్రభుత్వానికి చెల్లించడంలో ఒక్క రూపాయి కూడా ఎగ్గొట్టలేమని స్పష్టం చేసినట్లు చెబుతున్నాయి. అన్ని వ్యాపారాల్లా కాదు.. జీఎస్టీ వసూలుకు సంబంధించి అన్ని వ్యాపారాల్లాగా మద్యం అమ్మకాలు ఉండవని ఎక్సైజ్ శాఖ తన సమాధానంలో పేర్కొన్నట్లు తెలిసింది. మద్యం తయారీదారులు సరఫరా చేసిన మద్యా న్ని బ్రూవరేజస్ కార్పొరేషన్ ద్వారా వైన్ షాపులకు అమ్ముతామని.. అలా విక్రయించే క్రమంలోనే రిటైలర్ల (వైన్షాప్స్) నుంచి మార్కెట్లో మద్యం అమ్మకపు రేటుకు పన్ను తీసుకుంటా మని తెలియజేసింది. ఆ పన్ను పోను మద్యం అమ్మకాలపై వైన్ షాపు నిర్వాహకులకు కేవలం కమిషన్ ఇస్తామని... మార్కెట్లో మద్యం అమ్మే ధరపై జీఎస్టీ చెల్లించాలన్న వాదన సమంజసం కాదని వెల్లడించింది. ఈ మేరకు వైన్ షాపుల నుంచి పన్ను వసూలు చేసుకొని ప్రభుత్వానికి బ్రూవరేజస్ కార్పొరేషన్ చెల్లించే వెసులుబాటు వ్యాట్ చట్టం ద్వారా ఉందని తెలియజేసింది.తద్వారా కార్పొరేషన్ పన్ను ఎగవేసిందన్న వాదనలో వాస్తవం లేదని, నగదు లావాదేవీలే నిర్వహించని ప్రభుత్వ సంస్థ.. ప్రభుత్వానికి పన్ను ఎగవేసే వీలుండదని తెలిపింది. తమకూ వివరాలు ఇవ్వాలన్న సీజీఎస్టీ.. బ్రేవరేజెస్ కార్పొరేషన్ సహా 72 కంపెనీలు రూ. 1,400 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడ్డాయని ఆరోపిస్తూ జీఎస్టీ శాఖ జూలైలో కేసులు నమోదు చేసింది. మాజీ సీఎస్ సోమేశ్ కుమార్పైనా కేసు పెట్టింది. మరోవైపు ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలను తమకు కూడా పంపాలని కేంద్ర వస్తు సేవల పన్ను (సీజీఎస్టీ) విభాగం ఇటీవల రాష్ట్ర జీఎస్టీ శాఖకు లేఖ రాసినట్లు తెలిసింది. అందులో తమకు కూడా రూ. 700 కోట్ల వాటా వస్తుందని ఆ లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. -
ప్రభుత్వ మద్యం షాపులు రద్దు
సాక్షి, అమరావతి: రాష్టంలో ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేస్తూ, రిటైల్ లిక్కర్ షాపులకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేర్వేరు ఆర్డినెన్స్లు జారీ చేసింది. ఈ మేరకు ప్రొహిబిషన్, ఎక్సైజ్ చట్టాలకు సవరణలు చేసింది. ఈ రెండు ఆర్డినెన్స్లను గెజిట్లో ప్రచురిస్తూ న్యాయ శాఖ ఇన్చార్జి కార్యదర్శి వి.సునీత గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆర్డినెన్స్ల ప్రకారం వచ్చేనెల 1 నుంచి కొత్త విధానం అమల్లోకి వస్తుంది. కొత్త మద్యం విధానానికి రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలపడంతో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులు మార్గదర్శకాలను రూపొందించి న్యాయ శాఖకు పంపారు. వీటికి న్యాయ శాఖ ఆమోదం తెలపడంతో ప్రభుత్వం గవర్నర్ అనుమతితో ఆర్డినెన్స్లు తీసుకొచ్చింది. ప్రస్తుతం శాసన సభ సమావేశాలు లేకపోవడంతో ప్రభుత్వం ఆర్డినెన్స్లు జారీ చేసింది. అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఆర్డినెన్స్లు చట్ట రూపం దాలుస్తాయి. దాదాపు 3,736 రిటైల్ షాపులను ప్రైవేటు వ్యక్తులకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
ఎక్సైజ్ శాఖలో ‘డబ్బుల్’ ధమాకా!
సాక్షి ప్రతినిధి కర్నూలు/సాక్షి ప్రతినిధి, విశాఖ పట్నం: ఎక్సైజ్ శాఖ టీడీపీ నేతలకు కాసుల ఖజానాగా మారింది. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్)ను కూటమి ప్రభుత్వం తాజాగా రద్దు చేసింది. సెబ్లో ఉన్న ఉద్యోగులను తిరిగి ఎక్సైజ్ శాఖకు పంపుతోంది. దీంతో కోరుకున్న పోస్టులు దక్కించుకునేందుకు అధికారులు.. వీరి ఆరాటాన్ని ‘క్యాష్’ చేసుకునేందుకు ప్రభుత్వ పెద్దలు, టీడీపీ నేతలు సిద్ధమయ్యారు. ప్రాంతానికి, పోస్టుకో రేటును నిర్ణయించి భారీగా వసూళ్ల పర్వానికి తెరలేపారు. ఎమ్మెల్యే సిఫార్సు లేఖ ఉంటేనే పోస్టింగ్.. లెటర్కు, పోస్టింగ్కు వేర్వేరుగా టీడీపీ నేతలు డిమాండ్ చేసినంత కప్పం.. అడిగినంత చెల్లించలేకపోతే లూప్లైన్ పోస్టింగ్లు.. ఇలా అమరావతిలో ఎక్సైజ్శాఖ ప్రధాన కార్యాలయంలో రెండు రోజులుగా ఇదే దందా నడుస్తోంది. బేరసారాలతో కొందరు ఇప్పటికే తమకు నచ్చిన చోట పోస్టింగులు దక్కించుకోగా ఇంకొన్ని పోస్టింగులకు బేరాలు నడుస్తున్నాయి. ఇప్పుడు ఈ వ్యవహారం ఎక్సైజ్ శాఖలో తీవ్ర చర్చనీయాంశమైంది. సెబ్కు చెల్లుచీటీ ఇచ్చి.. వసూళ్ల పర్వానికి తెరలేపి.. గత ప్రభుత్వం పల్లెల్లో బెల్ట్షాపులకు అడ్డుకట్ట వేయడానికి, సారా తయారీని అరికట్టడానికి, గంజాయి నిర్మూలనకు సెబ్ను ఏర్పాటు చేసింది. అలాగే ప్రజలకు మద్యం దూరమయ్యేలా చేసేందుకు ప్రభుత్వమే పరిమిత సంఖ్యలో మద్యం దుకాణాలు నిర్వహించింది. బెల్ట్షాపుల కోసం బల్్కగా మద్యం బాటిళ్లను విక్రయించేందుకు ప్రభుత్వం అనుమతించలేదు. దీంతో సిబ్బంది అవసరం తగ్గింది. దీంతో సెబ్ను ఏర్పాటు చేసి ఎక్సైజ్ శాఖలోని 70 శాతం సిబ్బందిని అందులోకి పంపారు. బెల్ట్షాపులు తగ్గడంతో పల్లెల్లో మద్యం సేవించేవారి సంఖ్య తగ్గిపోయింది. తద్వారా నేరాల సంఖ్య కూడా పడిపోయింది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరడంతో తిరిగి ఎక్సైజ్ శాఖను ఏర్పాటు చేస్తున్నారు. సెబ్లో విలీనమైన ఎక్సైజ్ అధికారులను తిరిగి మాతృశాఖలో నియమించి పాత పంథాలోనే విధులు నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో తిరిగి ఎక్సైజ్ స్టేషన్లలో సీఐ, ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు ఉంటారు. వీటితో పాటు 26 జిల్లాలకు ఎక్సైజ్ సూపరింటెండెంట్లు(ఈఎస్), ఉమ్మడి 13 జిల్లాలకు డిప్యూటీ కమిషనర్ (డీసీ)లను నియమించనున్నారు. దీంతో కోరుకున్న చోట పోస్టులు దక్కించుకునేందుకు ప్రభుత్వ పెద్దలను, ఎమ్మెల్యేలను ఆశ్రయిస్తున్నారు. పోస్టుకో రేటు.. డీసీ, ఈఎస్, ఏసీలతో పాటు సీఐల నియామకాల కోసం రెండురోజులుగా అమరావతిలో కసరత్తు జరుగుతోంది. ఎక్సైజ్శాఖ యూనియన్ నాయకులు అక్కడే మకాం వేశారు. యూనియన్ కనుసన్నల్లోనే పోస్టింగులు ఖరారవుతున్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ కమిషనర్ పోస్టు కావాలంటే స్థానిక మంత్రి లేదా ఎమ్మెల్యే సిఫార్సు లేఖ తప్పనిసరి. ఈ లేఖ కావాలంటే రూ.15 లక్షలు స్థానిక ప్రజాప్రతినిధికి ఇవ్వాల్సిందే. లేఖ తీసుకొస్తే ఆపై పోస్టింగు ఇచ్చేందుకు ఎక్సైజ్ శాఖలోని ఓ ప్రభుత్వ పెద్దకు మరింత ముట్టజెప్పాలి. ఈ క్రమంలో విశాఖపట్నం, గుంటూరు, పశి్చమగోదావరి, విజయవాడ డీసీ పోస్టులకు రూ.30 లక్షలు ధర నిర్ధారించినట్లు తెలుస్తోంది. కొందరు ఇంత కంటే ఎక్కువ ఇచ్చి చేరేందుకు కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. తక్కిన జిల్లాల్లో డీసీ పోస్టులకు రూ.20లక్షలు, ఈఎస్ పోస్టులకు రూ.15లక్షలుగా ధర ఫిక్స్ చేశారు. ఈ మొత్తాలకు తక్కువ కాకుండా ఎవరు ఎక్కువ ఇస్తే వారికి పోస్టింగులు ఇస్తున్నారు. పోస్టింగులకు టీడీపీ ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు తప్పనిసరి అని ప్రభుత్వం చెప్పినట్లు తెలుస్తోంది. ప్రజాప్రతినిధులు యూనియన్ నాయకులు సిఫార్సు చేసిన వారికే లేఖలు ఇస్తున్నట్లు చెబుతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు కర్నూలు డీసీగా మునిచంద్రమోహన్, అనంతపురం డీసీగా నాగమద్దయ్య ఇప్పటికే ఖరారైనట్లు సమాచారం. చిత్తూరు డీసీ పోస్టు మంత్రి నారా లోకేశ్ సిఫార్సు చేసిన వారికే దక్కనున్నట్లు తెలుస్తోంది. కడప డీసీకి పెద్దగా పోటీ లేదని సమాచారం. అలాగే విశాఖ డిప్యూటీ కమిషనర్గా శ్రీరామచంద్రమూర్తి, ఎక్సైజ్ సూపరింటెండెంట్గా ఆర్. ప్రసాద్ పేరు ఖరారైందని చెబుతున్నారు. అలాగే శ్రీకాకుళం ఎక్సైజ్ సూపరింటెండెంట్గా రామకృష్ణ ఖరారైనట్లు సమాచారం. కానిస్టేబుల్ పోస్టుకు సైతంఎక్సైజ్ స్టేషన్లలో సీఐ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్వో)గా ఉంటారు. ఆయన కింద ఎస్ఐలు, హెడ్కానిస్టేబుల్, కానిస్టేబుళ్లు ఉంటారు. ప్రస్తుతం సీఐల పోస్టింగులకు బేరాలు నడుస్తున్నాయి. సీఐ పోస్టుకు సిఫార్సు లేఖ కావాలంటే రూ.8–10 లక్షలు సంబంధిత టీడీపీ ఎమ్మెల్యేకు ముట్టజెప్పాలని తెలుస్తోంది. రాజధానిలో పోస్టింగ్ కావాలంటే మరో రూ.10 లక్షలు సమర్పించుకోవాల్సిందే. స్టేషన్ను బట్టి ఈ ధరల్లో తేడాలు ఉన్నాయి. ఈఎస్లు.. లెటర్కు రూ.10 లక్షలు, రాజధానిలో పోస్టుకు రూ.15 లక్షలు ముట్టజెప్పాల్సిందేనని తెలుస్తోంది. మొదటగా డీసీలు, ఈఎస్లు, సీఐలను నియమించనున్నారు. ఆపై వీరు ఎస్ఐ నుంచి కానిస్టేబుళ్ల వరకూ నియమించుకోవచ్చు. ఈ నియామకాల్లోనే వీరు పెట్టిన పెట్టుబడిని రికవరీ చేయాలనే యోచనలో కొందరు డీసీలు, ఈఎస్లు ఉన్నట్లు తెలుస్తోంది.కానిస్టేబుల్ పోస్టుకు రూ.లక్ష, హెడ్ కానిస్టేబుల్కు రూ.1.50 లక్షలు, ఎస్ఐ పోస్టుకు రూ.5 లక్షలు ధర నిర్ణయించారు. తాము అడిగినంత చెల్లించలేనివారికి మొబైల్ పార్టీ, థర్డ్గ్రేడ్ స్టేషన్లను కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. కొత్త పాలసీలో భారీ ఆదాయం ప్రభుత్వం నూతన మద్యం పాలసీ తీసుకురానుంది. టెండర్ల ద్వారా లేదా లాటరీ ద్వారా మద్యం షాపులు ప్రైవేటు వ్యక్తులకు కేటాయించనున్నారు. దీంతో ప్రైవేటు వ్యక్తులు ‘సిండికేట్’ ద్వారా మద్యం ధరలు పెంచి విక్రయాలు సాగించనున్నారు. దీంతో అధికారులకు నెలమామూళ్లు ఇస్తారు. తద్వారా పోస్టింగ్ పెట్టుబడితో పాటు భారీగానే ఆర్జించే అవకాశం ఉంది. పైగా బెల్ట్షాపులు విచ్చలవిడిగా నడిచే అవకాశం ఉంది. దీంతోనే ఆదాయం ఉన్న స్టేషన్ల కోసం భారీగా పెట్టుబడి పెట్టి పోస్టింగులు తెచ్చుకునేందుకు అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది.విశాఖలో భారీ డిమాండ్ విశాఖ ఎక్సైజ్ శాఖలో పోస్టింగ్లకు భారీ డిమాండ్ ఉంది. డిప్యూటీ కమిషనర్ నుంచి సబ్ ఇన్స్పెక్టర్ వరకు ప్రతి చోట విపరీతమైన గిరాకీ కనిపిస్తోంది. పోస్టును బట్టి రేటు పలుకుతోంది. విశాఖ ఎక్సైజ్ శాఖలో డిప్యూటీ కమిషనర్ పోస్టు హాట్ సీటుగా మారిపోయింది. ఇక్కడ పోస్టింగ్ కోసం ఆశావహుల సంఖ్యలో కూడా ఎక్కువగానే ఉంది. ప్రధానంగా ముగ్గురు సీనియర్ అధికారులు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇక్కడ సూపరింటెండెంట్గా పని చేసి వెళ్లిన అధికారి కూడా ఈ కోవలో ఉన్నట్టు సమాచారం. అలాగే పక్క జిల్లాల నుంచి మరో ఇద్దరు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కొక్కరు 5 నుంచి 10 మంది ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను సిద్ధం చేసుకుంటున్నారు. అలాగే ఈ పోస్టుకు రూ.30 లక్షలు ముట్టజెప్పేందుకు రెడీ అవుతున్నారు. అలాగే ఎక్సైజ్ సూపరింటెండెంట్ పోస్టు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు పలుకుతోంది. కీలకమైన ఆ స్థానాలను చేజిక్కించుకుంటే.. ఆ తరువాత జరిగే సీఐ, ఎస్ఐ, కానిస్టేబుల్ బదిలీల్లో సులువుగా సంపాదించుకోవచ్చని ఇప్పుడు ఎంతైనా ఖర్చు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.స్టేషన్ను బట్టి రేటు సీఐ నుంచి కానిస్టేబుళ్ల వరకు రేటుతో పాటు స్థానిక ప్రజాప్రతినిధి సిఫార్సు లేఖలు కూడా తప్పనిసరి. ఆ సిఫార్సు లేఖలకు స్టేషన్ను బట్టి రేటు నిర్ణయించినట్లు సమాచారం. సీఐ పోస్టింగ్కు రూ.5 నుంచి రూ.8 లక్షలు, ఎస్ఐకి రూ.2 నుంచి రూ.3 లక్షలు, హెడ్ కానిస్టేబుల్కు రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షలు, కానిస్టేబుల్ స్థాయికి రూ.50 వేలు నుంచి రూ.75 వేలు వసూలు చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ వ్యవహారంలో ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల సంఘం రాష్ట్ర స్థాయి నేత కీలక పాత్ర పోషిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. రాయలసీమ ప్రాంతానికి చెందిన సదరు సీఐ స్థాయి అధికారి లాబీయింగ్లో సిద్ధహస్తుడన్న పేరు ఉంది. కొన్ని చోట్ల అధికారులు, సిబ్బంది పోస్టింగుల విషయంలో ఎవరైనా ప్రజాప్రతినిధులను కలిస్తే.. సదరు అధికారి ద్వారా రావాలని స్పష్టంగా చెబుతున్నట్లు సమాచారం. వెలగపూడిదే రాజ్యం.. విశాఖపట్నం నగర పరిధిలో ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నా హవా అంతా విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు చలాయిస్తున్నారు. కానిస్టేబుల్ నుంచి ఈసీ వరకూ పోస్టులకూ ఆయనే సిఫారసు లేఖలు ఇస్తున్నారు. తక్కిన ఎమ్మెల్యేలు ఎవరూ లేఖలు ఇచ్చేందుకు వీల్లేదు. వీరిలో గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా ఉండటం విశేషం. వీరితో పాటు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు, జనసేన పార్టీ ఎమ్మెల్యేలు పంచకర్ల రమేశ్బాబు, వంశీకృష్ణ యాదవ్ కూడా ఉన్నారు. భీమిలి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మినహా తక్కిన వారంతా తమ నియోజకవర్గాల్లో పోస్టింగ్ల కోసం ఎమ్మెల్యేల వద్దకు వెళ్తుంటే ‘వెలగపూడిని కలవండి’ అని వారు చెబుతున్నట్టు తెలుస్తోంది. గతంలో మద్యం సిండికేట్ మొత్తం వెలగపూడి కనుసన్నల్లోనే నడిచేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తిరిగి ఎక్సైజ్ను పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ప్రభుత్వ సహకారం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్రలో కూడా.. విశాఖలో మాత్రమే కాకుండా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా ఇదే తరహా పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా శ్రీకాకుళంలో మద్యం తయారీ కంపెనీలు ఉన్నాయి. దీంతో అక్కడ పోస్టింగ్లకు కూడా పెద్ద ఎత్తున పైరవీలు జరుగుతున్నాయి. విశాఖలో పోస్టింగ్ అవకాశం దక్కని వారు రెండో ఆప్షన్గా శ్రీకాకుళంను ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. అక్కడ జిల్లా స్థాయిలో పోస్టింగ్ లభిస్తే ఒక వైపు కింది స్థాయి అధికారుల బదిలీల్లోనే కాకుండా మద్యం కంపెనీల నుంచి కూడా పెద్ద ఎత్తున లాభం ఉంటుందని భావిస్తున్నారు. దీంతో శ్రీకాకుళం జిల్లా కూడా ఎక్సైజ్ అధికారులకు హాట్ ఫేవరెట్గా మారింది. -
AP: రేపటి నుంచి ఉద్యోగుల బదిలీలు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా తొలగించింది. ప్రజా సంబంధిత సేవలందించే 14 శాఖల్లోని ఉద్యోగుల బదిలీలకు సోమవారం నుంచి ఈ నెలాఖరు వరకు అనుమతించింది. ఎక్సైజ్ శాఖలో మాత్రం వచ్చేనెల 5 నుంచి 15వ తేదీ వరకు బదిలీలకు అనుమతించింది. ఈ మేరకు మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ శనివారం జారీ చేశారు. ఈ నెలాఖరుకల్లా 14 శాఖల్లో బదిలీలు పూర్తవ్వాలని, వచ్చే నెల 1వ తేదీ నుంచి నిషేధం తిరిగి అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఎక్సైజ్ శాఖలో వచ్చే నెల 16 నుంచి నిషేధం అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. 5 సంవత్సరాలుగా ఒకే చోట పనిచేస్తున్న ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇతర ఉద్యోగుల్లో పరిపాలన అవసరాలు లేదా వ్యక్తిగత అభ్యర్థనలపై బదిలీలకు అర్హులు. ఎన్నికల ప్రక్రియ కోసం బదిలీలను బదిలీగా పరిగణించరు. కారుణ్య ప్రాతిపదికన నియమితులైన వితంతువులైన మహిళా ఉద్యోగులు, దృష్టి లోపం గల ఉద్యోగులకు బదిలీల నుంచి మినహాయింపు ఉంటుంది.బదిలీలు జరిగే శాఖలు– రెవెన్యూ (భూపరిపాలన), సెర్ప్తో సహా పంచాయత్ రాజ్ – గ్రామీణాభివృద్ధి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్, గ్రామ, వార్డు సచివాలయాలు, పౌర సరఫరాలు, మైనింగ్– జియాలజీ, అన్ని విభాగాలలో ఇంజనీరింగ్ సిబ్బంది, దేవదాయ, రవాణా, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక, పరిశ్రమలు, ఇంధన, స్టాంపులు–రిజిస్ట్రేషన్, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్. ఏజెన్సీ ప్రాంతాల్లో ఖాళీలను ముందు భర్తీ చేయాలినోటిఫైడ్ ఏజెన్సీ ప్రాంతాల్లోని అన్ని ఖాళీ పోస్టులను ముందుగా భర్తీ చేయాలి. ఐటీడీఏ ప్రాంతాలతో పాటు వెనుకబడిన ప్రాంతాల్లో పోస్టుల భర్తీకి శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లు ప్రాధాన్యతనివ్వాలి. నిబంధనల ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లో రెండేళ్లు పూర్తి చేసిన ఉద్యోగులు కోరిన చోటుకు బదిలీ చేసేందుకు ప్రాధాన్యతనివ్వాలి. ఐటీడీఏ పరిధిలో బదిలీ చేసే ఉద్యోగులు 50 ఏళ్ల లోపు ఉండాలి. ఐటీడీఏ పరిధిలో గతంలో పనిచేయని ఉద్యోగులను బదిలీ చేయాలి. ఐటీడీఏ పరిధిలో బదిలీ చేసిన ఉద్యోగుల స్థానంలో ప్రత్యామ్నాయం లేకుండా రిలీవ్ చేయడానికి వీల్లేదు. బదిలీ దరఖాస్తుల పరిశీలనకుఅంతర్గత కమిటీలుప్రభుత్వ మార్గదర్శకాలు, షరతులకు అనుగుణంగా సంబంధిత అధికారులు బదిలీలను అమలు చేయాలి. జిల్లా, జోనల్, బహుళ జోనల్తో పాటు రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా బదిలీల ప్రక్రియ చేపట్టాలి. ప్రాధాన్యతల విషయంలో దుర్వినియోగం జరగకుండా సంబంధిత శాఖల అంతర్గత కమిటీలు దరఖాస్తులను పరిశీలించి, తగిన సిఫార్సులు చేయాలి. ఎటువంటి ఫిర్యాదులు, ఆరోపణలకు అవకాశం లేకుండా పారదర్శకంగా గడువులోగా బదిలీల ప్రక్రియను సంబంధిత శాఖాధిపతులు పూర్తి చేయాలి. ఉద్యోగ సంఘాల ప్రతినిధుల బదిలీల విషయంలో నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలి.ఈ వర్గాలకు బదిలీల్లో ప్రాధాన్యత– దృష్టి లోపం ఉన్న ఉద్యోగులు, మానసిక వికలాంగ పిల్లలను కలిగి ఉన్న ఉద్యోగులు సంబంధిత వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్న చోటుకి బదిలీ చేయాలని కోరేవారు– గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లకు పైగా పనిచేసిన ఉద్యోగులు– 40 శాతంకన్నా ఎక్కువ వైకల్యం గల ఉద్యోగులు– క్యాన్సర్, ఓపెన్ హార్ట్ ఆపరేషన్స్, న్యూరో సర్జరీ, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ మొదలైన దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా అటువంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్న స్టేషన్లకు బదిలీలు కోరుకునే ఉద్యోగులు (స్వయం లేదా జీవిత భాగస్వామి లేదా ఆధారపడిన పిల్లల వైద్యం కోసం)– భార్య, భర్త ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు అయితే, వారిద్దరినీ ఒకే స్టేషన్లో లేదా ఒకరికొకరు సమీపంలో ఉన్న స్టేషన్లలో ఉండేలా బదిలీకి ప్రయత్నించాలి.ఈ మార్గదర్శకాల ప్రకారం జరిగే అన్ని బదిలీలు, ప్రాధాన్య స్టేషన్ల ఎంపికను వినియోగించుకున్న ఉద్యోగుల బదిలీలను అభ్యర్థన బదిలీలుగా పరిగణిస్తారు. -
రమణా.. లోడ్ ఎత్తరా
ఇదేం ఖర్మరా బాబు.. ఎక్సైజోళ్ల బాధ పడలేకుంది. టార్గెట్.. టార్గెట్ అంటూ నిత్యం సంపుతున్నారు. మద్యం అమ్మితే నాలుగు డబ్బులు మిగిలేది మాకే కదా.. ఎంత అమ్మితే అంత వస్తుంది.. కానీ ఇప్పుడు వాళ్లకు సంపాదించి పెట్టాలట.. ఒక్కో షాప్నకు రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు అదనంగా మద్యం కొని అమ్మాలట. మాకేమైనా అదనంగా వస్తుందా అంటే అది లేదు. రూ.లక్ష మందు సమాను కొంటే రూ.15 వేలు పోతున్నాయి. ఏంటో మరి..! ..ఇది మహబూబ్నగర్ జిల్లాలోని ఓ వైన్స్ యజమాని ఆవేదన. అతను ఒక్కడే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణదారులందరి పరిస్థితి ఇదే.సాక్షి, హైదరాబాద్/సాక్షిప్రతినిధి, మహబూబ్నగర్, కరీంనగర్: ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం ప్రారంభంలోనే ఎక్సైజ్ అధికారులకు కష్టాలు వచి్చపడ్డాయి. ఈ ఏడాది జూలై మాసంలో మద్యం అమ్మకాల లక్ష్యాన్ని చేరేందుకు నెల చివరి రోజైన బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఎక్సైజ్ అధికారులు నానాతంటాలు పడ్డారు. ఈ నెల టార్గెట్ పూర్తి కాలేదని, పైఅధికారులు టార్గెట్ పెట్టారని, వీలున్నంత మేర స్టాక్ తీసుకెళ్లాలని వైన్షాప్ల యజమానులపై ఒత్తిడి తీసుకొచ్చారు. వాస్తవానికి, గత మూడు నెలలుగా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు రూ.3వేల కోట్లు మించి జరుగుతున్నాయి.జూన్ నెలలో రూ.3,175 కోట్లు దాటింది. కానీ, జూలై నెలలో ఈ అమ్మకాలు రూ.3వేల కోట్లలోపు ఉండడంతో ఎట్టి పరిస్థితుల్లో లక్ష్యం చేరాలన్న ఉన్నతాధికారుల ఆదేశాలతో స్థానికంగా ఉండే ఎక్సైజ్ అధికారులు రిటైలర్లపై ఒత్తిడి పెంచారు. గోదాముల్లో సరుకు రెడీగా ఉందని, ఈ నెలలో అమ్మకాల లక్ష్యం పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఒత్తిడి తెస్తున్నారని, ఎంతోకొంత సరుకు తీసుకెళ్లాలంటూ వైన్షాప్ యజమానులకు ఫోన్లు చేసినట్టు తెలిసింది.ఈ నేపథ్యంలో చేసేదేమీ లేని పరిస్థితుల్లో వైన్షాపుల యజమానులు అందుబాటులో ఉన్న నగదును బట్టి డీడీలు చెల్లించి గోదాముల నుంచి స్టాక్ తీసుకెళ్లారు. దీనిపై ఎక్సైజ్ అధికారులు మాట్లాడుతూ ప్రతిసారీ ఈ టార్గెట్లు ఉంటాయని, ఇప్పుడు ప్రభుత్వానికి నిధులు కూడా అవసరమైనందున ఉన్నతాధికారుల సూచన మేరకు సరుకు తీసుకెళ్లాలని వైన్షాపులను కోరామే తప్ప ఒత్తిడి తేలేదని, వీలునుబట్టి వైన్షాపుల నిర్వాహకులు సరుకు తీసుకెళ్లారే తప్ప...గొంతు మీద కత్తి పెట్టలేదని చెప్పడం గమనార్హం. తలపట్టుకుంటున్న వైన్స్ యజమానులు.. జనాభా ప్రాతిపదికన స్లాబ్ల ప్రకారం టెండర్ దక్కించుకున్నామని.. నిరీ్ణత కోటా అయిపోయిన తర్వాత తాము చెల్లించే మొత్తంలో సుమారు 15 శాతం నష్టపోవాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదాహరణకు ఓ ప్రాంతంలో రూ.50 లక్షల స్లాబ్తో టెండర్ దక్కించుకున్న వ్యాపారికి పది పర్యాయాల వరకు ఐఎంఎల్ డిపోలో కొనుగోలు చేసిన మద్యానికి ఎలాంటి అదనపు పన్ను ఉండదు. అంతకు మించి కొనుగోలు చేస్తే రూ.లక్షకు దాదాపు 15 శాతం అంటే రూ.15 వేలు అదనంగా పన్ను రూపంలో చెల్లించాలి. దీంతో పాటు అమ్మకాలు లేని సమయంలో కొనుగోలు చేయాల్సి రావడం భారంగా మారిందని.. మిత్తీలకే సరిపోని పరిస్థితి ఉందని మద్యం దుకాణాల యజమానులు వాపోతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇలా... ఉమ్మడి కరీంనగర్ పరిధిలో కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలు ఉన్నాయి. తాజాగా ఎక్సైజ్ అధికారులు నాలుగు జిల్లాల్లోని వైన్షాపులకు ఒక్కసారిగా సేల్స్ పెంచాలని టార్గెట్ విధించారు. ⇒ కరీంనగర్తో సహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ ప్రతీ వైన్షాపునకు రూ.30 లక్షల టార్గెట్ విధించారు. ‘‘మీరు అమ్ముకోండి.. లేదా స్టాక్ మీతోపాటే ఉంచుకోండి.. అవేమీ మాకు చెప్పొద్దు. కానీ, తప్పకుండా ప్రతీషాప్ రూ.30 లక్షల స్టాక్ కొనుగోలు చేయాల్సిందేనని’షరతు పెట్టారు. దీంతో గత్యంతరం లేక కేసులు పెడతారేమోననే భయంతో రూ.30లక్షల స్టాక్ కొనేందుకు సిద్ధమవుతున్నారు. ⇒ సిరిసిల్ల జిల్లాలో రూ.30 లక్షల సరుకు తాము కొనలేమని మెజారిటీ వైన్షాపుల నిర్వాహకులు చేతులు ఎత్తేయడంతో కనీసం గత ఏడాది విక్రయాలను చేరుకోవాలని మినహాయింపు ఇచ్చారు. ⇒ జగిత్యాల జిల్లాలోనూ వ్యాపారులు తాము రూ.30 లక్షలు చేయలేమని అనడంతో గతేడాది విక్రయాలతో 5–10 శాతం అదనంగా విక్రయించాలని టార్గెట్ పెట్టడంతో అంతా ఓకే అన్నారని సమాచారం. ⇒ పెద్దపల్లి జిల్లాలో రూ.30 లక్షలు స్టాకు కొనలేమని వ్యాపారులు చెప్పడంతో చివరికి గతేడాది విక్రయాల మీద 30 శాతం అదనంగా విక్రయించాల్సిందేని షరతు పెట్టడంతో వ్యాపారులు సమ్మతించారని తెలిసింది. ⇒ దీంతో ప్రతీ వైన్షాపు నిర్వాహకుడు రూ.లక్షలాదిగా దొరికిన చోటల్లా అధిక వడ్డీలకు అప్పులు చేస్తూ టార్గెట్ రీచ్ అయ్యేందుకు నానాతంటాలు పడుతున్నారు. -
మందు‘బాబు’ దందానే!
సాక్షి, అమరావతి: శాసనసభ సాక్షిగా ‘పచ్చ’ దయ్యాలు వేదాలు వల్లించాయి! మద్యం సిండికేట్ను గుప్పిట్లో పెట్టుకుని గతంలో ఐదేళ్లూ యథేచ్ఛగా దోపిడీకి పాల్పడ్డ చంద్రబాబు బృందం నీతు లు వల్లిస్తోంది! ఎన్నికల హామీలను అమలు చేయలేక సాకులు అన్వేషిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాల నాటకంలో బుధవారం మరో అంకానికి తెర తీశారు. ఎక్సైజ్ శాఖపై శ్వేతపత్రం పేరుతో అవాస్తవాలు, అభూత కల్పనలు జోడించి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందుకు యత్నించారు. కానీ 2014–19 మధ్య టీడీపీ హయాంలో ఏకంగా రూ.12.50 లక్షల కోట్లు కొల్లగొట్టిన టీడీపీ నేతల మద్యం దోపిడీ బహిరంగ రహస్యమే. ఎన్నికల మేనిఫెస్టోకు కట్టుబడి వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019–24 వరకు దశలవారీ మద్య నియంత్రణ విధానాన్ని సమర్థంగా అమలు చేయడంతో విక్రయాలు తగ్గాయని ఎక్సైజ్ శాఖ గణాంకాలు, కేంద్ర ప్రభుత్వ నివేదికలే వెల్లడిస్తున్నాయి.చంద్రబాబు ఆరోపణ: మేం పారదర్శకంగా మద్యం విధానాన్ని అమలు చేస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వం మద్యం దందాకు పాల్పడింది.నిజం ఇదీ: టీడీపీ సిండికేట్ మద్యం దోపిడీకి నిదర్శనాలివిగో..– 2014–19 మధ్య టీడీపీ మద్యం సిండికేట్ చెలరేగడంతో పర్మిట్ రూమ్లు, బెల్ట్ దుకాణాలతో మద్యం ఏరులై పారింది. – ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 వరకు జోరుగా విక్రయాలు. అనధికారికంగా 24 గంటలూ దందా.– 4,380 మద్యం దుకాణాలకు అనుబంధంగా అంతే సంఖ్యలో పర్మిట్ రూమ్లకు అనుమతి. వీటికి తోడు 43 వేలకు పైగా బెల్ట్ దుకాణాలు. – ఎమ్మార్పీ కంటే 25 శాతం అధిక ధరలకు అమ్మకాలు. – ఏటా బార్ల సంఖ్య పెంపు.– జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్) నివేదిక ప్రకారం 2015–16లో ఏపీలో 34.9 శాతం మంది పురుషులకు, 0.4 శాతం మంది మహిళలకు మద్యం అలవాటు ఉంది.పచ్చ సిండికేట్ దోపిడీ రూ.12.50 లక్షల కోట్లుమద్యం దందాను వ్యవస్థీకృతం చేసి రూ.12.50 లక్షల కోట్ల దోపిడీకి పాల్పడ్డ చరిత్ర చంద్రబాబు సర్కారుదే. 2014 నుంచి 2019 వరకు మద్యం సిండికేట్ను టీడీపీ నేతలు తమ గుప్పిట్లో ఉంచుకుని బడి, గుడి అనే విచక్షణ లేకుండా విచ్చలవిడిగా మద్యం దుకాణాలకు అనుమతులిచ్చేశారు. పర్మిట్ రూమ్ల పేరుతో అనధికారిక బార్లను తెరిచేసి మరో 43 వేల బెల్ట్ దుకాణాలను నెలకొల్పి ఏరులై పారించారు. ఎంఆర్పీ కంటే రూ.10 నుంచి రూ.25 వరకు అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. ఏడాదికి రూ.2.50 లక్షల కోట్ల చొప్పున ఐదేళ్లలో ఏకంగా రూ.12.50 లక్షల కోట్లు కొల్లగొట్టారు.చంద్రబాబు ఆరోపణ : ఊరూ పేరూ లేని బ్రాండ్లు తెచ్చారు..నిజం: అవన్నీ మీరు తెచ్చిన బ్రాండ్లే చంద్రబాబూ!– ప్రెసిడెంట్ మెడల్, హైదరాబాద్ బ్లూ డీలక్స్ బ్రాండ్ల విస్కీకి చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 2017 నవంబరు 22న అనుమతి ఇచ్చారు.– గవర్నర్ రిజర్వ్, లెఫైర్ నెపోలియన్, ఓక్టోన్ బారెల్ ఏజ్డ్, సెవెన్త్ హెవెన్ బ్లూ బ్రాండ్ల పేరుతో విస్కీ, బ్రాందీ తదితర 15 బ్రాండ్లకూ టీడీపీ సర్కారే 2018 అక్టోబరు 26న ఒకేసారి అనుమతులిచ్చింది. – హైవోల్టేజ్, వోల్టేజ్ గోల్డ్, ఎస్ఎన్జీ 10000, బ్రిటీష్ ఎంపైర్ సూపర్ స్ట్రాంగ్ ప్రీమియం బీర్, బ్రిటీష్ ఎంపైర్ అల్ట్రా బ్రాండ్లతో బీరు విక్రయాలు సైతం బాబు సర్కారు నిర్వాకాలే.ఆ బ్రాండ్లకు టీడీపీ ప్రభుత్వం 2017 జూన్ 7న అనుమతి జారీచేసింది.– రాయల్ ప్యాలెస్, న్యూకింగ్, సైన్ అవుట్ పేర్లతో విస్కీ, బ్రాందీ బ్రాండ్లకూ చంద్రబాబే 2018 నవంబరు 9న అనుమతిచ్చారు.– బిరా –91 పేరుతో మూడు రకాల బీర్ బ్రాండ్లకు 2019 మే 14న చంద్రబాబు ప్రభుత్వమే అనుమతి ఇచ్చింది. అప్పటికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇంకా అధికారం చేపట్టలేదు. – ఆ మర్నాడే టీఐ మ్యాన్షన్ హౌస్, టీఐ కొరియర్ నెపోలియన్ విస్కీ, బ్రాందీ బ్రాండ్లకూ టీడీపీ సర్కారే అనుమతినిచ్చిందన్నది నిఖార్సైన నిజం!చంద్రబాబు ఆరోపణ: డిస్టిలరీలన్నీ లాక్కున్నారు..నిజం: ఆ డిస్టిలరీలన్నీ మీరు అనుమతిచ్చినవే... మీ వాళ్లవే చంద్రబాబూ!!రాష్ట్రంలో 20 మద్యం డిస్టిలరీలు ఉంటే వాటిలో 14 డిస్టిలరీలకు చంద్రబాబు సీఎంగా ఉండగానే అనుమతినిచ్చారు. మిగిలిన 6 డిస్టిలరీలకు అంతకుముందు ప్రభుత్వాలు అనుమతినిచ్చాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కొత్తగా ఒక్క డిస్టిలరీకీ అనుమతి ఇవ్వలేదు.మద్యం తయారీ డిస్టిలరీలన్నీ చంద్రబాబు అనుయాయుల గుప్పిట్లోనే ఉన్నాయన్నది నిజం. ఆ డిస్టిలరీలకు అనుమతులు ఇచ్చిందీ కూడా గతంలో టీడీపీ ప్రభుత్వమే. ఆ డిస్టిలరీలు తయారు చేసిన మద్యాన్నే గతంలో టీడీపీ హయాంలో విక్రయించారు. అనంతరం వైఎస్సార్సీపీ హయాంలోనూ అదే మద్యాన్నే విక్రయించారు. మరి అందులో వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొత్తగా చేసిన అక్రమం ఏముందీ? టీడీపీ అధికారంలో ఉంటే మద్యం నాణ్యమైనదని.. లేదంటే నాసిరకమని దుష్ప్రచారం చేయడం చంద్రబాబు బృందానికి, పచ్చ మీడియాకే చెల్లింది.పచ్చ ముఠాదే మద్యం దందా..రాష్ట్రంలోని డిస్టిలరీలన్నీ దాదాపుగా టీడీపీ కీలక నేతల కుటుంబాల చేతుల్లోనే ఉన్నాయి. పీఎంకే డిస్టిలరీ టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడి అల్లుడు, టీడీపీ ఎమ్మెల్యే పుట్టా మధుసూదన్ యాదవ్ కుమారుడు, ప్రస్తుతం ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్కుమార్ది. – శ్రీకృష్ణ ఎంటర్ప్రైజెస్ టీడీపీ మాజీ ఎంపీ దివంగత డీకే ఆదికేశవులనాయుడు కుటుంబానిది. – ఎస్పీవై ఆగ్రో ప్రొడక్టŠస్ టీడీపీ నేత, మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి కుటుంబానిది. వైఎస్సార్సీపీ తరపున ఎంపీగా గెలిచిన ఎస్పీవై రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా టీడీపీలోకి ఫిరాయించినందుకు నజరానాగా ఆ డిస్టిలరీకి నాడు చంద్రబాబు అనుమతిచ్చారు. – గత ఎన్నికలకు ముందు ఆగమేఘాల మీద 2019 ఫిబ్రవరి 25న అనుమతినిచ్చిన విశాఖ డిస్టిలరీస్లో అప్పటి మంత్రి, ప్రస్తుత స్పీకర్ అయ్యన్నపాత్రుడు వాటాదారుగా ఉన్నారు.చంద్రబాబు ఆరోపణ: మేనిఫెస్టోలో హామీని వైఎస్సార్సీపీ ఉల్లంఘించింది..నిజం: దశలవారీ మద్య నియంత్రణను వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమర్థంగా అమలు చేసింది. 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో మద్యం దందాపై ఉక్కు పాదం మోపింది. ప్రైవేట్ మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసి 2019 అక్టోబరు 1 నుంచి మద్యం దుకాణాలను ప్రభుత్వపరం చేశారు. టీడీపీ హయాంలో 4,380 మద్యం దుకాణాలు ఉండగా వైఎస్ జగన్ ప్రభుత్వం వాటిని 2,934కి తగ్గించింది. మద్యం దుకాణాల వేళలను కుదిస్తూ ఉ.10 నుంచి రాత్రి 9 వరకే పరిమితంగా విక్రయాలకు అనుమతించారు. 4,380 పర్మిట్ రూమ్లు రద్దు చేశారు. 43 వేల బెల్ట్ దుకాణాలను పూర్తిగా తొలగించారు. కొత్త బార్లకు లైసెన్సులు ఇవ్వలేదు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి కట్టుబడుతూ మద్యం వినియోగాన్ని నిరుత్సాహపరిచేందుకు షాక్ కొట్టేలా ధరలు పెంచారు. అక్రమ మద్యాన్ని అరికట్టేందుకు ‘స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలనిచ్చాయి. టీడీపీ హయాంతో పోలిస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విక్రయాలు సగానికి పడిపోయాయి.ఏపీలో మద్యం వినియోగం తగ్గింది– కేంద్ర ప్రభుత్వ నివేదికవైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్లో మద్యం వినియోగం తగ్గిందని కేంద్ర ప్రభుత్వమే వెల్లడించడం గమనార్హం. మద్యం అలవాటు 2015–16లో పురుషుల్లో 34.9 శాతం, మహిళల్లో 0.4 శాతం ఉంది. 2019–21 మధ్య పురుషుల్లో ఈ అలవాటు 31.2 శాతానికి, మహిళల్లో 0.2 శాతానికి తగ్గినట్లు పార్లమెంట్కు సమర్పించిన నివేదికలో కేంద్ర హోంశాఖ వెల్లడించింది.చంద్రబాబు ఆరోపణ: నాణ్యత లేని మద్యంతో వినియోగదారుల ఆరోగ్యం దెబ్బతింది.నిజం: వైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్రంలో మద్యం నాణ్యతపై టీడీపీ గత ఐదేళ్లూ పదేపదే సాగించిన దుష్ప్రచారం బెడిసికొట్టింది. నాడు మద్యంలో విషపు అవశేషాలు ఉన్నట్లు చెన్నైలోని ఎస్జీఎస్ లేబొరేటరీ పేరిట ఓ తప్పుడు నివేదికను టీడీపీ ప్రచారంలోకి తెచ్చింది. అయితే అలాంటి నివేదికేదీ తాము ఇవ్వలేదని ఆ సంస్థ స్పష్టం చేసింది. తాము పరీక్షించిన మద్యం నమూనాల్లో అవశేషాలు పరిమితికి లోబడే ఉన్నాయని, అవి ప్రమాదకరం కాని సహజ సిద్ధమైన మొక్కల నుంచి తయారైనవేనని ఆ లేబొరేటరీ ప్రకటించింది. తమ నివేదికను తప్పుగా అన్వయించారని పేర్కొంది. అయినప్పటికీ రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్ మద్యం నమూనాలను హైదరాబాద్లోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్)కు చెందిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ల్యాబ్లో పరీక్షించింది. ఆ నమూనాలన్నీ నిర్దేశిత ప్రమాణాల ప్రకారమే ఉన్నాయని నివేదిక ఇచ్చింది.– 2014–19 మధ్య టీడీపీ హయాంలో మద్యం నాణ్యత పరీక్షలు తూతూ మంత్రంగా నిర్వహించారు. ఆ ఐదేళ్లలో 96,614 శాంపిల్స్ మాత్రమే సేకరించి పరీక్షించారు. వైఎస్సార్సీపీ హయాంలో మద్యం నాణ్యత పరీక్షల కోసం బెవరేజస్ కార్పొరేషన్ రూ.12.5 కోట్లతో అత్యాధునిక లేబరేటరీలను ఏర్పాటు చేసింది. సగటున ఏడాదికి 1,26,083 శాంపిల్స్ను పరీక్షించారు.రాష్ట్రంలో మద్యం డిస్టిలరీలకు ఎప్పుడెప్పుడు అనుమతులు ఇచ్చారంటే...1. కాంటినెంటల్ వైన్స్, ఆటోనగర్, విజయవాడ, 1971, ఆగస్టు 92. బీఆర్కే స్పిరిట్స్, కంకిపాడు, కృష్ణాజిల్లా, 1998, సెప్టెంబరు 153. పెర్ల్ డిస్టిలరీ లిమిటెడ్, సింగరాయకొండ, ప్రకాశం జిల్లా, 1997, ఆగస్టు 144. సోరింగ్ స్పిరిట్స్ ప్రైవేట్ లిమిటెడ్, చేబ్రోలు, తూ.గోదావరి జిల్లా, 2007, నవంబరు 75. సెంటిని బయో ప్రొడక్టŠస్ ప్రైవేట్ లిమిటెడ్, గండేపల్లి, కృష్ణాజిల్లా 2010, జూన్ 96. బీవీఎస్ డిస్టిలరీస్, కంకిపాడు, కృష్ణాజిల్లా, 2017, జనవరి 27. శ్రావణి ఆల్కో బ్రూ ప్రైవేట్ లిమిటెడ్, గంపలగూడెం, కృష్ణాజిల్లా, 2017, సెప్టెంబరు 298. గౌతమి ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్, వంగూరు, ప.గోదావరి జిల్లా, 1997, నవంబరు 179. జీఎస్బీ అండ్ కో, కశింకోట, విశాఖపట్నం జిల్లా, 200810. బీడీహెచ్ ఆగ్రో వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, కొప్పరం, తూ.గోదావరి జిల్లా, 2017, ఆగస్టు 2511. విశాఖ డిస్టిలరీస్, కశింకోట, విశాఖపట్నం జిల్లా, 2019, ఫిబ్రవరి 2512. పీఎంకే డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, కశింకోట, విశాఖపట్నం జిల్లా, 2017, అక్టోబరు 2313. ఈగిల్ డిస్టిలరీస్, తాడిగొట్ల, కడప, 1974, అక్టోబరు14. ఎస్వీఆర్ డిస్టిలరీస్, తిరుపతి, 198215. శ్రీకృష్ణా ఎంటర్ప్రైజెస్, తిమ్మ సముద్రం, చిత్తూరు జిల్లా, 1998, జులై16. ఎస్ఎన్జే సుగర్స్, ప్రొడక్ట్స్, వెంకటాచలం, నెల్లూరు జిల్లా, 2018, మే17. మోహన్ బెవరేజస్ అండ్ డిస్టిలరీస్ లిమిటెడ్, పల్లూరు, చిత్తూరు జిల్లా, 197818. ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్, నంద్యాల, కర్నూలు జిల్లా, 2016, సెప్టెంబరు19. ఖోడేస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, కుప్పం, చిత్తూరు జిల్లా, 197020. ప్రాగ్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, నల్లమిల్లి, తూ.గోదావరి జిల్లా, 1997, మార్చి 31. -
బేవరేజెస్ కార్పొరేషన్ సొంత నిర్ణయాలతో ప్రభుత్వానికి చెడ్డపేరు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ తప్పుడు నిర్ణయాలతో ప్రభుత్వానికి, ఎక్సైజ్శాఖకు చెడ్డపేరు వస్తోందని, కీలక పదవుల్లోని వారు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎౖMð్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకోవాలే తప్ప.. సొంత నిర్ణయాలు తీసుకోరాదని స్పష్టం చేశారు. మంగళవారం నాంపల్లిలోని ఎక్సైజ్శాఖ కార్యాలయంలో ఆయన ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.మద్యం కంపెనీల అనుమతుల వ్యవహారం ప్రభుత్వం దృష్టికి తీసుకొని రాకుండా బేవరేజెస్ కార్పొరేషన్ సొంతంగా విధివిధానాలు ఎలా ఖరారు చేస్తుందని మంత్రి అధికారులపై మండిపడ్డారు. తనశాఖలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఆయన తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి నిర్ణయాలతో శాఖ ప్రతిష్ట దెబ్బతినడమేకాక, ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయని వ్యాఖ్యానించారు. అనుమతుల అంశంపై సంజాయిషీ ఇవ్వాలని, విచారణ జరిపి సమగ్ర నివేదిక సమరి్పంచాలని ఎక్సైజ్శాఖ కమిషనర్, ఎండీ శ్రీధర్, బేవరేజెస్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ అబ్రహంను మంత్రి జూపల్లి ఆదేశించారు. నివేదిక ఆధారంగా కఠినచర్యలు ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మాదక ద్రవ్యాలు, అక్రమ మద్యం, కల్తీ కల్లు, గుడుంబా, గంజాయి సరఫరా, అమ్మకాలపై నిరంతర నిఘాపెట్టాలని, ఉక్కుపాదంతో డ్రగ్స్ మాఫియాను అణవేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇప్పటికే పలు సందర్భాల్లో మాదక ద్రవ్యాలు సరఫరా చేసేవారి వెన్నులో వణుకు పుట్టించేలా చర్యలు ఉండాలని ఆదేశించిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. తయారీ, సరఫరా, విక్రేతలు, సప్లయ్ నెట్వర్క్ వారి డేటాబేస్ తయారు చేయాలని, తరచూ ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపాలన్నారు. యాంటీ నార్కోటిక్ బ్యూరో, పోలీసు శాఖ సమన్వయంతో ఎక్సైజ్శాఖ అధికారులు పని చేయాలని తెలిపారు.మాదక ద్రవ్యాలను అరికట్టడమేకాక.. వాటితో కలిగే నష్టాలపై సమాజంలో అవగాహన కలి్పంచేందుకు మీడియా, సోషల్ మీడియా, థియేటర్లలో ఆడియో, వీడియో రూపంలో విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, అధ్యాపకులతో సమావేశాలు నిర్వహించి, వారిలో చైతన్యం తీసుకురావాలన్నా రు. ఈ సమావేశంలో ఎక్సైజ్శాఖ కమిషనర్, ఎండీ ఇ.శ్రీధర్, అడిషనల్ కమిషనర్ అజయ్రావు, బేవరేజెస్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ అబ్రహం, ఉమ్మడి జిల్లాల డిప్యూటీ కమిషనర్లు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పాల్గొన్నారు. -
Beer Companies: హడావుడిగా అనుమతి.. వెంటనే నిలిపివేత
సాక్షి, హైదరాబాద్: బీర్ల తయారీ కంపెనీలకు, సర్కారుకు మధ్య వారధిగా ఉండి ఎలాంటి సమస్య రాకుండా చూడాల్సిన ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు ప్రతిష్టకు పోయి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకువచ్చారనే చర్చ జరుగుతోంది. బీర్ల తయారీ కోసం రాష్ట్రంలో అనుమతి పొందిన పాత కంపెనీలతో సమన్వయం చేసుకోకుండా.. కొత్త కంపెనీలకు అనుమతులిచ్చి, ఆ తర్వాత సదరు అనుమతులను నిలిపివేసిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అధికారుల తీరుతో రాష్ట్రంలో బీర్ల కొరత ఏర్పడే పరిస్థితి తలెత్తింది. అన్ని డిపోల్లో కలిపి కనీసం 15 రోజుల స్టాక్ ఉండాల్సి ఉండగా, కేవలం రెండున్నర రోజులకు సరిపడా మాత్రమే నిల్వ ఉండడం గమనార్హం. పాత బకాయిలే తలనొప్పి బీర్లు, మద్యం తయారీ కంపెనీలు బేవరేజెస్ కార్పొరేషన్కు మద్యం ఇచ్చిన తర్వాత వాటిని డిపోల ద్వారా రిటైలర్లకు అమ్మిన 45 రోజుల్లోగా సదరు తయారీ కంపెనీలకు బేసిక్ ప్రైస్, ఎక్సైజ్ డ్యూటీలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ నిధులు సరిగా చెల్లించకపోవడంతో బకాయిలు రూ.1,500 కోట్లకు చేరాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తయారీ కంపెనీలకు ఇవ్వాల్సిన నిధులను ప్రతి నెలా చెల్లిస్తోంది. కానీ పాత బకాయిలను మాత్రం ఇవ్వడం లేదు. దీంతో సదరు కంపెనీలు తమకు పాత బకాయిలు ఇప్పించాలని, లేదంటే బీర్లు సరఫరా చేయలేమని ఎక్సైజ్ శాఖపై ఒత్తిడి పెంచారు. వేసవిలో సీజన్ కావడంతో బీర్లు తయారు చేసే బ్రెవరీలతో సమన్వయంతో వ్యవహరించి బీర్లను అందుబాటులోకి తేవాల్సిన ఎక్సైజ్ ఉన్నతాధికారులు రూటు మార్చారు. పాత కంపెనీలను కాదని, గుట్టుచప్పుడు కాకుండా సోమ్ సహా ఐదు కొత్త బ్రెవరీలకు అనుమతినిచ్చారు. అయితే ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో కొత్త బ్రెవరీలకు బ్రేక్ వేస్తూ ఆదేశాలు జారీ చేశారు. బేర్ మంటున్న బీర్ స్టాక్ ఎక్సైజ్ అధికారుల నిర్వాకంతో రాష్ట్రంలో బీర్లకు కొరత ఏర్పడేలా ఉంది. రాష్ట్రంలో యూబీ (2 యూనిట్లు), అన్హైజర్ బుష్ (ఏబీ–2 యూనిట్లు), కారŠల్స్బర్గ్, లీలాసన్స్ కంపెనీలు అనుమతులు పొంది బీర్లు తయారు చేస్తున్నాయి. రాష్ట్రంలో విక్రయించే బీర్లలో సింహభాగం యూబీ, ఏబీ కంపెనీలు తయారు చేసేవే. కాగా ఈ కంపెనీలకు ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు ఇప్పించడం లేదా సదరు కంపెనీలతో సమన్వయం చేసుకుని అవసరమైన మేరకు బీర్లను తయారు చేయించడం ఎక్సైజ్ ఉన్నతాధికారుల విధి. కానీ అలా చేయకుండా కొత్త బ్రెవరీలకు అనుమతినివ్వడం, మళ్లీ నిలిపివేయడంతో బీర్ల కొరత ఏర్పడింది. ప్రస్తుతం వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో రోజుకు 1.25 లక్షల కేసుల బీర్లు అవసరమవుతాయని అంచనా. కానీ ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని డిపోల్లో కలిపి 3 లక్షల కేసులు మాత్రమే స్టాక్ ఉందని తెలుస్తోంది. కాగా కొత్త బ్రెవరీల పేరుతో అనుమతులిచి్చన ఐదు కంపెనీల్లో మధ్యప్రదేశ్కు చెందిన సోమ్ బ్రెవరీస్ వుడ్ పెక్కర్, హంటర్తో పాటు మరో బ్రాండ్ తయారు చేస్తుందని, మిగిలినవి కర్జూరా బీర్లతో పాటు బిర్యానీ అనే బ్రాండ్ ఉత్పత్తి చేస్తాయని సమాచారం. కాగా కొత్తగా అనుమతినిచి్చన కంపెనీల్లో ఒక్కటి కూడా రాష్ట్రంలో ఎక్కువ మంది వినియోగించే బీర్లు తయారు చేసేవి కాకపోవడం గమనార్హం. -
కొత్త మద్యం బ్రాండ్లపై నిర్ణయం నాది కాదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త మద్యం బ్రాండ్ల అమ్మకాలకు సంబంధించి తాను ఎలాంటి అను మతులు ఇవ్వలేదని, తన వద్దకు ఎలాంటి దర ఖాస్తులు రాలేదని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. గతంలో చెప్పిన మాటలకు తాను కట్టుబడి ఉన్నానని, అనుమతులు బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ తీసుకున్న నిర్ణయమేనని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొత్త మద్యం బ్రాండ్లను ఎక్సైజ్ శాఖ అనుమతించిందని జరుగుతున్న ప్రచారం తప్పని, రాష్ట్రంలో మద్యానికి సంబంధించిన అన్ని నిర్ణయాలు తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారానే జరుగుతాయని పేర్కొన్నారు. ఈ వాస్తవాలను రూఢీ చేసుకోకుండా పత్రికలు తప్పుగా ప్రచురించాయని చెప్పారు. రాష్ట్రంలోని ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (ఐఎంఎఫ్ఎల్) లావాదేవీలన్నీ బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా జరుగుతాయని తెలిపారు. దీనికి టీజీబీసీఎల్ ఎండీ/ఎక్సైజ్ కమిషనర్ నేతృత్వం వహిస్తారన్నారు. రాష్ట్రంలో గత ఆరువారాలుగా వివిధ కారణాల వల్ల బీర్ల కొరత ఉందని, బీర్ల వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రజల ఇబ్బందులను పరిష్కరించడానికి బీసీఎల్ ఎండీ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సోమ్ డిస్టిలరీస్ రాష్ట్రానికి బీర్లు సరఫరా చేసే ఆఫర్పై ప్రతిస్పందించారని తెలిపారు. కొత్తగా ఐదు సంస్థలకు బేవరేజెస్ కార్పొరేషన్ అనుమతులు మంజూరు చేసినట్లు తెలిసింది. -
మద్యం ప్రియులకు దొరకని బీర్లు
మెదక్: టెండల్లో బుసబుస పొంగే చల్లని బీరు తాగి ఉపశమనం పొందాలనుకునే మందుబాబులకుకష్టకాలమొచ్చింది. వైన్ షాపుల్లో బ్రాండెడ్ బీర్లు దొరకని పరిస్థితి నెలకొంది. మద్యం డిపోలు ప్రధాన బ్రాండ్ల బీర్లపై రేషన్ విధించడంతో అటు వైన్షాప్ యజమానులు.. ఇటు కొనుగోలు దార్లు నిరుత్సాహానికి గురవుతున్నారు. దీంతో మద్యం ప్రియులు దొరికిన దానితోనే సరి పెట్టుకుంటున్నారు. ఒక్కో షాపునకు ఇండెక్స్ ఆధారంగా 20 నుంచి 25 కేసులు ఇస్తుండగా.. ఇది ఒక రోజుకు కూడా సరిపోదని మద్యం వ్యాపారులు పెదవి విరుస్తున్నారు. జిల్లాలో మెదక్, రామాయంపేట, నర్సాపూర్లో ఎక్సైజ్ స్టేషన్లు ఉన్నాయి. వీటి పరిధిలో 49 వైన్ షాపులు, ఐదు బార్లు ఉన్నాయి. ఈయేడు ఎక్సైజ్ సంవత్సరం డిసెంబర్లో ప్రారంభమైంది. అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో కొంత మేర మద్యం అమ్మకాలు పెరిగాయి. గతేడాది డిసెంబర్ నుంచి మార్చి వరకు రూ.194.68 కోట్ల మద్యం విక్రయాలు జరుగగా, ఈసారి నాలుగు నెలల కాలంలో రూ.206.71 కోట్ల విక్రయాలు జరిగాయి. మందు బాబుల పరేషాన్.. వేసవి ఎండలు ముదరడంతో మద్యం ప్రియులు ఎక్కువగా బీర్లు తాగడానికి మొగ్గు చూపుతున్నారు. కానీ ప్రస్తుతం నీటి కొరత, బీర్ల ఉత్పత్తి షరతులు తదితర కారణాల వల్ల బీర్ల కొరత ఏర్పడింది. అలాగే బీరు కాలపరిమితి 6 నెలలు ఉండటంతో ఎక్కువ కాలం నిల్వ ఉంచలేని పరిస్థితి. గతేడాది నాలుగు నెలల కాలంలో 2,68,763 కేసులు అమ్మగా, ఈయేడు మార్చి 31 వరకు 2,96,977 కేసులు అమ్ముడయ్యాయి. ప్రస్తుతం సాధారణ బ్రాండ్లు లభిస్తున్నప్పటికీ వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే బ్రాండ్లు దొరకడం లేదు. దీంతో ఇండెక్స్కు అనుగుణంగా 20 నుంచి 25 కేసులు లభ్యతను బట్టి ఇస్తున్నారు. అలాగే సామాన్యుడికి అందుబాటు ధర కలిగి, నిత్యం ఎక్కువగా అమ్ముడు పోయే ఓ బ్రాండ్ లిక్కర్ కొరత కారణంగా దానికి కూడా రేషన్ విధించినట్లు మద్యం వ్యాపారులు తెలిపారు. పెరిగిన 10.50 శాతం ఎక్సైజ్ స్టేషన్ల వారీగా మద్యం అమ్మకాలు చూస్తే గతేడాది నాలుగు నెలలు (డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి) నర్సాపూర్లో రూ.7,172.2 లక్షలు విక్రయాలు జరుగగా ఈసారి నాలుగు నెలలు రూ.7,888.2 లక్షలు, మెదక్లో గతేడాది రూ.6,847.6 లక్షలు ఉండగా, ఈసారి రూ.6,902.4 లక్షలు, రామాయంపేటలో గతేడాది రూ.5,447.9 లక్షలు కాగా, ఈసారి రూ.5,880.2 లక్షలు విక్రయించాయి. మొత్తం మీద గతేడాది నాలుగు నెలలతో పోలిస్తే ఈసారి జిల్లా వ్యాప్తంగా 6.18 శాతం మద్యం విక్రయాలు వృద్ధి చెందాయి. అలాగే గతేడాది బీర్లతో పోలీస్తే ఈ నాలుగు నెలల్లోనే బీర్ల వినియోగం 10.50 శాతం పెరిగింది. ప్రతీయేటా వేసవి కాలంలో బీరు సరఫరాలో కొరత ఏర్పడుతుంది. డిమాండ్ కనుగుణంగా సరఫరా లేక పోవడంతో ప్రధాన బ్రాండ్లపై రేషన్ విధిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. -
‘టానిక్’ వెనుక కీలక వ్యక్తులు ఎవరు?.. వెలుగులోకి సంచలనాలు
సాక్షి, హైదరాబాద్: నగరంతో పాటు శివారుల్లో టానిక్ వైన్ మార్ట్ పేరిట జరిగిన భారీ అక్రమాలు బయటపడుతున్నాయి. సోదాల్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టానిక్ ఎలైట్ వైన్ షాపుల్లో 6 ఏళ్లలో వందల కోట్ల అమ్మకాలు జరిపినట్టు గుర్తించారు. మిగతా 10 క్యూ బై టానిక్ వైన్ షాప్స్ లెక్కలపై జీఎస్టీ, ఎక్సైజ్ అధికారులు ఆరా తీస్తున్నారు. టానిక్ ఎలైట్ వైన్ షాప్ కోసం 2016లో గత ప్రభుత్వ స్పెషల్ సెక్రెటరీ జీవో జారీ చేశారు. జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్ చిరునామాతో అమిత్ రాజ్ లక్ష్మారెడ్డి పేరుతో టానిక్ ఎలైట్ షాప్ లైసెన్స్ జారీ అయ్యింది. టానిక్ ఎలైట్ వైన్ షాప్కి ఇచ్చిన మినహాయింపులపై ఎక్సైజ్ శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. టానిక్ ఎలైట్ వైన్ షాప్కు భారీ మినహాయింపులు ఇచ్చినట్లు తెలిసింది. 2016 నుండి 2019వరకు అన్ లిమిటెడ్ లిక్కర్ విక్రయాలకు టానిక్కు అనుమతి లభించగా, ఐదేళ్లకు ఒకసారి షాప్ రెన్యూవల్ చేసుకొనేలా వెసులుబాటు కల్పించారు. ఇతర షాపుల కంటే టానిక్కు ఐదు లక్షలు మాత్రమే అదనంగా యానివల్ ఫీజు నిర్ణయించారు. టానిక్ ఎలైట్ వైన్ షాప్ల వెనుక ఉన్న కీలక వ్యక్తుల ఎవరనేదానిపై అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. పూర్తి దర్యాప్తు అనంతరం చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ తెలిపింది. సులువుగా అనుమతులు పొందడం మొదలు.. నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు జరపడం, ట్యాక్సులు ఎగ్గొట్టడం దాకా.. ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో వంద కోట్ల రూపాయల ట్యాక్స్ ఎగ్గొట్టినట్లు తేలగా.. ఇందుకు గత ప్రభుత్వ హయాంలోని కొందరు అధికారులు పూర్తి సహకారం అందించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇదీ చదవండి: టానిక్ మోసాలు.. 100 కోట్ల ట్యాక్స్ ఎగవేత! -
టానిక్ మోసాలు.. 100 కోట్ల ట్యాక్స్ ఎగవేత!
హైదరాబాద్, సాక్షి: నగరంతో పాటు శివారుల్లో టానిక్ వైన్ మార్ట్ పేరిట జరిగిన భారీ అక్రమాలు బయటపడుతున్నాయి. సులువుగా అనుమతులు పొందడం మొదలు.. నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు జరపడం, ట్యాక్సులు ఎగ్గొట్టడం దాకా.. ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో వంద కోట్ల రూపాయల ట్యాక్స్ ఎగ్గొట్టినట్లు తేలగా.. ఇందుకు గత ప్రభుత్వ హయాంలోని కొందరు అధికారులు పూర్తి సహకారం అందించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఎలైట్ లిక్కర్ మార్ట్ కోసం పర్మినెంట్ లైసెన్స్ను 2016లో ప్రత్యేక జీవో 271ను పేరిట జారీ చేసింది గత ప్రభుత్వం. ఈ జీవో ప్రకారం ప్రతీ ఐదు సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. అలాగే.. మొదటి మూడు సంవత్సరాలు లిక్కర్ అదనపు అమ్మకాలపై ఎలాంటి ప్రివిలేజ్ ఫీజ్ చెల్లిచకుండా వెసులుబాటు కల్పించారు. ఇదిలా ఉంటే.. ఎలైట్ వైన్ షాపు కోసం 2016లో ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే.. టానిక్ బేవరేజెస్ మాత్రమే టెండర్ కోట్ చేసింది. దీంతో.. టానిక్ కు ఎలైట్ వైన్ షాప్ పర్మినెంట్ అనుమతి సులువైంది. అయితే.. తెలంగాణ లో ఒక్క ఎలైట్ ఔట్ లెట్కు మాత్రమే అనుమతి ఇవ్వగా.. హైదరాబాదు, నగర శివారుల్లో మరో 10 ఎలైట్ వైన్ షాపులను ‘Q By టానిక్’ పేరుతో నిర్వహిస్తూ వస్తోంది. నిబంధనల ప్రకారం.. ఎలైట్ వైన్స్ లైసెన్స్ ట్రాన్స్ఫర్కు అవకాశమే లేకపోవడం గమనార్హం. ఇక.. ఈ లైనెస్స్ ప్రకారం లిక్కర్ను బాటిల్స్గా మాత్రమే విక్రయించాలి. లూజ్ వైన్కు అనుమతి లేదు. ఇతర పానీయాలు ,ఆహార పదార్ధాల అమ్మకానికి వీలులేదు. అయితే ఈ వ్యవహారం మొత్తంలో సాధారణ మద్యం లైసెన్స్ అనుమతులు తీసుకుని విదేశీ మద్యం అమ్మకాలు జరపడం ఇక్కడ కొసమెరుపు. రీటైల్గా ఫారెన్ లిక్కర్ తోపాటు ప్రీమియం ఇండియన్ లిక్కర్ అమ్మడానికి టానిక్కు వెసలుబాటు కల్పించారు. ఇక.. టానిక్ వైన్ మార్టులో పని చేసే ఉద్యోగుల పేరిట లైసెన్సులు తీసుకున్నారు. అంతేకాదు.. ఈ ఫ్రాచైజీల్లో బడా బాబుల పిల్లల పెట్టుబడులు పెట్టారు. గత ప్రభుత్వ అనుమతులతోనే ఈ తతంగం అంతా నడిచినట్లు తెలుస్తోంది. హైదరాబాద్తో పాటు శివారులో వైన్ మార్టులు ఏర్పాటు చేసింది టానిక్. ఇందుకు ఓ ఐఏఎస్ అధికారితో పాటు మరో ఇద్దరు ఉన్నతాధికారులు సహకరించినట్లు ఎక్సైజ్ శాఖ గుర్తించింది. గచ్చిబౌలి, బోడుప్పల్, మాదాపూర్లో ఏర్పాటైన టానిక్ మార్టులో ఈ ముగ్గురు అధికారుల ప్రమేయం ఉన్నట్లు తేలింది. అలాగే సీఎంవో మాజీ అధికారి ఒకరి పాత్రపైనా అధికారులు ఆరా తీస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. టానిక్ షాపులకు ఎక్సైజ్ శాఖ షాకిచ్చింది. ప్రత్యేక జీవోతో అర్ధరాత్రి 2 గంటల దాకా లిక్కర్ అమ్ముకునే వెసులుబాటును తొలగించింది. రెగ్యులర్ లిక్కర్ దుకాణాల మాదిరే రాత్రి 11 గం. వరకే అమ్ముకోవాలని సూచిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పన్నుల ఎగవేతపై ప్రాథమిక నిర్ధారణకు వచ్చాకే ఈ నిర్ణయం ప్రకటించింది. ఇక.. పూర్తిస్థాయి తనిఖీల అనంతరం చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. -
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో గంజాయి చాక్లెట్ల గుట్టురట్టు
-
మద్యం ధరలు పెంచొద్దు
సాక్షి, హైదరాబాద్: మద్యం ధరలను పెంచకుండా ఎక్సైజ్ శాఖ ఆదాయాన్ని పెంచే మార్గాలను, అందుబాటులో ఉన్న వనరులను గుర్తించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సూచించారు. ప్రీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమ వారం సచివాలయంలో ఎక్సైజ్, టూరిజం శాఖల అధికారులతో సంబంధిత మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ మద్యం విక్రయాలపైనే కాకుండా కట్టడిపైనా దృష్టి పెట్టి పనిచేయాలని కోరారు. ఎలైట్ బార్ల తో పాటు ఎలైట్ షాప్ల విషయంలో ఏకీకృత విధానాలను అమలు చేయాలని, రాష్ట్రమంతటా ఒకటే నిబంధనలు అమలయ్యేలా మార్గదర్శకాలు రూ పొందించాలని కోరారు. పోలీస్, సమాచార శాఖలతో కలిసి ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసుకుని డ్రగ్స్ను కట్టడి చేయాలని ఆదేశించారు. ఇందుకు సరైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని, ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. టెంపుల్ టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి రాష్ట్రంలో పురాతన కట్టడాలు, దేవాలయాలు ఉన్న ప్రదేశాల్లో టెంపుల్, ఎకో టూరిజం అభివృద్ధికి గల అవకాశాలను అన్వేషించాలని, టెంపుల్ టూరిజం అభివృద్ధికి దేవాదాయ, పర్యాటక, ఆర్టీసీ శాఖలు సమన్వయంతో పనిచేయాలని భట్టి కోరారు. తగిన మార్కెటింగ్ వ్యవస్థ లేని కారణంగా సహజసిద్ధమైన పర్యాటక ప్రదేశాలను వినియోగించుకోలేక పోతున్నామన్నారు. తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని అంతర్జాతీయ పర్యాటకులకు తెలియజేసేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ అన్ని టూరిజం ప్రాజెక్టులను ప్రభుత్వమే చేపట్టలేదని, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో ప్రైవేటు కంపెనీల పెట్టుబడులకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందించాలని కోరారు. సమావేశంలో భాగంగా కొత్త కార్యాలయ భవనాల నిర్మాణం, చెక్పోస్టుల పటిష్టత కోసం ఎక్సైజ్ శాఖ అధికారులు నిధులను కోరగా కొత్త పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, స్పిల్ఓవర్ పనులకు టూరిజం శాఖ నిధులను ప్రతిపాదించింది. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్శర్మ, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ పాల్గొన్నారు. -
6 నెలలు... రూ.1.18 లక్షల కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 1.18 లక్షల కోట్ల మేర నిధులు సమకూరాయి. వివిధ వనరుల ద్వారా వచ్చిన ఆదాయం రూ. 87,207.22 కోట్లుకాగా బహిరంగ మార్కెట్లో రూ. 31,333.72 కోట్ల మేర రుణాలను ప్రభుత్వం సేకరించింది. 2023–24 బడ్జెట్ అంచనాల్లో మొత్తం రాబడులు రూ. 2.59 లక్షల కోట్లుకాగా అందులో 46 శాతం మేర అర్ధ వార్షిక కాలంలో వచ్చాయి. ఇందులో పన్ను ఆదాయం రూ. 66,691.49 కోట్లు ఉండగా పన్నేతర ఆదాయం రూ. 16,896.29 కోట్లు వచ్చినట్లు కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)కు ప్రభుత్వం ఇచ్చిన ఆరు నెలల నివేదికలో వెల్లడించింది. ఖర్చు రూ. 1.14 లక్షల కోట్లు తొలి ఆరు నెలల కాలంలో రూ. 1,18,558.96 కోట్ల మేర రాబడులురాగా అందులో రూ. 1,14,151.39 కోట్లు ఖర్చయిందని గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం ఖర్చులో రెవెన్యూ వ్యయం రూ. 91,315.21 కోట్లుగా నమోదవగా ప్రణాళికా వ్యయం కింద రూ. 22,836.18 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరానికిగాను మొత్తం వ్యయ అంచనాల్లో ఆరు నెలల కాలంలో జరిగిన ఖర్చు 61 శాతం కావడం గమనార్హం. ఇక సమకూరిన పన్ను ఆదాయాన్ని శాతాలవారీగా పరిశీలిస్తే ఎక్సైజ్ ఆదాయం ఎక్కువగా వచ్చింది. ఈ ఏడాది మొత్తం ఎక్సైజ్ ఆదాయ అంచనా రూ. 19,884 కోట్లుకాగా అందులో 62 శాతం అంటే రూ. 12,255.95 కోట్లు మొదటి ఆరునెలల్లోనే వచ్చింది. రానున్న ఆరు నెలల కాలంలో కలిపి అంచనాలను మించి ఎక్సైజ్ ఆదాయం వచ్చే అవకాశం ఉందని వర్గాలంటున్నాయి. -
ఎన్నికలపై ఎక్సైజ్ నిఘా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ అప్రమత్తమైంది. అతి త్వరలో ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉండడంతో అధికారులు ప్రత్యేకంగా ఎన్ఫోర్స్మెంట్ బృందాలను రంగంలోకి దింపారు. రాష్ట్ర సరిహద్దుల వెంట వాహనాలను తనిఖీ చేసేందుకు 21 శాశ్వత ఎక్సైజ్ చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో 8, మహారాష్ట్ర సరిహద్దులో 8, కర్ణాటక సరిహద్దులో 4, ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఒక చెక్పోస్టు ఏర్పాటు చేశారు. ఈ చెక్పోస్టుల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రధాన కార్యాలయం వద్ద కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానించారు. పోలీసులు, ఇతర ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల సమన్వయంతో 89 ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టులు, 4 సరిహద్దు మొబైల్ పెట్రోలింగ్ పార్టీలు, 8 ఇన్కమింగ్ రైలు మార్గాల నుండి వచ్చే రైళ్లను తనిఖీ చేయడానికి 13 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. బస్స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదుపులో 29,663 మంది ఈనెల 5న కేంద్ర ఎన్నికల సంఘం సమీక్షా సమావేశం తర్వాత ఎన్ఫోర్స్మెంట్ కార్యకలాపాలు విస్తృతమయ్యాయి. ఇప్పటివరకు రూ.1.14 కోట్ల విలువైన 14,227 లీటర్ల మద్యం, 1,710 కిలోల బెల్లం, 170 కిలోల గంజాయి, 21 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 29,663 మంది అనుమానాస్పద వ్యక్తులు, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 14 మందిపై పీడీ యాక్టు నమోదు చేశారు. రాష్ట్రంలో నేర చరిత్ర ఉన్న 8,362 మంది నిఘా పరిధిలో ఉన్నారు. -
కిక్కెక్కించిన మద్యం దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: ఖజానాకు ‘మద్యం దరఖాస్తుల’రూపంలో కాసుల వర్షం కురిసింది. రానున్న రెండేళ్ల కాలానికి గాను రాష్ట్రంలోని వైన్షాపులకు లైసెన్సుల మంజూరు కోసం నిర్వహించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియకు అనూహ్య రీతిలో స్పందన కనిపించింది. శుక్రవారం దరఖాస్తుల ప్రక్రియ ముగియగా, శనివారం మధ్యాహా్ననికి ఎన్ని దరఖాస్తులు వచ్చాయన్న లెక్కలను ఎక్సైజ్ శాఖ తేల్చింది. ఈ లెక్కల ప్రకారం రాష్ట్రంలోని 2,620 వైన్షాపుల లైసెన్సుల కోసం ఏకంగా 1,31,954 దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం కొనసాగుతున్న లైసెన్సుల కోసం 68,691 దరఖాస్తులు రాగా, ఈసారి గతం కంటే 63,263 దరఖాస్తులు ఎక్కువగా రావడం గమనార్హం. గత రెండేళ్లతో పోలిస్తే రానున్న రెండేళ్ల కాలానికి గాను దరఖాస్తుల సంఖ్య దాదాపు రెట్టింపయింది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రూ.2,639 కోట్ల ఆదాయం కేవలం దరఖాస్తుల రూపంలోనే లభించింది. ఈ దరఖాస్తుల నుంచి జిల్లా స్థాయిలో కలెక్టర్ల పర్యవేక్షణలో ఈనెల 21న డ్రా తీసి లైసెన్సులు మంజూరు చేయనున్నారు. హైదరాబాద్ శివార్లలో భారీగా.. భారీస్థాయిలో మద్యం విక్రయాలు జరుగుతున్న జిల్లాల్లోని వైన్షాపులను దక్కించుకునేందుకు ఆశావహులు పెద్ద ఎత్తున పోటీ పడినట్లు గణాంకాలు చెపుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ శివార్లలోని షాపుల కోసం వ్యాపారులు భారీ స్థాయిలో దరఖాస్తులు దాఖలు చేసినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. సరూర్నగర్ ఎక్సైజ్ కార్యాలయ పరిధిలోని 134 షాపులకు ఏకంగా 10,908 దరఖాస్తులు రాగా, శంషాబాద్లోని 100 షాపులకు 10,811 దరఖాస్తులు వచ్చాయి. ఇవే షాపులకు గత రెండేళ్ల లైసెన్సుల కోసం వచ్చిన దరఖాస్తులతో పోలిస్తే ఈసారి రెట్టింపు సంఖ్యలో రావడం గమనార్హం. సరూర్నగర్ పరిధిలోని షాపులకు గత రెండేళ్ల కాలానికి 4,102, శంషాబాద్లో 4,122 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఇక మరో ఏడు జిల్లాల్లో దరఖాస్తుల సంఖ్య 5 వేలు దాటింది. ఖమ్మం (7,207), కొత్తగూడెం (5,057), సంగారెడ్డి (6,156), నల్లగొండ (7,058), మల్కాజ్గిరి (6,722), మేడ్చల్ (7,017), వరంగల్ అర్బన్ (5,858)లో పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. ఇక, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో మాత్రమే వెయ్యి కంటే తక్కువ దరఖాస్తులు వచ్చాయి. కాగా, క్రితం సారి 10 రోజుల పాటు నిర్వహించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియలో మొత్తం కలిపి 68 వేల పైచిలుకు దరఖాస్తులు రాగా, ఈసారి చివరి ఒక్కరోజే 56,980 దరఖాస్తులు రావడం గమనార్హం. ఈసారి చివరి నాలుగు రోజుల్లోనే భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈనెల 15న సెలవు దినాన్ని మినహాయిస్తే 14,16,17, 18 తేదీల్లో కలిపి 1.10 లక్షల దరఖాస్తులు రావడం గమనార్హం. ఆదిలాబాద్లో 979, ఆసిఫాబాద్లో 967 దరఖాస్తులు వచ్చాయి. ఇక, తక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చిన జిల్లాల జాబితాలో నిర్మల్ (1,019), గద్వాల (1,179), వనపర్తి (1,329) ఉన్నాయి. ఈ దరఖాస్తుల సరళిని బట్టి రాష్ట్రంలోని రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇతర వ్యాపార రంగ సంస్థల యజమానులతో పాటు పొరుగు రాష్ట్రాలకు చెందిన లిక్కర్ వ్యాపారులు కూడా దరఖాస్తు చేసి ఉంటారని ఎక్సైజ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
అధిక మాసంలోనూ ‘అదరగొట్టారు’
సాక్షి, హైదరాబాద్: అధిక మాసంలోనూ వైన్షాపు టెండర్ల ప్రక్రియ అదిరిపోయింది. ఈసారి ఎలాగైనా మద్యం షాపులు దక్కించుకోవాలన్న వ్యాపారుల ఆశతో భారీ స్థాయిలో దరఖాస్తులు వస్తున్నాయి. ఈనెల 14న ఒక్కరోజే రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఆ ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి 14 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక, 15వ తేదీన సెలవుదినం కావడంతో 16వ తేదీ బుధవారం 8,500 పైగా దరఖాస్తులు వచ్చాయి. మొత్తం మీద 14, 16 తేదీల్లో కలిపి.. 23 వేల వరకు దరఖాస్తులు రాగా, ఈనెల 4 నుంచి 16 వరకు మొత్తం కలిపి 43,500 పైగా దరఖాస్తులు వచి్చనట్టు సమాచారం. కాగా, గత రెండేళ్ల కాలానికి గాను మొత్తం 10 రోజుల్లో 69 వేలకు పైగా దరఖాస్తులు రాగా, ఈసారి తొలి పది రోజుల్లో 43,500 మాత్రమే రావడం గమనార్హం. అయితే, ఈసారి గడువు రెండు రోజులు ఎక్కువగా ఇవ్వడం, అధిక శ్రావణం ముగిసి శ్రావణ మాసం రావడంతో చివరి రెండు రోజుల్లోనూ భారీగా దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది. ఇప్పటికే వేలాది మంది డీడీలు తీసి, శ్రావణ మాసం కోసం ఎదురుచూస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చివరి రెండురోజులైన గురు, శుక్రవారాల్లో భారీ స్థాయిలో దరఖాస్తులు వస్తాయని, గతం కంటే ఇప్పుడు ఎక్కువే దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నామని ఎక్సైజ్ అధికారులు చెపుతున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటివరకు మద్యం షాపుల దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.870 కోట్ల ఆదాయం సమకూరింది. చివరి రెండు రోజుల్లో కలిపి మరో రూ.500 కోట్ల వరకు వస్తుందని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది. -
ముందస్తుగా ‘మద్యం లాటరీలు’?
సాక్షి, హైదరాబాద్: ఎప్పుడో నవంబర్లో జరగాల్సిన వైన్షాపుల లాటరీ ప్రక్రియ వచ్చే నెలలోనే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల కోడ్ అక్టోబర్లోనే వస్తుందన్న అంచనాల నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ ఈ మేరకు కసరత్తు చేస్తోంది. 2021–23 సంవత్సరాల ఏ4 (వైన్స్) షాపుల లైసెన్సు కాలం ముగియక ముందే 2023–25 సంవత్సరాలకు లైసెన్సులిచ్చే నోటిఫికేషన్ జారీ చేసేందుకు ముమ్మరంగా ముందుకెళ్తోంది. వచ్చే నెలలో ఎప్పుడైనా నోటిఫికేషన్ ఇచ్చి సెప్టెంబర్ ప్రారంభం కల్లా ప్రక్రియను పూర్తి చేసేలా కొత్త పాలసీ రూపకల్పనలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ముందుగానే ఎందుకు?: వాస్తవానికి, 2021–23 (రెండేళ్ల పాలసీ) సంవత్సరాలకుగాను ఏ4 లైసెన్సుల గడువు వచ్చే నవంబర్ 30తో ముగియనుంది. అంటే డిసెంబర్ 1 నుంచి కొత్త లైసెన్స్దారులు రాష్ట్రంలో మద్యం విక్రయాలు జరపాల్సి ఉంటుంది. అలా జరగాలంటే అక్టోబర్ రెండో వారం తర్వాత ఎప్పుడైనా నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. రానున్న రెండేళ్లకు (2023–25) లైసెన్సులను లాటరీ పద్ధతిలో జారీ చేసేందుకు కొత్త పాలసీ రూపొందించాల్సి ఉంటుంది. అయితే, వచ్చే డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నందున అక్టోబర్లో షెడ్యూల్ విడుదలై ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే అవకాశముంది. దీంతో ఎన్నికల నియమావళి వచ్చేలోపే నోటిఫికేషన్ ఇచ్చి లాటరీలు ముగించి కొత్త లైసెన్స్దారులకు షాపులు కేటాయించాలని ఎక్సైజ్ శాఖ అధికారులు భావిస్తున్నారు. అయితే డిసెంబర్ 1 నుంచి మాత్రమే వారికి షాపులు అప్పగించాలని, ఈలోగా పాత లైసెన్స్ల ద్వారా మద్యం విక్రయాలు జరపవచ్చని అంటు న్నారు. ఈ మేరకు యుద్ధప్రాతిపదికన మద్యం టెండర్లకు ముహూర్తం ఖరారు చేసే పనిలో పడ్డారు. అడిగితే ఇవ్వరా?: గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం ముందస్తు ఎక్సైజ్ టెండర్లకు వెళ్లడం చర్చనీయాంశమవుతోంది. గతంలో జూలై 1 నాటికి లైసెన్సులు ముగిసేవి. కానీ, 2014లో మూడుసార్లు గడువు పెంచడంతో ఇప్పుడు డిసెంబర్ 1 నుంచి కొత్త షాపులు ప్రారంభమవుతున్నాయి. ఇప్పుడు ఎక్సైజ్ శాఖ ఈసారి గడువు పెంచకుండా ముందస్తుగా లాటరీల ప్రక్రియ ప్రారంభించాలని భావిస్తుండటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఎన్నికల కోడ్ అడ్డంకి అయితే, ఆ సమయంలో ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకుని ప్రక్రియ ప్రారంభించి లైసెన్స్లను ఖరారు చేసి పెట్టుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కోడ్ అయ్యాక కొత్త లైసెన్స్దారులకు షాపులు అప్పగించవచ్చనే వాదనా ఉంది. అయితే, అప్పటివరకు ఎంతకాలం అవసరమైతే అంతకాలం పాటు గడువు పొడిగించి పాత లైసెన్స్దారుల దగ్గరే ఫీజు వసూలు చేసి విక్రయాలు జరపవచ్చనే అభిప్రాయమూ ఉంది. మరోవైపు, వైన్షాపుల్లో కొన్ని సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై కోర్టులో కేసు పెండింగ్లో ఉంది. మళ్లీ ఇప్పుడు ముందస్తు ప్రక్రియపై ఎవరైనా కోర్టుకు వెళితే అసలుకే ఎసరు వస్తుందనే చర్చ ఎక్సైజ్ వర్గాల్లోనే జరుగుతుండటం గమనార్హం. ఆదాయం కోసమేనా?: మందుషాపులకు ముందస్తు లాటరీలు ఆదాయం కోసమేనా అనే చర్చ జరుగుతోంది. రెండేళ్లకు లైసెన్సు ఫీజు జారీ చేసేందుకు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తుల అమ్మకాల మీదనే ప్రభుత్వానికి రూ. 1,400 కోట్ల ఆదాయం వచ్చింది. ఎక్సైజ్ పాలసీ నిబంధనల ప్రకారం లాటరీ ప్రక్రియ పూర్తయి షాపు కేటాయించాలంటే మొదటి విడత లైసెన్సు ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఇలా లైసెన్స్ ఫీజు కింద మరో రూ.500– 600 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. ఎన్నికలకు ముందు ఈ రూ.2 వేల కోట్ల కోసమే ఎక్సైజ్ శాఖ హడావుడి చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి. -
పరుగెడుతున్న తెలంగాణ అప్పుల పద్దు.. ఆదాయంలో మూడో వంతు అప్పులే!
సాక్షి, హైదరాబాద్: ఈ ఆర్థిక సంవత్సరంలో అప్పుల పద్దు పరుగెడుతోంది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను తొలి రెండు నెలల ఆదాయ, వ్యయాలను పరిశీలిస్తే రాష్ట్ర మొత్తం ఆదాయంలో మూడో వంతు అప్పులే కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో కలిపి మొత్తం రూ.31,699 కోట్ల ఆదాయం రాగా, అందులో రూ.9,266 కోట్లు అప్పులే ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం కాగ్కు పంపిన నివేదికలో వెల్లడైంది. ఇక వచ్చిన ఆదాయంలో దాదాపు 95 శాతం ఖర్చయిపోయింది. ఈ రెండు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వ ఖర్చు రూ.28,171 కోట్లు అని ఈ నివేదిక వెల్లడించింది. పన్ను ఆదాయం రూ.20,097 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1.52 లక్షల కోట్ల పన్ను ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేయగా, అందులో 13.18% తొలి రెండు నెలల్లో సమకూరింది. అన్ని రకాల పన్నులు కలిపి రూ.20,097 కోట్లు వచ్చినట్టు తేలింది. జీఎస్టీ కింద రూ.7,430 కోట్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.2,358 కోట్లు, అమ్మకపు పన్ను పద్దు కింద రూ.4,802 కోట్లు, ఎక్సైజ్ ద్వారా రూ.2,683 కోట్లు, ఇతర పన్నుల నుంచి రూ.1,327 కోట్లు వచ్చాయి. ఇక పన్నేతర ఆదాయం అంచనాల్లో 4 శాతం అంటే రూ. 891.47 కోట్లు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం నుంచి తొలి రెండు నెలల్లో రూ.3 వేల కోట్లకు పైగా గ్రాంట్లు వచ్చాయి. అందులో పన్నుల్లో వాటా కింద రూ.1,494 కోట్లు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ.1,438 కోట్లు వచ్చాయి. వడ్డీలకు రూ.3,200 కోట్లు ఖర్చుల విషయానికి వస్తే వేతనాలు, పింఛన్లు, అప్పులకు వడ్డీల రూపంలో సింహభాగం ఖర్చయ్యాయి. వేతనాలకు రూ.6,784 కోట్లు, పింఛన్లకు రూ.2,779 కోట్లు, అప్పులకు వడ్డీల కోసం రూ.3,205 కోట్లు చెల్లించారు. సబ్సిడీల రూపంలో రూ.1,923 కోట్లు, రెవెన్యూ పద్దు కింద రూ.6,692 కోట్లు ఖర్చయ్యాయి. అన్ని రంగాల్లో కలిపి మూలధన వ్యయం కింద రూ.6,800 కోట్ల వరకు ఖర్చయ్యాయి. -
విశాఖ నుంచి కేరళకు గంజాయి
తిరువనంతపురం: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్టణం నుంచి కేరళకు తీసుకువచ్చిన 155 కిలోల గంజాయిని ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. విశాఖ నుంచి తీసుకువచి్చన గంజాయిని తిరువనంతపురంలోని పల్లితురలోని ఓ గోదాములోకి మార్చుతుండగా అధికారులు నలుగురిని అరెస్ట్ చేశారు. గంజాయితోపాటు 61 గ్రాముల ఎండీఎంఏ అనే సింథటిక్ డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు. తిరువనంతపురం నుంచి విశాఖకు వెళ్లిన నలుగురిలో ఇద్దరు విమానంలో తిరిగి రాగా మిగిలిన ఇద్దరు వాహనంలో డ్రగ్స్ను తీసుకువచ్చారని అధికారులు తెలిపారు. -
మద్యం అమ్మకాలపై ఎకై ్సజ్ అధికారులు టార్గెట్!
మోర్తాడ్: మద్యం అమ్మకాలను పెంచాలని వైన్ షాపుల యజమానులకు ఎకై ్సజ్ అధికారులు టార్గెట్ విధించారు. గతేడాది కంటే పది శాతం విక్రయాలు పెరగాలని ఒత్తిడి చేస్తున్నారు. అమ్మకాలు తగ్గితే తాము ఏమి చేయాలని యజమానులు మొరపెట్టుకుంటున్నా.. ఎకై ్సజ్ శాఖ మాత్రం టార్గెట్ ప్రకారం కొనుగోళ్లు పూర్తి చేయాలని ఆదేశించడం గమనార్హం. ప్రభుత్వ ఖజానా నింపే ప్రధాన ఆదాయం మద్యమే కావడంతో టార్గెట్పై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. గత సంవత్సరం కొనుగోళ్ల జాబితా ఆధారంగా ఈసారి పది శాతం అదనంగా లేదా గతంలో మాదిరిగానే మద్యం కొనుగో ళ్లను పూర్తి చేయాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. నిజామాబాద్ నగర కార్పొరేషన్తో పాటు మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు, మేజర్ పంచాయతీల్లో 102 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఒక్కో దుకాణం ద్వారా రోజుకు రూ.4లక్షల నుంచి రూ.10లక్షల వరకు మద్యం కొనుగోళ్లు చేపట్టాలని ఎకై ్సజ్ శాఖ టార్గెట్ను నిర్ణయించింది. 2022 నాటి కొనుగోళ్లపై అదనంగా పదిశాతం మద్యం కొనుగోలు చేయాలని లేదంటే కేసులు తప్పవని వైన్ షాపుల యజమానులను అధికారులు హెచ్చరిస్తున్నారు. నిత్యం లక్ష్యానికి అనుగుణంగా డీడీలు చెల్లించాలని ఆదేశిస్తున్నారు. జీరో దందా కట్టడి.. మద్యం దుకాణాల నుంచి రిటైల్ అమ్మకాలతో పాటు టోకున బెల్టుషాపులకు కూడా మద్యం అమ్ముతారు. ఈ క్రమంలో జీరో (పొరుగు రాష్ట్రాల నుంచి తెప్పించిన) మద్యం విక్రయిస్తున్నారా అనే సందేహం వ్యక్తమైతుంది. బెల్టుషాపుల్లో మద్యం గోల్మాల్ జరిగే అవకాశం ఉండటంతో వాటి నిర్వాహకులను అధికారులు బైండోవర్ చేస్తున్నారు. బెల్టుషాపులను వైన్షాపుల యజమానులే నిర్వహిస్తుండగా కేవలం పని చేస్తున్న తమను ఎందుకు బైండోవర్ చేస్తున్నారని కూలీలు ప్రశ్నిస్తున్నారు. టార్గెట్ పూర్తి చేయాలని ఆదేశాలు ఉన్నాయి మద్యం దుకాణాల ద్వారా గతంలో మాదిరిగా మద్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని టార్గెట్ ఉంది. బ్రేవరీస్ నుంచి మద్యం కొనుగోళ్లు చేపట్టాలి. ఎక్కడైనా జీరో మద్యం కొనుగోలు చేసి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు. ప్రభుత్వ ఆదాయానికి గండి పడితే సహించేది లేదు. – గుండప్ప, ఎకై ్సజ్ సీఐ, మోర్తాడ్ -
12కిలోల గంజాయి పట్టివేత
మల్కన్గిరి: జిల్లాలోని కోరుకొండ సమితి బలిమెల పోలీసు స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు గంజాయి పాటు ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. బలిమెల ఐఐసీ జాన్ఖుజుర్ ఆధ్వర్యంలో సిబ్బంది టోనాల్ క్యాంప్–ఖడికజోడి గ్రా మాల మధ్య శుక్రవారం వేకువజామున అతివేగంగా వెళ్తున్న బైక్ను గమనించారు. అనుమానంతో వాహనాన్ని తనిఖీ చేయగా.. వారి వద్ద ఉన్న బ్యాగ్ లో 12కిలోల గంజాయిని గుర్తించారు. ఈ నేపథ్యంలో బైక్పై ఉన్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. సరుకును స్వాధీనం చేసుకోవడంతో పాటు కేసు నమోదు చేశారు. గంజాయిని ఢిల్లీకి చెందిన యువతి సాబ.. చిత్రకొండలో దీనిని కొనుగోలు చేసి, కుమార్గుడకు చెందిన యువకుడు సనియా ముదిలికి అప్పగించినట్లు నిందితులు అంగీకరించారు. అక్కడి నుంచి మల్కన్గిరి, రాయిపూర్ మీదుగా ఢిల్లీకి తరలించేందుకు రవాణా చేస్తున్నామని తెలిపారు. పట్టుబడిన సరుకు విలువ రూ.60 వేలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరి అరెస్ట్.. పర్లాకిమిడి: జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఎక్సైజ్శాఖ అధికారులు జరిపిన దాడుల్లో 23కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఎకై ్సజ్శాఖ సూపరింటెండెంట్ ప్రభాత్కుమార్ శెఠి ఆదేశాల మేరకు ఎస్ఐ లింగరాజ్ దామిన్ పర్లాకిమిడి బస్టాండ్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని తనిఖీ చేశారు. మోహానా సమితి పట్టిగజపతి గ్రామానికి చెందిన నిందితుడు అజయ్ నాయక్ వద్ద నుంచి 15.2 కిలోల గంజాయి పట్టుబడింది. అలాగే రాయఘడ బ్లాక్ లంజిపదర్ జంక్షన్ వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఎకై ్సజ్ ఎస్ఐ మంగళ త్రిపాఠి బైక్పై రవాణా చేస్తున్న వ్యక్తి నుంచి 8కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు అడవ పోలీసు పరిధి కేసరిగుడ గ్రామానికి చెందిన జైన్ రైకాగా గుర్తించారు. దాడుల్లో దీపక్ మహాపాత్రొ, ఏఎస్ఐ ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. నిందితులను పర్లాకిమిడి కోర్టుకు తరలించారు. -
తెలంగాణ ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం.. ఇకపై బార్లలో క్వార్టర్, హాఫ్ కూడా!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ సంక్షోభ పరిస్థితుల తర్వాత మనుగడ సాగించలేని పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రంలోని 1,172 బార్లకు ఆర్థిక ఆసరా కలిగేలా ఎక్సైజ్ శాఖ నిబంధనలను సవరించింది. లైసెన్సింగ్ విధానాన్ని సరళతరం చేయడంతోపాటు బ్యాంకు గ్యారెంటీల తగ్గింపు, లైసెన్స్ ఫీజు చెల్లింపులో ఉదారత, కమీషన్ పెంపు లాంటి చర్యల ద్వారా ఆర్థికంగా బార్లను కుదుటపడేలా చేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ మార్పులు చేసినట్లు ఎక్సైజ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ మార్పులతో కూడిన ఉత్తర్వులు నేడో, రేపో రానున్నాయి. ఆ బాటిళ్లు ఇస్తే ఎలా? ఇప్పటివరకు వైన్ షాపుల్లోనే క్వార్టర్, హాఫ్ బాటిళ్లు అందుబాటులో ఉండగా ఇప్పుడు బార్ అండ్ రెస్టారెంట్లకు కూడా ఎక్సైజ్ శాఖ అనుమతి ఇవ్వడంపై వైన్షాప్ యజమానుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. క్వార్టర్, హాఫ్ బాటిళ్లు బార్ అండ్ రెస్టారెంట్లలో అమ్మితే తమ అమ్మకాలు కుంటుపడతాయని వారు చెబుతున్నారు. అయితే ఎక్సైజ్ శాఖ మాత్రం ఇప్పటికే 2బీ (బార్ అండ్ రెస్టారెంట్) లైసెన్సుల కింద స్టార్ హోటళ్లలో క్వార్టర్లు, హాఫ్లు అందుబాటులో ఉన్నాయని, ఇప్పుడు సాధారణ బార్ అండ్ రెస్టారెంట్లకూ దీన్ని వర్తింపజేస్తున్నామని చెబుతోంది. ఇలా చేయడం ద్వారా వినియోగదారుడికి తాను తీసుకొనే మద్యం బ్రాండ్లపై నమ్మకం ఉంటుందని, స్టాక్ సమస్య రాదని, తయారీదారుడికి సైతం వెసులుబాటు ఉంటుందని అంటోంది. ఇప్పటివరకు ఉన్న నిబంధనలు ► క్వార్టర్, హాఫ్ బాటిళ్లు ఉండేవి కావు. ఫుల్బాటిళ్ల ద్వారానే విక్రయాలు. ► మూడు వాయిదాల్లో లైసెన్స్ ఫీజు చెల్లింపునకు అవకాశం. ► బ్యాంకు గ్యారెంటీ కింద సగం లైసెన్స్ ఫీజు చూపాలి. ► లైసెన్స్ ఫీజుతో పోలిస్తే ఐదు రెట్ల విలువైన మద్యం అమ్మే వరకు బార్ యజమానులకు 20% కమీషన్. ఆ తర్వాత అమ్మే మద్యం విలువలో 13.6% ప్రభుత్వానికి, 6.4% బార్ యజమానులకు కమీషన్. ► ఏటా అన్ని డాక్యుమెంట్లూ సమర్పిస్తేనే లైసెన్స్ రెన్యూవల్. నిబంధనల్లో రానున్న మార్పులు ► బార్లలోనూ క్వార్టర్, హాఫ్ బాటిళ్లు అందుబాటులోకి. ► లైసెన్స్ ఫీజు 4 వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు. ► 25% లైసెన్స్ ఫీజును బ్యాంక్ గ్యారెంటీగా చూపితే సరిపోనుంది. ► లైసెన్స్ ఫీజు కంటే ఏడు రెట్లు మద్యం విక్రయాల వరకు 20 శాతం కమీషన్. ప్రభుత్వానికి 10 శాతం , మరో 10 శాతం బార్ యజమానులకు కమీషన్. ► రెస్టారెంట్ లైసెన్స్ చూపించి ఫీజు కడితే లైసెన్స్ ఆటో రెన్యూవల్. చదవండి: రెండ్రోజులపాటు పెరగనున్న ఉష్ణోగ్రతలు.. ఆదిలాబాద్లో భగభగ -
Liquor Price: స్టాకు ఉన్నంత వరకు పాత ధరలే!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘రాజు వరమిచ్చినా.. మంత్రి అడ్డుకున్నట్లు’గా ఉంది మందుబాబుల పరిస్థితి. ప్రభుత్వం మద్యం ధరలు తగ్గించినట్లు ప్రకటించి మూడురోజులు గడుస్తున్నా.. సరుకుపై ధరలు తగ్గించకపోవడంపై మందుబాబులు మండిపడుతున్నారు. దీనిపై వైన్షాపుల యజమానులు మాత్రం తమకు కొత్త స్టాకు వచ్చేంత వరకు పాతధరలే కొనసాగుతాయని చెబుతున్నారు. ఈనెల 5 నుంచి మద్యంపై ధరలను ప్రభుత్వం సవరించింది. ఫుల్బాటిల్పై రూ.40, హాఫ్ బాటిల్పై రూ.20, క్వార్టర్పై రూ.10 చొప్పున తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని కూడా చెప్పింది. అయితే దీన్ని క్షేత్రస్థాయిలో మందుబాబులు తప్పుగా అర్థం చేసుకున్నారు. దీంతో శని, ఆది, సోమ వారాల్లో మద్యం ధరలు తగ్గాయి కదా? అంటూ వాగ్వాదానికి దిగుతున్నారు. వారికి సర్ది చెప్పడం ఎలాగో తెలియక వైన్షాపుల నిర్వాహకులు తల పట్టుకుంటున్నారు. దాదాపు పూర్తయిన లేబులింగ్.. ప్రభుత్వం మద్యం ధరలను సవరించిన ప్రతీసారి ప్రభుత్వం కొత్త లేబులింగ్తో మద్యం సీసాలు విక్రయిస్తుంది. ఆదేశాలు వెలువడిన అనంతరం తక్షణమే అమలు కావాలి. కానీ అప్పటికే మద్యంషాపులు కొని తెచ్చుకున్న స్టాకు అలాగే ఉండిపోయింది. చాలాషాపుల్లో స్టాకు వారం పది రోజులకు ఒకసారి మారుస్తారు. పాత ధరలకు కొన్న రేట్లకే ఆ మద్యాన్ని అమ్ముకునే వీలుంది. ఎక్కువకు కొని తక్కువకు ఎవరూ విక్రయించరు కదా! ఈ మేరకు ఎకై ్సజ్శాఖ కూడా వీరికి పాత స్టాకును, పాత ధరలకు విక్రయించుకునేందుకు పచ్చజెండా ఊపింది. ఈలోపు ఐఎంల్ గోదాముల్లో ఉన్న లిక్కర్ స్టాకు లేబులింగ్ మార్చాల్సి వచ్చింది. పాత ధరలతో ఉన్న స్టాకుపై కొత్తగా సవరించిన ధరలను ముద్రించిన లేబుళ్లను వేస్తున్నారు. శని, ఆది, సోమవారాల్లోనూ ఈ ప్రక్రియ కొనసాగింది. మంగళవారం నుంచి ఉమ్మడి జిల్లాలోని సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్లోని వైన్షాపులకు వెళ్లే స్టాకుపై కొత్తగా ముద్రించిన లేబులింగ్ ప్రకారం మద్యం సీసాలు విక్రయించనున్నారు. ఈ వ్యవహారం తెలియని మందుబాబులు మాత్రం పాత ధరలకే మద్యం విక్రయిస్తున్నారంటూ యజమానులతో గొడవకు దిగుతున్నారు. పాత ధరలకు విక్రయిస్తే చర్యలు ధరల విషయంలో ఇప్పటికే పలువురు ఎకై ్సజ్ అధికారులకు పలువురు మద్యం ప్రియులు ఫిర్యాదులు చేస్తున్నారు. పాత లేబుల్ ఉన్నవాటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేమని పాత స్టాకు ఉన్నంత వరకు పాత ధరలు అమలవుతాయని, కొత్త లేబులింగ్ ప్రక్రియ పూర్తయిన తరువాత పాత ధరలతో విక్రయిస్తే మాత్రం చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. నిమిషానికి 78 బీర్లు..! వేసవి ఉష్ణోగ్రతల నేపథ్యంలో బీర్లకు డిమాండ్ పెరిగింది. మే మొదలైనప్పటి నుంచి ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లోని మందుబాబులు బీర్లను తెగతాగేశారు. మే 1 నుంచి 7వ తేదీల్లో రూ.23.17 కోట్ల విలువైన 65,961 కాటన్ల బీర్లు అమ్ముడుపోయాయి. కాటన్కు 12 బీర్లు చొప్పున మొత్తం 7,91,532 బీర్లు విక్రయించారు. ఈ లెక్కన రోజుకు 1,13,076 బీర్లు, ప్రతీ గంటకు 4,711, నిమిషానికి 78 చొప్పున బీర్లు తాగేశారు. వేసవి తాపానికి మద్యంప్రియులు అంతా బీర్లకు మారుతున్నారు. లిక్కర్ ధరలో మినహాయింపు ఇచ్చిన ప్రభుత్వం బీర్ల ధరల్లో ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు. అయినా మందుబాబులు మాత్రం చల్లగా బీర్లను పీల్చేస్తున్నారు. -
ఆదాయార్జన శాఖల్లో మెరుగైన విధానాలు ఉండాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ఆదాయార్జన శాఖల్లో మెరుగైన విధానాలు ఉండాలన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆదాయాన్ని ఆర్జించే శాఖలపై సీఎం జగన్ శుక్రవారం సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి డిప్యూటీ సీఎం (ఎక్సైజ్) నారాయణ స్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, స్పెషల్ సీఎస్లు నీరబ్కుమార్ ప్రసాద్, రజత్ భార్గవ, భూగర్భ గనుల శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ముఖ్యకార్యదర్శి శ్యామలరావు, హోంశాఖ ముఖ్యకార్యదర్శి హరీష్కుమార్ గుప్తా, రవాణాశాఖ కార్యదర్శి ప్రద్యుమ్న, పీసీసీఎఫ్ వై. మధుసుదన్రెడ్డి, వాణిజ్యపన్నుల శాఖ కార్యదర్శి గుల్జార్, రవాణాశాఖ కమిషనర్ మనీష్కుమార్ సిన్హా, పురపాలక శాఖ కమిషనర్ కోటేశ్వరరావు, స్టాంప్, రిజిస్ట్రేషన్స్ కమిషనర్ రామకృష్ణ, సేల్స్ టాక్స్ స్పెషల్ కమిషనర్ అభిషిక్త్ కిషోర్, అడిషనల్ డీజీలు ఎన్.సంజయ్, రవిశంకర్ అయ్యన్నార్, ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి, మైన్స్ డైరెక్టర్ వి.జి.వెంకటరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమీక్ష సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. ఆదాయాలను ఆర్జించే శాఖల్లో మెరుగైన విధానాలు ఉండాలి దీనివల్ల సమర్థత పెరుగుతుందని, పన్నులుచెల్లించేవారికి సౌలభ్యంగా సేవలు అందుతాయి.. వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి మానవ ప్రమేయాన్ని తగ్గించి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సేవలందించే విధానాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి వీటిని అధ్యయనం చేసి వచ్చే సమీక్షా సమావేశంలో తనకు నివేదించాలన్న సీఎం ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఎంతమేర లక్ష్యాలను చేరుకున్నామో సీఎం జగన్కు వివరించిన వివిధ శాఖలకు చెందిన అధికారులు ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను వివరించిన అధికారులు గత ఏడాదితో పోలిస్తే వాణిజ్య పన్నుల ఆదాయ వృద్ధిలో ఏపీ మెరుగైన పనితీరు. కర్ణాటక, మహారాష్ట్రల కంటే మెరుగైన స్థానంలో ఏపీ గత ఏడాదితో పోలిస్తే కర్ణాటకలో 27.51శాతం, మహారాష్ట్రలో 24.4 శాతం, ఆంధ్రప్రదేశ్ లో 25.29శాతం వృద్ధి 2022-23లో రాష్ట్రంలో వాణిజ్యపన్నుల ఆదాయం రూ. 51,481 కోట్లు. 93.24శాతం లక్ష్యాన్ని చేరుకున్నట్టుగా వెల్లడించిన అధికారులు. ఈ ఆర్థిక సంవత్సరంలో (2023-24) రూ.60,191 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నామన్న అధికారులు. లీకేజీలను అరికట్టి, సమగ్ర పర్యవేక్షణలద్వారా లక్ష్యాన్ని చేరుకునే మార్గాలపై దృష్టిపెట్టినట్లు వెల్లడించిన అధికారులు. సీఎం ఆదేశాల మేరకు డేటా అనలిటిక్స్, ఆటోమేషన్, శాఖలతో సమన్వయం, ఎగవేతలపట్ల అప్రమత్తత, సమర్థతను పెంచుకునే పద్ధతుల ద్వారా పనితీరును మెరుగుపరుచుకుంటున్నామన్న అధికారులు. యంత్రాంగంలో సరైన విధానాలను అమలు చేయడం ద్వారా సమర్థత గణనీయంగా పెరుగుతుందని, దీనివల్ల లీకేజీలు అరికట్టడమే కాకుండా పన్ను చెల్లింపుదారులకు చక్కటి సేవలు అందుతాయని, తద్వారా ఆదాయాలు పెరుగుతాయన్న సీఎం. వీటిపై దృష్టిపెట్టాలన్న సీఎం. స్టాంపులు రిజిస్ట్రేషన్ల ఆదాయం వృద్ది చెందినట్టుగా తెలిపిన అధికారులు గత ఐదేళ్లుగా క్రమంగా పెరుగుతూ వస్తున్న స్టాంపులు రిజిస్ట్రేషన్ల ఆదాయం 2018-19లో ఈ శాఖ ఆదాయం రూ.4725 కోట్లు కాగా, 2022-23 నాటికి రూ. 8071కోట్లకు చేరిన ఆదాయం రిజిస్ట్రేషన్లు, టౌన్ ప్లానింగ్ విభాగాలు, మండల కార్యాలయాలు, గ్రామవార్డు సచివాలయాలు సహా ఇతర చోట్లకూడా ఎక్కడా కూడా అవినీతికి ఆస్కారం ఉండకుండా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం. సేవలు అందించడంలో అత్యంత పారదర్శకత ఉండాలన్న సీఎం ఎవరికి ఫిర్యాదు చేయాలన్న దానిపై ఏసీబీ నంబర్లను ఆయా కార్యాలయాల్లో ప్రముఖంగా కనిపించేలా హోర్డింగ్స్ఉంచాలన్న సీఎం. మానవ ప్రమేయాన్ని తగ్గించి పారదర్శకతను పెంచే సాంకేతిక విధానాలపై అధ్యయనం చేసి వాటిని అమల్లోకి తీసుకురావడంపై దృష్టిపెట్టాలన్న సీఎం. వచ్చే సమీక్షా సమావేశం నాటికి మంచి మార్పులు కనిపించాలని అధికారులకు సీఎం ఆదేశం. అవినీతి నిరోధకశాఖను క్రియాశీలకంగా ఉంచాలని సీఎం ఆదేశం. డ్రగ్స్, మత్తుపదార్థాలను నివారించడానికి, వాటి పంపిణీని అడ్డుకోవడానికి అధికారులు గట్టి దృష్టిపెట్టాలని సీఎం ఆదేశం యూనివర్శిటీలు, కాలేజీలు, విద్యాసంస్థల వద్ద కచ్చితంగా టోల్ ఫ్రీ నంబర్ ఉండేలా హోర్డింగ్స్ఉంచాలన్న సీఎం. డ్రగ్స్ నివారణ కార్యక్రమాలు, టోల్ ఫ్రీ నంబర్ పనితీరుపై ప్రతి జిల్లాలో ప్రతి 15 రోజులకోసారి మాక్ డ్రిల్ చేపట్టాలన్న సీఎం. గనులు ఖనిజాల శాఖలో 2022-23 సంవత్సరంలో రూ.4500 కోట్లు లక్ష్యం కాగా, రూ. 4,756 కోట్ల ఆదాయం. గత ఏడాదితో పోలిస్తే 26శాతం వృద్ధి. ఈ ఏడాది రూ.6వేలకోట్ల మేర ఆదాయ లక్ష్యాన్ని పెట్టుకున్నామన్న అధికారులు. రవాణాశాఖలో 2022-23లో ఆదాయం రూ. 4294.12 కోట్లు. 95.42శాతం లక్ష్యాన్ని చేరుకున్న రవాణా శాఖ 2018-19లో ఈ ఆదాయం రూ. 3224.98 కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) లో రూ.6999.42 కోట్ల లక్ష్యంగా పెట్టుకున్నామన్న అధికారులు. రవాణాశాఖలో మెరుగైన విధానాలు తీసుకురావాలన్న సీఎం. దీనిపై అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్న సీఎం. -
సీఎస్కు ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్: ఎక్సై జ్, వాణిజ్య పన్నుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి పూ ర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆమెకు సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి వి.శేషాద్రి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో సీఎస్గా ఉన్న సోమేశ్కుమార్ ఈ శాఖలను పర్యవేక్షించేవారు. కొత్త సీఎస్గా శాంతికుమారి బాధ్యతలు తీసుకున్నప్పటికీ ఆ రెండు శాఖల బాధ్యతలు ఆమె తీసుకోలేదు. ఈ నేపథ్యంలోనే సీఎస్కు ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖల పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
Telangana: న్యూ ఇయర్ కిక్.. ఒక్కరోజే రూ.215 కోట్లు తాగేశారు..
హైదరాబాద్: తెలంగాణలో డిసెంబర్ 31న ఎక్సైజ్ శాఖకు భారీ ఆదాయం వచ్చింది. ఒక్కరోజే రూ.215 కోట్ల 74 లక్షలు ఆర్జించింది. మద్యం అమ్మకాలు తగ్గినప్పటికీ ధరలు పెరిగిన కారణంగా ఇంత మొత్తం వచ్చింది. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 19 డిపోల నుండి జరిగిన రిటైల్ అమ్మకాలు వివరాలు (సుమారుగా)... 2 లక్షల 17 వేల 444 లిక్కర్ కేసులు లక్షా 28వేల 455 కేసుల బీర్లు హైదరాబాద్ 1 డిపో 15 వేల 251 లిక్కర్ కేసులు 4వేల 141 కేసుల బీర్లు 16 కోట్ల 90 లక్షలు ఆదాయం హైదరాబాద్ 2 డిపో 18 వేల 907 లిక్కర్ కేసులు 7వేల 833 బీర్ కేసులు 20 కోట్ల 78 లక్షల ఆదాయం మొత్తం హైదరాబాద్ రెండు డిపోల్లో వచ్చిన ఆదాయం రూ.37 కోట్ల 68 లక్షలు. చదవండి: మందుబాబులకు షాక్.. 5,819 డ్రైవింగ్ లైసెన్స్లు రద్దు -
మందుబాబులకు హెచ్చరిక..
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలను ప్రజలందరూ ఎంతో జోష్తో జరుపుకుంటున్నారు. మరికొన్ని గంటల్లో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు కూడా న్యూ ఇయర్కు స్వాగతం పలుకనున్నారు. ఈ సందర్భంగా వేడుకలపై తెలంగాణ పోలీసులు నిఘా పెట్టారు. అటు ఎక్సైజ్ శాఖ అధికారులు సైతం వేడుకలపై ఫోకస్ పెట్టారు. న్యూ ఇయర్ వేడుకలపై మందుబాబులపై ఎక్సైజ్ శాఖ నిఘా పెట్టి 26 స్ట్రైకింగ్ టీమ్లను ఏర్పాటు చేశారు అధికారులు. ఈవెంట్లలో డ్రగ్స్ సరఫరాపై ప్రత్యేకంగా ఫోకస్ పెంచారు. ఇక, డిసెంబర్ 31 సందర్బంగా రాత్రి 12 గంటల వరకు వైన్స్, ఒంటి గంట వరకు బార్లకు అనుమతి ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్టు అధికారులు హెచ్చరించారు. మరోవైపు.. న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు కూడా మందుబాబులను హెచ్చరించారు. పోలీసులు నెక్లెస్రోడ్, కేబీఆర్ పార్క్రోడ్, బంజారాహిల్స్ రోడ్ నెం.1, 2, 45, 36లతో పాటు జూబ్లీహిల్స్ రోడ్నెం. 10, సికింద్రాబాద్, మెహదీపట్నం, గండిపేట దారుల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ రేసులు, డ్రంకన్ డ్రైవింగ్ పైనా కన్నేసి ఉంచుతారు. బహిరంగ ప్రదేశాల్లో టపాసులు కాల్చడం నిషిద్ధం. వాహనాల్లో ప్రయాణిస్తూ, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చేస్తే చర్యలు తప్పవు. వాహనాలు టాప్స్, డిక్కీలు ఓపెన్ చేసి డ్రైవ్ చేయడం, కిటికీల్లోంచి టీజింగ్ చేయడం వంటిని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తారు. ‘సాగర్’ చుట్టూ నో ఎంట్రీ... కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, దురుసుగా డ్రైవింగ్ చేయడం, మితిమీరిన వేగం, పరిమితికి మంచి వాహనాలపై ప్రయాణించడం చేయకూడదని పేర్కొన్నారు. శాంతి భద్రతల విభాగం అధికారులతో పాటు ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తారని, ఉల్లంఘనలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్యాంక్ బండ్ పైన భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా హుస్సేన్సాగర్ పరిసరాల్లో ట్రాఫిక్ మళ్లింపులు విధించారు. శనివారం రాత్రి 10 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్రోడ్, అప్పర్ ట్యాంక్ బండ్లపై వాహనాల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించారు. ప్రత్యామ్నాయాలు లేని బేగంపేట, లంగర్హౌస్ ఫ్లైఓవర్ మినహా మిగిలిన అన్ని ఫ్లైఓవర్లను శనివారం రాత్రి మూసి ఉంచుతారు. ఓఆర్ఆర్, వంతెనలు బంద్ నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో ఔటర్ రింగ్ రోడ్డు, పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వేలపై వాహనాలకు అనుమతి లేదు. నేడు రాత్రి 11 గంటల నుంచి 1న ఉదయం 5 గంటల వరకు ఈ అంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. విమాన టికెట్, ఇతరత్రా ధ్రువీకరణ పత్రాలు చూపించిన ప్రయాణికులను మాత్రమే ఆయా మార్గాల్లో అనుమతి ఇస్తారు. అలాగే దుర్గం చెవురు కేబుల్ బ్రిడ్జి, శిల్పా లైఅవుట్ ఫ్లైఓవర్, గచ్చిబౌలి, బయోడ్రైవర్సిటీ, షేక్పేట్, మైండ్స్పేస్, రోడ్ నం–45, సైబర్ టవర్, ఫోరంమాల్–జేఎన్టీయూ, ఖైత్లాపూర్, బాబు జగ్జీవన్రామ్ ఫ్లైఓవర్లు రాత్రి 11 నుంచి ఉదయం 5 వరకు పూర్తిగా బంద్ ఉంటాయి. అలాగే నాగోల్, కామినేని ఫ్లైఓవర్లు, ఎల్బీనగర్, చింతలకుంట అండర్పాస్లు రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు ద్విచక్ర వాహనాలకు, ప్యాసింజర్ వాహనాలకు అనుమతి లేదు. -
ప్రైవేట్ హాస్టల్పై ఎక్సైజ్ దాడి
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్లోని ఒక పేయింగ్గెస్ట్ హాస్టల్పై బుధవారం ఎక్సైజ్ శాఖ స్టేట్ టాస్క్ఫోర్స్ అధికారులు దాడిచేసి కొకైన్, ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎన్.అంజిరెడ్డి ఆధ్వర్యంలోని అధికారుల బృందం బుధవారం బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లోని పేయింగ్ గెస్ట్ హాస్టల్పై దాడి చేశారు. నూతన సంవత్సర వేడుకల సమయంలో అమ్మేందుకు కొకైన్, ఎండీఎంఏను నిల్వ చేసినట్లు సమాచారం రావడంతో అధికారులు హుటాహుటిన దాడి చేశారు. ఈ క్రమంలో 48 గ్రాముల ఎండీఎంఏ, 25 గ్రాముల కొకైన్, ఒక మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎన్.అంజిరెడ్డి తెలిపారు. ఈ కేసులో ఏ1గా హరి సతీశ్ను అరెస్టు చేసినట్లు వివరించారు. గ్రాము కొకైన్ను రూ.10 వేలు, గ్రాము ఎండీఎంఏను రూ.5వేల చొప్పున విక్రయించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారని సమాచారం అందడంతో దాడులు చేసి నిందితుడిని అరెస్టు చేసి అమీర్పేట్ ఎస్హెచ్వో జ్యుడీషియల్ రిమాండ్కు పంపినట్లు తెలిపారు. -
ఎక్సైజ్ శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
‘మత్తు’ వదిలిద్దాం
మరింత సమర్థంగా ఎస్ఈబీ అక్రమ మద్యం, బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం, ఇసుక అధిక ధరలకు విక్రయించడం లాంటి ఫిర్యాదులపై ఎస్ఈబీ అధికారులు సత్వరం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి. ఎస్ఈబీ మరింత సమర్థంగా పని చేయాలి. కేవలం అక్రమ మద్యం అరికట్టేందుకే పరిమితం కాకుండా మాదక ద్రవ్యాలు, గంజాయి, గుట్కాలు లాంటి వాటిపై కఠినంగా వ్యవహరించాలి. అందుకోసం స్థానిక ఇంటెలిజెన్స్ (నిఘా) వ్యవస్థను సద్వినియోగం చేసుకోవాలి. – సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: ఎక్సైజ్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(ఎస్ఈబీ), పోలీసు శాఖలు మరింత సమన్వయంతో పనిచేసి రాష్ట్రాన్ని సంపూర్ణంగా మాదక ద్రవ్యాలు, అక్రమ మద్య రహిత ప్రాంతంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాలు, అక్రమ మద్యాన్ని పూర్తిగా అరికట్టడం, సచివాలయాల్లో మహిళా పోలీసు వ్యవస్థ బలోపేతం, కట్టుదిట్టంగా దిశ వ్యవస్థను అమలు చేయడం అత్యంత ప్రాధాన్యత అంశాలని అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు. ఈ నాలుగు అంశాలపై పోలీసు శాఖ, ఎస్ఈబీ ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. అక్రమ మద్యం, గంజాయి నిర్మూలన చర్యలు, కేసుల నమోదు తదితర అంశాలపై సోమవారం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్షించారు. దిశ యాప్ వినియోగం, కాల్స్పై తక్షణ స్పందన కోసం అన్ని చోట్లా మాక్ డ్రిల్ నిర్వహించాలని సూచించారు. సీఎం సమీక్షలోముఖ్యాంశాలు ఇవీ.. సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వారంలో రెండు సమావేశాలు మాదక ద్రవ్యాలు, అక్రమ మద్యం నిర్మూలనపై ప్రతి మంగళవారం సమన్వయ సమావేశం నిర్వహించాలి. అక్రమ మద్యం, గంజాయి సాగును అరికట్టేందుకు తీసుకున్న చర్యలను ఎక్సైజ్, ఎస్ఈబీ శాఖలు సమీక్షించాలి. ఆ తరువాత ప్రతి గురువారం పోలీసు ఉన్నతాధికారులు సమావేశం కావాలి. జిల్లా ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాదక ద్రవ్యాలు, అక్రమ మద్యాన్ని అరికట్టడం, సచివాలయాల్లో మహిళా పోలీసులతో సమన్వయం, సమర్థంగా దిశ వ్యవస్థ వినియోగం తదితర అంశాలపై సమీక్షించాలి. ఇక నుంచి ఇవన్నీ క్రమ తప్పకుండా పాటించాలి. 14500 టోల్ఫ్రీ నంబర్తో హోర్డింగ్లు మాదక ద్రవ్యాల దుష్ఫ్రభావాలపై ప్రచారం చేపట్టి కాలేజీలు, యూనివర్సిటీల్లో విస్లృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ఎస్ఈబీ టోల్ఫ్రీ నంబర్ 14500పై పెద్ద ఎత్తున అవగాహన కల్పించడంతోపాటు మాదక ద్రవ్యాల దుష్పరిణామాలను వివరిస్తూ కాలేజీలు, యూనివర్సిటీల వద్ద భారీ హోర్డింగులు ఏర్పాటు చేయాలి. ఎక్కడా, ఏ విద్యార్థీ మాదక ద్రవ్యాల బారిన పడకుండా చూడాలి. రాష్ట్రాన్ని వచ్చే మూడు నాలుగు నెలల్లో సంపూర్ణ మాదక ద్రవ్యాల రహిత ప్రాంతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పోలీసు, ఎక్సైజ్ శాఖలు సమన్వయంతో పని చేయాలి. మన కాలేజీలు, యూనివర్సిటీలు మాదక ద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. అందుకోసం అన్ని కాలేజీలు, యూనివర్సిటీల వద్ద నెలరోజుల్లో హోర్డింగుల ఏర్పాటు పూర్తి చేయాలి. పటిష్టంగా మహిళా పోలీసు వ్యవస్థ మహిళా పోలీసులు, దిశ వ్యవస్థ, యాప్ను ఇంకా పటిష్టం చేయాలి. రాష్ట్రంలో దాదాపు 15 వేల మంది మహిళా పోలీసులు ఉన్నారు. వీరి సేవలను వినియోగించుకుంటూ దిశ వ్యవస్థను మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలి. దిశ యాప్ డౌన్లోడ్స్ పెరగాలి. ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు గంజాయి సాగు విడనాడిన వారికి వ్యవసాయం, ఇతర ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలి. అప్పుడే వారికి శాశ్వత ఉపాధి కల్పించినట్లు అవుతుంది. గంజాయి సాగుదార్లల్లో మార్పు తెచ్చేందుకు ఆపరేషన్ పరివర్తన్ పటిష్టంగా నిర్వహించాలి. అంతా మనవైపు చూసేలా.. మనం చేసే మంచి పనులకు అవార్డులు రావాలి. మన మాదిరిగా సచివాలయాల్లో మహిళా పోలీసు వ్యవస్థ దేశంలో ఎక్కడా లేదు. కాబట్టి మహిళా పోలీసు వ్యవస్థను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి. దానివల్ల మంచి ఫలితాలు రాబట్టవచ్చు. దేశమంతా మనవైపు చూసే స్థాయిలో పనితీరు చూపాలి. 2.82 లక్షల ఆర్వోఎఫ్ఆర్ పట్టా భూములు రాష్ట్రంలో 1.15 లక్షల కుటుంబాలకు దాదాపు 2.82 లక్షల ఎకరాల ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చాం. ఆ భూముల అభివృద్ధికి తీసుకున్న చర్యలపై అధికారులు నివేదిక ఇవ్వాలి. హాజరైన మంత్రులు, ఉన్నతాధికారులు.. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి, హోంమంత్రి తానేటి వనిత, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, ఎక్సైజ్ శాఖ కమిషనర్ వివేక్ యాదవ్, అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్, ఎస్ఈబీ డైరెక్టర్ రమేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నార్కోటిక్స్ రహిత రాష్ట్రంగా ఏపీ మారాలి : సీఎం వైఎస్ జగన్
-
నార్కొటిక్స్ రహిత రాష్ట్రంగా ఏపీ మారాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి : రాష్ట్రంలో ఎక్సైజ్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) పనితీరు పైన సోమవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. నార్కొటిక్స్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారాలని ఈ సమావేశంలో ఆయన ఆకాంక్షించారు. ఎక్కడా మాదక ద్రవ్యాలు వినియోగం ఉండొద్దు.. ఆ లక్ష్యంతోనే పని చేయాలంటూ పోలీస్, ఎక్సైజ్ శాఖలు కలిసి పని చేయాలంటూ ఆయన సూచించారు. ఈ సందర్భంగా సంబంధిత శాఖల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్న ఆయన.. పలు కీలక సూచనలు చేశారు. ఎస్ఈబీ సమీక్ష సందర్భంగా.. నార్కొటిక్స్తో పాటు అక్రమ మద్యాన్ని పూర్తిగా అరికట్టడం, మరింత సమన్వయంతో సచివాలయాల్లోని మహిళా పోలీస్ల పనితీరును మెరుగుపర్చడం, దిశ చట్టం.. యాప్లను మరింత పక్కాగా అమలు చేసేలా చూడడం.. ఈ నాలుగింటిపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. అలాగే.. రాష్ట్రాన్ని నార్కొటిక్స్ రహిత ప్రాంతంగా తీర్చి దిద్దడంలో ఎక్సైజ్, ఎస్ఈబీ అధికారులతో పోలీస్ శాఖ మరింత సమన్వయంతో పని చేయాలని కోరారు. అదే విధంగా దిశ యాప్ వినియోగం, కాల్స్, వేగంగా స్పందించడం వంటి వాటిపై అన్ని చోట్లా మాక్ డ్రిల్స్ నిర్వహించాలని సీఎం జగన్ సూచించారు. ఇకపై వారంలో రెండు సమావేశాలు మరింత సమర్థవంతంగా పని చేసేందుకు ప్రతి మంగళవారం సమన్వయ సమావేశం నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశించారు. అక్రమ మద్యం నియంత్రణ దిశలో ఎస్ఈబీ, ఎక్సైజ్ అధికారులు తీసుకున్న చర్యలు, గంజాయిసాగు అరికట్టడంపై సమీక్షించాలన్నారు. అలాగే.. ప్రతి గురువారం పోలీస్ ఉన్నతాధికారులు సమావేశం కావాలన్నారు. జిల్లా ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి.. నార్కొటిక్స్, అక్రమ మద్యాన్ని అరి కట్టడం, సచివాలయాల మహిళా పోలీసులతో సమన్వయం, దిశ చట్టం, యాప్ ఇంకా సమర్థ వినియోగంపై సమీక్షించాలని, ఇక నుంచి ఇవన్నీ రెగ్యులర్గా జరగాలని సీఎం జగన్ అధికారులకు స్పష్టం చేశారు. కాలేజీలు, వర్సిటీల్లో ప్రచారం ఎస్ఈబీ టోల్ఫ్రీ నెంబర్.. 14500తో పాటు, నార్కొటిక్స్ నియంత్రణపై అన్ని కాలేజీలు, యూనివర్సిటీల వద్ద పెద్ద హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలని, విద్యార్థులు నార్కొటిక్స్ వినియోగించకుండా అరికట్టాలని సీఎం జగన్ కోరారు. వచ్చే మూడు, నాలుగు నెలల్లో నార్కొటిక్స్ రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చి దిద్దాలని ఆయన ఆకాంక్షించారు. అదే లక్ష్యంతో పోలీస్, ఎక్సైజ్ శాఖ అధికారులు పని చేయాలని కోరారు. మన యూనివర్సిటీలు, కాలేజీలు.. అన్నీ జీరో నార్కొటిక్స్గా ఉండాలి. అదే ఆయా శాఖల లక్ష్యం కావాలి. ఇందు కోసం నెల రోజుల్లో అన్ని కాలేజీలు, వర్సిటీల్లో హోర్డింగ్ల ఏర్పాటు పూర్తి కావాలి అని చెప్పారు. పటిష్టం చేయండి మహిళా పోలీసులు, దిశ చట్టం, యాప్ను ఇంకా పటిష్టం చేయాలి. మహిళా పోలీసుల పనితీరు ఇంకా మెరుగుపర్చడంపై దృష్టి పెట్టాలి. రాష్ట్రంలో దాదాపు 15 వేల మంది మహిళా పోలీస్లు ఉన్నారు. ఇంకా దిశ చట్టాన్ని ఇంకా బాగా అమలు చేయాలి. యాప్ డౌన్లోడ్స్ పెరగాలి అని సీఎం జగన్.. సంబంధిత అధికారులకు తెలిపారు. ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలి: గంజాయిసాగుదార్లకు వ్యవసాయం, పాడి వంటి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపాలి. అప్పుడు వారికి శాశ్వత ఉపాధి కల్పించినట్లు కూడా అవుతుంది. గంజాయి సాగుదార్లను మార్చే విధంగా, ‘ఆపరేషన్ పరివర్తన్’ నిర్వహించాలని సీఎం జగన్ సూచించారు. ఎస్ఈబీ ఇంకా సమర్థంగా.. అక్రమ మద్యం గురించి కానీ, పబ్లిక్ ప్లేసెస్లో మద్యపానం కానీ.. ఇసుక ఎక్కువ ధరకు అమ్మడం కానీ.. ఇలా దేనిపై ఫిర్యాదు వచ్చినా ఎస్ఈబీ అధికారులు వెంటనే స్పందించాలి. తగిన చర్య తీసుకోవాలి. ఆ విధంగా ఎస్ఈబీ మరింత సమర్థంగా పని చేయాల్సిన అవసరం ఉంది. ఎస్ఈబీ పరిధి కేవలం లిక్కర్ వరకే కాకుండా నార్కొటిక్స్, గంజాయి, గుట్కాలు.. వంటి వాటి విషయాల్లో కూడా కఠినంగా వ్యవహరించాలి. లోకల్ ఇంటలిజెన్స్ను (నిఘా)ను బాగా వినియోగించుకోవాలి. ప్రత్యేక గుర్తింపు రావాలి.. మనం చేసిన పనుల వల్ల అవార్డులు రావాలి. దేశంలో ఎక్కడ మన మాదిరిగా సచివాలయాల్లో మహిళా పోలీసులు లేరు. కాబట్టి వారిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి. దాని వల్ల మంచి ఫలితాలు రాబట్టవచ్చు. దేశమంతా మనవైపు చూసేలా మన చర్యలు ఉండాలి. ఆ స్థాయిలో పనితీరు చూపాలి. ఆర్వోఎఫ్ఆర్ పట్టా భూములు.. రాష్ట్రంలో 1.15 లక్షల కుటుంబాలకు 2.82 లక్షల ఎకరాలకు సంబంధించి ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చామన్న సీఎం, ఆ భూముల అభివృద్ధికి సంబంధించి తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. రాష్ట్రంలో మద్యం విక్రయాలు, అక్రమ మద్యం నియంత్రణ, ఆ దిశలో తీసుకున్న చర్యలు, గంజాయి సాగు ధ్వంసం, ఆ సాగుదార్లపై తీసుకున్న చర్యలు, కేసుల నమోదు.. వంటి అన్నింటిపై సమీక్షలో అధికారులు వివరించారు. ఎస్ఈబీ సమీక్ష సమావేశానికి.. డిప్యూటీ సీఎం (ఎక్సైజ్) కే. నారాయణ స్వామి, హోంమంత్రి తానేటి వనిత, డీజీపీ కేవి. రాజేంద్రనాథ్ రెడ్డి, రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, ఎక్సైజ్ శాఖ కమిషనర్ వివేక్ యాదవ్, ఎస్ఈబీ కమిషనర్ ఏ.రవిశంకర్, ఎస్ఈబీ డైరెక్టర్ రమేష్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
సారా, అక్రమ మద్యం కట్టడికి కఠిన చర్యలు
సాక్షి, అమరావతి: నాటు సారా, అక్రమ మద్యాన్ని పూర్తిగా అరికట్టాలని ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి కె.నారాయణ స్వామి అధికారులను ఆదేశించారు. దశాబ్దాలుగా సారా తయారీయే వృత్తిగా జీవిస్తున్నవారికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఉద్దేశించిన ‘పరివర్తనం’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. వెలగపూడిలోని సచివాలయంలో గురువారం నిర్వహించిన ఎక్సైజ్ శాఖ సమీక్ష సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అక్రమాలకు పాల్పడినవారి నుంచి సంబంధిత మొత్తాన్ని వసూలు చేసేందుకు ఆర్ ఆర్ చట్టం ప్రయోగించాలని ఆదేశించారు. అంతర్రాష్ట్రస్థాయి గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు విస్తృతంగా తనిఖీలు చేపట్టాలన్నారు. ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, కమిషనర్ వివేక్ యాదవ్, రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్ ఎండీ డి.వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘లిక్కర్’ స్కాంలో ప్రముఖులు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణంలో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వారి పేర్లను ఈడీ ప్రస్తావించింది. బుధవారం ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సహచరుడు అమిత్ అరోరాను రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరుస్తూ రిమాండ్ రిపోర్టును ధర్మాసనానికి అందజేసింది. ఈ రిపోర్టు ద్వారా తొలిసారిగా ఎమ్మెల్సీ కె.కవిత పేరు బయటకొచ్చింది. దక్షిణాది గ్రూప్ నుంచి విజయ్నాయర్కు రూ.100 కోట్లు లంచాలు అందాయని వెల్లడించింది. ఎక్సైజ్ అధికారులకు రూ.కోటి లంచం అందించడంలోనూ విజయ్నాయర్ కీలక పాత్ర పోషించారని పేర్కొంది. దక్షిణాది గ్రూపును శరత్చంద్రారెడ్డి, కె.కవిత, మాగుంట శ్రీనివాసులురెడ్డి నియంత్రించారని పేర్కొంది. మద్యం పాలసీ రూపకల్పన సమయం నుంచి వీరంతా ఎన్ని ఫోన్లు వినియోగించారు. ఎన్ని ఫోన్ నంబర్లు మార్చారన్న అంశాలను తేదీలతో సహా వివరించింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా నాలుగు ఫోన్ నంబర్లు, విజయ్నాయర్ రెండు, సృజన్రెడ్డి ఒకటి, అభిషేక్ బోయినపల్లి ఒకటి, బుచ్చిబాబు గోరంట్ల ఒకటి, శరత్రెడ్డి ఒకటి, కల్వకుంట్ల కవిత రెండు ఫోన్ నంబర్లు వినియోగించారని, ఏయే రోజుల్లో సదరు ఫోన్ వినియోగించారనేది ఐఎంఈఐ నంబర్ సహా స్పష్టం చేసింది. మొత్తంగా 36 మంది (నిందితులు/అనుమానితులు) ఫోన్ నంబర్ల వివరాలను రిపోర్టులో పేర్కొంది. ఈ 36 మంది 170 ఫోన్లు వినియోగించి వాటిని ధ్వంసం చేశారని తెలిపింది. ఈ ఫోన్ల విలువ రూ.1.38 కోట్లు ఉంటుందని పేర్కొంది. 2022, సెప్టెంబర్ 23 వరకూ ఆయా ఫోన్లు వినియోగించారని తెలిపింది. మద్యం విధానంలో భాగంగా 32 జోన్లుగా విభజించారని, ఆయా జోన్లను ఎవరి ఆధ్వర్యంలో నిర్వహించారన్న విషయాలు వివరించింది. మద్యం పాలసీ కారణంగా ప్రభుత్వ ఖజానాకు రూ.2,873 కోట్లు నష్టం వాటిల్లిందని దీనిపై పూర్తిస్థాయి వివరాలు రాబట్టడానికి అమిత్ అరోరాను 14 రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోరింది. -
ఈ ఏడాది మూడుసార్లు పెరిగిన మద్యం ధరలు.. అసలే దసరా కావడంతో
సాక్షి, హైదరాబాద్: మద్యం తయారీ ధరల పెంపు కోసం డిస్టలరీలు ఎత్తులు వేస్తున్నాయి. పండుగ సీజన్ను ఆసరాగా చేసుకుని చీప్ లిక్కర్ కృత్రిమ కొరత సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే దెబ్బకు దెబ్బ అన్నట్టు ఎక్సైజ్ శాఖ ఏకంగా మద్యం దిగుమతులకు సిద్ధమవుతోంది. అయినా ఇప్పటికే బహిరంగ మార్కెట్లో చీప్ లిక్కర్కు స్వల్ప కొరత ఏర్పడింది. డిస్టలరీలు తయారీ నిలిపివేయడంతో పాపులర్ బ్రాండ్ చీప్ లిక్కర్ మార్కెట్లో దొరకడం లేదు. ధర ఎక్కువ ఉన్న బ్రాండ్లే మందు ప్రియులకు దిక్కయ్యాయి. ఈ నేపథ్యంలో దసరా పండుగ నాటికి అసలు మందు దొరికే పరిస్థితి ఉండదనే వదంతులు కూడా ఎక్సైజ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అసలేం జరిగింది? కరోనా లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత రాష్ట్రంలో మూడుసార్లు మద్యం ధరలు పెరిగాయి. కానీ మద్యం తయారు చేసినందుకు గాను డిస్టలరీలకు చెల్లించే ప్రాథమిక ధర (లిక్కర్ కేస్కు చెల్లించే బేసిక్ ప్రైస్)ను మాత్రం ప్రభుత్వం పెంచలేదు. దీంతో పెరిగిన ధరల మేరకు ఆదాయమంతా ప్రభుత్వ ఖజానాకు వెళుతోంది. ఈ నేపథ్యంలో బేసిక్ ప్రైస్ పెంపు కోసం డిస్టలరీలు ప్రయత్నించాయి. ఈఎన్ఏ కొరత అంటూ.. రాష్ట్రంలో ప్రతిరోజూ లక్ష కేసుల వరకు మద్యం అమ్ముడవుతుంది. ఈ లక్ష కేసుల మద్యాన్ని తయారు చేసేందుకు గాను 4 లక్షల లీటర్ల ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ (ఈఎన్ఏ) అవసరమవుతుంది. ఈ ఈఎన్ఏ తయారీ కోసం రాష్ట్రంలో 8 ప్రైమరీ డిస్టలరీలున్నాయి. ఈ డిస్టలరీల్లో రెక్టిఫైడ్ స్పిరిట్, ఇథనాల్తో పాటు ఈఎన్ఏ కూడా తయారవుతుంది. ఇందులో స్పిరిట్, ఇథనాల్ను ఇండ్రస్టియల్ ఆల్కహాల్గా పరిగణిస్తారు. ఈఎన్ఏతో సెకండరీ డిస్టలరీలు మద్యం తయారు చేస్తాయి. అయితే ఈఎన్ఏ తయారు చేయడం కోసం ప్రైమరీ డిస్టలరీలకు ఆహార ధాన్యాలు (గోధుమలు, బియ్యం), మొలాసిస్ అవసరం. తెలంగాణలోని డిస్టలరీల్లో నూక బియ్యాన్ని మాత్రమే ఉపయోగించి ఈఎన్ఏ తయారు చేస్తారు. కస్టమ్ మిల్లింగ్ బియ్యం (సీఎంఆర్) వ్యవహారంలో మిల్లులపై ఎఫ్సీఐ దాడులు చేయడంతో నూక బియ్యం సరఫరా తగ్గిపోయింది. దీంతో ప్రస్తుతం నాలుగు డిస్టలరీలే ఈఎన్ఏను పూర్తిస్థాయిలో తయారు చేస్తున్నాయి. ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకోవాలని డిస్టలరీలు ఎత్తు వేశాయి. మద్యం తయారుచేసే ఈఎన్ఏ (ముడిసరుకు) ధర పెరిగిందని, అసలు ముడిసరుకు దొరకడం లేదని, నాలుగు డిస్టలరీల్లో తయారవుతున్న ఈఎన్ఏ.. ప్రీమియం బ్రాండ్ల తయారీకి అవసరమవుతుందంటూ చీప్ లిక్కర్ తయారీని డిస్టలరీలు నిలిపివేశాయి. బేసిక్ ప్రైస్ పెంచాలని ప్రతిపాదించాయి. ఎక్సైజ్ పరిశీలనలో గుట్టు రట్టు డిస్టలరీల ప్రతిపాదనను ఎక్సైజ్ శాఖ నిశితంగా పరిశీలించడంతో అసలు విషయం బయటపడింది. అసలు ఈఎన్ఏ కొరతే లేదని, అవసరాల మేరకు ఈఎన్ఏ అందుబాటులో ఉందని తేలింది. రోజుకు 4 లక్షల లీటర్ల ఈఎన్ఏ అవసరం కాగా, డిస్టలరీల్లో 10 రోజులకు సరిపడా (అంటే 40 లక్షల లీటర్లు) స్టాక్ ఉందని గుర్తించింది. పూర్తి స్థాయిలో పనిచేస్తున్న నాలుగు ప్రైమరీ డిస్టలరీల నుంచే రోజుకు 3.5 లక్షల లీటర్ల ఈఎన్ఏ ఉత్పత్తి అవుతోందని తేలింది. అయినప్పటికీ ఒకవేళ సరిపోని పక్షంలో ముడిసరుకును మహారాష్ట్ర, కర్ణాటక నుంచి దిగుమతి చేసుకోవాలని, ఇందుకు గాను ప్రతి లీటర్పై ఉన్న రూ.4 సుంకాన్ని ఎత్తివేస్తామని ప్రతిపాదించింది. అవసరమైతే చీప్ లిక్కర్ను కూడా దిగుమతి చేసుకోవాలని, ఇందుకోసం ప్రతి కేస్పై వసూలు చేసే ఆరు రూపాయల సుంకాన్ని కూడా ఎత్తివేస్తామని ప్రతిపాదించింది. అదే సమయంలో డిస్టలరీలు కోరుతున్న విధంగా బేసిక్ ప్రైస్ పెంచేందుకు శాఖాపరమైన కమిటీని నియమించి, అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కోరుతూ ఉత్తర్వులు జారీ చేసింది. -
పారదర్శకంగా బార్ల లైసెన్సుల ప్రక్రియ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బార్ల లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకున్నవారిలో బుధవారం నాటికి 834 మంది నాన్ రిఫండబుల్ ఫీజు చెల్లించారు. కొత్త బార్ పాలసీ ప్రకారం బార్ల లైసెన్సుల జారీ ప్రక్రియను ఎక్సైజ్ శాఖ పూర్తిగా ఆన్లైన్ విధానంలో పారదర్శకంగా నిర్వహిస్తోంది. మొత్తం 130 మున్సిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో మూడేళ్లపాటు 840 బార్ల లైసెన్సుల కేటాయింపునకు ఎక్సైజ్ శాఖ ఇటీవల నోటిఫికేషన్ జారీచేసింది. వాటిలో 123 మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో బార్ల లైసెన్సుల కోసం 1,672 మంది ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు. వారిలో 1,441 మంది ప్రాసెసింగ్ ఫీజు చెల్లించారు. వారిలో 1,308 మంది చలానాలు తీసుకోగా బుధవారం నాటికి 834 మంది నాన్రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు చెల్లించారు. నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు చెల్లించేందుకు గురువారం సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉంది. చలానాలు తీసుకున్నప్పటికీ సాంకేతికపరమైన సందేహాలతో పలువురు వేచిచూసే ధోరణి అవలంబించారు. ఆ సందేహాలు కూడా తొలగిపోవడంతో నాన్ రిఫండబుల్ దరఖాస్తు ఫీజు చెల్లింపులు వేగం పుంజుకున్నాయి. గురువారం మరింతమంది దరఖాస్తు ఫీజు చెల్లిస్తారని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. అనంతరం బిడ్లు తెరిచి ఈ నెల 30, 31 తేదీల్లో ఈ–వేలం నిర్వహించి బార్ల లైసెన్సులను ఖరారు చేస్తారు. -
రాష్ట్రంలో మద్యం కచ్చితంగా నాణ్యమైనదే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విక్రయిస్తున్న మద్యంలో ఎలాంటి విషపూరిత అవశేషాలు లేవని.. నిర్దేశిత ప్రమాణాల ప్రకారం కచ్చితంగా పూర్తి నాణ్యత పాటిస్తున్నామని ఏపీ, తెలంగాణ లిక్కర్, బీర్ సరఫరాదారుల అసోసియేషన్ స్పష్టం చేసింది. మద్యాన్ని మూడు దశల్లో ప్రభుత్వ ల్యాబొరేటరీల్లో పరీక్షించిన అనంతరమే ఎక్సైజ్ శాఖ అనుమతితో మార్కెట్లోకి విడుదల చేస్తున్నామని వెల్లడించింది. విజయవాడలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.కామేశ్వరరావు మాట్లాడుతూ.. మద్యంలో విషపూరిత అవశేషాలు ఉన్నట్టుగా తాము నివేదిక ఇవ్వలేదని చెన్నైలోని ఎస్జీఎస్ ల్యాబొరేటరీ కూడా స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఎవరికైనా సందేహాలు ఉంటే తమ డిస్టిలరీలకు వచ్చి పరిశీలించుకోవచ్చన్నారు. ‘మద్యం ప్రైమరీ ప్రొడక్ట్ను మొదట ప్రభుత్వ కెమికల్ ల్యాబొరేటరీలో పరీక్షించి ఆమోదించిన తరువాతే ఉత్పత్తిని తయారు చేస్తారు. దాన్ని తీసుకుని మేం బ్లెండ్ చేసి మరోసారి ప్రభుత్వ ల్యాబొరేటరీకి పరీక్ష నిమిత్తం పంపిస్తాం. అక్కడ కూడా పరీక్షించి ఆమోదించిన తరువాతే మద్యం ఉత్పత్తిని ప్రారంభిస్తాం. ఆ విధంగా ఉత్పత్తి చేసిన మద్యాన్ని మరోసారి ప్రభుత్వ ల్యాబొరేటరీలో పరీక్షించి ఆమోదించిన తరువాతే మారెŠక్ట్లోకి విడుదల చేస్తాం’ అని ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్లో విక్రయిస్తున్న మద్యం నాణ్యతపై టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ఆయన చెప్పారు. టీడీపీ నేతలు చెప్పిన ప్రమాదకర అవశేషాలేవి మద్యంలో లేనే లేవన్నారు. మద్యం తయారీ, బాట్లింగ్, ప్యాకింగ్, రవాణా వరకూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. తమ సొంత ల్యాబ్లతోపాటు ప్రభుత్వ ల్యాబొరేటరీలలో పరీక్షించిన అనంతరమే మద్యం ఉత్పత్తులు స్కాన్ అవుతాయన్నారు. నాణ్యతా ప్రమాణాలను నిర్ధారించుకునేందుకు నావల్ ల్యాబొరేటరీలో కూడా పరీక్షించి ఆమోదం తీసుకుంటున్నామన్నారు. ఈ విధంగా మూడు దశాబ్దాలుగా మద్యం నాణ్యత విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉంటున్నామని ఆయన చెప్పారు. డిమాండ్ను బట్టే అందుబాటులో బ్రాండ్లు ఏయే బ్రాండ్ల మద్యాన్ని అందుబాటులో ఉంచాలన్నది వినియోగదారుల డిమాండ్ను బట్టి ఉంటుందని కామేశ్వరరావు చెప్పారు. దాదాపు అన్ని ప్రధాన బ్రాండ్లు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. గతంలో ధర గిట్టుబాటు కాక కొన్ని బ్రాండ్లు మార్కెట్లోకి రాలేదని.. మళ్లీ ధర గిట్టుబాటు అయితే అందుబాటులోకి తెచ్చారని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్నవే మంచి బ్రాండ్లు అన్నది కేవలం అపోహ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఒక్కో కంపెనీకి నాలుగైదు బ్రాండ్లు ఉంటాయని ఆయన చెప్పారు. ఫలానా బ్రాండు మద్యాన్నే విక్రయించాలని ప్రభుత్వం నుంచి గానీ ఎవరి నుంచి గానీ తమపై ఒత్తిడి లేదని స్పష్టం చేశారు. తెలంగాణతో పోలిస్తే మద్యం సరఫరాకు ఏపీ ప్రభుత్వం చెల్లిస్తున్న ధరలు తక్కువగా ఉన్నాయని ఆయన చెప్పారు. మద్యం సరఫరా ధరలు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు సత్యనారాయణరెడ్డి (ఈగల్ డిస్టిలరీస్), చంద్రశేఖర్ (పీఎంకే డిస్టిలరీస్), వెంకటేశ్వరరావు (అంబర్ స్పిరిట్స్) తదితరులు పాల్గొన్నారు. -
రూ.90 లక్షల విలువైన గంజాయి స్వాధీనం
భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఎక్సైజ్ అధికారులు శనివారం నిర్వహించిన తనిఖీల్లో రూ.90 లక్షల విలువైన 300 కేజీల గంజాయి పట్టుబడింది. వివరాలివి. ఎక్సైజ్ సీఐ రహీమున్నీసా బేగం సిబ్బందితో కలిసి శనివారం తెల్లవారుజామున కూనవరం రోడ్డులో తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో వెళ్తున్న కారును ఆపేందుకు ప్రయత్నించగా ఆగకుండా దూసుకుపోయింది. దీంతో ఆ వాహనాన్ని వెంబడించి పట్టుకునే క్రమంలో ఎక్సైజ్ అధికారుల వాహనం ముందు భాగం దెబ్బతింది. అక్కడి నుంచి పారిపోయిన నిందితుల వాహనం కోసం గాలిస్తుండగా రామాలయం వద్ద కనిపించింది. దాన్ని తనిఖీ చేయగా 300 కేజీల గంజాయి లభించడంతో సీజ్ చేశారు. పట్టుబడిన వాహనం జార్ఖండ్ రాష్ట్రానికి చెందినదని గుర్తించామని, నిందితులు పారిపోయారని సీఐ తెలిపారు. -
ఆబ్కారీకి నకిలీ మకిలి! కోట్లలో అక్రమార్జన
సాక్షి హైదరాబాద్: ఆబ్కారీశాఖలో నకిలీ ఈవెంట్ పర్మిట్ల దందా చర్చనీయాంశంగా మారింది. వేడుకల సందర్భంగా మద్యం వినియోగానికి నకిలీ అనుమతులు ఇచ్చిన ఉదంతంలో శంషాబాద్ ఎక్సైజ్ స్టేషన్కు చెందిన ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు, ఓ ఔట్సోర్సింగ్ ఉద్యోగిని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. నగర శివార్లలోని ఫంక్షన్ హాళ్లు, స్టార్ హోటళ్లు, బాంక్విట్ హాళ్లు వంటి చోట్ల నిర్వహించే వేడుకల సందర్భంగా మద్యం వినియోగం కోసం పెద్ద సంఖ్యలో నకిలీ అనుమతులను ఇచ్చినట్లు వెల్లడి కావడంతో ఎక్సైజ్ శాఖ సదరు ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. ఈ ఉదంతం వెనుక పైఅధికారుల ప్రమేయం కూడా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇద్దరు సీఐలతో పాటు మరో సూపరింటెండెంట్ స్థాయి అధికారి అనుమతితోనే నకిలీ దందా కొనసాగినట్లు ఎక్సైజ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వ ఖాతాలో చేరాల్సిన సొమ్మును స్వాహా చేయడాన్ని తీవ్రంగా పరిగణించి క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సి ఉండగా కేవలం సస్పెన్షన్కే పరిమితం కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శంషాబాద్ ఎక్సైజ్ స్టేషన్తో పాటు నగర శివార్లలోని మరికొన్ని స్టేషన్ల పరిధిలోనూ ఇలాంటి నకిలీ పర్మిట్లు వందల సంఖ్యలో వెలువడ్డాయని, ఉన్నతస్థాయిలో విచారణ జరిపితే అనేక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు కొందరు అధికారులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఎక్సైజ్ శాఖలో ఏళ్లుగా.. మరోవైపు తాజాగా నకిలీ అనుమతుల ఉదంతం వెలుగులోకి వచ్చినప్పటికీ 2016 అక్టోబర్ నుంచి ఇలాంటి అనుమతుల దందా కొనసాగుతున్నట్లు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు తదితర ప్రాంతాల్లో ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో వేడుకలు జరుగుతాయి. అంతర్జాతీయ స్థాయి సమావేశాలు నిర్వహిస్తా రు. ఇలాంటి కార్యక్రమాలకు ఒకరోజు అనుమతికి రూ.8000 నుంచి రూ.9000 వరకు మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమాలకు రూ.30 వేలకుపైగా ఎక్సైజ్శాఖకు చలానాల రూపంలో చెల్లించి ఆన్లైన్లో అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. పైఅధికారుల అండతోనే కిందిస్థాయి సిబ్బంది అనుమతుల సమూనాపత్రాల్లో తేదీలు, వేడుక స్థలాలను మార్పు చేసి ఇస్తున్నారు. ఇలా ఏటా వందల సంఖ్యలో నకిలీ అనుమతులు వెలువడుతున్నాయి. ప్రభుత్వ ఖజానాకు చేరవలసిన ఆదాయం కొందరు అధికారులు, సిబ్బంది జేబుల్లోకొ వెళ్తోంది. మరోవైపు ఈ తరహా అక్రమాలకు పాల్పడే సిబ్బంది ఎలాంటి బదిలీలు లేకుండా ఏళ్లుగా ఒకేచోట పాతుకుపోయి పని చేయడం గమనార్హం. ఏసీబీతో విచారణ జరిపించాలి.. ప్రజాధనం దుర్వినియోగానికి పాల్పడిన నేపథ్యంలో నకిలీ అనుమతులపై ఉద్యోగుల సస్పెన్షన్, శాఖాపరమైన విచారణకు పరిమితం కాకుండా ఏసీబీ విచారణ జరిపించాలని, ఏ స్థాయి అధికారులైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ వర్గాలు కోరుతున్నాయి. (చదవండి: పడవతో గస్తీ.. లేక్ పోలీసింగ్ వ్యవస్థ) -
తెలంగాణలో మరో జాబ్ నోటిఫికేషన్.. 614 పోస్టులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇప్పటికే 16,614 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు.. గురువారం ట్రాన్స్పోర్ట్, అబ్కారీ శాఖల్లోని కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర రోడ్డు రవాణా శాఖలోని 63 కానిస్టేబుల్ పోస్టులు, ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ (అబ్కారీ)లో 614 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలిసింది. ఇందుకోసం మే 2వ తేదీ నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు నోటిఫికేషన్లో పేర్కొంది. రవాణా శాఖలో హెడ్ ఆఫీస్లో 6 కానిస్టేబుల్ పోస్టులు, లోకల్ కేడర్ కేటగిరీలో 57 పోస్టులు భర్తీ చేయనున్నట్టు తెలిపింది. ఇంటర్మీ డియెట్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు అబ్కారీ కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని, రవాణా శాఖ పోస్టులకైతే ఇంటర్తో పాటు లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చని బోర్డు అధికారులు వెల్లడించారు. ఓసీ, బీసీ కేటగిరీ అభ్యర్థులు రూ.800, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.400 దరఖాస్తు రుసుముగా చెల్లించాలని సూచించారు. నాలుగు రోజుల క్రితం విడుదల చేసిన నోటిఫికేషన్లోని పోస్టులు, కేటగిరీలకు ఏయే రిజర్వేషన్లు ఉన్నాయో అవే రిజర్వేషన్లు ఆయా కేటగిరీల అభ్యర్థులకు వర్తిస్తాయని బోర్డు స్పష్టం చేసింది. కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నిర్వహించే విధంగానే ముందుగా ప్రిలిమినరీ రాతపరీక్ష, శారీరక దారుఢ్య పరీక్షలు, చివరగా తుది రాత పరీక్ష ఉంటుందని తెలిపింది. మొదటిసారిగా బోర్డు.. అబ్కారీ, ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుళ్ల భర్తీ ప్రక్రియ గతంలో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించేది. అయితే మొదటిసారిగా యూనిఫాం పోస్టులకు సంబంధించిన పూర్తి నియామక ప్రక్రియను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు ప్రభుత్వం అప్పగించింది. అన్ని పోస్టులకు విద్యార్హతలతో పాటు నియామక ప్రక్రియ దాదాపుగా ఒకే విధంగా ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. -
ఎక్సైజ్ అధికారులకు పదోన్నతులు
సాక్షి, హైదరాబాద్: ఎక్సైజ్ శాఖలో ఎస్సై స్థాయి నుంచి అదనపు కమిషనర్ వరకు వివిధ హోదాల్లో పనిచేస్తున్న అధికారులకు పదోన్నతులు లభించాయి. శనివారం ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్గౌడ్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ పదోన్నతుల పత్రాలను అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ పదోన్నతులు సాధించిన ఉద్యోగులను అభినందించారు. రాష్ట్రంలో కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతే గంజాయి, గుడుంబాలను నిర్మూలించగలిగామని చెప్పారు. డ్రగ్స్పై ఉక్కుపాదం మోపాలని ఎక్సైజ్ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు అజయ్రావు, హరికిషన్, అంజన్రావు, డేవిడ్ రవికాంత్, శాస్త్రి, ఖురేషి, సురేశ్రాథోడ్, చంద్రయ్యగౌడ్, దత్తురాజుగౌడ్, సత్యనారాయణ, రవీందర్రావు, గణేశ్గౌడ్, కిషన్నాయక్, అరుణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఎక్సైజ్ ఉద్యోగులకు ‘ఉగాది కానుక’
సాక్షి, హైదరాబాద్: ఎక్సైజ్ శాఖలో పని చేస్తున్న అధికారులు, ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఉగాది కానుక ప్రకటించింది. రాష్ట్రంలో అన్ని శాఖల ఉద్యోగులకు పదోన్నతులు కల్పించిన తరహాలోనే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో ఎస్ఐ నుంచి అదనపు కమిషనర్ స్థాయి అధికారుల పదోన్నతులతో పాటు పోస్టుల అప్గ్రెడేషన్కు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారు. ఇందుకు అనుగుణంగా నేడు పదోన్నతుల పత్రాలను రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అందజేస్తారని మంత్రి కార్యాలయ వర్గాలు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించాయి. -
AP: రాష్ట్రంలో కల్తీ మద్యం లేనేలేదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కల్తీ మద్యం అనేది లేనేలేదని ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు, కొన్ని మీడియా సంస్థలు దురుద్దేశంతోనే ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు దుష్ప్రచారం చేస్తున్నాయని అన్నారు. విజయవాడలో ఆదివారం విలేకరుల సమావేశంలో రజత్ భార్గవ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో ఏడాదికి 90 వేల మద్యం నమూనాలే పరీక్షించేవారని చెప్పారు. కానీ.. ప్రస్తుత ప్రభుత్వంలో రెండేళ్లుగా ఏటా 1.50 లక్షల నమూనాలను పరీక్షిస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో విక్రయిస్తున్న మద్యం బ్రాండ్ల నమూనాలను ఐదు ప్రాంతీయ ల్యాబొరేటరీల్లో ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ తగిన ప్రమాణాల మేరకు ఉన్నవాటినే మార్కెట్లో విక్రయానికి అనుమతిస్తున్నామని చెప్పారు. జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం అమ్మకాలు జరగలేదన్నారు. అక్కడ మృతుల్లో ఎవరూ కల్తీ మద్యం వల్ల మరణించలేదని వైద్య పరీక్షల నివేదికలు కూడా స్పష్టం చేశాయని చెప్పారు. కొత్త డిస్టిలరీలకు అనుమతివ్వలేదు 2018 తరువాత రాష్ట్రంలో కొత్తగా ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదని రజత్ భార్గవ తెలిపారు. ప్రస్తుతం మద్యం బ్రాండ్లను తయారు చేస్తున్న డిస్టిలరీలకు గత ప్రభుత్వ హయాంలో 2018లోనే అనుమతి ఇచ్చినట్టు చెప్పారు. సారా తయారీ, అక్రమ మద్యం అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేసే వారిపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్రంలో మద్యపానాన్ని నిరుత్సాహ పరచడమే లక్ష్యంగా నిర్దేశించుకుని కార్యాచరణ చేపట్టిందన్నారు. అందుకోసమే గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన 43 వేల బెల్ట్ దుకాణాలను తొలగించడంతోపాటు 4,380 పర్మిట్ రూమ్ల అనుమతులను రద్దు చేసినట్టు తెలిపారు. మద్యం దుకాణాలను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకుని వాటి సంఖ్యను 4,380 నుంచి 2,934కు తగ్గించినట్టు వివరించారు. మద్యం విక్రయ సమయాలను కూడా కుదించామన్నారు. దాంతో రాష్ట్రంలో 2018–19తో పోలిస్తే 2019–20లో మద్యం విక్రయాలు 25 శాతం, బీర్ విక్రయాలు 59 శాతం తగ్గాయని వివరించారు. ఇక 2020–21లో అయితే మద్యం విక్రయాలు 40 శాతం, బీర్ విక్రయాలు 77 శాతం తగ్గాయని చెప్పారు. సారా, అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపుతున్నాం రాష్ట్రంలో సారా, అక్రమ మద్యం అమ్మకాలపై ఉక్కుపాదం మోపుతున్నామని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) కమిషనర్ వినీత్ బ్రిజ్లాల్ స్పష్టం చేశారు. అందుకోసం ప్రత్యేక బృందాలను వినియోగించి ఏజెన్సీ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల్లో కూడా విస్తృతంగా తనిఖీలు, దాడులు నిర్వహిస్తున్నామన్నారు. డ్రోన్ కెమెరాలు, జియో ట్యాగింగ్, ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టామన్నారు. 2020లో సెబ్ను ఏర్పాటు చేసిన తరువాత ఇప్పటివరకు 93,722 కేసులు నమోదు చేసి, 70 వేల మందిని అరెస్ట్ చేశామన్నారు. సారా, అక్రమ మద్యం అరికట్టేందుకు గతంలో ‘ఆపరేషన్ నిఘా’ నిర్వహించగా.. ప్రస్తుతం ప్రత్యేకంగా ‘ఆపరేషన్ పరివర్తన్–2.ఓ’ నిర్వహిస్తున్నామన్నారు. గడచిన 10 రోజుల్లోనే 2,051 కేసులు నమోదు చేసి 1,260మందిని అరెస్ట్ చేశామన్నారు. మొత్తం 26,375 లీటర్ల సారా, 89 వాహనాలను జప్తు చేసి 10.05 లక్షల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశామని వివరించారు. సారా, అక్రమ మద్యం విక్రయించే వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నామన్నారు. -
అక్రమ మద్యం కేసులో మహిళకు 6 నెలల జైలు
విశాఖ లీగల్: అనుమతి లేకుండా ప్రభుత్వ మద్యాన్ని అక్రమంగా విక్రయించిన మహిళకు ఆరు నెలల జైలు, రూ.2 లక్షల జరిమానా విధిస్తూ నగరంలోని ఎక్సైజ్ కేసుల ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి శ్రీకాంత్ గురువారం తీర్పునిచ్చారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మరో రెండు నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక నూతన ఎక్సైజ్ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. ఈ చట్టం ప్రకారం ఎవరైనా అక్రమంగా మద్యాన్ని విక్రయిస్తే కనీసం 6 నెలల జైలు శిక్షతో పాటు రూ.2లక్షల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ చట్టం అమలులోకి వచ్చిన తరువాత రాష్ట్రంలోనే తొలి తీర్పు కావడం విశేషం. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అవతారం అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. గాజువాక పెదగంట్యాడ పితానివానిపాలెంకి చెందిన పితాని సన్యాసమ్మ (50) 2020 ఆగస్టు 18న పెదగంట్యాడ సమీపంలోని ఆటోనగర్లో 12 మద్యం సీసాలు విక్రయిస్తూ ఉండగా న్యూపోర్టు పోలీసులు పట్టుకున్నారు. ఆమె నుంచి మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పునిచ్చారు. -
నడిగడ్డ.. నకిలీ లిక్కర్ అడ్డా
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఇప్పటికే నకిలీ పత్తివిత్తనాలు, నకిలీకల్లు, రేషన్ రీసైక్లింగ్తో అక్రమాలకు అడ్డాగా మారిన నడిగడ్డలో మరో నకిలీ వ్యవహారం బయటపడింది. జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం పాతపాలెంలో నకిలీ లిక్కర్ తయారీ దందా బయటపడటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. నకిలీ మద్యాన్ని గోవా, కర్ణాటక లిక్కర్ పేరిట చుట్టుపక్కల ప్రాంతాల్లోని బెల్ట్షాపులకు సరఫరా చేయడంతోపాటు బ్రాండెడ్ లేబుళ్లతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా రవాణా చేస్తున్నట్లు వెల్లడైంది. ముఠా పట్టుబడిందిలా.. రెండురోజుల క్రితం కర్ణాటక నుంచి స్పిరిట్ (100శాతం ప్యూర్ ఆల్కహాల్) లోడ్తో కారు వస్తున్నట్టు సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు.. గద్వాల జిల్లా పాతపాలెం వద్ద కాపు కాసి పట్టుకున్నారు. 70 లీటర్ల (2 క్యాన్లు) స్పిరిట్ను, వాహనాన్ని నడుపుతున్న పాతపాలెం నివాసి వీరేశ్ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా.. నకిలీ మద్యం తయారీ కేంద్రం గుట్టు తెలిసింది. దీనితో ఎక్సైజ్ అధికారులు, పోలీసులు ఆదివారం పాతపాలెంలో నకిలీ మద్యం తయారు చేస్తున్న గోపి అనే వ్యక్తి ఇంటిపై దాడులు చేశారు. నకిలీ మద్యం తయారుచేసే యంత్రం, బ్రాండెడ్ మద్యానికి సంబంధించిన నకిలీ లేబుళ్లు, ఫ్లేవర్, 35 లీటర్ల స్పిరిట్ డబ్బా, 50 ఇంపీరియల్ బ్లూ మద్యం సీసాల కాటన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ దందాతో సంబంధమున్న అలంపూర్ మండలం బొంగూరుకు చెందిన లోకేశ్గౌడ్, కల్లుకుంట్లకు చెందిన నాగరాజుగౌడ్, సింగవరానికి చెందిన బాబుగౌడ్, మల్దకల్ మండలం మద్దెలబండకు చెందిన ఈరన్నగౌడ్ ఇళ్లలోనూ సోదాలు చేశారు. బాబుగౌడ్ ఇంట్లో 140 లీటర్ల స్పిరిట్ను స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా ఈ ముఠా కర్ణాటక నుంచి స్పిరిట్ తీసుకొచ్చి నకిలీ మద్యం తయారుచేసి, గద్వాల జిల్లా, పరిసర ప్రాంతాలతోపాటు ఏపీలోని కర్నూల్ జిల్లాలోని బెల్టుషాపులకు విక్రయిస్తున్నట్టు విచారణలో గుర్తించారు. కర్నూల్కు చెందిన నారాయణగౌడ్, రాయచూర్కు చెందిన శ్రీనివాస్గౌడ్లకు దందాలో భాగస్వామ్యం ఉన్నట్టు తేల్చారు. 8 మంది అరెస్టు.. నకిలీ మద్యం ముఠా, దాడుల వివరాలను ఎక్సైజ్ ఉప కమిషనర్ దత్తురాజుగౌడ్ సోమవారం వెల్లడించారు. మొత్తం 9 మందిపై కేసు నమోదు చేసి, ఎనిమిది మందిని అరెస్టు చేశామని, రాయచూర్కు చెందిన శ్రీనివాస్గౌడ్ పరారీలో ఉన్నాడని తెలిపారు. మొత్తంగా రూ.15 లక్షల విలువైన 210 లీటర్ల స్పిరిట్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. కీలక ప్రజాప్రతినిధి అండతో..! నకిలీ మద్యం దందాలో.. పాతపాలెంకు చెందిన ఒక ప్రభుత్వ ఉద్యోగి, మరో ప్రభుత్వ ఉద్యోగి సోదరుడు భాగస్వాములుగా ఉన్నారని, ఇన్నాళ్లుగా అక్రమార్కులకు జిల్లాకు చెందిన ఓ కీలక ప్రజాప్రతినిధి అండదండలు ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల గ్రామదేవతల ఉత్సవాల నేపథ్యంలో సదరు కీలక ప్రజాప్రతినిధితో వ్యవహారం బెడిసికొట్టిందని.. ఈ క్రమంలోనే నకిలీ మద్యం తయారీ కేంద్రంపై దాడులు జరిగాయని అంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగి ఒకరు ఆ ముఖ్య ప్రజాప్రతినిధి వద్ద గతంలో పనిచేయగా.. అతడి సోదరుడు మద్యం దందాలో పెట్టుబడి పెట్టినట్టు సమాచారం. ఈ క్రమంలోనే వారిని ఈ కేసు నుంచి తప్పించినట్టు ప్రచారం జరుగుతోంది. కర్ణాటక నుంచి స్పిరిట్.. గుట్టుగా బెల్టుషాపులకు.. గద్వాల నియోజకవర్గంలో కేటీదొడ్డికి కర్ణాటకలోని రాయచూర్ జిల్లా సరిహద్దుగా ఉంది. అక్కడి నుంచి స్పిరిట్ (100శాతం ప్యూర్ ఆల్కాహాల్) గద్వాల జిల్లాకు సరఫరా అవుతోంది. రాయచూర్కు చెందిన శ్రీనివాస్గౌడ్ ఈ స్పిరిట్ కొనుగోలు, అమ్మకం, రవాణాలో కీలకమని సమాచారం. ఇక గోపి, వీరేశ్, వీరేశ్గౌడ్, లోకేశ్ గౌడ్, నాగరాజుగౌడ్ తదితరులు ఆ స్పిరిట్ను ఉపయోగించి నకిలీ మద్యాన్ని తయారు చేస్తూ.. స్థానికంగా బెల్టుషాపులకు సరఫరా చేస్తుంటారని తెలిసింది. మరోవైపు ఆలంపూర్ నియోజకవర్గానికి ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా సరిహద్దుగా ఉండటంతో.. ఆ జిల్లా మీదుగా ఏపీలోకి రవాణా చేస్తున్నారు. కర్నూల్కు చెందిన నారాయణగౌడ్ స్థానికంగా, గద్వాల జిల్లాలోని రెండు నియోజకవర్గాల పరిధిలో బెల్ట్షాపులకు నకిలీ మద్యం సరఫరాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు తెలిసింది. వీరంతా కొన్నేళ్లుగా చైన్ పద్ధతిలో మద్యం తయారీ, అమ్మకాలు చేస్తున్నట్టు స్థానికులు చెప్తున్నారు. అంతేకాదు.. ఈ ముఠాలో ఐదుగురికి బినామీ పేర్లతో వైన్స్షాపుల భాగస్వామ్యం ఉందని, అయినా డబ్బుల కోసం నకిలీ మద్యం దందాకు దిగారని అంటున్నారు. నకిలీ మద్యం తయారీ ఇలా.. కర్ణాటక నుంచి వచ్చిన స్పిరిట్ను ఉపయోగించి నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. బ్రాండెడ్ మద్యం వాసన, రంగు వచ్చేలా ఫ్లేవర్లు, నీళ్లు కలుపుతున్నట్టు తేల్చారు. అనుమానం రాకుండా చీప్ లిక్కర్ బాటిళ్లలో నింపి, లేబుళ్లు కూడా అతికించి బెల్ట్ షాపులకు సరఫరా చేస్తున్నారు. -
మరోసారి తెరపైకి వచ్చిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు
Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. డ్రగ్స్ కేసు వివరాలు ఇవ్వాలని తాజాగా ఈడీ ఎక్సైజ్ శాఖకు లేఖ రాసింది. ఇప్పటికే పలువురు సినీతారలను విచారించిన ఈడీ బ్యాంక్ ఖాతాల లావాదేవీలను సైతం పరిశీలించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవలె కేసుకు సంబంధించిన రికార్డులన్నీ ఈడీకి ఇవ్వాలన్న హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో తాజాగా మరోసారి ఈడీ ఎక్సైజ్ శాఖకు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సెలబ్రిటీలు మరోసారి ఈడీ విచారణను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఈ కేసులో మనీలాండరింగ్ కోణంలోనూ దర్యాప్తు చేయనుంది. -
డ్రగ్స్పై ఈడీ అమీతుమీ!
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో అమీతుమీ తేల్చేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సంసిద్ధమైంది. పాత కేసుల్లో స్పష్టత రానందున వాటిని మళ్లీ తిరగతోడే పనిలో ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. హైకోర్టు ఆదేశాలతో 2017లో జరిగిన సినీ ప్రముఖుల డ్రగ్స్ వ్యవహారంలో ఈడీ అధికారులు మరోసారి విచారణకు సిద్ధమవుతుండటం సంచలనం రేపుతోంది. పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా ఈ కేసుకు సంబంధించిన అన్ని వివరాలను ఈడీకి అప్పగించాలని హైకోర్టు ఎక్సైజ్ శాఖను ఆదేశించడంతో కేసు దర్యాప్తు హీటెక్కినట్టు తెలుస్తోంది. తాజాగా హైదరాబాద్లోని పంజగుట్ట పోలీసులు విచారిస్తున్న డ్రగ్స్ పెడ్లర్ (అక్రమ సరఫరాదారు) టోనీ వ్యవహారంపైనా ఈడీ దృష్టిపెట్టింది. విదేశాలకు నిధుల తరలింపుతోపాటు రూ. కోట్లు బదిలీ చేసి వ్యాపారవేత్తలు డ్రగ్స్ దందాలో మనీలాండరింగ్కు పాల్పడినట్టు అనుమానిస్తోంది. పొంతన లేని విచారణ 2017లో డ్రగ్స్ వాడారన్న కేసులో మనీలాండరింగ్ జరిగిందని భావించిన ఈడీ 13 మంది సినీ ప్రముఖులను విచారించింది. అయితే ఈ విచారణలో ఎక్సైజ్ శాఖ నుంచి ఎలాంటి సహకారం అందలేదని ఈడీ హైకోర్టుకు తెలిపింది. అప్పుడు విచారణ సమయంలోనూ ఈడీ అనేక అనుమానాలు వ్యక్తంచేసింది. కేసు విచారణలో బయటకొచ్చిన అంశాలకు, దాఖలు చేసిన చార్జిషీట్లకు పొంతనలేదన్న భావనలో ఈడీ అధికారులున్నట్టు సమాచారం. తాజా పరిణామాల నేపథ్యంలో అప్పటి కాల్డేటా, నిందితుల బ్యాంకు ఖాతాల వివరాలను తీసుకొని మరోసారి పూర్తిస్థాయిలో విచారించాలని భావిస్తోంది. ఈ కేసు విచారణలో కీలకంగా వ్యవహరించిన ముగ్గురు రాష్ట్ర ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులను విచారించాలని యోచిస్తోంది. విచారణ సమయంలో తమకు సహకరించలేదని, మనీలాండరింగ్ అంశాలు బయటకు రాకుండా వ్యవహరించారని అనుమానిస్తోంది. వీరిని విచారిస్తే రాష్ట్రంలో సంచలనంగా మారే అవకాశం ఉంది. రాష్ట్ర అధికారులను కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారనుంది. వ్యాపారవేత్తలకు నోటీసులు! హైదరాబాద్ డ్రగ్ కేసులో టోనీ, ప్రముఖ వ్యాపారవేత్తల వ్యవహారంపైనా ఈడీ చర్యలు చేపట్టింది. వ్యాపారవేత్తల ద్వారా సమకూరిన డబ్బును నైజీరియాకు తరలించి మనీలాండరింగ్కు పాల్పడినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. దీంతో ఈ కేసులో మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద విచారణ జరపాలని భావిస్తోంది. ఈ కేసులో పట్టుబడ్డ 31 మంది వ్యాపారవేత్తల నుంచి హవాలా రూపంలో డ్రగ్స్ కొనుగోలు జరిగిందా అన్న కోణంలోనూ విచారించాలని యోచిస్తోంది. వ్యాపారవేత్తలకు నోటీసులు జారీచేసి విచారించాలని అధికారులు భావిస్తున్నట్టు తెలిసింది. -
బార్ నడుపుతున్న ఎక్సైజ్ సీఐ, ఎస్ఐ!
మదనపల్లె టౌన్: చిత్తూరు జిల్లా మదనపల్లెకి చెందిన ఓ ఎక్సైజ్ సీఐ, ఎస్ఐ నిబంధనలకు విరుద్ధంగా బార్ను లీజుకు తీసుకుని చీకటి వ్యాపారం చేస్తున్న వ్యవహారం వెలుగు చూసింది. ప్రభుత్వ షాపులకు సరఫరా చేయాల్సిన మద్యాన్ని బార్కు మళ్లించి ప్రభుత్వ షాపుల్లో కృత్రిమ కొరత సృష్టించడమే కాకుండా.. అదే మద్యాన్ని సదరు బార్లో అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇదేమని నిలదీసిన వ్యాపార భాగస్వామిపై సీఐ, ఎస్ఐ కిరాయి రౌడీలతో దాడులు చేయించగా.. ఈ వ్యవహారం బట్టబయలైంది. ఈ కేసులో బాధితుడైన నాదెళ్ల వెంకట శివకుమార్ టూటౌన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. మదనపల్లెకు చెందిన ఆనందరెడ్డి తన భార్య నిర్మల పేరిట మదనపల్లె అవెన్యూ రోడ్డులో ఆనంద్ బార్ పేరిట గతంలోనే లైసెన్స్ పొందాడు. దీనిని ఎక్సైజ్ విభాగంలోని మదనపల్లె మద్యం డిపోలో పనిచేస్తున్న సీఐ జవహర్బాబు, ఎస్ఐ సురేష్కుమార్, స్థానిక ఏబీఐ కాలనీలో ఉండే నాదెళ్ల వెంకట శివకుమార్ కలిసి లీజుకు తీసుకున్నారు. కాగా, సీఐ, ఎస్ఐ ప్రభుత్వ మద్యం షాపులకు కేటాయించాల్సిన బీర్లు, ఖరీదైన మద్యాన్ని బార్కు మళ్లించి బ్లాక్ మార్కెట్లో విక్రయాలు సాగిస్తున్న విషయం భాగస్వాముడైన వెంకట శివకుమార్కు తెలిసింది. ఈ విషయాన్ని బార్ యజమాని ఆనంద్కు తెలియజేశాడు. ప్రభుత్వ దుకాణాల్లో అమ్మాల్సిన మద్యాన్ని బార్లో అమ్మటం నేరం కాబట్టి ఆ నేరం తనపైకి వస్తుందన్న భయంతో 20 రోజుల క్రితం బార్కు తాళాలు వేసి తనకు సరుకు వద్దని సీఐ, ఎస్ఐలకు తెగేసి చెప్పాడు. ఆపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆగ్రహించిన సీఐ జవహర్బాబు, ఎస్ఐ సురేష్కుమార్ ఆదివారం కిరాయి రౌడీలతో బార్ తలుపులు ధ్వంసం చేయడమే కాకుండా అడ్డుకున్న వెంకట శివకుమార్పై దాడికి పాల్పడ్డారు. దీనిపై బాధితుడు వెంకట శివకుమార్ ఫిర్యాదు చేయగా.. పోలీసులు బార్ వద్దకు చేరుకుని ముగ్గురు రౌడీలను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉందని టూటౌన్ సీఐ మురళీకృష్ణ తెలిపారు. -
డ్రగ్స్పై.. తగ్గేదేలే!
ఎవరినీ వదలం.. ►ఏదైనా గ్రామంలో ఐదుసార్లకు మించి గంజాయి దొరికితే.. ఆ ఊరికి రైతు బంధుతో సహా అన్నిరకాల సబ్సిడీలను రద్దు చేస్తాం. ►గంజాయి, డ్రగ్స్ కేసుల్లో త్వరగా బెయిల్ రాకుండా చర్యలు. అవసరమైతే పీడీ యాక్ట్. ►డ్రగ్స్ మాఫియాను నిర్మూలించే క్రమంలో పోలీసులకు అధునాతన ఆయుధాలు ►మాదకద్రవ్యాలకు బానిసలైన వారిని గుర్తించి డీఅడిక్షన్ చికిత్స ఇప్పించడం, డ్రగ్స్ నెట్వర్క్ లింకులను గుర్తించి నిర్మూలించడంపై దృష్టి ►మాదక ద్రవ్యాల నియంత్రణకు గ్రేహౌండ్స్ తరహాలో ప్రత్యేకంగా 1,000 మంది సుశిక్షితులైన పోలీస్ సిబ్బంది, కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ఏర్పాటు. మంచి పనితీరు చూపే పోలీసులకు యాక్సెలరేషన్ ప్రమోషన్లు, ప్రోత్సాహకాలు. ►డ్రగ్స్ తయారీ, పంపిణీకి నెలవుగా మారుతున్న ఫార్మా కంపెనీలను గుర్తించి చర్యలు. ►డ్రగ్స్ విషయంలో ఎంతటివారినైనా పోలీసులు ఉపేక్షించొద్దు. ఏ పార్టీ వారైనా సరే వదలొద్దు. ►డ్రగ్స్ నియంత్రణపై జనంలో అవగాహన కోసం రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు, సదస్సులు నిర్వహించాలి. సాక్షి, హైదరాబాద్: ‘‘ఎంత ధనం, ఆస్తులు సంపాదిస్తే ఏం లాభం? మన పిల్లలు మన కళ్ల ముందే డ్రగ్స్కు బానిసలై భవిష్యత్ నాశనమై పోతుంటే ఎంత వేదన. అందుకే రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వాడకాన్ని సమూలంగా మొగ్గలోనే తుంచేయాలి..’’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. డ్రగ్స్, గంజాయి నియంత్రణ కోసం అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని, ఈ విషయంలో ఏ పార్టీవారైనా, ఎంతటి వారైనా సరే వదిలిపెట్టబోమని హెచ్చరించారు. యువత డ్రగ్స్వైపు మళ్లకుండా అవగాహన కల్పించాలని.. ఈ అక్రమ దందాలకు పాల్పడుతున్నవారిని గుర్తించి కటకటాల్లోకి నెట్టాలని అధికారులను ఆదేశించారు. ‘తెలంగాణ ఆర్గనైజ్డ్ క్రైం యాక్ట్’ను తిరిగి అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నదని, అందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని డీజీపీ మహేందర్రెడ్డిని ఆదేశించారు. రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణపై శుక్రవారం ప్రగతిభవన్లో పోలీసు, ఎక్సైజ్ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. గ్రామాల్లో స్థానికులే దృష్టిపెట్టాలి ‘‘గ్రామాల్లో గంజాయి సాగు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయా గ్రామస్తుల మీద కూడా ఉంది. ఏదైనా గ్రామంలో ఐదుసార్లకు మించి గంజాయి దొరికితే.. ఆ ఊరికి రైతు బంధుతో సహా అన్నిరకాల సబ్సిడీలను రద్దు చేస్తాం. ఇటువంటి చట్ట వ్యతిరేక చర్యల విషయంగా గ్రామస్తులంతా అప్రమత్తమై ప్రభుత్వానికి ముందస్తు సమాచారం అందించాలి. ‘డ్రగ్స్ ఫ్రీ’గ్రామాలకు ప్రత్యేక ఫండ్స్తోపాటు ఇన్సెంటివ్స్ ఇస్తాం. డ్రగ్స్ నియంత్రణపై ప్రజల్లో చైతన్యం పెంచేందుకు మీడియా, సినీ మాధ్యమాలను వినియోగించుకోవాలి. డ్రగ్స్ నియంత్రణపై అవగాహన పెంచే సినిమాలు, డాక్యుమెంటరీలు, ప్రకటనలకు సబ్సిడీలు అందించి ప్రోత్సహించాలి. పీడీ యాక్ట్లు.. ఫోరెన్సిక్ ల్యాబ్లు.. వ్యవస్థీకృత నేరాల నియంత్రణ కోసం చేస్తున్న విధంగా.. డ్రగ్స్, గంజాయి దందా చేసేవారిపైనా పీడీ యాక్ట్లు నమోదు చేసేందుకు పోలీసు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలి. నేరస్తులను పట్టుకొని విచారించే క్రమంలో కీలకమైన ‘ఫోరెన్సిక్ ల్యాబ్స్’ను ఆధునాతన సాంకేతికతతో ఏర్పాటు చేయాలి. నిందితులను కోర్టుల ముందు ప్రవేశపెట్టినప్పుడు కేసులు వీగిపోకుండా, నేరాలను రుజువు చేసేందుకు కావాల్సిన అన్నిరకాల ప్రాసిక్యూషన్ విషయంలో పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. డ్రగ్స్ కేసుల్లో బెయిల్ త్వరగా వచ్చే పరిస్థితులు ఉన్నందున.. వ్యసనపరులు, వ్యాపారులు తిరిగి దందా కొనసాగిస్తున్నారు. ఇలా జరగకుండా తగిన న్యాయ సలహాలు తీసుకుని చర్యలు చేపట్టాలి. ఇక నైజీరియా వంటి దేశాల నుంచి వచ్చి డ్రగ్స్ విక్రయిస్తున్న వ్యవస్థీకత నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలి. అలాంటి వారిని వెంటనే గుర్తించి వారి దేశాలకు పంపించేయాలి. సోషల్ మీడియా ద్వారా కూడా డ్రగ్స్ దందా నడుస్తుందనే విషయం పరిశీలనలో తేలింది. దాని మీద కూడా దృష్టి సారించాలి. ద్విముఖ వ్యూహంతో.. ►డ్రగ్స్ను నియంత్రించేందుకు అధికారులు ద్విముఖ వ్యూహాన్ని అనుసరించాలి. మొదట ఇప్పటికే డ్రగ్స్కు బానిసైన వారిని గుర్తించి, వారి కుటుంబ సభ్యుల సహకారంతో డీఅడిక్షన్ చికిత్స ఇప్పించేందుకు కార్యాచరణ రూపొందించాలి. డ్రగ్స్కు ఆకర్షితులవుతున్న యువతను గుర్తించడం, వారికి డ్రగ్స్ అందిస్తున్న నెట్వర్క్ లింకులను గుర్తించి నిర్మూలించడమనేది రెండో కార్యాచరణగా చేపట్టాలి. డ్రగ్స్ మాఫియా ను అరికట్టే క్రమంలో పోలీస్ యంత్రాంగం అధునాతన ఆయుధాలను వినియోగించాలి. చురకల్లాంటి పోలీసు అధికారులకు బాధ్యతలు అప్పగించి డ్రగ్స్ మాఫియాపై విజృంభించాలి. ►ఇంటర్, డిగ్రీ, వృత్తివిద్య కాలేజీలు, విద్యా సంస్థల యాజమాన్యాలను, ప్రిన్సిపాల్స్ను పలిచి సమావేశాలు నిర్వహించాలి. డ్రగ్స్ వినియోగం పట్ల విద్యార్థులు ఆకర్షితులు కాకుండా ఉండేలా అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టాలి. ►డ్రగ్స్ నియంత్రణపై జనంలో అవగాహన కల్పించేందుకు గ్రామ సర్పంచులు, టీచర్లు, లెక్చరర్లు, విద్యార్థులతో సమావేశాలు, సదస్సులు నిర్వహించాలి. మూలాలను గుర్తించాలి.. మూసివేసిన ఫార్మా పరిశ్రమల వంటివి డ్రగ్స్ తయారీ, పంపిణీకి నెలవుగా మారుతున్నాయన్న సమాచారం వస్తోంది. అలాంటి వాటిని తక్షణమే గుర్తించి చర్యలు చేపట్టాలి. ఇతర రాష్ట్రాల నుంచి, సరిహద్దుల్లోంచి గంజాయి అక్రమ రవాణాను రూపుమాపాలి. పోలీస్, ఎక్సైజ్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలి. అక్రమ మద్యం, గుడుంబా, పేకాట నియంత్రణపైనా గట్టిగా దృష్టి సారించాలి. పబ్బులు, బార్లపై ప్రత్యేకంగా నజర్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గంజాయి, ఇతర డ్రగ్స్ వినియోగం మూలాలను గుర్తించి నియంత్రించాలి. రాష్ట్రంలో హుక్కా సెంటర్లనే మాటే వినపడకూడదు. పబ్బులు, బార్లు వంటిచోట్ల డ్రగ్స్ వినియోగంపై దృష్టి సాధించాలి. డీకామ్ ఆపరేషన్లు చేపట్టి.. దందాను గుర్తించి, లైసెన్సులు రద్దు చేయాలి. ఈ మేరకు వాటి యజమానులను పిలిపించి, కచ్చితమైన ఆదేశాలు ఇవ్వాలి.’’ ఎవరైనా సరే.. వదిలేది లేదు.. ►డ్రగ్స్ నియంత్రణ విషయంలో ఎంతటివారినైనా ఉపేక్షించవద్దు. ఈ విషయంలో ఏ పార్టీకి చెందిన వారైనా సరే వదలొద్దు. నేరస్తులను కాపాడేందుకు ప్రజాప్రతినిధులు ప్రయత్నిస్తే.. నిర్ద్వందంగా తిరస్కరించాలి. ►పోలీసులుగానీ, ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది గానీ డ్రగ్స్ వ్యవహారంలో తలదూర్చినట్లు తేలితే కఠినంగా వ్యవహరిస్తాం. తరచుగా ఎక్సైజ్ శాఖపై సమీక్ష నిర్వహిస్తా. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తప్పవు. ►నార్కోటిక్ కేసుల విచారణలో ప్రభుత్వ అడ్వొకేట్లు కొందరు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. డ్రగ్స్ కేసులు వాదించే పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకంలో నిబద్ధత కలిగిన వ్యక్తులను నియమించాలి. గ్రేహౌండ్స్ మాదిరిగా.. ప్రత్యేక సెల్ రాష్ట్రంలో డ్రగ్స్ వాడకం, స్మగ్లింగ్ను మొగ్గలోనే తుంచేందుకు..ఆధునిక హంగులతో కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ను ఏర్పాటు చేసి, ప్రత్యేకంగా 1,000 మందిని నియమించుకోవాలి. ఆపరేషన్స్ యూనిట్లో అసాంఘిక శక్తులను నిర్వీర్యం చేస్తున్న గ్రేహౌండ్స్ మాదిరిగా.. నార్కోటిక్ డ్రగ్స్ను నియంత్రించే విభాగం కూడా పనిచేయాలి. అద్భుత పనితీరు చూపే అధికారులు, సిబ్బందికి రివార్డులు, ఇతర ప్రోత్సాహకాలను అందించాలి. ఇందుకోసం కావాల్సిన నిధులను ప్రభుత్వం సమకూరుస్తుంది. యూకేలో స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు, పంజాబ్వంటి చోట్ల డ్రగ్స్ నియంత్రణ, నేరస్తులను గుర్తించి పట్టుకోవడం కోసం అవలంబిస్తున్న విధానాలను పరిశీలించి.. మనదగ్గరా అమలు చేయాలి. అధికారులు ఆయా చోట్ల పర్యటించి రావాలి. ఈ సమీక్షలో మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్గౌడ్, వేముల ప్రశాంత్రెడ్డి, మల్లారెడ్డి, ఎంపీలు బీబీ పాటిల్, కవితా నాయక్, ఎమ్మె ల్యేలు బాల్క సుమన్, రెడ్యానాయక్, రవీంద్రకుమార్ నాయక్, ఆళ్ల వెంకటేశ్వర్రెడ్డి, రాజేందర్రెడ్డి, గ్యాదరి కిశోర్, సాయన్న, రేఖానాయక్, అబ్రహం, హన్మంత్ షిండే, సీఎస్ సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, పోలీసు, ఎక్సైజ్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
Liquor Sales: తెలంగాణలో లిక్కర్ సేల్స్ రికార్డుల మోత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రికార్డ్ స్థాయిలో లిక్కర్ అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్శాఖ తెలిపింది. డిసెంబర్ నెలలోనే తెలంగాలో అత్యధిక విక్రయాలు నమోదయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే రూ.171 కోట్ల లిక్కర్ అమ్మకాలు జరిగాయి. గత ఐదు వ్యవధిలోనేనే రూ.902 కోట్ల మద్యాన్ని మందుబాబులు స్వాహా చేశారు. గతంలో ఎన్నడూ లేనంతగా డిసెంబర్ నెలలో 3,435 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. గత సంవత్సరం డిసెంబర్లో 2,764 కోట్ల అమ్మకాలు జరిగాయి. 2020లో 25,602కోట్ల అమ్మకాలు జరగ్గా.. 2021 శుక్రవారం సాయంత్రానికే 30,196 కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగాయి. రంగారెడ్డి జిల్లాలో 6,970 కోట్లు, నల్గొండ జిల్లాలో 3288 కోట్లు, హైదరాబాద్లో 3,201 కోట్ల అమ్మకాలు నమోదయినట్లు ఎక్సైజ్శాఖ వెల్లడించింది. చదవండి: (కేకలు, అరుపులు.. జూబ్లీహిల్స్లో యువతి హల్చల్) -
మద్యం తాగే వయసు 21 ఏళ్లకు కుదింపు! ఆ రాష్ట్రాల్లో పూర్తిగా నిషేధం..
Legal Drinking Age Around The World హర్యానా: రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ చట్టాన్ని తాజాగా సవరించింది. తాజా చట్ట సవరణ ప్రకారం మద్యపానం చేయడానికి, కొనడానికి కనీస వయస్సును 25 నుంచి 21కి తగ్గించింది. ఈ మేరకు డిసెంబర్ 22 (బుధవారం)న విధానసభలో వయోపరిమితి మార్పు సవరణ బిల్లుకు ఆమోదం పొందింది. అర్ధాంతరంగా వయసును తగ్గండానికి గల కారణాలను వివరిస్తూ ఇతర రాష్ట్రాలు, దేశాల్లో అమల్లో ఉన్న పరిమితులను ఉదాహరించింది. ఆ వివరాలు ఇలా.. ఐఏఆర్డీ 2020 సేకరించిన సమాచారం మేరకు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో లీగల్ డ్రింకింగ్ ఏజ్ ఈ విధంగా ఉంది.. ►ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, కువైట్, లిబియా ఆల్కహాల్, సౌదీ అరేబియా అమ్మడం, కొనడం, వాడటం ఇక్కడ పూర్తిగా నిషేధం. ►ఆస్ట్రేలియా: 18 ఏళ్లు నిండిన వారు మద్యం కొనుగోలు చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో పెద్దలతో కలిసి మద్యం సేవించడానికి ఇక్కడ అనుమతి ఉంటుంది. ►బంగ్లాదేశ్: నార్కొటిక్స్ కంట్రోల్ శాఖ అనుమతి ఉంటే తప్ప, అన్ని వయసుల వారు మద్యపానం చేయడం నిషేధమిక్కడ. కేవలం ముస్లీంలు మాత్రమే వైద్య కారణాల రిత్యా మద్యం సేవిస్తారు. ►కెనడా: పెద్దల పర్యవేక్షణలో మైనర్లు మద్యంపానం చేయడానికి అనుమతి ఉంటుంది. ►ఈజిప్టు: 18 ఏళ్లు, ఆపై వయసువారు ఎవరైనా మద్యం అమ్మవచ్చు, కొనొచ్చు, తాగొచ్చు. చదవండి: వీడి దుంపదెగా! ఎంత చలి పుడితేమాత్రం ఇన్ని సెగలా? ►జర్మనీ: 16 ఏళ్లవారు బీరు, వైన్, 18 ఏళ్లవారు స్పరిట్స్ సేవించడానికి అనుమతి ఉంటుంది. ఐతే బార్లు, నైట్క్లబ్బుల్లో 18 ఏళ్ల కంటే తక్కువ వయసున్నవారికి అనుమతి లేదు. ►మలేషియా: ముస్లింలకు మద్యం అమ్మడం నిషేధం. ముస్లిమేతరులకు మద్యం అమ్మకానికి చట్టపరమైన వయస్సు 21 సంవత్సరాలు. ►శ్రీలంక: 21 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వారు మద్యం సేవించడానికి అనుమతి ఉంటుంది. ►యూఏఈ: షార్జాలో మద్యపానం నిషేధించబడింది. ఇతర ప్రదేశాల్లోనైతే వయోపరిమితి 21 సంవత్సరాలు. ►అమెరికా: ఆల్కహాల్ సేవించడానికి చట్టపరమైన వయస్సు 21 సంవత్సరాలు. ►యూకే: 18 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వాళ్లు పెద్దలతో కలిసి మద్యం సేవించడానికి అనుమతి ఉంటుంది. ఐతే కొనుగోలు చేయడం చట్ట విరుద్దం. మనదేశంలోనైతే ఇలా.. ►గోవా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, సిక్కిం, పుదుచ్చేరిలలో మద్యం కొనుగోలు చేయడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు. ►బీహార్, గుజరాత్, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్ మరియు లక్షద్వీప్లతో సహా రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు నిషేధించబడ్డాయి. ►ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, ఛత్తీస్గఢ్, జమ్మూ అండ్ కశ్మీర్, జార్ఖండ్, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మిజోరం, ఒరిస్సా (ఒడిశా), రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, త్రిపుర, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్లలో 21 సంవత్సరాలు, హర్యానా, మేఘాలయ, పంజాబ్, ఢిల్లీలో 25గా ఉంది. ఐతే ప్రస్తుత చట్ట సవరణ బిల్లు ద్వారా అది 21 సంవత్సరాలుగా మార్చబడింది. కాగా నూతన సంవత్సర వేడుకల సందర్భంగా దేశంలోని పలు ప్రాంతాల్లో మద్యపాన దుఖాణాలు, పార్టీలపై పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే! ఈ సమయంలో హర్యానా ప్రభుత్వం తీసుకున్న ఈ కీలక నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. చదవండి: Hyderabad: పబ్బుల యాజమాన్యాలకు సీపీ సీరియస్ వార్నింగ్!! -
Telangana : మద్యం దుకాణాలకు ‘రోస్టర్ పాయింట్లు’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లను రోస్టర్ పాయింట్ల పద్ధతిలో అమలు జరపాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు నిబంధనలను రూపొందించింది. ఎక్సైజ్ శాఖ రూపొందించిన నిబంధనల ప్రకారం 2021–23 సంవత్సరాలకు గాను రాష్ట్రంలోని వైన్ (ఏ4) షాపుల్లో 30 శాతం రిజర్వేషన్లు అమలు కానున్నాయి. ఇందులో గౌడ్లకు 15, ఎస్సీలకు 10, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తారు. ఈ రిజర్వేషన్లను అమలు చేసేందుకు జిల్లా కలెక్టర్లు ముందుగా డ్రాలు తీయాల్సి ఉంటుంది. జిల్లా ఎక్సైజ్ అధికారి, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల అధికారులతో కూడిన కమిటీ ముందు వీడియో చిత్రీకరణ చేస్తూ ఈ డ్రాలు తీయాలని నిబంధనల్లో పేర్కొన్నారు. ఆ డ్రాలలో వచ్చిన షాపులను ఈ మూడు వర్గాలకు కోటా మేరకు కేటాయిస్తారు. కోటా పూర్తయిన తర్వాత మిగిలిన షాపులను ఓపెన్ కేటగిరిలో అన్ని వర్గాలకు అందుబాటులో ఉంచుతారు. ఎక్సైజ్ శాఖ రూపొందించిన నిబంధనల ప్రకారం.. ముందుగా జిల్లాలో ఉన్న షాపులన్నింటికీ నంబర్లు కేటాయించి టోకెన్ల రూపంలో ఒక ఖాళీ డబ్బాలో పోయాలి. ఆ డబ్బా నుంచి ఒక్కో టోకెన్ బయటకు తీయాలి. మొదటి టోకెన్ షాపును ఎస్టీలకు, ఆ తర్వాత వచ్చే టోకెన్ను ఎస్సీలకు, ఆ తర్వాతి దాన్ని గౌడ సామాజిక వర్గాలకు కేటాయించాలి. ఈ కోటా పూర్తయిన తర్వాత డబ్బాలో మిగిలిన టోకెన్ నంబర్లున్న షాపులను ఓపెన్ కేటగిరీ డ్రాల కోసం నోటిఫై చేస్తారు. షెడ్యూల్డ్ ఏరియాలో అన్నీ ఎస్టీలకే.. రాష్ట్రంలోని షెడ్యూల్డ్ ప్రాంతాల పరిధిలోనికి వచ్చే షాపులన్నింటినీ గిరిజనులకే కేటాయించాలని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ షాపులన్నీ ఎస్టీలకు రిజర్వ్ చేయనున్న నేపథ్యంలో ఆ ప్రాంతాల్లోని షాపులను సాధారణ డ్రా నుంచి మినహాయించనున్నారు. ఈ షాపులకు ఎస్టీలకు ఇస్తున్నందున మైదాన ప్రాంతాల్లోని షాపుల్లో ఎస్టీలకు పరిమిత సంఖ్యలో మాత్రమే కేటాయించనున్నారు. -
గంజాయి వాడకంపై ఎక్సైజ్ శాఖ అధ్యయనంలో విస్తుగొలిపే అంశాలు
సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్కు బానిసవడం లోనూ దశలుంటాయట. యువత మొబైల్ ఫోన్ల వాల్ పేపర్స్ను బట్టి వాళ్లు డ్రగ్స్కు బానిసలనే విషయాన్ని గుర్తించవచ్చట. వారు ఉపయోగించే కోడ్ భాషల ద్వారా వారు ఏ డ్రగ్ వాడుతున్నారో కూడా చెప్పొచ్చట. రాష్ట్ర ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల పరిశీలనలో వెల్లడైన ఈ అంశాలు విస్తుగొలిపేలా ఉన్నాయి. గంజాయి దమ్ము కొడితే ఎలా ఉంటుందో చూడాలన్న సరదా యువత భవిష్యత్తును బలితీసుకుంటోంది. అప్పటికే ఆ అలవాటున్న స్నేహితుల ఒత్తిడీ ఇందుకు కారణం అవుతోంది. సరదా కాస్తా అలవాటుగా ఆ తర్వాత సీరియస్గా మారుతోంది. డ్రగ్స్ తీసుకోనిదే ఉండలేని పరిస్థితిలోకి తీసుకువెళుతుంది. స్నేహితుల బర్త్డే పార్టీలు, వారాంతపు రోజుల్లో జరిగే సరదా పార్టీలు గంజాయి తాగుడుకు వేదికలుగా మారుతున్నాయ ని ఎక్సైజ్ శాఖ అధ్యయనం స్పష్టం చేసింది. ఆల్కహాల్ తాగితే వచ్చే వాసన తల్లిదండ్రులు సులభంగా గుర్తుపడతారని, అదే గంజాయి అయితే ఎలాంటి వాసన ఉండదన్న భావనతో అందుకు అలవాటుపడుతున్నారు. మిగతా డ్రగ్స్తో పోలిస్తే తక్కువ రేటుకు లభించడం, ఆరోగ్యానికి ఎలాంటి హానీ చేయదనే ఒక అపోహతో చాలామంది గంజాయి తాగుతున్నారని ఎక్సైజ్ అధికారులు తమ పరిశీలనలో గుర్తించారు. నిర్బంధ విద్య బాధితులే ఎక్కువ ఇంజనీరింగ్ కాలేజీలు, బీబీఏ, ఎంబీఏ కాలేజీలు, హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థులు, టెక్నో స్కూళ్లు, ఐఐటీ ఫౌండేషన్స్, కార్పొరేట్ ఇంటర్ కాలేజీల్లో నిర్బంధ విద్యకు గురైన వాళ్లు గంజాయికి అలవాటు పడుతున్న వారిలో ముందు వరుసలో ఉన్నారు. అప్పటివరకు నాలుగు గోడల మధ్య బందీలు మాదిరి ఉన్న విద్యార్థులు పై చదువుల సమయంలో స్వేచ్ఛా భావనకు గురి కావడంతో పాటు కొత్త స్నేహాలతో దురలవాట్లను చేసుకుంటున్నట్టు ఎక్సైజ్ నివేదిక పేర్కొంటోంది. బ్యాగ్లాగ్ పరీక్షలుండటం, ప్రేమ విఫలమవడం, సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో పనిఒత్తిడి, కాల్ సెంటర్ ఉద్యోగుల్లో రాత్రి షిఫ్టులు, వారాంతపు పార్టీల కల్చర్కు బాగా అలవాటు పడిన వారు డ్రగ్స్ తీసుకుంటున్న జాబితాలో మెజారిటీగా ఉంటున్నారని తమ ప్రాథమిక అంచనాల్లో వెల్లడైనట్టు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. కుటుంబాలతో కాకుండా స్నేహితులతో కలిసి గోవా, అరకు, మనాలి ట్రిప్స్కు వెళ్లిన వారిలోనూ ఇలాంటి పోకడలు బయటపడ్డాయని తెలిపింది. విదేశీ, ఉత్తర భారతదేశ విద్యార్థులతో స్నేహం, వారి ప్రభావంతోనూ డ్రగ్స్కు అలవాటు పడుతున్నట్టు గుర్తించింది. మ్యూజిక్ మూడ్లో ఎల్ఎస్డీ స్నేహితులతో తొలుత గంజాయితో మొదలై తదుపరి దశలో ఎల్ఎస్డీగా పిలిచే లిసర్జిక్ ఆసిడ్ డై ఇథలమైడ్ తాగే వరకు వెళ్తోందని ఎక్సైజ్ అనేక కేసుల దర్యాప్తులో గుర్తించింది. గంజాయి తర్వాత సంగీతాన్ని, సైకడెలిక్/ట్రాన్స్ మ్యూజిక్ (ఓ విధమైన మానసిక భ్రాంతికి గురిచేసే మ్యూజిక్) ఎంజాయ్ చేయడానికి ఎల్ఎస్డీ స్టాంప్స్ (నాలుక మీద పెట్టుకునే చిన్న పట్టీ లాంటిది), బ్లాట్స్ (పీల్చే ద్రవం)ను వాడుతున్నట్టు తేలింది. దాదాపు 12 నుంచి 14 గంటల వరకు ఈ డ్రగ్స్ ప్రభావం ఉంటుందని, ప్రమాదరకరమైన ఈ డ్రగ్ గోవాలో జరిగే మ్యూజిక్ పార్టీల్లో యువత భారీగా తీసుకుంటున్నట్టు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. గంజాయి తీసుకునే స్నేహితుల కలిసిన సమయంలో నెక్ట్స్ లెవల్ డ్రగ్స్ (తదుపరి దశ మాదకద్రవ్యాలు) పేరిట జరిగే చర్చలో భాగంగా ఎల్ఎస్డీలు వాడుతున్నారని, డార్క్నెట్ ద్వారా ఇవి సులభంగా మార్కెట్లో దొరుకుతుండటంతో వాటి బారిన పడుతున్నారని చెబుతున్నారు. కోడ్ పదాలుంటే అనుమానించాల్సిందే.. తల్లిదండ్రులు తమ పిల్లల వాట్సాప్, ఫేస్బుక్ మెసెంజర్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ తదితర యాప్స్ను చెక్ చేయాలని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం విజ్ఞప్తి చేస్తోంది. వాటిలో ఏవైనా కోడ్ పదాలు ఉన్నట్టయితే డ్రగ్స్ తీసుకుంటున్నట్టుగా అనుమానించాలని చెబుతోంది. వీడ్, స్కోర్, స్టఫ్, స్టాంప్, ఆసిడ్, పేపర్, ఓసీబీ, కోక్, ఎండీ, జాయింట్, స్టాష్, మాల్, ఖాష్, స్టోనర్, పెడ్లర్, డమ్, పాట్, క్రిస్టల్, బూమ్, డీపీ (దూల్పేట్) అనే కోడ్ పదాలుంటే వీళ్లు డ్రగ్స్ వాడుతున్నట్టేనని భావించాలని సూచించారు. స్క్రీన్సేవర్లు, వాల్ పేపర్లను బట్టీ చెప్పొచ్చు డ్రగ్స్కు బానిసలైన వారి మొబైల్ ఫోన్లు, ట్యాబులు, ల్యాప్ట్యాపులు, వ్యక్తిగత డెస్క్టాప్లను గమనించాలని కూడా అధికారులు సూచిస్తున్నారు. వారి మొబైల్ లేదా కంప్యూటర్లలోని స్క్రీన్ సేవర్, వాల్ పేపర్లలో సైకోడెలిక్ చిత్రాలు, పొగతో కూడిన బొమ్మలు, మల్టీకలర్ ఇమేజులుంటే వారిని నిశితంగా గమనించాలని తల్లిదండ్రులను హెచ్చరిస్తున్నారు. అదే విధంగా విద్యార్థులు బ్యాగ్ల్లో గనుక ఐ డ్రాప్స్, లైటర్స్, ఓసీబీ పేపర్స్ గనుక గమనిస్తే వారు గంజాయి సేవిస్తున్నట్టుగా భావించాలని స్పష్టంచేశారు. మరింత మత్తు కోసం కొకైన్ మద్యం తీసుకున్న తర్వాత మరింత కిక్ రావాలని యువత కొకైన్కు బానిసవుతున్నట్టు ఎక్సైజ్ అధ్యయనంలో తేలింది. 24 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కు లు మరింత కిక్ కోసం కొకైన్ను స్వీకరిస్తున్నారని, ఒత్తిడిని ఎదుర్కోలేక దీని వైపు మళ్లి మత్తులో మునిగి తేలుతున్నారని అధికారులు తెలిపారు. గంట వరకు ప్రభావం చూపించే కొకైన్ను కుంగిపోయిన పరిస్థితుల నుంచి వెంటనే తేరుకోవడానికి ఉపయోగిస్తుంటారని, వ్యాపారంలో నష్టపోయినవారు, కెరీర్లో ఒడిదొడుకులు ఎదుర్కుంటున్న వారు పార్కింగ్ ఏరియాల్లో కార్లలో దీనిని వినియోగిస్తున్నట్టు వెల్లడైంది. తల్లిదండ్రుల సహకారం కీలకం మాదకద్రవ్యాల నియంత్రణకు పోలీస్, ఎక్సైజ్ విభాగాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అయితే యువత తల్లిదండ్రుల సహకారం లభిస్తే మరింత సులభంగా, కఠినంగా డ్రగ్స్ సరఫరాను, వినియోగాన్ని అణిచివేయవచ్చు. అధ్యయనంలో వెల్లడైన అంశాలను ఒక్కసారి పరిశీలించండి. ఇందులోని అంశాలను బట్టి మీ పిల్లల్ని గమనించండి. మీ నియంత్రణే వారికి శ్రీరామరక్ష. మరీ విపరీత దశలో ఉంటే మాకు సమాచారం ఇవ్వండి. సంబంధిత డ్రగ్స్ సరఫరాదారులపై చర్యలు తీసుకునేందుకు, యువతను కాపాడుకునేందుకు ఇది దోహదపడుతుంది. – అంజిరెడ్డి, సూపరింటెండెంట్, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, హైదరాబాద్ -
టాలీవుడ్ డ్రగ్స్ కేసు: ఎక్సైజ్ శాఖకు చుక్కలు చూపిస్తున్న నిందితులు
ప్రస్తుతం టాలీవుడ్ డ్రగ్ కేసు ఇండస్ట్రీలో హాట్టాపిక్గా మారింది. ఇప్పటికే ఈ కేసులో దర్శకుడు పూరి జగన్నాథ్, హీరో రానా దగ్గుబాటి, రవితేజ, తరుణ్, నటి చార్మి కౌర్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్లతో పాటు పలువురు సినీ ప్రముఖులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారించింది. ఈ విచారణ ముగియడంతో పాత నిందితులు పేర్లు మరోసారి తెరపైకి వస్తున్నాయి. గతంలో ఈ కేసుపై ఎక్సైజ్ శాఖ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో నిందితులు ఎక్సైజ్ శాఖకు చుక్కలు చూపిస్తున్నారు. ఈ డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ శాఖ గతంలో 12 మందిపై చార్జ్షీట్ దాఖలు చేయడంతో కోర్టు విచారణకు ఆదేశించింది. కానీ నిందితులు కోర్టు విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నారు. 2019 నుంచి నిందితుడు సంతోష్ దీపక్ అదృశ్యం కాగా.. 2020 నుంచి ఈ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్ కోర్టుకు హజరుకావడం లేదు. మూడు సార్లు కెల్విన్కు కోర్టు నోటీసులు ఇచ్చినప్పటికీ అతడు హజరుకాకుండా తప్పించుకు తిరిగాడు. ఇక 2018లో నుంచి అబూబకర్ అనే మరో నిందితుడు కోర్టు రావడంలేదు. మరో నిందితుడు సోహెల్ పరారీ ఉన్నాడు. మైక్ కమింగ్ విదేశాలకు పారిపోయాడు. ఇలా నిందితులు కోర్టుకు హజరుకాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ కేసు విచారణ ముందుకు సాగడం లేదు. నిందితులపై నాన్ బెయిల్బుల్ వారెంట్ జారీ చేసి వారిని పట్టుకోవడంలో జాప్యం జరుగుతోంది. -
ఏపీ: మద్యం.. తగ్గుముఖం
అక్రమ మద్యంపై ఉక్కుపాదం బెల్ట్ షాపులు, పర్మిట్ రూములను మూసేయించడం, దుకాణాల సంఖ్యను తగ్గించడంతో పాటు.. విక్రయాల సమయాన్ని కుదించాం. తద్వారా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు తగ్గాయి. ఈ సమయంలో రాష్ట్రంలోకి అక్రమంగా మద్యం తరలి రాకుండా చూడాలి. ఎక్కడైనా తయారు చేస్తుంటే చర్యలు తీసుకోవాలి. కాలేజీలు, యూనివర్సిటీలకు సమీపంలో గంజాయి అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎక్కడి నుంచి సరఫరా అవుతుందో నిఘా పెట్టాలి. గంజాయి సాగును గుర్తించి, ఎప్పటికప్పుడు ధ్వంసం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: అక్రమ మద్యం తయారీ, రవాణాతో పాటు గంజాయి సాగు, రవాణాపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులను ఆదేశించారు. మద్యం అక్రమ రవాణా, తయారీకి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఇదివరకే చట్టాన్ని తీసుకు వచ్చామని, దానిని కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ కార్యకలాపాల ప్రగతిపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మద్య నియంత్రణలో భాగంగా రేట్లను పెంచామని, 4,379 మద్యం షాపులను 2,975కు కుదించి.. మూడింట ఒక వంతు దుకాణాలను మూసి వేశామని తెలిపారు. చదవండి: సీఎం జగన్ను కలిసిన తెలంగాణ పర్వతారోహకుడు తుకారాం 43 వేల బెల్టు షాపులను తీసేయడంతో పాటు 4,379 పర్మిట్ రూమ్లను మూసి వేయించడం వల్ల రాష్ట్రంలో మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయన్నారు. ఇది వరకు ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం విక్రయించే వారని, ఈ సమయాన్ని ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల వరకే పరిమితం చేశామని చెప్పారు. ఈ చర్యలన్నింటితో లిక్కర్ అమ్మకాలు నెలకు 34 లక్షల కేసుల నుంచి 21 లక్షల కేసులకు, బీరు అమ్మకాలు నెలకు 17 లక్షల కేసుల నుంచి 7 లక్షలకు తగ్గాయని వివరించారు. ఇలాంటి సందర్భంలో అక్రమంగా రవాణా అవుతున్న మద్యాన్ని, మద్యం తయారీని అడ్డుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. గంజాయి సాగు, రవాణాపై ఉక్కుపాదం ► గంజాయి సాగు, రవాణాపై ఉక్కుపాదం మోపాలి. క్రమం తప్పకుండా దాడులు నిర్వహించి గంజాయి తోటలను ధ్వంసం చేయాలి. పోలీసు విభాగాలు సమన్వయంతో పని చేయాలి. ► డ్రగ్స్కు వ్యతిరేకంగా విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ఏ కాలేజీలోనైనా అలాంటి ఉదంతాలు కనిపిస్తే.. అక్కడ ప్రత్యేక దృష్టి పెట్టాలి. క్రమం తప్పకుండా విశ్వవిద్యాలయాలు, కాలేజీలపై పర్యవేక్షణ ఉండాలి. ► దీనిపై కార్యాచరణ తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలి. ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నామో వచ్చే సమావేశంలో తెలియజేయాలి. ఆరోగ్యానికి అత్యంత హానికరంగా మారిన గుట్కా విక్రయాలు, రవాణాపై దృష్టి పెట్టాలి. ఇసుక ఎక్కువ ధరకు అమ్మితే చర్యలు ► నిర్ధేశించిన రేట్ల కన్నా ఇసుకను ఎక్కువ ధరకు అమ్మితే చర్యలు తీసుకోవాలి. ఎస్ఈబీ కాల్ సెంటర్ నంబర్పై విస్తృత ప్రచారం కల్పించాలి. అధిక రేట్లకు ఎవరైనా అమ్మితే వెంటనే వినియోగదారులు ఆ నంబర్కు కాల్ చేసేలా జిల్లాల వారీగా ప్రచారం చేయాలి. ► వచ్చే కాల్స్పై సత్వరమే స్పందించి అధికారులు చర్యలు తీసుకోవాలి. ఆయా జిల్లాల్లో రేట్ల వివరాలను తెలియజేస్తూ ప్రకటనలు ఇవ్వాలి. అంతకన్నా ఎక్కువ ధరకు ఎవరైనా విక్రయిస్తే.. తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. క్రమం తప్పకుండా అధికారులు దీనిపై పర్యవేక్షణ చేయాలి. వర్షాలు తగ్గుముఖం పట్టగానే మరిన్ని రీచ్లు, డిపోల సంఖ్య పెంచేలా చూడాలి. ► ఈ సమీక్షా సమావేశంలో ప్లానింగ్ అండ్ రిసోర్స్ మొబలైజేషన్ స్పెషల్ సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, డీజీపీ గౌతమ్ సవాంగ్, రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ ఎస్ రావత్, ఇంటెలిజెన్స్ చీఫ్ కే వీ రాజేంద్రనాథ్ రెడ్డి, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్, ఎస్ఈబీ కమిషనర్ వినీత్ బ్రిజ్లాల్, ఎస్ఈబీ డైరెక్టర్ (స్పెషల్ యూనిట్స్) ఏ రమేష్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో బెల్లం ఊటను ధ్వంసం చేస్తున్న పోలీసులు (ఫైల్) కేసుల వివరాలు ఇలా.. ► మద్యం అక్రమ రవాణా, తయారీపై నమోదైన కేసులు : 1,20,822 ► అరెస్ట్ అయిన నిందితులు : 1,25,202 ► 2020లో ఎక్సైజ్ శాఖ నమోదు చేసిన కేసులు : 63,310 ► 2021లో ఎక్సైజ్ శాఖ నమోదు చేసిన కేసులు : 57,512 ► ఎస్ఈబీ నమోదు చేసిన కేసులు : 74,311 ► పోలీసులు నమోదు చేసిన కేసులు : 46,511 ► సీజ్ చేసిన అక్రమ మద్యం (లీటర్లు) : 8,30,910 ► స్వాధీనం చేసుకున్న నాటుసారా (లీటర్లు) : 8,07,644 ► ధ్వంసం చేసిన బెల్లం ఊట (లీటర్లు) : 2,30,48,401 ► సీజ్ చేసిన వాహనాలు : 29,491 ► ఇసుక అక్రమ రవాణాపై నమోదైన కేసులు : 12,211 ► అరెస్ట్ అయిన నిందితులు : 22,769 ► స్వాధీనం చేసుకున్న ఇసుక (టన్నులు) : 5,72,372 ► స్వాధీనం చేసుకున్న వాహనాలు : 16,365 ► గంజాయి సాగు, రవాణాపై నమోదైన కేసులు : 220 ► అరెస్ట్ అయిన నిందితులు : 384 ► స్వాధీనం చేసుకున్న గంజాయి (కిలోలు) : 18,686 ► 2021 మార్చి 20 నుంచి 2021 మార్చి 31 వరకు ఆపరేషన్ నయా సవేరా కింద నమోదైన కేసులు : 69 ► అరెస్ట్ అయిన వారు : 174 ► స్వాధీనం చేసుకున్న గంజాయి (కిలోలు) : 2,176 ► అవేర్నెస్ క్యాంపులు : 330 -
వారి కుట్రలకు ఆగం కావద్దు
హుజూరాబాద్: జాతీయ పార్టీలు బీసీలకు ఏనాడూ న్యాయం చేయలేదని, ఆ పార్టీల కుట్రలకు ఆగం కావొద్దని రాష్ట్ర ఎౖక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. హుజూరాబాద్లోని మార్కెట్ యార్డులో బుధవారం రాష్ట్రమంత్రి హరీశ్రావు అధ్యక్షతన టీఆర్ఎస్కు మద్దతుగా గౌడ కులస్తుల ఆశీర్వాద సభ ని ర్వహించారు. రాష్ట్ర మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ పాల్గొన్నారు. ఈ సభలో, స్థానికంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో శ్రీనివాస్గౌడ్ మాట్లాడారు. గౌడన్నలు సర్దార్ సర్వాయి పాపన్న, ఎల్లమ్మ తల్లి వారసులని పేర్కొన్నారు. గత ప్రభుత్వాల పాలనలో వీరి పరిస్థితి దయనీయంగా ఉండేదన్నారు. గత పాలకుల వైఖరి వల్ల గౌడ కులస్తులు తీవ్రమైన అన్యాయానికి గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాతే వీరి ఆత్మ గౌరవం పెరిగిందని చెప్పారు. వృత్తి, చెట్టు పన్ను మాఫీచేశారని, కల్లు గీత వృత్తి గౌడ లకే పరిమితమని, నీరా అమ్మకాలు గౌడేతరులు విక్రయిస్తే జైలుకు పంపే జీవోలు తెచ్చారని తెలిపారు. వృత్తిలో ప్రమాదవశాత్తు చనిపోయిన గీత కార్మికుల కుటుంబానికి ఇచ్చే ఎక్స్గ్రేషియాను రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచారన్నారు. వైన్ షాపుల్లో రిజర్వేషన్లు ఎక్కడా లేవు తాజాగా వైన్ షాపుల్లో 15 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చారని, వైన్ షాపుల్లో రిజర్వేషన్లు కల్పించడం దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే ఎక్కడా లేదని మంత్రి తెలిపారు. గీత కార్మికులకు మోపెడ్ వాహనాలు ఇవ్వాలని సహచర మంత్రి హరీశ్రావుతో కలిసి సీఎంను కోరతానని హామీ ఇచ్చారు. గెల్లు శ్రీనివాస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇక్కడి మట్టి బిడ్డను నేను: గెల్లు శ్రీనివాస్ ‘ఇక్కడి మట్టి బిడ్డను నేను. ఇక్కడి చెమట చుక్కను నేను. నన్ను ఆశీర్వదిస్తే హుజూరాబాద్ ప్రజలకు సేవ చేస్తా. ఈ నియోజకవర్గంలో నిరుపేదలు చాలామంది ఉన్నారు, అందరికీ ఇళ్లు నిర్మించి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా..’అని హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ అన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిస్తే హుజూరాబాద్కు మెడికల్ కాలేజీ వస్తుందని భరోసా ఇచ్చారు. సభలో ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, గంగాధర్ గౌడ్, లక్ష్మీనారాయణ గౌడ్, ఎమ్మెల్యేలు సతీష్కుమార్, ప్రకాష్ గౌడ్, దివాకర్ గౌడ్, మాజీ పార్లమెంట్ సభ్యులు బూర నర్సయ్య గౌడ్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎక్సైజ్ శాఖ చార్జిషీట్పై ఫోరంఫర్గుడ్ గవర్నెన్స్ అనుమానాలు
-
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మలుపులు
డ్రగ్స్ విషయమై వరుసగా టాలీవుడ్ ప్రముఖులను ఈడీ విచారించిన సంగతి తెలిసిందే. డ్రగ్ డీలర్ కెల్విన్ ఇచ్చిన సమాచారంతో ఈడీ విచారణ జరుగుతుండగా సినీ తారలపై ఎక్సైజ్ శాఖ వరుస ఛార్జ్షీట్లు దాఖలు చేసింది. కెల్విన్తో సెలబ్రిటీలకి ఉన్న సంబంధాలపై విచారించింది. తాజాగా సినీ ప్రముఖులకు అతనితో సంబంధం ఉన్నట్లు బలమైన ఆధారాలు లేవని, నిందితులుగా చేర్చేందుకు కేవలం కెల్విన్ వాగ్మూలం సరిపోదని ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఎక్సైజ్ శాఖ, ఎఫ్ఎస్ఎల్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటులకు క్లీన్చిట్ ఇచ్చాయి. కాగా, 2017 జూలై 2న డ్రగ్స్ కేసులో కెల్విన్ అరెస్టు అయ్యాడు. అతని సమాచారం మేరకు మొత్తం 66 మందిని విచారించిన ఎక్సెజ్సిట్, ముగ్గురు మాత్రమే నిందితులని పేర్కొంది. అయితే ఇటీవల డైరెక్టర్ పూరి జగన్నాథ్, నటుడు తరుణ్ స్వచ్ఛందంగా శాంపిల్స్ ఇవ్వగా, వాటిలో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్(ఎఫ్ఎస్ఎల్) చెప్పింది. చదవండి: డ్రగ్స్ కేసులో కీలక పరిణామం.. ఆ ఇద్దరికి క్లీన్చిట్ -
'సెలబ్రిటీల వద్ద డ్రగ్స్ లభించలేదు...కెల్విన్ వాంగ్మూలం సరిపోదు'
Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సెలబ్రిటీలపై బలమైన ఆధారాలు లేవని ఎక్సైజ్ శాఖ తెలిపింది. సినీతారలపై కెల్విన్ ఇచ్చిన కెల్విన్ వాంగ్మూలం దర్యాప్తును తప్పుదోవపట్టించేలా ఉన్నాయని, కేవలం నిందితుడు చెప్పిన విషయాలను బలమైన ఆధారాలుగా భావించలేం అని ఎక్సైజ్ శాఖ తెలిపింది. 'సినీ తారలు, విద్యార్థులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, హోటల్ నిర్వాహకులకు డ్రగ్స్ అమ్మినట్లు కెల్విన్ వాంగ్మూలం ఇచ్చారు. దాని ఆధారంగా సిట్ బృందం పలువురు సినీ తారలకు నోటీసులు ఇచ్చి ప్రశ్నించింది. అన్ని రకాల సాక్ష్యాలను సిట్ బృందం పరిశీలించి, విశ్లేషించింది. అయితే సెలబ్రిటీలపై బలమైన ఆధారాలు లభించలేదు. సెలబ్రిటీలను నిందితులుగా చేర్చేందుకు కేవలం కెల్విన్ వాంగ్మూలం సరిపోదు. అంతేకాకుండా సెలబ్రిటీలు, ఇతర అనుమానితుల వద్ద డ్రగ్స్ కూడా లభించలేదు' అని ఎక్సైజ్ శాఖ పేర్కొంది. ఇప్పటికే పూరి జగన్నాథ్, తరుణ్ శాంపిల్స్ లో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్(ఎఫ్ఎస్ఎల్) తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. కాగా నిందితులు, సాక్షుల జాబితాలో సినీ తారల పేర్లను ఎక్సైజ్ శాఖ పొందుపరచలేదు. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కెల్విన్ గురించి మాట్లాడుతూ.. 'కెల్విన్ మంగళూరులో చదువుకునేటప్పుడు డ్రగ్స్ కు అలవాటు పడ్డాడని ఎక్సైజ్ శాఖ తెలిపింది. 2013 నుంచి తన స్నేహితులకు డ్రగ్స్ అమ్మడం మొదలు పెట్టాడు. గోవా, విదేశాల నుండి డార్క్ వెబ్ ద్వారా కెల్విన్ డ్రగ్స్ తెప్పించాడు. వాట్సప్, మెయిల్ ద్వారా ఇతరుల నుంచి ఆర్డర్లు తీసుకొని డ్రగ్స్ సరఫరా చేశాడు. చిరునామాలు, ఇతర కీలక వివరాలు దర్యాప్తులో కెల్విన్ వెల్లడించలేదు. కెల్విన్, అతని స్నేహితులు నిశ్చయ్, రవికిరణ్ ప్రమేయం ఆధారాలున్నాయి. సోదాల సందర్భంగా కెల్విన్ వంటగది నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు' అని ఎక్సైజ్ శాఖ వివరించింది. -
సినీ ఈవెంట్లకే ఎఫ్ క్లబ్కు వెళ్లా
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా సినీ నటుడు నవదీప్, ఎఫ్–లాంజ్ క్లబ్ మాజీ జనరల్ మేనేజర్ అర్పిత్ సింగ్ సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరయ్యారు. ముంబైలో ఉన్న నవదీప్ అక్కడ నుంచి నేరుగా ఉదయం 11.15 గంటల ప్రాంతంలో ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన కంటే ముందే అర్పిత్ సింగ్ వచ్చారు. రాత్రి 8.45 గంటల వరకు వీరి విచారణ సాగింది. గత నెల 31న దర్శకుడు పూరీ జగన్నాథ్ తర్వాత ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారించింది వీరిద్దరినే. సోమవారం నాటి విచారణ.. కెల్విన్తో వారికున్న సంబంధాలు, ఎఫ్–క్లబ్ లావాదేవీలు, మనీల్యాండరింగ్ ఆరోపణల కేంద్రంగా జరిగింది. డ్రగ్స్ కేసులో ఇతర నిందితులుగా ఉన్న పీటర్, కమింగ్లతో సంబంధాలు ఉన్నాయా? అనేది ఆరా తీశారు. ఎఫ్–లాంజ్ నా స్నేహితులది: నవదీప్ 2016–17 మధ్య ఎఫ్–క్లబ్లో భారీ స్థాయిలో డ్రగ్స్ పార్టీలు జరిగాయనేది తెలంగాణ ఎక్సైజ్ అధికారుల ఆరోపణ. వాటికి అనేకమంది సినీ ప్రముఖులు హాజరయ్యారని అప్పట్లో వార్తలు వచ్చాయి. దీన్ని నవదీప్ నిర్వహించగా... అర్పిత్ సింగ్ జనరల్ మేనేజర్గా వ్యవహరించాడని ఈడీ అనుమానం. ఆ మధ్యకాలంలో దాదాపు 35 పెద్ద పార్టీలకు ఆ క్లబ్ వేదికైనట్లు ఈడీ ఆధారాలు సేకరించింది. అక్కడ జరిగిన పార్టీలకు కెల్విన్ నుంచి డ్రగ్స్ ఖరీదు చేయడం వంటి ఆరోపణలపై ఇద్దర్నీ వివరణ అడిగింది. ఎఫ్–లాంజ్ తన స్నేహితులకు చెందినదని చెప్పిన నవదీప్... అక్కడ జరిగిన కొన్ని సినీ సంబంధిత ఈవెంట్లకు మాత్రమే తాను వెళ్లానని స్పష్టం చేశారు. తాను సినిమాల్లో నటించడంతో పాటు ఆ రంగానికి సంబంధించిన, ఇతర కీలక ఈవెంట్లూ నిర్వహిస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలోనే మరో ఈవెంట్ మేనేజర్ అయిన కెల్విన్తో పరిచయం ఉందని వివరించారు. అలా కలిసిన సందర్భాల్లోనే ఫొటోలు దిగడం, ఈవెంట్లకు సంబంధించిన వివరాలపై చర్చించిన నేపథ్యంలో ఫోన్, వాట్సాప్ సంభాషణలు ఉండి ఉండవచ్చని చెప్పారు. 2016–18 మధ్య కాలానికి సంబంధించిన తన బ్యాంకు స్టేట్మెంట్లను అందజేశారు. లావాదేవీలన్నీ ఈవెంట్స్కు సంబంధించినవే: అర్పిత్ ఈవెంట్ మేనేజర్గా ఉన్న కెల్విన్ ఎఫ్–క్లబ్లోనూ కొన్ని కార్యక్రమాలు చేసినట్లు అర్పిత్ సింగ్ ఈడీ అధికారులకు తెలిపారు. 2016–17 మధ్య జరిగిన పార్టీలకు ముందు, తర్వాత అనేకమంది సినీ ప్రముఖుల నుంచి అర్పిత్తో పాటు ఎఫ్–క్లబ్ ఖాతాకు భారీగా డబ్బు బదిలీ జరిగిందని ఈడీ ఆధారాలు సేకరించింది. ఆర్థిక లావాదేవీలు జరిగిన మాట వాస్తవమే అని అంగీకరించిన అర్పిత్.. అవన్నీ కేవ లం ఈవెంట్స్, లేదా పార్టీలకు సంబంధించినవి మాత్రమే అని స్పష్టం చేశారు. ఎఫ్–క్లబ్ బ్యాంకు లావాదేవీల రికార్డులను అందించారు. నవదీప్, అర్పిత్ సింగ్లను వేర్వేరుగా ఆపై ఇద్దరినీ కలిపి విచారించిన ఈడీ అధికారులు వాం గ్మూలాలు నమోదు చేశారు. ఈడీ కార్యాలయం నుంచి తిరిగి వెళ్తున్న సమయం లో మీడియాతో మాట్లాడటానికి నవదీప్ విముఖత చూపారు. ఇలావుండగా సినీ నటి ముమైత్ఖాన్ బుధవారం ఈడీ విచారణకు హాజరుకానున్నారు. -
24 గంటలూ కిక్కు
తాడిపత్రి అర్బన్: తాడిపత్రిలో పొద్దు పొద్దున్నే పాల ప్యాకెట్లయినా సరిగా దొరుకుతాయో లేదో కానీ మద్యం మాత్రం అన్ని వేళలా దొరుకుతోంది. సమయం ఏదైనా సరే తలుపు తట్టడమే ఆలస్యం అడిగిన మొత్తం చెల్లిస్తే ఏ బ్రాండ్ మద్యం కావాలన్నా చేతికందిస్తారు. సామాన్యుల వ్యసనాలను ఆసరాగా చేసుకుని ప్రభుత్వ నిబంధనలను బేఖాతారు చేస్తూ తాడిపత్రి పట్టణంలోని బార్ల నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. అందిన కాడికి దోచుకోవడమే ధ్యేయంగా తమ వ్యాపారాన్ని సాగిస్తున్నారు. నిబంధనలకు తూట్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చెప్పినట్లుగానే మద్యపాన నిషేధం దిశగా ఒక్కో అడుగు వేస్తోంది. ఇందులో భాగంగానే ప్రైవేటు మద్యం దుకాణాలకు పూర్తి ఎత్తివేశారు. ప్రభుత్వ ఆధీనంలోనే అది కూడా ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల మధ్యలోనే మద్యం విక్రయాలను కొనసాగిస్తున్నారు. బార్ల సమయాలను కూడా కుదించేశారు. నిబంధనల ప్రకారం ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే మద్యాన్ని విక్రయించాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ మద్యం బాటిళ్లను పార్శిల్ విధానం ద్వారా బయటకు ఇవ్వకూడదు. అయితే తాడిపత్రి పట్టణంలోని బార్ల నిర్వాహకులు నిబంధనలకు నీళ్లొదిలారు. అడిగినంత ఇస్తే చాలు మద్యం ఎప్పుడు కావాలన్నా సరే ఇచ్చేస్తున్నారు. కార్మికులే లక్ష్యంగా.... తాడిపత్రి చుట్టూ అనేక పరిశ్రమలు ఉన్న సంగతి తెలిసిందే. ఆయా సంస్థల్లో పనిచేసే కారి్మకులు కూడా అధికంగానే ఉంటారు. ముఖ్యంగా కారి్మకులనే లక్ష్యంగా చేసుకొని బార్ల నిర్వాహకులు తమ దందాను కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాలు తెరవని సమయాల్లో ఒక్కో క్వాటర్ బాటిల్ పై రూ.50 నుంచి రూ.70 దాకా అధికంగా వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మామూళ్ల మత్తుల్లో ఎక్సైజ్ అధికారులు తాడిపత్రిలోని అన్ని బార్లలో ఎప్పుడు కావాలన్నా మద్యం సిద్ధంగా ఉంటుంది. ఉదయం, రాత్రి అన్న తేడా లేకుండా మద్యం విక్రయాలను కొనసాగిస్తున్నా ఎక్సైజ్ పోలీసులతో పాటు పట్టణ పోలీసులు కూడా చూసీచూడనట్లే వ్యవహరిస్తున్నారు. పత్రికల్లోనో, జిల్లా అధికారుల నుంచి ఆదేశాలు వచ్చినప్పుడు మాత్రం హడావుడి చేసి తర్వాత మిన్నకుండిపోతున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. బార్ల నిర్వాహకుల నుంచి భారీగా మామూళ్లు వసూలు చేస్తుండటంతోనే పోలీసులు అటు వైపు కన్నెత్తి కూడా చూడటం లేదన్న ఆరోపణలున్నాయి. కొత్తగా వచ్చా... బార్ నిర్వాహకుల దందాపై ఎక్సైజ్ ఎస్ఐ స్వామినాథన్ను ‘సాక్షి’ వివరణ కోరగా... ‘ ఈ సర్కిల్కి కొత్తగా వచ్చా... మీకు వివరణ కావాలంటే సీఐని అడగండి’ అని సమాధానమిచ్చారు. తాడిపత్రి సర్కిల్ ఎక్సైజ్ సీఐని ఫోన్ ద్వారా సంప్రదించాలని ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. -
మద్యం షాపులు పెరగవ్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వైన్షాపుల గడువు మరో మూడు నెలల్లో ముగియనున్న నేపథ్యంలో కొత్త విధానంపై ఎక్సైజ్ వర్గాల్లో అప్పుడే చర్చ మొదలైంది. షాపుల సంఖ్యను పెంచాలా? ప్రస్తుతమున్న ఆయా షాపుల పరిధిని మార్చాలా? దరఖాస్తు ధర ఎలా ఉండాలి? శ్లాబుల్లో మార్పులు చేయాలా? ఇప్పటికే మద్యం ధరలు పెరిగిన నేపథ్యంలో వినియోగదారులపై ఎక్కువ భారం పడకుండా ప్రభుత్వ అంచనాలకు అనుగుణంగా రాబడి ఎలా రాబట్టాలి అనే దానిపై ఎక్సైజ్ శాఖ అధికారుల్లో తర్జనభర్జనలు మొదలయ్యాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 2,216 మద్యం దుకాణాలు (ఏ4 షాపులు) ఉన్నాయి. కొత్త ఎక్సైజ్ పాలసీపై ప్రాథమిక చర్చల అనంతరం ఈసారి కూడా పాత సంఖ్యలోనే దుకాణాలను కొనసాగించాలని అధికారులు సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దరఖాస్తు ఫీజు, లైసెన్సు ఫీజు, ఏ4 షాపుల పరిధుల్లో మార్పులు చేసినా, షాపుల సంఖ్యను మాత్రం పెంచవద్దని ఉన్నతాధికారులు భావిస్తున్నట్టు సమాచారం. 2019–21 ఎక్సైజ్ పాలసీ ఈ ఏడాది అక్టోబర్ 31తో ముగియనుంది. పరిశీలనలో రెండు అంశాలు ఈ నేపథ్యంలో ఎక్సైజ్ వర్గాలు రెండు అంశాలను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతమున్న లైసెన్సు ఫీజును కట్టించుకుని మరో ఏడాది పాటు లైసెన్సుల గడువు పొడిగించాలని, లేదంటే కనీసం రెండు లేదా మూడు నెలల పాటు ఎలాంటి ఫీజు లేకుండా పొడిగించాలనే ప్రతిపాదనలపై ఆ శాఖ ఉన్నతాధికారుల్లో చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. లేదంటే న్యాయపరమైన సమస్యలు వస్తాయనే అంశాన్ని కూడా ఆ శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 31 తర్వాత రానున్న రెండేళ్ల పాటు రాష్ట్రంలో కొత్త ఎక్సైజ్ పాలసీ వస్తుందా? వాయిదా పడుతుందా అన్నది త్వరలోనే తేలనుంది. మాకూ న్యాయం చేయండి... ప్రస్తుతం కరోనా వైరస్ గుబులు ఎక్సైజ్ శాఖను వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో నవంబర్ 1 నుంచి కొత్త పాలసీ అమల్లోకి తేవాలా లేక పాత షాపులనే మరికొన్నాళ్లు పొడగించాలా అనే చర్చ జరుగుతోంది. ఐదు నెలల క్రితం రాష్ట్రంలోని కొత్త మున్సిపాలిటీల్లో 159 కొత్త బార్ షాపులను ప్రభుత్వం నోటిఫై చేసి దరఖాస్తులను ఆహ్వానించింది. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 59 బార్లు ఉండగా, ఇప్పటివరకు కేవలం ఐదుగురు మాత్రమే బార్లను ఏర్పాటు చేశారని, మిగిలిన వారంతా లైసెన్సులు తీసుకుని ఎప్పుడు బార్లు పెట్టాలన్న దానిపై మీమాంసలో ఉన్నారని తెలుస్తోంది. ఇందుకు కరోనా వైరస్ కారణంగా జరగని వ్యాపారమే కారణమని ఎౖMð్సజ్ వర్గాలంటున్నాయి. మరోవైపు కరోనా లాక్డౌన్ కారణంగా రాష్ట్రంలోని బార్లు, వైన్షాపులు, బీర్, లిక్కర్ తయారీ పరిశ్రమలు 2–3 నెలలు మూత పడ్డాయి. ఈ నేపథ్యంలో బార్లు, బీర్ తయారీ పరిశ్రమలకు లైసెన్స్ ఫీజు, తయారీ గంటల విషయంలో మినహాయింపునిచ్చింది. తద్వారా బార్ల యజమానులు, డిస్టలరీలకు కొంత ఉపశమనం కలిగింది. కానీ 47 రోజుల సంపూర్ణ లాక్ డౌన్, కొన్ని రోజుల పాటు మధ్యాహ్నం నుంచి షాపులు మూసేయాల్సి రావడంతో తాము కూడా నష్టపోయామని వైన్షాపుల యజమానులంటున్నారు. తమకు కూడా ఈ విషయంలో న్యాయం చేయాలని, శాశ్వత లైసెన్సుదారులకు మినహాయింపు ఇచ్చినట్టే రెండేళ్ల వరకే ఉండే తమకు కూడా ఏదో ఒక రూపంలో ఉపశమనం కలిగించాలని కోరుతున్నారు. -
3 నెలల్లో రూ.5 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: మద్యం అమ్మకాలు జోరుగా జరగడంతో ఎక్సైజ్ శాఖకు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కాసుల పంట పండింది. 2021–22కిగాను ఏప్రిల్, మే, జూన్లలో కలిపి రూ. 6,741.44 కోట్ల విలువైన మద్యం అమ్మకాలపై రూ. 5 వేల కోట్ల మేర ఆదాయం వచ్చిందని ఎక్సైజ్ శాఖ వర్గాలు తెలిపాయి. ఇక ఈ నెల 18 వరకు రూ. 1,436 కోట్ల విలువైన మద్యం విక్రయాలు గణాంకాలు జరిగాయని బ్రూవరేజెస్ కార్పొరేషన్ లెక్కలు చెబుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ ఆదాయం కింద రూ.16 వేల కోట్లు వస్తాయని ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదనల్లో అంచ నా వేయగా తొలి 3 నెలల్లోనే సుమారు 5 వేల కోట్ల (దాదాపు 30%) ఆదాయం రావడం గమనార్హం. ఆ ఐదు జిల్లాల్లోనే 50 శాతానికి పైగా... రాష్ట్రంలోనే అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో మద్యం విక్రయాలు జరుగుతుండగా రెండో స్థానంలో నల్లగొండ, ఆ తర్వాత హైదరాబాద్, మహబూబ్నగర్, వరంగల్ (అర్బన్) జిల్లాలున్నాయి. ఈ మూడు నెలల్లో కలిపి రంగారెడ్డి జిల్లాలోనే రూ. 1,500 కోట్ల మేర అమ్మకాలు జరిగాయి. ఏప్రిల్లో రూ. 534.83 కోట్లు, మేలో రూ. 450.67 కోట్లు, జూన్లో రూ. 495.08 కోట్ల విలువైన మద్యం రంగారెడ్డి జిల్లాలో అమ్ముడుపోయింది. నల్లగొండ జిల్లాలో ఏప్రిల్లో రూ. 251.32 కోట్లు, మేలో రూ. 243.32 కోట్లు, జూన్లో రూ. 267.5 కోట్ల అమ్మకాలు జరిగాయి. హైదరాబాద్లో ఈ మూడు నెలల్లో కలిపి రూ. 650 కోట్లు, మహబూబ్నగర్లో రూ.570 కోట్లు, వరంగల్ అర్బన్లో రూ. 555 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయిందని గణాంకాలు చెబుతున్నాయి. మేలో తగ్గిన బీర్ విక్రయాలు ఈ మూడు నెలల మద్యం అమ్మకాలను పరిశీలిస్తే ప్రతి నెలలో 27 లక్షలకుపైగా కేసుల లిక్కర్ అమ్ముడవుతోంది. జూన్లో మాత్రం అత్యధికంగా 28.73 లక్షల కేసుల మేర లిక్కర్ విక్రయాలు జరిగాయి. బీర్ల విషయానికి వస్తే ఏప్రిల్, జూన్లలో 26 లక్షలకుపైగా కేసులు అమ్ముడు కాగా, మేలో సుమారు 20 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. ఇందుకు బీర్ల ఉత్పత్తి తగ్గిపోవడమే కారణమని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రాకపోవడంతో డిస్టిల్లరీలు బీర్ల ఉత్పత్తిని తగ్గించాయని, ఆ తర్వాత రూ.10 చొప్పున ప్రతి బాటిల్పై ప్రభుత్వం ఉపశమనం ఇవ్వడంతో జూన్లో బీర్ల ఉత్పత్తి, అమ్మకాలు పెరిగాయని ఎక్సైజ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
TS: బ్లాక్ ఫంగస్తో ఎక్సైజ్ ఎస్ఐ మృతి
సాక్షి,ఖమ్మం: స్థానిక ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని ఎస్సైగా పనిచేస్తున్న ఎం.చిరంజీవి (55) బ్లాక్ ఫంగస్తో ఆదివారం మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి.. నేలకొండపల్లి ఎక్సైజ్ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న చిరంజీవికి నెల రోజుల కిందట కరోనా సోకింది. చికిత్స కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స కోసం తరలించారు. అక్కడ కరోనా నెగటివ్ వచ్చాక బ్లాక్ ఫంగస్ సోకింది. అదే హస్పిటల్లో కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్నారు. కోలుకుంటున్న సందర్భంలో మళ్లీ అనారోగ్యం బారిన పడి ఆదివారం మృతి చెందారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. నేలకొండపల్లి ఎక్సైజ్ సీఐ విజేందర్, ట్రైనింగ్ ఎస్సైలు శంకర్, సందీప్, నేలకొండపల్లి, కొత్తకొత్తూరు సర్పంచ్లు రాయపూడి నవీన్, వల్లాల రాధాకృష్ణ, రాచమంద్రాపురం సొసైటీ చైర్మన్ గూడవల్లి రాంబ్రహ్మం, దగ్గుల అంజిరెడ్డి తదితరులు సంతాపం ప్రకటించారు -
ఎస్ఈబీ మరింత బలోపేతం
సాక్షి, అమరావతి :స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ)ని మరింత పటిష్టం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్రమ మద్యం, డ్రగ్స్, ఇసుక అక్రమ రవాణా తదితర వాటిని అరికట్టేందుకు నెలకొల్పిన ఎస్ఈబీని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తలపెట్టింది. ఎక్సైజ్ శాఖలో ఉన్న 31 మంది అధికారులను కొత్తగా ఎస్ఈబీకి కేటాయించింది. ఈ మేరకు ఎస్ఈబీ ముఖ్య కార్యదర్శిగా ఉన్న డీజీపీ సవాంగ్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఎస్ఈబీకి కేటాయించిన వారిలో ఇద్దరు జాయింట్ కమిషనర్లు, నలుగురు డెప్యూటీ కమిషనర్లు, 9 మంది అసిస్టెంట్ కమిషనర్లు, 16 మంది సూపరింటెండెంట్లు ఉన్నారు. -
మద్యం షాపుల్లో అక్రమాలకు చెక్
సాక్షి, అమరావతి: మద్యం దుకాణాల్లో ఎలాంటి అక్రమాలు, అవకతవకలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వ మద్యం దుకాణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని రెవెన్యూ శాఖ(ఎక్సైజ్) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఇటీవల ఏపీ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీకి ఆదేశాలు జారీ చేశారు. మద్యం దుకాణాల్లో ఏర్పాటు చేసే సీసీ కెమెరాలను జిల్లా కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేస్తారు. తద్వారా మద్యం దుకాణాల్లో విక్రయాలు సజావుగా జరుగుతున్నాయా, లేదా అనే విషయాన్ని జిల్లా కంట్రోల్ రూమ్ల నుంచి పర్యవేక్షిస్తారు. విక్రయాల్లో ఏదైనా అవకతవకలు జరిగితే ఆ విషయం సీసీ కెమెరాల ద్వారా తెలిసిపోతుంది. మద్యం బాటిల్స్ లేబుల్స్ను తప్పనిసరిగా స్కాన్ చేయాల్సి ఉంటుంది. అలాగే దుకాణాల్లో మద్యం విక్రయించే వ్యక్తుల నుంచి రెండు సెక్యూరిటీలను తీసుకోనున్నారు. ఒకవేళ ఆర్థిక వ్యవహారాల్లో అక్రమాలు జరిగితే.. విక్రయించే వ్యక్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. మద్యం దుకాణాల్లోని లావాదేవీలను ప్రతి నెలా ప్రత్యేకంగా ఆడిట్ నిర్వహిస్తారు. సంబంధిత నోడల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్స్ క్రమం తప్పకుండా దుకాణాలను తనిఖీ చేయాలి. ఏమైనా అక్రమాలు జరిగితే తెలియజేసేందుకు వీలుగా మద్యం దుకాణాల వద్ద స్థానిక ఎక్సైజ్ అధికారి ఫోన్ నంబర్ను తప్పనిసరిగా ఉంచాలి. మద్యం విక్రయించే వ్యక్తులు ఎవ్వరైనా తప్పులు చేయడానికి ప్రయత్నిస్తున్నారని అనుమానం వస్తే.. వారిని బదిలీ చేయనున్నారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం దశల వారీ మద్య నియంత్రణలో భాగంగా ఇప్పటికే 33 శాతం మద్యం దుకాణాలను తగ్గించింది. 43 వేల బెల్ట్ షాపులను రద్దు చేసింది. అలాగే పర్మిట్టు రూమ్లను రద్దు చేసింది. ప్రత్యేకంగా మద్యం అక్రమాలను అరికట్టేందుకు, మద్యం వినియోగాన్ని తగ్గించేందుకు చర్యలు చేపడుతోంది. అక్రమ మద్యం వ్యవహారాలను నిరోధించేందుకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(ఎస్ఈబీ)ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పటికే అక్రమ మద్యం వ్యవహారాలకు సంబంధించి 15 వేల కేసులు నమోదు చేశారు. తాజాగా మద్యం దుకాణాల్లోనూ ఎలాంటి అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకుంటోంది. -
చంద్రన్న మార్కు మద్యం దందా: కాగ్ నివేదికలో వెల్లడి
సాక్షి, అమరావతి: చంద్రబాబు హయాంలో మద్యం దందా ఇష్టారాజ్యంగా సాగిందని.. లెక్కలేనన్ని అక్రమాలు చోటుచేసుకున్నాయని ఇటీవల కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక స్పష్టం చేసింది. ధరలు పెంచి మద్యం విక్రయాలు సాగించినా.. విడి అమ్మకాలు జరిపినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని స్పష్టం చేసింది. పైగా అలాంటి అక్రమాలను ప్రోత్సహించేలా వ్యవహరించిందని కాగ్ ఎత్తి చూపింది. 2014–19 మధ్య చంద్రబాబు పాలనలో ఎక్సైజ్ శాఖ పనితీరుకు సంబంధించి లోపాలను, అక్రమాలను కాగ్ వెల్లడించింది. లైసెన్సుదారులు అపరాధ రుసుం చెల్లించకపోయినా లైసెన్సులు రద్దు చేయలేనదని, చాలా కేసుల్లో పన్నులు, సుంకాలు వసూలు చేయకపోవడంతో రాష్ట్ర ఖజానాకు ఆదాయ నష్టం ఏర్పడిందని స్పష్టం చేసింది. మద్యం విక్రయాల్లో నేరాలకు పాల్పడిన వారిపై ఎటువంటి చర్యలను తీసుకోకపోవడంతో వారు మళ్లీ నేరాలకు పాల్పడే అవకాశం కల్పించినట్టయిందని కాగ్ వ్యాఖ్యానించింది. కాగ్ వెల్లడించిన అక్రమాల్లో కొన్ని ఇలా.. మద్యం కోటా దస్త్రాలను పరిశీలించగా.. కమిటీ సిఫార్సు లేకుండానే 5 మద్యం ఉత్పత్తి కంపెనీలకు అదనపు మద్యం కోటాను మంజూరు చేశారు. ఇందులో 4 కంపెనీల నుంచి రుసుములు వసూలు చేయలేదు. బీవీఎస్ డిస్టిలరీస్, విశాఖ డిస్టిలరీస్, పీఎంకే డిస్టిలరీస్, శ్రావణి ఆల్కో బ్రూవరీస్ నుంచి రూ.22.40 కోట్ల రుసుములు వసూలు చేయలేదు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రాబడి కోల్పోయింది. మద్యం ఉత్పత్తి కంపెనీలు అదనంగా సామర్థ్యం పెంచుకోవడానికి 2016 ఆగస్టు, సెప్టెంబర్లో రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. అయితే అదనంగా మంజూరు చేసిన మద్యం కోటాను పరిగణనలోకి తీసుకోకుండా ఉన్న సామర్థ్యం ప్రకారమే రుసుములను వసూలు చేసింది. దీనివల్ల రుసుముల రూపేణా రూ.13.24 కోట్లు, వడ్డీ రూపేణా రూ.6.02 కోట్ల మేర రాష్ట్ర ప్రభుత్వం రాబడి కోల్పోయింది. 2014–15 నుంచి 2018–19 మధ్య కాలంలో 20,475 నేరాలకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల స్థితిగతులకు సంబంధించిన వివరాలను నేర చిట్టాల నివేదికలో పొందుపరచలేదు. -
టీటీడీపై మరోసారి ఎల్లో మీడియా కుట్ర
సాక్షి, అమరావతి/తిరుమల: తిరుమల, తిరుపతి దేవస్థానాల (టీటీడీ)పై ఎల్లో మీడియా దుష్ప్రచారం మరోసారి బెడిసి కొట్టింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో మిజోరం రాష్ట్రంలో అక్రమంగా రవాణా చేస్తున్న తలనీలాలను అస్సాం రైఫిల్స్ బలగాలు జప్తు చేయగా, దాదాపు నెలన్నర తర్వాత ఆ సంఘటనను టీటీడీకి ఆపాదిస్తూ ఓ వర్గం మీడియా దుష్ప్రచారం చేయడం విస్మయ పరుస్తోంది. కాగా జప్తు చేసిన తలనీలాలు టీటీడీకి చెందినవి కావని కేంద్ర కస్టమ్స్, ఎక్సైజ్ శాఖ పూర్తి వివరాలతో ప్రకటన విడుదల చేయడంతో ఇది ఎల్లో మీడియా కుట్ర అని స్పష్టమైంది. ఈ ఏడాది ఫిబ్రవరి 8న మిజోరాం నుంచి మయన్మార్కు 120 బస్తాలలో ఓ వాహనం ద్వారా అక్రమంగా రవాణా చేస్తున్న తలనీలాలను అస్సాం రైఫిల్స్ బలగాలు జప్తు చేశాయి. ఐజ్వాల్కు చెందిన ముంగ్సీయన్ సింగ్ అనే వ్యక్తి జీపులో వీటిని తీసుకెళ్తుండగా, అనుమతి పత్రాలు ఉన్నాయా అని అడిగితే లేవని చెప్పాడు. దాంతో మొత్తం రూ.18,17,089 విలువైన 3,240 కేజీల తలనీలాలను జప్తు చేశారు. ముంగ్సీయన్ సింగ్ను పోలీసులు విచారించగా ఐజ్వాల్లో మరుయతి అనే మహిళ తో ఆ తలనీలాలను తన వాహనంలో మయన్మార్కు రవాణా చేసేందుకు కిరాయికి ఒప్పుకున్నానని చెప్పారు. దాంతో అతన్ని అరెస్టు చేసి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. దేశంలో ఎన్నో దేవాలయాలు, ప్రైవేట్ ప్రదేశాల్లో తలనీలాలు సమర్పిస్తుండగా, అవి టీటీడీకి చెందినవే అని ఓ వర్గం మీడియా తప్పుడు ప్రచారానికి తెర తీసింది. ఈ నేపథ్యంలో ఆ తలనీలాలతో టీటీడీకి సంబంధం ఉన్నట్టు తమ విచారణలో వెల్లడి కాలేదని కేంద్ర కస్టమ్స్, ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. మాకు సంబంధం లేదు : టీటీడీ మిజోరాంలో జప్తు చేసిన 120 బ్యాగుల తలనీలాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని టీటీడీ మంగళవారం స్పష్టం చేసింది. తిరుమలలో భక్తులు సమర్పించే తలనీలాలను ఈ– టెండర్ల ద్వారా వేలం నిర్వహించి విక్రయిస్తుంటామని తెలిపింది. టెండర్లో ఎక్కువ మొత్తం కోట్ చేసిన బిడ్డర్ నుంచి జీఎస్టీ కట్టించుకుని తలనీలాలు అప్పగిస్తున్నామని వివరించింది. కొనుగోలు చేసిన బిడ్డర్కు అంతర్జాతీయ ఎగుమతి అనుమతులున్నాయా? లేక దేశంలో ఏ ప్రాంతంలో విక్రయిస్తారనేది టీటీడీకి సంబంధించిన విషయం కాదని తెలిపింది. దేశంలోని అనేక ఆలయాల్లో తలనీలాల విక్రయాలు జరుగుతుంటాయని, టీటీడీ కూడా ప్రతి 3 నెలలకోసారి ఈ–టెండర్ ద్వారా తలనీలాలు విక్రయించడం సాధారణంగా జరిగే ప్రక్రియ అని పేర్కొంది. తలనీలాల అక్రమ రవాణాకు పాల్పడిన సంస్థల పేర్లు అధికారికంగా తెలియజేస్తే వాటిని బ్లాక్ లిస్ట్లో పెడతామని తెలిపింది. ఎల్లో మీడియాపై భక్తుల ఆగ్రహం వాస్తవాలు ఇలా ఉంటే ఎల్లో మీడియా మాత్రం ఆ తలనీలాలు టీటీడీకి చెందినవని దుష్ప్రచారానికి ఒడిగట్టడంపై భక్తులు మండిపడుతున్నారు. రాజకీయ దురుద్దేశాలతో తిరుమల ఆలయం పవిత్రతను దెబ్బతీసేందుకు, భక్తుల మనోభావాలకు భంగం కలిగించేందుకు ఎల్లో మీడియా కుట్రలు పన్నుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంపై బుదర జల్లేందుకు టీటీడీపై దుష్ప్రచారం చేయడాన్ని ప్రతిపక్ష పార్టీలు ఓ రాజకీయ వ్యూహంగా మార్చుకున్నాయని, ఇందుకు ఎల్లో మీడియా వత్తాసు పలుకుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీటీడీపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసు భక్తులు సమర్పించిన తలనీలాలను టీటీడీ చైనాకు స్మగ్లింగ్ చేసే ప్రయత్నం చేసిందని ఫేస్ బుక్, మీడియాలో దుష్ప్రచారం చేసిన వారిపై మంగళవారం రాత్రి తిరుపతి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతీసే ఉద్దేశంతో తప్పుడు ప్రచారం చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని టీటీడీ విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు టీడీపీకి చెందిన రామ రాజ్యం మళ్లీ మొదలైంది (టీడీపీ పొలిటికల్ వింగ్), గంగా ప్రకాష్, ప్రియాంక రెడ్డి స్వచ్ఛ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయా వ్యక్తులు, సంస్థలు ఫేస్బుక్లో పోస్టులు పెట్టడం, షేర్ చేయడం, దుష్ప్రచారం చేయడం లాంటి చర్యలకు పాల్పడినట్లు విజిలెన్స్ అధికారులు ఆధారాలు సమర్పించారు. -
హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ కేసు కలకలం
సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ కేసు హైదరాబాద్లో మరోసారి సంచలనం సృష్టిస్తోంది. ఎక్సైజ్ పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. ప్రముఖులకు డ్రగ్స్ పంపించిన డీలర్ డాడీ బాయ్కి సంబంధించిన డెలివరీ బాయ్ జేమ్స్ను పోలీసులు పట్టుకున్నారు. నాలుగేళ్ల కిత్రం వరకు హైదరాబాద్లో డాడీ బాయ్ డ్రగ్స్ బిజినెస్ నిర్వహించాడు. ప్రస్తుతం గోవా, బెంగళూరు కేంద్రంగా డ్రగ్స్ దందా నడుపుతున్నాడు. గతంలో డ్రగ్స్ డీలర్ డాడీ బాయ్ టాస్క్ఫోర్స్ పోలీసులకు పట్టుబడ్డాడు. హైదరాబాద్లో ప్రముఖులకు డ్రగ్స్ డెలివరీ చేసేందుకు ప్లాన్ చేశాడు. నగరంలో గుడ్ స్టఫ్ అంటూ ఓ వాట్సాప్ గ్రూప్ ద్వారా మెసేజ్లు పంపించాడు. ఫోన్ నంబర్లు ఇవ్వకుండా వాట్సాప్ కాన్ఫరెన్స్ ద్వారా ఈ డ్రగ్స్ దందాను ఆపరేట్ చేశాడు. ఈనెల 14న బస్సు ద్వారా అతడు పంపిన డ్రగ్స్ హైదరాబాద్ చేరాయి. ఈ డ్రగ్స్ జేమ్స్ అనే నైజీరియన్ ద్వారా డెలివరీ అవుతున్నయి. పక్కా సమాచారంతో డెలివరీ బాయ్ జేమ్స్ను పోలీసులు పట్టుకున్నారు. బల్క్ ఆర్డర్ చేసిన ప్రముఖులపై ఎక్సైజ్ పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రముఖ హోటల్స్, నెక్లస్రోడ్ , చెక్పోస్ట్, డ్రైవ్ ఇన్ లే డెలివరీ స్పాట్స్ను పోలీసులు గుర్తించారు. ఒకేసారి 153గ్రాముల కొకెయిన్, ఎండీఎంఏ దొరకడంతో డ్రగ్స్ వ్యవహారంపై ఎక్సైజ్ శాఖ సీరియస్గా ఉంది. చదవండి: అన్న సమక్షంలోనే వదినపై లైంగిక దాడి -
తెగ తాగేశారు.. భారీగా ఆదాయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మద్యానికి డిమాండ్ ఫుల్లుగా పెరిగింది. గతేడాది ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 28 వరకు ఏకంగా రూ.24,814 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయింది. ఇందులో వ్యాట్ పోగా రూ.15 వేల కోట్లకుపైగా ఎక్సైజ్ శాఖకు ఆదాయం వచ్చింది. ఇక లిక్కర్ బాటిళ్ల వారీగా చూస్తే.. ఈ 11 నెలల కాలంలో 2.4 కోట్ల కేసుల బీర్లు, మూడు కోట్ల కేసులకుపైగా లిక్కర్ విక్రయాలు నమోదుకావడం గమనార్హం. లక్ష్యం రూ.16 వేల కోట్లు కరోనా కారణంగా రాష్ట్ర ప్రజలతోపాటు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి కూడా దెబ్బతిన్నది. 2020–21 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పన్నుల రూపంలో వచ్చే ఆదాయ వనరులేవీ లక్ష్యాన్ని చేరుకునే పరిస్థితి లేకుండా పోయింది. కానీ ఎక్సైజ్ ఆదాయ అంచనాలు మాత్రం లక్ష్యాన్ని చేరుకుంటున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ రాబడుల కింద రూ.16 వేల కోట్లు సమకూర్చుకోవాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకోగా.. మరో నెల గడువు ఉండగానే రూ.15 వేల కోట్ల వరకు ఆదాయం వచ్చింది. మార్చిలో మిగతా వెయ్యి కోట్లకన్నా ఎక్కువే రాబడి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే గతేడాది లాక్డౌన్ టైంలో మార్చి 22 నుంచి మే 6వ వరకు 46 రోజుల పాటు మద్యం విక్రయాలు జరగలేదు. ఆ టైంలో కూడా వైన్షాపులు, బార్లు తెరిచి ఉంటే మరో 2వేల కోట్ల మేర ఆదాయం ఎక్కువగా వచ్చేదని ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్తున్నారు. మొత్తమ్మీద జీఎస్టీ, అమ్మకపు పన్ను, రిజిస్ట్రేషన్లు వంటి కీలక రంగాల నుంచి ఆదాయం తగ్గినా.. మద్యం రాబడి పెరగడంతో ఖజానాకు ఇబ్బంది తప్పిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రోజుకు 5.6 లక్షల లీటర్ల బీర్లు.. 8.22 లక్షల లీటర్ల లిక్కర్ గత 11 నెలల మద్యం విక్రయాల లెక్కలను చూస్తే.. రాష్ట్రంలో రోజుకు 5.6 లక్షల లీటర్ల బీర్లు, 8.22 లక్షల లీటర్ల లిక్కర్ తాగేస్తున్నారని వెల్లడవుతోంది. ఈ 11 నెలల్లో 3 కోట్ల కేసులకుపైగా లిక్కర్, 2.4 కోట్ల కేసులకుపైగా బీర్లు అమ్ముడయ్యాయి. ఒక్కో లిక్కర్ కేసులో 9 లీటర్ల మద్యం, బీర్ కేసులో 7.8 లీటర్ల బీర్ ఉంటుంది. ఈ లెక్కన గత 334 రోజుల్లో మందుబాబులు.. లిక్కర్, బీర్లు కలిపి రోజుకు 14 లక్షల లీటర్ల వరకు తాగుతున్నారు. ఇక ఈ ఏడాది జనవరిలో రాష్ట్రంలో 28 లక్షల కేసుల లిక్కర్, 33 లక్షల కేసుల బీర్ అమ్ముడయ్యాయి. వీటి విలువ 2,727 కోట్లు. ఫిబ్రవరిలో 28 రోజులే ఉండడం, ఇతర కారణాలతో డిపోల నుంచి మద్యం కొంత తక్కువ వెళ్లింది. జనవరి కంటే 3 లక్షల కేసుల లిక్కర్, 5 లక్షల కేసుల బీర్లు తక్కువగా అమ్ముడుపోయాయి. అయితే మార్చిలో మద్యం విక్రయాలు మళ్లీ పెరుగుతాయని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. -
ఏక్ బార్.. అమ్మకముందే భారీ ఆదాయం..!
సాక్షి, హైదరాబాద్: కొత్త మున్సిపాలిటీ సరికొత్త రికార్డు సృష్టించింది. అక్కడ ఏర్పాటు చేయాల్సింది ఏక్ బార్.. వచ్చినవి ఏకంగా 248 దరఖాస్తులు. రాష్ట్రంలోని 72 కొత్త మున్సిపాలిటీల్లో 159 బార్ల ఏర్పాటుకు గత నెల 25న ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. సూర్యాపేట జిల్లాలో కొత్తగా ఏర్పాటైన నేరేడుచర్ల మున్సిపాలిటీలో ఒక్క లిక్కర్ షాపు కోసం 248 దరఖాస్తులు వచ్చాయి. అతిఎక్కువ దరఖాస్తులు వచ్చిన రెండో మున్సిపాలిటీ నేరేడుచర్లనే. మహబూబ్బాద్ జిల్లా తొర్రూర్లో ఒక బార్కు 278 దరఖాస్తులు వచ్చాయి. సోమవారం దరఖాస్తు గడువు ముగిసే సమయానికి ఆయా మున్సిపాలిటీల్లో 7,380 దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ వర్గాలు వెల్లడించాయి. కాగా, దరఖాస్తు రుసుము కింద ప్రభుత్వ ఖజానాకు రూ.73.78 కోట్ల ఆదాయం సమకూరడం గమనార్హం. 12 చోట్ల మినహా.. కొత్త బార్ల కోసం మొదట్లో మందకొడిగా దాఖలైన దరఖాస్తులు గడువు సమీపించేకొద్దీ వెల్లువలా వచ్చాయి. మొత్తం 7,378 దరఖాస్తులు వచ్చాయి. 147 షాపులకు 10 కంటే ఎక్కువే దరఖాస్తులు వచ్చాయి. నిజామాబాద్ కార్పొరేషన్లో కొత్తగా ఏడు బార్లు నోటిఫై చేయగా 7, బోధన్ మున్సిపాలిటీలో 3బార్లు నోటిఫై చేయగా 3 దరఖాస్తులు వచ్చాయి. దుబ్బాకలో ఒక షాపునకు 7, అమరచింతలో ఒక షాపునకు 8 దరఖాస్తులు వచ్చాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 55 షాపులకు 1,074 వరకు దరఖాస్తులు వచ్చాయి. కొత్త మద్యం దుకాణాలకుగాను బుధవారం ఆయా జిల్లాల కలెక్టర్లు డ్రా తీయనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని షాపులకు ఎక్సైజ్ కమిషనర్ అదేరోజు డ్రా తీస్తారు. గెలిచినవారికి 17న షాపులు కేటాయించనున్నారు. షాపులు కేటాయించిన మూడు నెలల్లోపు బార్ ఏర్పాటుకు ఎక్సైజ్ శాఖ సూచించే అన్ని నిబంధనలను యజమానులు పూర్తి చేయాల్సి ఉంటుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో రికార్డు సాక్షి, యాదాద్రి: యాదాద్రి–భువనగిరి జిల్లాలోని నూతన మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేయనున్న ఐదు బార్లకు 638 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు ఫీజు రూపంలోనే రూ. 6.38 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. చివరి రోజైన సోమవారం 356 దరఖాస్తులు రావడం పోటీ తీవ్రతకు అద్దంపడుతోంది. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని ఒక బార్కు 277 దరఖాస్తులు వచ్చాయి. చౌటుప్పల్లోని రెండు బార్లకు 135, ఆలేరులోని ఒక బార్కు 126, మోత్కూరులోని ఒక బార్కు 100 దరఖాస్తులు వచ్చాయి. సాక్షి కార్టూన్: ఈ అడ్రస్సా.. ఇలా వెళ్లు ఊర్వశీ బార్ వస్తుంది.. -
డబ్బు.. మద్యం పంపిణీకి చెక్ పెట్టేలా..
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రవాహానికి చెక్ పెట్టేందుకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) రంగంలోకి దిగింది. డీజీపీ డి.గౌతమ్ సవాంగ్, ఎస్ఈబీ కమిషనర్ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో ప్రత్యేక కార్యాచరణ మొదలైంది. రాష్ట్రంలోని 18 పోలీస్ యూనిట్ల పరిధిలో.. ఏఎస్పీల నేతృత్వంలో ఎస్ఈబీ టీమ్లు డబ్బు, మద్యం పంపిణీని అడ్డుకునేందుకు కృషి చేస్తాయి. పోలీస్, ఎక్సైజ్, మైనింగ్ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ స్పెషల్ టీమ్లు ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించాయి. రాష్ట్ర స్థాయిలోను, 18 పోలీస్ యూనిట్ల పరిధిలో 24 గంటలూ పనిచేసేలా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ప్రతి కంట్రోల్ రూమ్లో సీఐ నేతృత్వంలో ఒక ఎస్సై, సిబ్బంది విధులు నిర్వహిస్తారు. డబ్బు, మద్యం పంపిణీకి సంబంధించిన సమాచారాన్ని ప్రజలు కంట్రోల్ రూమ్లకు తెలియజేయవచ్చు. ఈసీఎంఎస్ యాప్తో పర్యవేక్షణ డబ్బు, మద్యం పంపిణీ.. వాటి రవాణాకు సంబంధించిన ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునేలా పర్యవేక్షణ చేపట్టేందుకు ప్రత్యేకంగా ఎక్సైజ్ కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఈసీఎంఎస్) యాప్ను ఉపయోగిస్తున్నారు. దీంతోపాటు ఆన్లైన్ సిస్టమ్, వాట్సాప్, కంట్రోల్ రూమ్ తదితర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఫిర్యాదులపై ఎంతవరకు చర్యలు తీసుకున్నారు, చర్యలు తీసుకోకపోతే కారణాలేమిటి, దాడులు చేసిన ఫలితాలు తదితర అన్ని వివరాలు ఎప్పటికప్పుడు సమీక్షిస్తారు. వీటిపై ప్రతిరోజూ ఉదయం రాష్ట్రస్థాయి అధికారులతో మంగళగిరి పోలీస్ ప్రధాన కార్యాలయంలోను, జిల్లాల స్థాయిలోను వేర్వేరుగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. అనంతరం అన్ని జిల్లాల ఎస్ఈబీ టీమ్లతో టెలీ కాన్ఫరెన్స్లో తక్షణ ఆదేశాలిస్తున్నారు. రంగంలోకి టాస్్కఫోర్స్ టీమ్లు మద్యం, డబ్బు రవాణా, పంపిణీలకు అడ్డుకట్ట వేసేందుకు ఎస్ఈబీ నేతృత్వంలో ప్రత్యేకంగా 12 టాస్్కఫోర్స్ టీమ్లను, ప్రతి జిల్లాలో 10 చొప్పున 180 ప్రత్యేక టీమ్లను ఏర్పాటు చేశారు. వీటితోపాటు ఎస్ఈబీ ప్రత్యేకంగా 130 మొబైల్ పార్టీలతోపాటు పోలీస్, మైనింగ్, ఎక్సైజ్ శాఖలకు చెందిన బృందాలు కూడా ఉంటాయి. మద్యం, డబ్బు రవాణా, పంపిణీకి సంబంధించిన సమాచారాన్ని ఎప్పుటికప్పుడు ఎస్ఈబీకి చేరవేసేలా ఇంటెలిజెన్స్(నిఘా) బృందాలు కూడా పనిచేస్తున్నాయి. 439 చెక్పోస్టులు పొరుగు రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి మద్యం, డబ్బు రవాణా కాకుండా రాష్ట్ర సరిహద్దుల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. వీటితోపాటు జిల్లాలు డివిజన్ల వారీగా కూడా చెక్పోస్టులు పెట్టారు. ఎస్ఈబీ ప్రత్యేకంగా 50 చెక్పోస్టులను ఏర్పాటు చేయగా, మైనింగ్, ఎక్సైజ్, పోలీస్ శాఖలకు చెందిన మరో 389 చెక్పోస్టులు ఉన్నాయి. మొత్తం 439 చెక్పోస్టులు ఈ ఎన్నికల్లో నిరంతర తనిఖీలు నిర్వహిస్తాయి. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పనిచేస్తున్న స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు(ఎస్పీవోలు) 2,200 మందితోపాటు ఎస్ఈబీ అధికారులు, పోలీస్ అధికారులు, సిబ్బంది ఈ చెక్పోస్టుల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఒక్క రోజే 219 కేసులు ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నాం. నామినేషన్లు మొదలైన శుక్రవారం ఒక్క రోజే ఎస్ఈబీ 219 కేసులు నమోదు చేసి 219 మందిని అరెస్ట్ చేసింది. 35 వాహనాలను స్వా«దీనం చేసుకున్నాం. డీజీపీ డి.గౌతమ్ సవాంగ్, ఎస్ఈబీ కమిషనర్ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో రాష్ట్రంలో ఎస్ఈబీ, పోలీస్, ఎక్సైజ్, మైనింగ్ సమన్వయంతో మంచి ఫలితాలు సాధించే దిశగా చర్యలు చేపట్టారు. – పీహెచ్డీ రామకృష్ణ, ఎస్ఈబీ డైరెక్టర్ -
న్యూ ఇయర్ ఎఫెక్ట్: మద్యానికే మత్తెక్కించేశారు..
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సరాదిలో తెలంగాణలో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. గత నాలుగురోజుల్లో రూ.758.76 కోట్ల విలువైన లిక్కర్ వ్యాపారం జరిగింది. డిసెంబర్ 28 నుంచి 31 వరకు నాలుగు రోజుల వ్యవధిలోనే పెద్ద ఎత్తున మద్యం విక్రయాలు జరిగినట్లు అబ్కారీశాఖ పేర్కొంది. అయితే ఈ ఏడాది రాష్ట్రంలో నూతన సంవత్సరం వేడుకలకు అనుమతి లేకున్నా.. గతేడాది పోలిస్తే ఈ నాలుగు రోజుల్లోనే రూ. 200 కోట్లు అధికంగా ఆదాయం రావడం విశేషం. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోనే రూ.300 కోట్ల విక్రయాలు జరిగాయి. మొత్తంగా 8.61 కోట్ల లిక్కర్ కేసులు, 6.62 కోట్ల బీర్ కేసుల అమ్మకాలు జరిగినట్లు అబ్కారీ శాఖ తెలిపింది. -
బాబు హయాంలో మద్యం సిండికేట్లకు సలాం
సాక్షి, అమరావతి: చంద్రబాబు హయాంలో ఎక్సైజ్ శాఖలో జరిగిన అవినీతిని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) తూర్పారబట్టింది. లోపభూయిష్టంగా జరిగిన పన్నుల వసూళ్లు, నమోదైన కేసుల్లో అవకతవకలను ఎత్తి చూపింది. మద్యం సిండికేట్లకు అనుకూలంగా వ్యవహరించి.. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినట్లు కాగ్ తేల్చింది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖలో ఆడిట్ చేయాల్సిన కార్యాలయాలు 103 ఉండగా.. 2017–18 ఆర్థిక సంవత్సరంలో కాగ్ 14 కార్యాలయాలను మచ్చుకు తనిఖీ చేసింది. మొత్తం 41 కేసుల్లో రూ.6.71 కోట్ల మేర ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినట్లు నిర్ధారించింది. అంటే మిగిలిన కార్యాలయాల్లో ఎంత మేర అక్రమాలు జరిగి ఉంటాయో ఊహించుకోవచ్చని కాగ్ పేర్కొంది. కాగ్ ఎత్తి చూపిన తప్పులను ఎక్సైజ్ శాఖ కూడా అంగీకరించడం గమనార్హం. ఇష్టానుసారంగా అనుమతులు..: రాష్ట్రంలోని పలు గ్రామాలను సమీప నగర పాలక/పురపాలక సంస్థల్లో విలీనం చేశారు. ఇక్కడి మద్యం షాపులకు అదనపు లైసెన్సు ఫీజులు వసూలు చేయాలి. కానీ ఎక్సైజ్ శాఖ దీన్ని పట్టించుకోలేదు. కాగ్ తనిఖీ చేసిన సామర్లకోట మున్సిపాలిటీ, కాకినాడ, రాజమండ్రి కార్పొరేషన్లలో విలీనమైన గ్రామాలకు సంబంధించి ప్రభుత్వానికి రావాల్సిన రూ.2.01 కోట్ల ఆదాయానికి గండి కొట్టారు. పర్మిట్ రూంలకు ఫీజులు వసూలు చేయకుండా మద్యం సిండికేట్లతో కుమ్మక్కై రూ.3.16 కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు. అలాగే బార్లను అనుమతించిన విస్తీర్ణంలో కాకుండా.. బ్లూ ప్రింట్ను మించి వ్యాపారం నడిపినా పట్టించుకోలేదు. వీటికి అదనపు రుసుం వసూలు చేయలేదు. కాకినాడ, ఒంగోలు, రాజమండ్రిలో 13 మంది లైసెన్సుదారులకు రూ.94.11 లక్షల అదనపు ఫీజు విధించలేదు. ఇక కల్లు చెట్లకు వర్తించే రేట్లను తక్కువగా చేసి చూపడంతో రూ.28.89 లక్షల ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోయింది. కాకినాడ, ఏలూరు, రాజమండ్రి, విజయనగరంలో కల్లు చెట్లకు అద్దెలను తక్కువగా విధించినట్లు కాగ్ తేల్చింది. -
గంజాయి.. ఇక సాగదోయి!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గంజాయి సాగు, అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు ఎక్సైజ్ శాఖ రంగం సిద్ధం చేసింది. ఇకపై మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించేందుకు కార్యాచరణను సిద్ధం చేసింది. విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ కేంద్రంగా గంజాయి సాగు.. అక్రమ రవాణా జరుగుతోంది. విశాఖ ఏజెన్సీలో స్మగ్లర్లు అక్కడి గిరిజనులతో గంజాయి సాగు చేయిస్తూ.. పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు అక్రమంగా రవాణా చేస్తున్నారు. పాడేరు కేంద్రంగా ‘స్పెషల్ ఆపరేషన్’ ► నవంబర్ నుంచి గంజాయి సాగు సీజన్ ఆరంభం కానుంది. ఈ ఏడాది సాగును అడ్డుకునేందుకు ఎక్సైజ్ శాఖ ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం రాష్ట్ర నోడల్ అధికారిగా ఎక్సైజ్ శాఖ అదనపు కమిషనర్ కేఎల్ భాస్కర్ను ప్రభుత్వం నియమించింది. ► 2020–21లో సాగును పూర్తిగా నియంత్రించేందుకు అన్ని రాష్ట్రాలతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో గురువారం సమావేశం నిర్వహించనుంది. ► స్పేస్ టెక్నాలజీ సమాచారంతో నవంబర్లో మొదలయ్యే గంజాయి సాగును నిర్మూలించేందుకు విశాఖ జిల్లా పాడేరు కేంద్రంగా ‘స్పెషల్ ఆపరేషన్’ నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించారు. గత ఏడాది 31,360 కేజీల గంజాయి సీజ్ 2019 సెప్టెంబర్ 1 నుంచి 2020 ఆగస్టు 31 వరకు గడచిన ఏడాది కాలంలో 31,360 కేజీల గంజాయిని సీజ్ చేసి.. 512 ఎకరాల్లో గంజాయి తోటలను ఎక్సైజ్ శాఖ ధ్వంసం చేసింది. విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లోని 17 గ్రామాల్లో గంజాయి నిర్మూలన కార్యక్రమాలు నిర్వహించి 25.62 లక్షల గంజాయి మొక్కల్ని తొలగించింది. అదే గ్రామాల్లో 358 కేజీల ఎండు గంజాయిని తగులబెట్టారు. పోలీసుల సహకారం తీసుకుంటాం విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాలతోపాటు నల్లమల అటవీ ప్రాంత పరిధిలోని జిల్లాల్లోనూ గంజాయి సాగును గుర్తించాం. సాగును నిర్మూలించేందుకు, అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కార్యాచరణ రూపొందించాం. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సూచనలకు అనుగుణంగా చర్యలు చేపడతాం. ఈ విషయంలో పోలీసుల సహకారం తీసుకుంటాం. – కేఎల్ భాస్కర్, నోడల్ అధికారి, ఎక్సైజ్ అదనపు కమిషనర్ -
4 రోజులు.. రూ.812 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఈసారి దసరా పండుగకు మందు బాబులు దుమ్ము లేపారు. కరోనా ప్రభావం అసలుందా.. అనే స్థాయిలో ఫుల్లుగా తాగేశారు. ఈ నెల 22 నుంచి 25 వరకు రాష్ట్రంలోని మద్యం డిపోల నుంచి బయటకు వెళ్లిన లిక్కర్, బీర్ కేసుల విలువ రూ.812 కోట్ల పైమాటే. అంటే రోజుకు సగటున రూ.203 కోట్ల విలువైన మద్యం అమ్ముడయిందన్న మాట. అదే నెల సగటు చూస్తే రోజువారీ అమ్మకాలు రూ.82 కోట్లు మాత్రమే జరగడం గమనార్హం. ఈ నెల మద్యం విక్రయాల గణాంకాలను పరిశీలిస్తే లిక్కర్, బీర్లు కలిపి దాదాపు 50 లక్షల కేసుల వరకు అమ్ముడయ్యాయి. వీటి విలువ రూ.2,112 కోట్లుగా ఉంది. ఈ నెల 27 నాటికి 27,08,292 కేసుల లిక్కర్, 22,65,397 కేసుల బీర్లు డిపోల నుంచి రాష్ట్రంలోని వైన్ షాపులకు చేరాయి. ఇందులో మూడో వంతు దసరా నాలుగు రోజుల్లోనే అమ్ముడయ్యాయి. ఈ నాలుగు రోజుల్లో 9,41,900 కేసుల లిక్కర్, 9,29,694 కేసుల బీర్ల విక్రయాలు జరిగాయని ఎక్సైజ్ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. -
ఎవరైనా.. ఎంతటి వారైనా..
సాక్షి, అమరావతి: దశలవారీ మద్యం నియంత్రణకు కట్టుబడిన రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు కొనసాగిస్తోంది. మద్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు ఏర్పాటైన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) ప్రభుత్వ ఆదేశాల మేరకు చురుగ్గా వ్యవహరిస్తోంది. మద్యం అక్రమ రవాణా చేసేవారు ఎంతటి వారైనా ఉపేక్షించడం లేదు. ఫలితంగా అక్రమ మద్యం కేసుల్లో ప్రభుత్వ ఉద్యోగులు సైతం పట్టుబడుతున్నారు. వీరిలో పోలీస్, ఎక్సైజ్ శాఖలతోపాటు ఇతర విభాగాల ఉద్యోగులు కూడా ఉన్నారు. 4 నెలల్లో 233 మంది ఉద్యోగుల పట్టివేత ► స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) ఏర్పాటైన నాలుగు నెలల వ్యవధిలో 40 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. సుమారు 50 వేల మందిని ఎస్ఈబీ అరెస్ట్ చేసింది. ► మద్యం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన 233 మంది ఉద్యోగులపై కేసులు నమోదయ్యాయి. వీరిలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్లో పనిచేసే సీఐ, ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి ఉద్యోగులూ ఉండటం గమనార్హం. ► కేసుల్లో పట్టుబడిన వారిలో ఎస్ఈబీ ఉద్యోగులు 65 మంది ఉండగా.. మిగిలిన 168 మంది ఇతర శాఖల ఉద్యోగులు. ► కృష్ణా జిల్లాలో 27 మంది, కర్నూలులో 48 మంది, పశ్చిమ గోదావరిలో 26 మంది ప్రభుత్వ ఉద్యోగులు పట్టుబడ్డారు. ► ఎస్ఈబీ ఉద్యోగుల్లో 25 మందిపై అభియోగాలు నమోదు కాగా.. 9 మందిని సస్పెండ్ చేశారు. మరో 10 మంది అరెస్ట్ అయ్యారు. ఆరుగురిపై శాఖాపరమైన విచారణ కొనసాగుతోంది. ఎంతటి వారినైనా ఉపేక్షించం అక్రమ మద్యం కేసుల్లో ఎంతటి వారున్నా.. వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎస్ఈబీ ఆవిర్భవించిన నాలుగు నెలల్లోనే ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. పదే పదే పట్టుబడితే పీడీ కేసులు నమోదు చేస్తాం. – వినీత్ బ్రిజ్లాల్, ఎస్ఈబీ కమిషనర్ -
ఆదాయం ఫుల్లు
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది ఏప్రిల్ అంతా రాష్ట్రంలో వైన్ షాపులు లేవు.. బార్లు, క్లబ్బులు, పబ్బులు తెరుచు కోలేదు. మే 6న వైన్ షాపులు ఓపెన్ అయ్యాయి. బార్లు, క్లబ్బులు తెరుచుకునేందుకు 2 రోజుల క్రితమే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నాలుగైదు నెలలుగా లిక్కర్ అమ్మకాలు ఈ వైన్ షాపుల ద్వారా మాత్రమే జరుగుతున్నాయి. అయినా... రాష్ట్రంలో మే, జూన్, జూలై, ఆగస్టు నెలల్లో కలిపి ఎక్సైజ్ శాఖకు వచ్చిన ఆదాయం అక్షరాలా.. ఏడు వేల తొమ్మిది వందల ఏడు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు. అంటే దాదాపు రూ.8 వేల కోట్లు. సగటున నెలకు రూ.2 వేల కోట్లు అన్నమాట. ఇదేదో అంచనా వేసిన లెక్క కాదు. జలగం సుధీర్ అనే సమాచార హక్కు చట్టం కార్యకర్త అడిగిన ప్రశ్నకు తెలంగాణ బ్రేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇచ్చిన అధికారిక సమాధానం. అంటే కరోనా కాలంలోనూ నెలకు రూ.2 వేల కోట్ల మద్యం ఖాళీ చేశారు మన మందుబాబులు. ఏటేటా పెరుగుదల... తెలంగాణ బ్రేవరేజెస్ కార్పొరేషన్ సమాచార హక్కు చట్టం ద్వారా ఇచ్చిన సమాధానాన్ని పరిశీలిస్తే.. రాష్ట్రంలో ఎక్సైజ్ ఆదాయం ఏటేటా పెరిగిపోతోంది. 2017–18లో మినహా మిగిలిన అన్ని సంవత్సరాల్లోనూ ఎక్సైజ్ ఆదాయంలో వృద్ధి కనిపించింది. ఇక, ఈ ఏడాది తొలి ఐదు నెలల్లోనే (మద్యం విక్రయాలు జరిగింది నాలుగు నెలలే) రూ.8 వేల కోట్ల వరకు రాబడి వచ్చింది. అంటే, రాష్ట్రం ఏర్పాటైన తొలి ఏడాది వచ్చిన మొత్తం ఆదాయం రూ.6,095.03 కోట్ల కంటే.. ఈ ఏడాది ఐదు నెలల్లో వచ్చిన ఆదాయమే ఎక్కువన్న మాట. ఇక, ఇదే ఒరవడి కొనసాగితే ఈ ఏడాది ఎక్సైజ్ ఆదాయం రూ.20 వేల కోట్లు దాటుతుందని అంచనా. బార్లు, క్లబ్బులు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఒకట్రెండు రోజుల్లో అవి కూడా పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించను న్నాయి. దీంతో మరికొంత ఆదాయం పెరుగుతుందని ఎక్సైజ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చావుల్లేవ్... ఇక, సమాచార హక్కు చట్టం కింద అడిగిన మరో ప్రశ్నకు సమాధానం ఇస్తూ 2014–15 నుంచి రాష్ట్రంలో మద్యం తాగి ఎవరూ చనిపోలేదని వెల్లడించింది. ఏ జిల్లాలోనూ ఇలాంటి మరణాలు సంభవించలేదని తెలిపింది. అదే విధంగా రాష్ట్రంలో హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్లో మాత్రమే మద్యం నాణ్యతా పరీక్షల కోసం ప్రయోగశాలలున్నాయని, వీటి ద్వారా వచ్చిన అనుమతుల మేరకే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు మద్యం సరఫరా చేస్తామని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 300కు పైగా డీలర్ల నుంచి ప్రభుత్వం మద్యం కొనుగోలు చేసి రిటైల్ విక్రయాల కోసం డిపోల ద్వారా పంపిణీ చేస్తుందని కూడా సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడైంది. -
స్పీడ్పోస్టు, కొరియర్లలో డ్రగ్స్
సాక్షి, హైదరాబాద్: నగరంలో డ్రగ్స్ దందా జరుగుతోందని మరోసారి తేటతెల్లమైంది. ప లువురు విదేశీయులు ఇక్కడ మాదక ద్రవ్యా లు విక్రయిస్తున్నారని స్వయంగా ఎక్సైజ్శాఖ అంగీకరించింది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్జీజీ) స మాచార హక్కు చట్టం ద్వారా వేసిన ప్రశ్నకు ఎక్సైజ్శాఖ సమాధానమిస్తూ పలు విషయాలను వెల్లడించింది. హైదరాబాద్లో అనేక మార్గాల్లో డ్రగ్స్ విక్రయాలు జరుగు తుండగా.. ఈ వ్యవహారాలను మొత్తం విదేశీయులే నడిపిస్తున్నారని, ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే.. నేరుగా ఇంటికే స్పీడ్ పోస్టు ద్వారా నిషేధిత మాదకద్రవ్యాలు చేరుతున్నాయని ఎక్సైజ్శాఖ బాంబు పేల్చింది. కొనుగోలుదారులు ఆర్డర్ చేసే డ్రగ్స్ గ్రా ముల్లో ఉండటంతో వాటిని గుర్తించడం కష్టమని, విదేశాల నుంచి వచ్చే ప్రతీ ఉత్తరాన్ని తనిఖీ చేయడం సాధ్యం కాదని అధికారులే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. గుట్టుగా సాగుతున్న ఈ దందాను మరింత విస్తరించేందుకు విద్యార్థులను ఎంచుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఎక్సైజ్శాఖ అరెస్టు చేసిన డ్రగ్స్ విక్రయదారుల్లో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా ఉండటం విస్తరించిన నెట్వర్క్ తీవ్రతకు అద్దం పడుతోంది. వీరిని మాదకద్రవ్యాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలపై ఆయా కాలేజీలు బహిష్కరించాయి. ఇంగ్లండ్, జర్మనీల నుంచి కొరియర్ల ద్వారా డ్రగ్స్ నేరుగా ఇంటికే చేరుతున్నాయన్న విషయం కూడా వెల్లడైంది. స్టీల్బౌల్స్ పేరుతో కొకైన్, ఎల్ఎస్డీలను భారత్కు దిగుమతి చేస్తున్నారని గుర్తించారు. అదే సమయంలో సికింద్రాబాద్ మోండా మార్కెట్లోని ఓ ఫార్మాలో డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు. దర్యాప్తు పైపైనే.. డ్రగ్స్ కేసుల విచారణలో ఎక్సై జ్ శాఖ లోతుగా వెళ్లడం లేదన్న విమర్శలు ఎదుర్కొంటోంది. నిందితుల్లో అధికశాతం పలుకు బడి కలిగిన రాజకీయ, సంప న్న కుటుంబాల వారు కావడం తో విచారణ ముందుకుసాగకుండా అడ్డుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. 2017లోనూ ఇదే తరహాలో సినిమా పరిశ్రమలో డ్రగ్స్ కల్లోలం చెలరేగిన విషయం తెలిసిందే. ఆ కేసులో 60 మంది పేర్లు జాబితాలో పొందుపరిచిన అధికారులు, మరో 12 మంది సినీ ప్రముఖులనూ గుర్తించారు. తొలుత విచారణ నిష్పక్షపాతంగానే సాగినా.. చార్జిషీట్లలో ఎక్కడా సినీ ప్రముఖుల పేర్లు లేకపోవడంతో కేసు పక్కదారి పట్టిందన్న విమర్శలకు బలం చేకూర్చింది. విద్యార్థులు బలి కాకుండా చూడాలి: పద్మనాభరెడ్డి, ఎఫ్జీజీ సెక్రటరీ హైదరాబాద్లో విస్తరిస్తోన్న డ్రగ్స్ కల్చర్పై ప్రభుత్వం స్పందించాలి. మాదకద్రవ్యాలకు విద్యార్థులు అలవాటుపడితే... అది మొత్తం దేశంపైనే చెడు ప్రభావం చూపుతుంది. ఇకనమోదైన కేసులను నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలి. నిందితులెవరైనా శిక్ష పడేలా చూడాలి. -
2024 నాటికి మద్య రహిత రాష్ట్రంగా ఏపీ
నెల్లూరు(క్రైమ్): మద్యపాన వ్యసనాన్ని సమాజం నుంచి దూరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, 2024 నాటికి మద్య రహిత రాష్ట్రంగా ఏపీ మారబోతోందని రాష్ట్ర మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వి.లక్ష్మణ్రెడ్డి పేర్కొన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు అన్ని వర్గాలవారు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. శనివారం ఆయన నెల్లూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ► ప్రస్తుతం మద్యం విక్రయాలను గత ప్రభుత్వ హయాంలోని విక్రయాలతో పరిశీలిస్తే.. 30 శాతం మద్యం, 60 శాతం బీర్లు విక్రయాలు తగ్గాయి. 2024 నాటికి త్రీస్టార్, ఫైవ్ స్టార్ హోటల్స్కే మద్యం పరిమితం కానుంది. ► మద్యంలేని సమాజాన్ని సృష్టించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోంది. ఈ మహాయజ్ఞంలో అందరూ భాగస్వాములు కావాలి. ► మద్య పానంతో కలుగుతున్న నష్టాలపై, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై షార్ట్ఫిల్మ్ల పోటీలకు ఎంట్రీలను ఆహ్వానిస్తున్నాం. విజేతలకు అక్టోబర్ 2 మహాత్మగాంధీజయంతి రోజున గుంటూరులో ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్శాఖ మంత్రి నారాయణస్వామి చేతుల మీదుగా బహుమతులు అందజేయనున్నాం. -
పెదకూరపాడు ఎక్సైజ్ ఎస్ఐ ఆత్మహత్యాయత్నం
-
పెదకూరపాడు ఎక్సైజ్ ఎస్ఐ ఆత్మహత్యాయత్నం
సాక్షి, గుంటూరు : పెదకూరపాడు ఎక్సైజ్ ఎస్ఐ గీత ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతోంది. ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. కాగా.. ఎక్సైజ్ సూపరింటెండెంట్ బాలకృష్ణన్ వేధింపుల వల్లే ఎస్ఐ గీత ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. దీంతో సూపరింటెండెంట్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేసి, విచారణకు ఆదేశించారు. (మూడు రోజుల కస్టడీకి నూతన్ నాయుడు) -
కరోనా వేళ.. ‘సూపర్’ కథ!
సాక్షి, హైదరాబాద్ : గ్రూప్–2 నియామకాల ద్వారా నియమితులైన ఎస్సైల వేతనాల చెల్లింపులకు ఇబ్బంది లేకుండా ఉండడం కోసమంటూ 83 సూపర్ న్యూమరరీ పోస్టులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం ఎక్సైజ్ శాఖలో చర్చనీయాంశమైంది. కరోనా కాలంలో కాసులకు కష్టాలు ఎదుర్కొంటున్న వేళ ఈ పోస్టులు సృష్టించి మరీ ఏడాదిపాటు వేతనాలు చెల్లించడం ఎందుకనే చర్చ ఆ శాఖ వర్గాల్లో జరుగుతోంది. అయితే, ఈ పోస్టుల సృష్టి ద్వారా శాఖ పరిధిలో అడ్హాక్ పదోన్నతులు పొందిన హెడ్ కానిస్టేబుళ్లను రివర్షన్ గండం నుంచి తప్పించారని, తద్వారా చాలాకాలంగా పదోన్నతులు లేకుండా ఉన్నవారికి ఉపశమనం కలిగిందని మరికొందరు అంటున్నారు. చాలాకాలంపాటు ఎస్సైలుగా తాత్కాలిక పదోన్నతిపై పనిచేసినవారిని.. డైరెక్ట్ రిక్రూటీలు వచ్చారనే కారణంతో వెనక్కు పంపడం వారిని నైతికంగా దెబ్బతీస్తుందని, అందుకే వారికి సాధారణ పదోన్నతుల సమయం వచ్చే వరకు ఈ పోస్టులు మనుగడలో ఉండేలా ఉత్తర్వులు ఇచ్చారనే చర్చ జరుగుతోంది. ఈ ఉత్తర్వుల ద్వారా గరిష్టంగా రూ.3 కోట్ల అదనపు భారం ఆ శాఖపై పడుతుందని సమాచారం. మరోవైపు ఈ ఉత్తర్వుల జారీ కోసం కాసులు చేతులు మారాయని, ఈ నేపథ్యంలోనే హడావుడి ఆదేశాలు వచ్చాయనే మరో చర్చ కూడా ఉద్యోగుల్లో సాగుతోంది. మొత్తం మీద కరోనా కలకలం రేపుతున్న వేళ వచ్చిన సూపర్ న్యూమరరీ ఉత్తర్వులు ఎక్సైజ్ శాఖలో ఆసక్తికర చర్చకు దారి తీస్తున్నాయి. -
మద్యం దందాలో ఆ ఇద్దరు సీఐలు
ఇంటి దొంగల బాగోతం మొత్తం ఎక్సైజ్ శాఖ పరువును బజారున పడేస్తోంది. ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తున్నా.. డబ్బు కిక్కు దిగని ఆ ఇద్దరు సీఐలు అడ్డదారిలో అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రముఖుల పేర్లు చెప్పి పబ్బం గడుపుకుంటున్నారు. లెక్కల్లో తేడా రాకుండా జాగ్రత్త పడుతూ ఎంచక్కా నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నారు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: మద్యం వ్యాపారం ఎక్సైజ్ శాఖలోని ఇద్దరు సీఐలకు ఆదాయ వనరుగా మారింది. గతంలో సిండికేట్, ఇతరత్రా మార్గాల్లో వస్తున్న ఆదాయానికి కాస్తా ప్రభుత్వం గండి కొట్టడంతో కొందరు ఉద్యోగులు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటున్నారు. నేరుగా డిపో నుంచి కేసులకు కేసుల మద్యాన్ని తమకున్న విచక్షణాధికారాలతో తీసుకెళ్తున్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న బ్రాండ్లను తీసుకెళ్లి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈ విధంగా ఒక్కో కేసు మీద బ్రాండ్ను బట్టి రూ.10 వేల వరకు ఆర్జిస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా మంచి బ్రాండ్లు కాస్తా పక్కదారి పడుతుండటంతో మద్యం దుకాణాల్లో ఈ బ్రాండ్ల మద్యం దొరకని పరిస్థితి నెలకొంది. అయితే, ఈ విధంగా పక్కదారి పట్టించిన మద్యాన్ని దుకాణాల్లోనే విక్రయించినట్టు లెక్కలు తారుమారు చేస్తున్నట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంలో ఇద్దరు ఎక్సైజ్ సీఐలు కీలకపాత్ర పోషిస్తున్నట్టు చర్చ జరుగుతోంది. వీరిద్దరూ తమకు తెలిసిన ముఖ్యుల పేర్లు చెప్పి ఈ విధంగా మద్యాన్ని పక్కదారి పట్టిస్తున్నట్టు తెలుస్తోంది. కొన్ని సార్లు డిపోల నుంచి తరలిస్తుండగా.. మరికొన్ని సార్లు నేరుగా మద్యం దుకాణాల నుంచి తీసుకెళుతున్నారనేఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం తమకు తెలిసిన సూపర్వైజర్లను వాడుకుంటున్నారు. అయితే, స్థానిక ఎక్సైజ్ సీఐకి విషయం తెలిసి సూపర్వైజర్లను ప్రశ్నిస్తే.. సదరు ఇద్దరు సీఐల పేర్లు చెబుతున్నట్టు తెలుస్తోంది. దీంతో వారితో తమకెందుకు గొడవంటూ స్థానిక ఎక్సైజ్ సీఐలు కిమ్మనకుండా ఉండిపోతున్నారని సమాచారం. సూపర్వైజర్లతో లెక్క సరి వాస్తవానికి గతంలో ప్రైవేటు మద్యం దుకాణాలు ఉండేవి. ఆయా దుకాణాల నుంచి నెలవారీగా మాముళ్లు వచ్చేవి. మరోవైపు బార్ల నుంచి కూడా భారీగానే దండుకునేవారు. అయితే, ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటు మద్యం దుకాణాలను ఎత్తేశారు. పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాల నిర్వహణ సాగుతోంది. అంతేకాకుండా షాపుల సంఖ్యను కూడా క్రమంగా తగ్గించారు. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖలోని కొందరు అక్రమార్కులకు గీతం లేకుండా పోయింది. దీంతో కొద్ది మంది అవినీతి సిబ్బంది కొత్త మార్గాలను ఎన్నుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా మద్యం దుకాణాల్లో అవుట్సోర్సింగ్ కింద కొద్ది మంది సూపర్వైజర్లను తమకు తెలిసిన వారిని నియమించుకున్నట్టు సమాచారం. వీరి ద్వారా మద్యాన్ని పక్కదారి పట్టించి.. సదరు దుకాణంలోనే విక్రయించినట్టు లెక్కలు చూపుతున్నారు. ఈ విధంగా డిపో నుంచి నేరుగా తీసుకెళ్లిన మద్యం బాటిళ్ల లెక్కలను సరిచేసే బాధ్యతను కూడా తమకు అనుకూలమైన సూపర్వైజర్లతోనే చేయిస్తున్నారు. అంతేకాకుండా నేరుగా డిపో నుంచి కూడా వివిధ వ్యక్తుల పేర్లు చెప్పి కేసులకు కేసులు ఎత్తుకెళుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో ప్రధానంగా ఇద్దరు సీఐల పాత్ర ఉన్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక సిబ్బందికి చుక్కలు అక్రమ మద్యం, ఇసుక రవాణాను అరికట్టేందుకు వీలుగా ప్రభుత్వం ప్రత్యేకంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(సెబ్)ను నియమించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఐపీఎస్ అధికారిని కూడా నియమించింది. సెబ్ పరిధిలోకి కొద్ది మంది ఎక్సైజ్ సిబ్బందిని కూడా తీసుకున్నారు. అయితే, ఈ విధంగా అక్రమాలు పాల్పడుతున్న సీఐల్లో ఒకరు సెబ్లో ఉన్నట్టు తెలుస్తోంది. తద్వారా తమకు అడ్డులేదనే రీతిలో వీరు వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా మద్యం దుకాణం నుంచి మద్యాన్ని అక్రమంగా తీసుకెళుతున్నట్టు తెలిసిన స్థానిక ఎక్సైజ్ సిబ్బంది పర్యవేక్షణకు వెళ్లి సూపర్వైజర్లను నిలదీస్తే.. సదరు అధికారి పేరు చెబుతున్నట్టు సమాచారం. దీంతో వీరు కూడా తమకెందుకీ తలనొప్పులు అని మిన్నకుండిపోతున్నట్టు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై ఉన్నతాధికారులు దృష్టి సారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సెబ్లో చక్రం తిప్పుతున్న ఓ సీఐ తనకున్న పలుకుబడితో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(సెబ్)లో చోటు దక్కించుకున్న ఓ ఎక్సైజ్ సీఐ మద్యం అక్రమ దందాలో చక్రం తిప్పుతున్నాడు. మద్యం దుకాణాల్లోని కొందరు సూపర్వైజర్లను తన కనుసన్నల్లో పెట్టుకొని ఎంచక్కా ‘బ్రాండ్’ బజాయిస్తున్నాడు. జిల్లాలో పాతుకుపోయిన ఈ సీఐ.. ఇప్పుడు ఏకంగా సెబ్లో పాగా వేసి తన అక్రమాలు వెలుగులోకి రాకుండా జాగ్రత్త పడుతున్నాడు. వ్యవహారం బయటకు పొక్కినా స్థానిక సిబ్బంది ఎందుకొచ్చిన తలనొప్పులని మిన్నకుండిపోతుండటం గమనార్హం. -
మద్యంపై ఆదాయం వద్దు.. ప్రజారోగ్యమే ముద్దు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వానికి మద్యంపై ఆదాయం వద్దని, ప్రజారోగ్యమే ప్రాధాన్యత అని ఎక్సైజ్ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన ఎక్సైజ్ శాఖపై సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వంలో అమ్మకాలతో పోలిస్తే.. లిక్కర్ అమ్మకాల్లో 31%, బీరు అమ్మకాల్లో 49.74 % తగ్గుదల నమోదైందన్నారు. మద్యం అమ్మకాల విలువ రూ.1,944 కోట్లు కోల్పోయినా సీఎం జగన్ మహిళలకు ఇచ్చిన మాటకు కట్టుబడి మద్య నియంత్రణ వైపు అడుగులేస్తున్నట్లు చెప్పారు. ► గత ప్రభుత్వ హయాంలో మద్యం షాపునకు అనుబంధంగా ఉన్న పర్మిట్ రూముల వల్ల ఏడాదికి రూ.164 కోట్ల ఆదాయం వచ్చేది. ఈ ఆదాయాన్ని లెక్క చేయకుండా ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహిస్తూ పర్మిట్ రూములను రద్దు చేసింది. ► ప్రైవేటు వ్యక్తులకు, మద్యం మాఫియాకు అడ్డుకట్ట వేసి వారి నుంచి లైసెన్సు ఫీజు రూపంలో వచ్చే రూ.400 కోట్ల ఆదాయాన్ని వదులుకుంది. ► ఏడాదిలోనే 33 శాతం మద్యం షాపులు తగ్గించడంతో పాటు షాపుల వేళలు కుదించాం. 43 వేల బెల్టు షాపులు రద్దు చేశాం. ► స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ బ్యూరో ఏర్పాటు చేసిన నెల రోజుల్లోనే 84,412 లీటర్ల సారా సీజ్ చేశాం. 14,84,627 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం, 54,594 కేజీల నల్లబెల్లం స్వాధీనం, 67,512 లీ టర్ల నాన్ డ్యూటీ పెయిడ్ లిక్క ర్, 4,732 లీటర్ల బీరు, 5,514 వాహనాలను సీజ్ చేశాం. -
కూలీ డబ్బులన్నీ ఇప్పుడు ఇంటికే
సాక్షి, కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ హయాంలో 535 మద్యం దుకాణాలు ఉండగా ఇప్పుడు 425కి పరిమితమయ్యాయి. ఈ నెలాఖరు కల్లా మరో 60 షాపులు తగ్గించేందుకు కసరత్తు జరుగుతోంది. ఇక 3,000కిపైగా ఉన్న బెల్ట్ షాపులను పూర్తిగా నిర్మూలించారు. బార్లలో అమ్మకాలు నిలిపివేయడంతో మద్యం అమ్మకాలు 50 శాతం, బీరు విక్రయాలు 90 శాతం తగ్గాయి. విక్రయాల్లో సమయ పాలన పకడ్బందీగా అమలు చేయడం, పరిమితి విధించడంతో మద్యం రక్కసిని నియంత్రించగలిగారు. గడ్డు కాలం నుంచి గట్టెక్కాం.. ఇంటి యజమాని తాగుడుకు బానిస కావడంతో ఛిద్రమైన ఎన్నో కుటుంబాలను చూశా. ఆ గడ్డు పరిస్థితుల నుంచి ఇప్పుడు మేం పూర్తిగా కోలుకున్నాం. మా ఆయన సత్యన్నారాయణ తాగుడుకు స్వస్తి చెప్పడం తో కూలీ డబ్బులన్నీ ఇంటికి చేరుతున్నాయి. చేతి ఖర్చులకు రూ.10, 20 తీసుకొని మిగతావి మాకే ఇవ్వడంతో సంసారం ఒడిదుడుకులు లేకుండా సాగిపోతోంది. – పొత్తూరి వెంకటలక్ష్మి (బూరుగపల్లి, రాజవొమ్మంగి మండలం) కొనలేక మానేశా.. ‘25 ఏళ్లుగా మందు తాగుతున్నా. గతంలో క్వార్టర్ బాటిల్ రూ.110కే దొరకడంతో కూలీ డబ్బుల్లో సగం ఖర్చు పెట్టి మద్యం తాగేవాడిని. బెల్టుషాపుల ద్వారా 24 గంటలు దొరికేది. ఇప్పుడు ధరలు భారీగా పెరగడంతో క్వార్టర్ బాటిల్ రూ.350 పెట్టి కొనలేక మద్యం మానేశా. నా కుమార్తె రాణికి గ్రామ వలంటీర్గా ఉద్యోగం కూడా వచ్చింది. ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయాలతో మా కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తోంది’– అండ్రు నాగేంద్రుడు (గోకవరం మండలం సంజీవయ్యనగర్) దూరం వెళ్లలేక మానుకుంటున్నాం.. మా ఊళ్లో మద్యం షాపు లేదు. మద్యం దుకాణానికి వెళ్లాలంటే 4 కిలోమీటర్ల దూరంలోని వెల్ల గ్రామానికి వెళ్లాలి. గత ప్రభుత్వంలో బెల్టు షాపుల వల్ల మద్యం దొరికేది. వీలున్నప్పుడల్లా మద్యం తీసుకునే వాళ్లం. ప్రస్తుతం ప్రభుత్వం బెల్టు షాపులు కూడా లేకుండా చేయడంతో ఊర్లో చాలా మందిమి మద్యం అలవాటు మానుకున్నాం. నేను కల్లు గీత వృత్తి ద్వారా వచ్చిన ఆదాయంతో ఇద్దరు పిల్లలను చక్కగా పోషించుకుంటున్నాను. – వాసంశెట్టి నాగ ఆంజనేయులు,తాడిపల్లి, రామచంద్రపురం మండలం) -
కరోనా మృతి.. కొత్త సవాలు
తిరువనంతపురం: గురువారం ఉదయం కేరళలోని కన్నూర్ జిల్లాలో ఎక్సైజ్ విభాగంలో పనిచేస్తున్న 28 ఏళ్ల డ్రైవర్ కరోనాతో మరణించాడు. అయితే చనిపోయే ముందు వరకు అతడిలో కరోనా లక్షణాలు కనిపించకపోవడమే కాక.. ఎక్కడ, ఎవరి ద్వారా అతడికి కరోనా సోకింది అనే విషయం ఇంకా తెలియలేదు. ఇప్పటివరకు సమాజంలో వైరస్ నిశ్శబ్దంగా సంక్రమిస్తుందనే సందేహాలను పక్కదారి పట్టించిన కేరళలో నమోదయిన ఈ కేసు.. ఆ రాష్ట్ర ఆరోగ్య అధికారులకు కొత్త సవాలు విసురుతోంది. వివరాలు పాడియూర్కు చెందిన సునీల్ కుమార్ మత్తన్నూర్ ఎక్సైజ్ రేంజ్ కార్యాలయంలో డ్రైవర్గా ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో జూన్ 12న అతడు వైరల్ న్యుమోనియా లక్షణాలతో మొదట ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. కొద్ది రోజుల పాటు చికిత్స తీసుకున్నాడు కానీ ఫలితం లేదు. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో జిల్లాలో కరోనా పేషంట్లకు చికిత్స అందించే అత్యున్నత ఆస్పత్రి పరియారం మెడికల్ కాలేజీకి పంపించారు. అక్కడ అతనికి కరోనా పరీక్షలు చేశారు. జూన్ 14న నమునాలు తీసుకోగా.. దాని ఫలితాలు జూన్ 16న వచ్చాయి. సునీల్ కుమార్కు కరోనా పాజిటివ్గా తేలింది. అయితే అతడికి వైరస్ సంక్రమణ ఎలా జరిగింది అనే విషయం ఇంకా తెలియలేదు. (వైద్యులకు, పోలీసులకు రక్షణ కిట్లు ఇవ్వండి) ఈ క్రమంలో వైద్యులు మాట్లాడుతూ.. ‘ఈ రోజు ఉదయం 9:55 గంటలకు సునీల్ కుమార్ మరణించాడు. తొలుత అతడిలో కరోనా లక్షణాలు కనిపించలేదు. అతడి ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో కరోనా టెస్టులు చేయగా పాజిటివ్ వచ్చింది’ అన్నారు. ‘సునీల్ కుమార్ డ్రైవర్ కావడంతో సహజంగానే అతను చాలా ప్రదేశాలకు వెళ్లి ఉంటాడు. ప్రైమరి కాంటాక్ట్స్ చాలానే ఉండే అవకాశం ఉంది. అంతేకాక ఎక్సైజ్ కార్యాలయంలో అతని సహచరులతో పాటు బయట అతను కలుసుకున్న ఇతరుల వివారలు సేకరిస్తున్నాం. అయితే సునీల్ కుమార్కి ఎక్కడ, ఎవరి నుంచి కరోనా సోకింది అనే దాని గురించి తెలుసుకోవడానికి మేము కూడా ప్రయత్నిస్తున్నాము’ అన్నారు. డాక్టర్ నాయక్ మాట్లాడుతూ, ‘ఒక వ్యక్తి శరీరంలో అతని / ఆమె రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే.. వేరే ఇతర అంతర్గత వైద్య పరిస్థితులతో సంబంధం లేకుండా వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది’ అన్నారు. అంతేకాక ‘ఇది క్లిష్టమైన పరిస్థితి. వైరస్ ప్రజలను ఎక్కడ, ఎలా ప్రభావితం చేస్తుందో మేము చెప్పలేము. ఇప్పటివరకు కన్నూర్ జిల్లాలో కరోనా కారణంగా కేవలం వృద్ధులు మాత్రమే మరణించారు. వారిలో మొదటి నుంచి కరోనా లక్షణాలు కనిపించాయి. కానీ సునీల్ కుమార్ విషయంలో ఇవేవి జరగలేదు. మేము చాలా జాగ్రత్తగా ఉండాలి’ అన్నారు కరోనా కారణంగా కేరళలో మృతి చెందిన వారిలో సునీల్ కుమార్ 21వ వ్యక్తి. ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం.. కరోనా లక్షణాలు కనిపపించకుండా మరణించిన రెండవ వ్యక్తి సునీల్ కుమార్. మే 31 న కొల్లం జిల్లాలో 65 ఏళ్ల వ్యక్తి మరణించిన కేసులో కూడా మొదట కరోనా లక్షణాల కనిపించలేదు. వైరస్ ఎక్కడి నుంచి సంక్రమించింది అనే విషయం ఇప్పటికి కూడా తెలియలేదు. -
మద్య నియంత్రణతో.. మార్పు వైపు
ఈమె గుంటూరు జిల్లా ఈపూరుకు చెందిన చేపల అంజమ్మ. మద్య నియంత్రణకు ముందు తమ గ్రామంలో అడుగుకో బెల్టుషాపు ఉండేదని.. తన భర్త సంపాదనంతా తాగుడికే ఖర్చుచేసే వాడని చెబుతోంది. కానీ, ఇప్పుడు మద్యం అందకుండా పోవడంతో అతను కూలి డబ్బులన్నీ తెచ్చి ఇంట్లో ఇస్తున్నా డని సంతోషంతో చెబుతోంది. ఇలా ఒక్క అంజమ్మ ఇంట్లోనే కాదు.. ప్రతి పేద మహిళ ఇంట్లోనూ మద్య నియంత్రణ ఆర్థిక స్థితిగతులను మార్చింది. సాక్షి, అమరావతి: మద్యం ప్రియుల్లో మార్పు మొదలైంది. నవరత్నాల్లో ఒకటైన దశల వారీ మద్యం నియంత్రణకు ఏడాది కాలంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలవల్ల పేదల కుటుంబాల్లో ఆర్థిక స్థితి మెరుగుపడింది. ఆదాయం కోసం కాకుండా ప్రజారోగ్యం కోసమే ఈ సర్కారు పనిచేస్తుందని సీఎం వైఎస్ జగన్ చేతల్లో చూపించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 43 వేల బెల్ట్ షాపులను తొలగించిన సంగతి తెలిసిందే. అంతేకాక.. మద్యం వినియోగాన్ని కూడా తగ్గించేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకుని అమలుపరుస్తోంది. దీంతో పేదల కుటుంబాల్లో జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి. మద్యం వినియోగం తగ్గడంతో డ్రంకెన్ డ్రైవ్ కేసులు గణనీయంగా తగ్గిపోయాయి. టీడీపీ హయాంలోని పరిస్థితికి ఇప్పటికీ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఎలాగంటే.. ► 2018 అక్టోబర్ నుండి 2019 మార్చి వరకు 191.79 లక్షల మద్యం కేసుల అమ్మకాలు జరగ్గా, 2019 అక్టోబర్ నుండి 2020 మార్చి వరకు 140.79 లక్షల కేసులు మాత్రమే అమ్ముడయ్యాయి. అంటే.. 23.46 శాతం అమ్మకాలు తగ్గాయి. ► బీరు విషయానికొస్తే.. 2018 అక్టోబర్ నుండి 2019 మార్చి వరకు 131.46 లక్షల కేసులు అమ్ముడవగా.. 2019 అక్టోబర్ నుండి 2020 మార్చి వరకు కేవలం 51.85 లక్షల కేసుల అమ్మకాలు జరిగాయి. అంటే.. 55.57 శాతం అమ్మకాలు తగ్గాయి. ► లిక్కర్ షాపుల వద్ద టీడీపీ హయాంలో ఏర్పాటుచేసిన పర్మిట్ రూమ్లను ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా రద్దుచేసింది. ► అప్పట్లో ఒక వ్యక్తికి గరిష్టంగా ఆరు మద్యం బాటిళ్లు ఇచ్చేవారు. కానీ, ఇప్పుడు ఏదైనా మూడు మాత్రమే ఇస్తున్నారు. ► చంద్రబాబు హయాంలో అర్ధరాత్రి వరకు అమ్మకాలు జరిగేవి. ఇప్పుడు ఉ.11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే అనుమతిస్తున్నారు. ► వినియోగాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం షాక్ కొట్టేలా మద్యం ధరలను 75 శాతం మేర భారీగా పెంచింది. ► దీంతోపాటు బార్లను 40 శాతం తగ్గించింది. ఫలితంగా రాష్ట్రంలో ఉన్న 840 బార్లు 530కి తగ్గాయి. ► అలాగే, ఏపీ స్టేట్ బెవరేజేస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న షాపులను 4,380 నుంచి 2,934కు తగ్గించారు. ► ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మద్యంవల్ల ఎదురయ్యే దుష్ఫలితాలపై సర్కారు ప్రజల్లో పెద్దఎత్తున ప్రచారం ప్రారంభించింది. ఇందుకోసం మద్య విమోచన ప్రచార కమిటీని ఏర్పాటుచేసింది. ► అలాగే, రాష్ట్రవ్యాప్తంగా 15 డి–అడిక్షన్ కేంద్రాలను ఏర్పాటుచేసింది. ► అక్రమ మద్యాన్ని అన్ని రకాలుగా అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ బ్యూరో (ఎస్ఈబీ)ను ఏర్పాటుచేసింది. ► వార్డు వలంటీర్లతో పాటు గ్రామాల్లో నియమించిన మహిళా మిత్ర, మహిళా రక్షక్ల సేవలను ఇందుకు వినియోగించుకుంటోంది. దశలవారీ మద్య నియంత్రణకు కట్టుబడ్డాం మా ప్రభుత్వం దశల వారీ మద్య నియంత్రణకు కట్టుబడి ఉంది. మద్యాన్ని ప్రజలకు దూరం చేసేందుకే సీఎం వైఎస్ జగన్ ధరల పెంపు నిర్ణయాన్ని తీసుకున్నారు. అసలు ప్రజలకు మద్యాన్ని అలవాటు చేసిందే చంద్రబాబు. లాక్డౌన్ కాలంలో అక్రమ మద్యం విక్రయాలకు టీడీపీ నేతలు పాల్పడ్డారు. చంద్రబాబు బంధువులు కూడా చిత్తూరులో మద్యం అమ్ముతూ పట్టుబడ్డారు. – కళత్తూరు నారాయణ స్వామి, డిప్యూటీ సీఎం గతంలో అమ్మకాలు పెంచేందుకు టార్గెట్లు గతంలో మద్యం అమ్మకాలు ఎలా పెంచాలా? అని ఎక్సైజ్ అధికారులకే టార్గెట్లు ఇచ్చేవాళ్లం. ఇప్పుడు ఎలా తగ్గించాలా? అని లక్ష్యాలు విధిస్తున్నాం. మద్యం షాపులు ఎక్కడ నుంచి తొలగించాలనే అంశంపైనే ఎక్సైజ్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. – కేఎల్ భాస్కర్, ఎక్సైజ్ అదనపు కమిషనర్ -
రిపోర్టర్ ఇంట్లో మద్యం పట్టివేత
-
ఆంధ్రజ్యోతి రిపోర్టర్ ఇంట్లో మద్యం పట్టివేత
సాక్షి, అనంతపురం : కళ్యాణదుర్గంలో ఎక్సైజ్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఆంధ్రజ్యోతి రిపోర్టర్ శంకర్ నాయక్ ఇంట్లో భారీగా మద్యం బయటపడింది. అతడి ఇంటి నుంచి 368 బాటిళ్ల కర్ణాటక మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రజ్యోతి విలేకరి శంకర్ నాయక్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. కాగా లాక్డౌన్ సమయంలోనూ అక్రమంగా మద్యం విక్రయించినట్లు శంకర్ నాయక్పై పలు ఆరోపణలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. (ఆంధ్రజ్యోతి వాహనం సీజ్) -
డ్రగ్స్ ఫ్రీ సిటీగా హైదరాబాద్: అంజిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ సడలింపు తర్వాత గంజాయి, డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాలకు చెక్ పెడుతున్నామని ఎక్సైజ్ అండ్ ఎన్స్ఫోర్స్మెంట్ అడిషనల్ సూపరిండెంట్ అంజిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బెంగుళూరు నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను అరెస్టు చేసి వారి నుంచి 54 గ్రాముల కోకైన్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వారు హైదరాబాద్కు చెందిన పరంజ్యోతి, అమిత్ సింగ్లుగా ఆయన పేర్కొన్నారు. నిందితులను విచారించగా బెంగుళూరు నుంచి 70 గ్రాముల కొకైన్ను కోనుగోలు చేసి 16 గ్రాములు విక్రయించినట్లు విచారణలో వెల్లడైందన్నారు. ప్రస్తుతం ఎవరెవరికి కొకైన్ను విక్రయించారనే దానిపై విచారణ జరుపుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం వారి కాల్ డేటా, వాట్సప్ చాట్లను పరీశిలించి వివరాలు సేకరిస్తున్నామన్నారు. ఇటీవల హైదరాబాద్లో పెద్ద ఎత్తున గంజాయి తరలించిన ముఠాను సైతం అరెస్టు చేశామని తెలిపారు. హైదరాబాద్ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చేందుకు ఎక్సైజ్ & ఎన్ఫోర్స్మెంట్ కృషి చేస్తుందన్నారు. కాగా పిల్లలు డ్రగ్స్కు అలవాటు పడకుండా తల్లిదండ్రులు చూసుకోవాలని ఆయన సూచించారు. -
15 రోజుల్లో 1,648 వాహనాలు సీజ్
సాక్షి, అమరావతి: స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ బ్యూరో (ఎస్ఈబీ) దాడుల్లో అక్రమంగా మద్యం తరలిస్తున్న వాహనాలు భారీగా పట్టుబడుతున్నాయి. రాష్ట్రంలో అక్రమ మద్యం రవాణాను అరికట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గత 15 రోజుల క్రితం ఎస్ఈబీ ఏర్పాటైన విషయం తెలిసిందే. ఈ 15 రోజుల్లో అక్రమంగా మద్యం తరలిస్తున్న 1,648 వాహనాలను ఎస్ఈబీ అధికారులు సీజ్ చేశారు. వీటిలో అధికంగా ఖరీదైన హై ఎండ్ మోడల్ కార్లు ఉండటం గమనార్హం. ప్రధానంగా ఖరీదైన కార్లలో ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం పట్టుబడుతోంది. పెద్ద ఎత్తున వాహనాలు పట్టుబడటంతో వీటిని ఉంచేందుకు ఎక్సైజ్ స్టేషన్లు సరిపోవడం లేదు. దీంతో ఎక్సైజ్ స్టేషన్లలో ఉన్న అంతకుముందు పట్టుబడిన పాత వాహనాలకు వేలం ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేందుకు ఎక్సైజ్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ► నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ (ఎన్డీపీఎల్) ఒక్క బాటిల్ ఉన్నా వాహనాన్ని సీజ్ చేస్తారు. అదే డ్యూటీ పెయిడ్ లిక్కర్ బాటిళ్లు మూడుకు మించి ఉంటే కేసులు నమోదు చేస్తారు. ► సరిహద్దు చెక్పోస్టుల వద్ద సీసీటీవీలు ఏర్పాటు చేయడంతోపాటు మొబైల్ పార్టీలను రంగంలోకి దించి మద్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపనున్నారు. ► పదే పదే పట్టుబడుతున్న వారిపై పీడీ కేసులు నమోదు చేయనున్నారు. -
కమీషన్ క్వీన్!
సాక్షి, కృష్ణా: అది మంగళగిరి ఆబ్కారీ స్టేషన్.. అక్కడ ఆమె చెప్పిందే వేదం.. చేసిందే చట్టం.. స్టేషన్లో బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో అక్రమార్కుల పాలిట సింహ స్వప్నం.. వరుసగా గంజాయి రవాణాదారులు.. బెల్టుషాపుల నిర్వాహకులపై ఉక్కుపాదం మోపి.. ఆ ఏడాది ఉత్తమ ఉద్యోగిగా కలెక్టర్ నుంచి ప్రశంసాపత్రం కూడా అందుకున్నారు. దీంతో జిల్లాలో ఆ అధికారి పేరు మార్మోగింది.. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు ఆమె వ్యవహారం భిన్నం. స్టేషన్ పరిధిల గంజాయి వ్యాపారులకు, మత్తుమందు విక్రేతలకు అండదండలు అందిస్తుంటారు.. బడా బాబుల పిల్లలు ఎవరైనా గంజాయి, మత్తు పదార్థాలు సేవిస్తూ పట్టుపడినా... వారిపై ఎలాంటి కేసులు పెట్టరు. అక్రమంగా మద్యం విక్రయించే వారికి సహాయ సహకారాలు.. అందుకు ఫలితంగా మామూళ్లు దండుకోవడం ఇదీ ఆమె అసలు రూపం. దుకాణాల ఏర్పాటు మాటున.. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బెల్టుషాపులను రద్దు చేసింది. ప్రైవేటు మద్యం దుకాణాల స్థానంలో ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటు చేసింది. బార్లను సైతం 40 శాతానికి కుదించింది. ఈ నేపథ్యంలో మంగళగిరి ఆబ్కారీ స్టేషన్ పరిధిలో 23 ప్రభుత్వ మద్యం దుకాణాలను అక్టోబరు 1వ తేదీ నుంచి ఏర్పాటు చేశారు. ఇక్కడ ఆమె అక్రమార్కులతో కుమ్మక్కై.. షాపులను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. తాడేపల్లి సెంటర్లో గతంలో ఉన్న ప్రైవేటు మద్యం షాపు కౌంటర్ సుమారు రూ. 5 లక్షలు ఉండేది. అలాంటి చోట ఓ బార్ యజమానికి అండగా నిలిచి.. ఆ సెంటర్లో ప్రభుత్వ మద్యం దుకాణం ఏర్పాటు కాకుండా పకడ్బందీగా ప్రణాళిక అమలు చేసినట్లు తెలిసింది. అలాగే తాడికొండ, తుళ్లూరు మండలాల్లో ఉన్న 12 మద్యం షాపుల సమీపంలోనే అటూ ఇటుగా కూల్డ్రింక్ షాపులకు అనుమతించారు. ఈ షాపులన్నీ టీడీపీ మండలస్థాయి నాయకుడివే. వారితో ప్రాంతాన్ని బట్టి నెలనెలా రూ.5 వేల నుంచి 10 వేల వరకు మామూళ్లు వసూలు చేస్తున్నారు. ఎర్రబాలెం, వడ్డేశ్వరం గ్రామాల్లోని మద్యం దుకాణాల పక్కన మరో టీడీపీ నేత అనుచరులు కూల్డ్రింక్ షాపులు పెట్టినా ఆబ్కారీ అధికారి ఎటువంటి అభ్యంతరం పెట్టకపోవడం విశేషం. గుంటూరులో నివాసం ఉంటోన్న ఈ అధికారిణిని రోజూ మంగళగిరి స్టేషన్ నుంచి ఓ వాహనం వెళ్లి తీసుకొస్తుంది. మళ్లీ రాత్రికి తీసుకెళ్లి ఇంటి వద్ద దించేసి తిరిగి వాహనాన్ని మంగళగిరికి చేరుస్తారు. ఆమె వినియోగించే ఈ వాహనం సైతం మంగళిగిరికి చెందిన టీడీపీ ముఖ్య నాయకుడి పీఏది కావడం గమనార్హం. ప్రభుత్వ వాహనాలు ఉన్నప్పటికీ ఆమె అదే వాహనాన్ని ఉపయోగిస్తున్నారు. ఆ వాహనానికి సంబంధించిన డీజిల్ బిల్లులకు సైతం తాము వసూలు చేసిన మామూళ్ల నుంచే సొమ్ము చెల్లిస్తున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాలకు టెండర్ ద్వారా అద్దెలు ఖరారు చేశారు. మంగళగిరి, తాడేపల్లిలో ఒక్కో షాపునకు రూ. 50 వేల నుంచి రూ. 70 వేల వరకు అద్దెలు ఉండగా.. తుళ్లూరు, తాడికొండ మండలాల్లో వీటి అద్దె రూ. 20 వేలు రూ. 30 వేలు మధ్య ఉంది. అయితే ఆయా షాపుల యజమానులతోనూ ఒక నెల అద్దె భయానా రూపంలో వసూలు చేసినట్లు తెలుస్తోంది. మంగళగిరి చెందిన ఓ టీడీపీ నేత అన్న కుమారుడు, మరో యువకుడు గంజాయి, మత్తు మందుతో దొరికితే వారిపై కేసు పెట్టకుండా వదిలేశారు. స్టేషన్లో కూర్చోబెట్టి ఒప్పందం తర్వాత వదిలేశారు. ఆ తర్వాత నాలుగు రోజులకు టీడీపీ నేతకు చెందిన వస్త్ర దుకాణం నుంచి నాలుగు సూట్కేసుల నిండా దుస్తులు తీసుకున్నట్లు సమాచారం. విశాఖ–చెన్నైకు వెళ్లే ప్రైవేటు బస్సులు రోజూ కాజా టోల్ప్లాజా మీదుగా వెళ్తుంటాయి. ఇక్కడ ఎక్సైజ్ అధికారులు చేపట్టే తనిఖీల్లో బస్సుల్లో రవాణా అవుతున్న గంజాయి పాకెట్లు దొరుకుతున్నాయి. అయితే వీటిని ఎవరు తరలిస్తున్నారో తెలియదు కాబట్టి ఈ నేపథ్యంలో బస్సు డ్రైవర్, క్లీనర్లపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇది నిత్యకృత్యం కావడంతో ఏకంగా కొందరు ప్రైవేటు బస్సుల యజమానులతో మామూళ్లు మాట్లాడుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వ వాహనం తీసుకుని మూడు రోజులపాటు శ్రీశైలం వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో ఆబ్కారీ అధికారిణి అధికారికంగా సెలవు పెట్టినట్లుగా ఎక్కడా రికార్డుల్లో లేకపోవడం విడ్డూరం. ఈ ఏడాది మార్చిలో స్టేషన్కు చెందిన ఓ హెడ్కానిస్టేబుల్ పదవీ విరమణ పొందితే అతనికి వీడ్కోల పార్టీ హాయ్ల్యాండ్లో నిర్వహించారు. ఈ పార్టీకి స్టేషన్ సిబ్బంది ఎవ్వరూ వెళ్లలేదు. అయినా ఆ పార్టీ కోసం ఏకంగా రూ. 21,050 ఖర్చు పెట్టినట్లు రోజువారీ నిర్వహణ పట్టికలో చూపడం విశేషం. ఆమెకో లెక్కుంది.. ఇదంతా ఏదో రహస్యంగా జరుగుతోందని భావిస్తున్నారనుకుంటే పొరపడినట్లే.. అక్రమార్కుల ద్వారా వచ్చే మామూళ్లకు ఓ లెక్కుంది.. వాటిని ప్రతినెలా ఏ విధంగా రూపాయి రూపాయి ఖర్చు పెడుతున్న విషయాన్ని పట్టిక రూపంలో చూసిపెడుతున్నారు ఆమె ముఖ్య అనుచరులు. విచారించి చర్యలు తీసుకుంటాం.. మంగళగిరి ఎక్సైజ్ అధికారిణి అవినీతికి పాల్పడుతున్నట్లు ఇప్పటి వరకు మా దృష్టికి ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. ఒకవేళ అలాంటివి ఉంటే విచారించి చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ కె. శ్రీనివాస్, ఎక్సైజ్ డెప్యూటీ కమిషనర్, గుంటూరు -
ఏపీలో తగ్గుతున్న మద్యం వినియోగం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం మద్యపాన నిషేధంలో భాగంగా మద్యం ధరలను షాక్ కొట్టేలా పెంచడంతో మందు బాబులు తాగుడు తగ్గించేశారు. గత రెండు రోజుల నుంచి మద్యం వినియోగం బాగా తగ్గింది. సాధారణంగా వారాంతంలో మద్యం వినియోగం అధికంగా ఉంటుంది. రూ.70 కోట్ల నుంచి రూ.80 కోట్ల వరకు అమ్మకాలు జరుగుతుంటాయి. అలాంటిది శనివారం మద్యం షాపులు మూసే సమయానికి కేవలం రూ.40.77 కోట్ల అమ్మకాలు మాత్రమే నమోదయ్యాయి. దీన్ని బట్టి చూస్తే మద్యం ధరల పెరుగుదల ప్రభావం మందు బాబులపై ఊహించిన దానికంటే ఎక్కువ పడింది. మద్యం కొనాలంటేనే మందు బాబులు భయపడుతున్నారు. మరోవైపు అక్రమ మద్యం అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తోంది. నాటు సారా, సుంకం చెల్లించని మద్యం (ఎన్డీపీఎల్) అమ్మకాలు జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉండేలా చర్యలు చేపడుతోంది. ఇందుకోసం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) పేరిట శనివారం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మద్యం షాపుల్ని ఈ నెలాఖరు నాటికి 13 శాతం తగ్గిస్తే మద్యం వినియోగం ఇంకా తగ్గే అవకాశం ఉంది. ఆయా జిల్లాల్లో తగ్గే 566 మద్యం షాపుల వివరాలపై ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్లు రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు. ఒక్క రోజులోనే రూ.2 కోట్లకు పైగా తగ్గిన అమ్మకాలు ► రాష్ట్రంలో ఈ నెల 8 (శుక్రవారం)న మద్యం, బీరు కలిపి 15.55 లక్షల బాటిళ్లు విక్రయించారు. అమ్మకాల విలువ రూ.42.72 కోట్ల వరకు ఉంది. ► శనివారం 15.40 లక్షల బాటిళ్లను మాత్రమే మద్యం ప్రియులు కొనుగోలు చేయగా, విక్రయాల విలువ రూ.40.77 కోట్లకు తగ్గిపోయింది. ► వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక 2020 జనవరి నుంచి ఏప్రిల్ వరకు మద్యం అక్రమాలకు పాల్పడుతున్న వారిపై 7,812 కేసులు నమోదు చేసింది. 5,870 మందిని అరెస్టు చేసి, 97,482 లీటర్ల మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
పెద్ద మొత్తంలో మద్యం కొనుగోలు.. షాప్ ఓనర్పై కేసు
బెంగళూరు : దాదాపు 40 రోజుల తర్వాత మద్యం విక్రయాలకు అనుమతివ్వడంతో.. మందుబాబుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. చాలా రోజులుగా మద్యం దొరక్క అల్లాడిపోయిన మందుబాబులు.. రెట్టించిన ఉత్సాహంతో అర్ధరాత్రి నుంచే వైన్ షాపుల ముందు క్యూ కట్టారు. ఎండను సైతం లెక్కచేయకుండా.. షాపులు తెరిచే వరకు వేచి చూశారు. కొందరైతే షాపులు తెరవగానే.. భారీ స్థాయిలో మద్యం కొనుగోలు చేశారు. బెంగళూరులో ఓ వ్యక్తి ఏకంగా రూ. 52,841 విలువ చేసే మద్యం కొనుగోలు చేశాడు. అందుకు సంబంధించిన బిల్లును ఫొటో తీసి వాట్సాప్లో ఉంచడంతో.. అది కాస్త వైరల్ మారింది.(చదవండి : మందుబాబులు ఎగబడ్డారు!) దీంతో స్పందించిన కర్ణాటక ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు మద్యం విక్రయించిన షాప్ ఓనర్పై కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. అనుమతించిన దానికంటే ఎక్కువ మొత్తంలో ఓ వ్యక్తికి మద్యం అమ్మడంతో ఈ నిర్ణయం తీసకున్నట్టు తెలిపారు. నిబంధనల ప్రకారం ఒక్క రోజులో 2.6 లీటర్ల ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ లేదా 18 లీటర్ల బీర్ మాత్రమే ఒక వినియోగదారుడికి విక్రయించాలి. కానీ వాట్సాప్లో వైరల్ అయిన బిల్లు ప్రకారం.. దక్షిణ బెంగళూరులోని వనిల్లా స్పిరిట్ జోన్ నిబంధనలకు విరుద్ధంగా ఓ వినియోగదారుడికి 13.5 లీటర్ల లిక్కర్, 35 లీటర్ల బీర్ విక్రయించింది. మరోవైపు ఆ బిల్లు పోస్ట్ చేసిన వ్యక్తిపై కూడా అధికారులు కేసు నమోదు చేయనున్నారు. అయితే అతడి వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది.(చదవండి : ఢిల్లీలో లిక్కర్పై 70% స్పెషల్ కరోనా ఫీజు) ఇదే విషయంపై ఎక్సైజ్ అధికారులు సదరు మద్యం షాపు ఓనర్ను ప్రశ్నించగా.. వారు 8 మంది వినియోగదారులని, కానీ ఒక కార్డు ద్వారా బిల్లు మొత్తం చెల్లించినట్టు తెలిపాడు. అయితే ఓనర్ స్టేట్మెంట్ ఆధారంగా విచారణ సాగిస్తామని.. ఆ తర్వాత చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు. ఇలా భారీ మొత్తంలో మద్యం కొనుగోలు చేసిన కొందరు తమ బిల్లులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. అధికారులు వారి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. మరోవైపు మంగళవారం నుంచి కర్ణాటకలో మద్యం రేట్లు 6 శాతం పెంచనున్నట్టు ఎక్సైజ్ శాఖ మంత్రి నాగేశ్ తెలిపారు. కాగా, మే 17 వరకు లాక్డౌన్ పొడిగించిన కేంద్రం.. పలు సడలింపులు ప్రకటించింది. అందులో భాగంగా కరోనా ప్రభావం అధికంగా లేని చోట్ల విక్రయాలకు అనుమతించింది. -
పేదలకు దూరం చేయడానికే
వెదురుకుప్పం(చిత్తూరు జిల్లా): మద్య నిషేధంలో రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగేసిందని డిప్యూటీ సీఎం, ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి కళత్తూరు నారాయణస్వామి తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ధర పెంచి, పేదలకు మద్యం దూరం చేయాలనే ఆలోచనతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. ప్రభుత్వానికి రాబడి తగ్గిందనే ఉద్దేశంతో కాదని స్పష్టం చేశారు. ధరలు పెంచడం ద్వారా విక్రయాలు తగ్గించి, ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు కానుకగా మద్య నిషేధం అమలు చేసి ఇవ్వనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే స్పందించి, పరిష్కరిస్తుంటే, ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయన్నారు. మద్యం లేదనేది టీడీపీ వాళ్లే.. మద్యం విక్రయాలు ఆపడంతో సారా తయారు చేస్తున్నారనేది కూడా వారేనని ఎద్దేవా చేశారు. 80 శాతం బార్లు టీడీపీ హయాంలో వారికి అనుకూలమైనోళ్లకే అప్పజెప్పారని తెలిపారు. రాష్ట్రంలో సారా, నకిలీ మద్యం తయారీలో పట్టుబడింది టీడీపీ నేతలు, మద్దతుదారులేనన్నారు. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పనిచేస్తుంటే ఏదోరకంగా బురదజల్లి ప్రతిపక్ష నేత చంద్రబాబు పబ్బం గడుపుకుంటున్నారన్నారు. దశలవారీ నిషేధమే సర్కారు లక్ష్యం: లక్ష్మణరెడ్డి సత్తెనపల్లి: రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయ దృఢ సంకల్పమైన దశలవారీ మద్యనిషేధం అమలును ఎవరూ నీరుగార్చవద్దని మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి విజ్ఞప్తి చేశారు. దశలవారీ మద్యపాన నిషేధమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో సంపూర్ణ మద్య నిషేధం అసాధ్యమని, నియంత్రించడమే మేలని సీపీఐ, సీపీఎం పేర్కొన్నాయని, ప్రస్తుతం ఇప్పటికిప్పుడు అమలు చేయాలనడం హాస్యాస్పదమన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర, నవరత్నాలు, ఎన్నికల మేనిఫెస్టోల్లో పేర్కొన్నట్లుగా దశల వారీ మద్య నిషేధాన్ని నిక్కచ్చిగా అమలు చేస్తున్నారన్నారు. మద్యం దుకాణాలు ఏటా 20 శాతం తగ్గిస్తూ, మద్యం విక్రయ సమయం కుదించినట్టు చెప్పారు. 2024 నాటికి ఆంధ్రప్రదేశ్లో త్రీస్టార్, ఫైవ్స్టార్ హోటళ్లలోనే మద్యం లభ్యమయ్యే పరిస్థితి ఉంటుందని, మరెక్కడా లభించదని స్పష్టం చేశారు. మద్యం అక్రమాలపై 14500, 180042454868 టోల్ఫ్రీ నంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. -
మద్యం అమ్మకాలు షురూ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మద్యాన్ని నియంత్రించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే లక్ష్యంతో భారీగా ధరలు పెంచిన ప్రభుత్వం లాక్డౌన్ నిబంధనలు, కేంద్ర మార్గదర్శకాలను పాటిస్తూ సోమవారం నుంచి విక్రయాలకు అనుమతించడంతో 2,345 మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. చాలా రోజుల తరువాత దుకాణాలు తెరవడంతో తొలిరోజు మద్యం దుకాణాల వద్ద రద్దీ నెలకొంది. కొన్నిచోట్ల మధ్యాహ్నం 2 గంటలకు షాపులు తెరిచారు. మద్యం షాపుల సీల్ తెరిచేందుకు కలెక్టర్ అనుమతి ఇవ్వాల్సి ఉండటం, కంటైన్మెంట్ క్లస్టర్ల జాబితాలు అందకపోవడంతో కొంత ఆలస్యమైంది. రెడ్జోన్లలో దుకాణాలు బంద్ ► రాష్ట్రంలో మొత్తం 3,468 మద్యం షాపులుండగా కంటైన్మెంట్ క్లస్టర్లను మినహాయించి మిగిలిన చోట్ల 2,345 దుకాణాలు తెరిచారు. మద్యం షాపులను రెడ్జోన్లో కూడా తెరవవచ్చని కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసినా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాష్ట్రంలో వీటిని తెరవలేదు. ► విజయవాడతోపాటు ప్రకాశం జిల్లాలో ఒక్క మద్యం షాపు కూడా తెరవలేదు. ప్రకాశం జిల్లాలోని మద్యం గోడౌన్లు కంటైన్మెంట్ క్లస్టర్లలో ఉండటంతో ఎక్సైజ్ శాఖ షాపులను తెరవలేదు. విజయవాడలో కంటైన్మెంట్ క్లస్టర్ల జాబితా అందకపోవడం వల్ల తెరవలేదు. ► గత 45 రోజుల నుంచి రాష్ట్రంలో మద్యం దొరకపోవడంతో సోమవారం మద్యం ప్రియులు ఒక్కసారిగా షాపుల వద్దకు చేరుకున్నారు. మద్యం దుకాణాల ముందు భారీ ఎత్తున క్యూ కట్టారు. భౌతిక దూరం పాటిస్తూ క్యూలలో నిలుచుని తమ వంతు కోసం నిరీక్షించారు. అయితే కొన్నిచోట్ల భౌతిక దూరం నిబంధనను ఉల్లంఘించారు. ► మద్యం ధరలు పెంచినా కొన్ని దుకాణాల్లో మధ్యాహ్నానికల్లా సరుకు ఖాళీ అయింది. మద్యం షాపుల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు, వలంటీర్లు విధులు నిర్వహించారు. ఎక్కువ చోట్ల భౌతిక దూరం పాటించినప్పటికీ కొన్నిచోట్ల మొదటిరోజు కావడం మూలాన మాత్రం ఉల్లంఘనలు జరిగాయి. శ్రీకాకుళం జిల్లా కవిటి సినిమా హాలు రోడ్డులో మద్యం దుకాణం వద్ద క్యూ లైన్ పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం కోసం.. ► కొందరు తమిళనాడు వాసులు ఏపీ సరిహద్దు ప్రాంతానికి చేరుకుని మద్యం కొనుగోలు చేసేందుకు ప్రయత్నించడంతో షాపుల్ని మూసివేసి వారిని వెనక్కి పంపించారు. నెల్లూరు జిల్లా జీవీ పాలెం, రామాపురం, చిత్తూరు జిల్లా పాలసముద్రంలో మద్యం దుకాణాల వద్దకు పొరుగు రాష్ట్రం నుంచి ప్రజలు రావడంతో అమ్మకాలు నిలిపివేశారు. ► ఏపీ–తెలంగాణ సరిహద్దులో ఉన్న తూర్పుగోదావరి జిల్లా ఎటపాకలో కూడా మద్యం దుకాణాల వద్దకు భద్రాచలం వాసులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో షాపులను మూసివేశారు. ► గుంటూరు జిల్లా పిడుగురాళ్ల సమీపంలోని మాచవరం, పిల్లుట్ల ప్రాంతాల్లో మద్యం అమ్మకాల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఓ ప్రాంతం వారు మరో ప్రాంతానికి రావడంతో ఘర్షణ నెలకొంది. భారీగా పెరిగిన మద్యం ధరలు అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ కింద మద్యం ధరలను భారీగా పెంచారు. మద్యపానాన్ని నీరుగార్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలు పెంచింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పీయూష్ కుమార్ సోమవారం జీవో జారీ చేశారు. -
గుడుంబాపై ఉక్కుపాదం మోపండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గుడుంబా తయారీని సహించేది లేదని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. గుడుంబాపై ఉక్కుపాదం మోపాలని, తయారీదారులపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేయాలని ఎక్సైజ్ అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ‘గుడుంబా గుప్పు–పల్లెకు ముప్పు’ శీర్షికన రాష్ట్రంలో మళ్లీ కోరలు చాస్తున్న గుడుంబా తయారీపై బుధవారం ‘సాక్షి’మెయిన్ ఎడిషన్లో ప్రచురితమైన కథనానికి స్పందనగా, తాజా పరిస్థితి గురించి బుధవారం ఆయన ఎక్సైజ్ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదల, నిబద్ధతతో రాష్ట్రం గుడుంబా రహితంగా మారిందని, ఆ ఇమేజ్ పోతే సహించేది లేదని చెప్పారు. చదవండి: గుడుంబా గుప్పు.. పల్లెకు ముప్పు గుడుంబా తయారీదారులను, బెల్లం అమ్మకందారులను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. క్షేత్ర స్థాయిలో అధికారులు ఎలాంటి అలసత్వం ప్రదర్శించవద్దని, అలాంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఆబ్కారీ జిల్లాల అధికారులు ప్రతి రోజూ తమ సిబ్బంది నుంచి వివరాలు తీసుకుని, ఆ నివేదికలను తనకు పంపాలని ఆదేశించారు. డిప్యూటీ కమిషనర్లు, ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, పోలీస్, తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లతో కలసి తనిఖీలు నిర్వహించాలని సూచించారు. లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా ఊరుకోవద్దని, మద్యం అమ్మకాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే షాపుల లైసెన్సులు రద్దు చేయాలని చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, అదనపు కమిషనర్ అజయ్రావు, టీఎస్బీసీఎల్ ఎండీ సంతోష్రెడ్డి, ఉన్నతాధికారులు ఖురేషీ, హరికిషన్లతో పాటు వివిధ జిల్లాల డిప్యూటీ కమిషనర్లు, ఎక్సైజ్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. ఇప్పటివరకు 1,922 కేసులు నమోదు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ గుడుంబా తయారీ, అమ్మకందారుల మీద ఇప్పటివరకు 1,922 కేసులు పెట్టి 8,091 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నామని ఎక్సైజ్ అధికారులు మంత్రికి వివరించారు. అక్రమ మద్యం అమ్మేవారిపై 743 కేసులు పెట్టి 777 మందిని అరెస్టు చేశామని, 6,223 లీటర్ల మద్యం, 4,525 లీటర్ల బీరును సీజ్ చేశామని చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం సరఫరా చేస్తున్న 21 మందిపై కేసులు నమోదు చేసి 212 లీటర్ల మద్యం 22 లీటర్ల బీరు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. లాక్డౌన్ సందర్భంగా 45 మంది నిబంధనలకు వ్యతిరేకంగా మద్యం అమ్ముతున్నారని గుర్తించి కేసులు పెట్టామని, 80 మందిని అరెస్టు చేశామని మంత్రికి వివరించారు. -
గుడుంబా గుప్పు.. పల్లెకు ముప్పు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గుడుంబా గుప్పుమంటోంది. లాక్డౌన్ వేళ గ్రామీణ ప్రాంతాల్లో సారా బట్టీల మంటలు రాజుకుంటున్నాయని ఎక్సైజ్ శాఖ గణాంకాలే చెబుతున్నాయి. మార్చి 22న జనతా కర్ఫ్యూ నాటి నుంచి సోమవారం వరకు 1,600 గుడుంబా కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. రాష్ట్రంలో గుడుంబా ‘కాగిన’ సమయంలో ఒక్క నెలలో ఎన్ని కేసులు నమోదయ్యాయో ఈ 40 రోజుల్లో అన్నే కేసులు నమోదయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో మద్యం అందుబాటులో లేకపోవడంతో మళ్లీ గుడుంబా వైపు అడుగులు పడుతుండగా, దాన్ని ఎలా కట్టడి చేయాలో తెలియక ఎక్సైజ్ యంత్రాంగం తలలు పట్టుకుంటోంది. కేసుల్లేని జిల్లా లేదు.. లాక్డౌన్ అమల్లోకి వచ్చాక రాష్ట్రంలో మద్యం దుకాణాలను మూసివేశారు. అయినా పట్టణ ప్రాంతాల్లో ఎలాగోలా మందు లభ్యమవుతుండగా, పల్లెల్లో సరుకు దొరకట్లేదు. దీంతో అనివార్యంగా మళ్లీ గ్రామాల్లోని ప్రజలు గుడుంబా వైపు చూస్తున్నట్టు ఎక్సైజ్ గణాంకాలను పరిశీలిస్తే అర్థమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 23 నుంచి ఏప్రిల్ 26 వరకు 1,600 గుడుంబా కేసులు నమోదయ్యాయి. మొత్తం 7,019 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకోగా, 1.15 లక్షల లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 20వేల లీటర్లు, వరంగల్లో 17వేలు, కరీంనగర్, మహబూబ్నగర్ జిల్లాల్లో 15వేల చొప్పున, రంగారెడ్డిలో 8వేలు, నల్లగొండలో 7వేల లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. రాష్ట్రంలోని దాదాపు అన్ని ఉమ్మడి జిల్లాల్లోనూ గుడుంబా కేసులు నమోదయ్యాయి. తయారీకి కారణాలనేకం.. రాష్ట్రంలో మళ్లీ గుడుంబా గుప్పుమనడానికి చాలా కారణాలున్నాయి. మద్యం అందుబాటులో లేకపోవడం ప్రధాన కారణం కాగా, లాక్డౌన్ సమయలో పనుల్లేకపోవడం మరో కారణమని ఎక్సైజ్ అధికారులు అంటున్నారు. గుడుంబాను నిర్మూలించగలిగాం కానీ గుడుంబా కాసే పద్ధతులు ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో మర్చిపోలేదని వారు చెబుతున్నారు. చాలాకాలంగా గుడుంబాపై ఆధారపడి జీవించిన వర్గాలు మళ్లీ అటువైపు ఆకర్షితులయ్యేలా పరిస్థితులు మారాయని అంటున్నారు. లాక్డౌన్ సమయంలో రాత్రిపూట పూర్తిగా కర్ఫ్యూ ఉండడంతో గుట్టుచప్పుడు కాకుండా గుడుంబా కాస్తున్నారని చెబుతున్నారు. వీటన్నిటికితోడు నిత్యావసర వస్తువుల్లో భాగంగా బెల్లం, పటిక, పండ్లు అందుబాటులో ఉండడం కూడా గుడుంబా తయారీదారులకు కలిసివస్తోంది. అక్కడ పేట్రేగితే అంతే సంగతులు రాష్ట్రంలో చాలాకాలంగా గుడుంబాకు ఆలవాలమైన ప్రాంతాలున్నాయి. వీటిని ఎక్సైజ్ శాఖ హాట్స్పాట్లుగా గుర్తించింది. హైదరాబాద్లోని ధూల్పేట సహా దేవరకొండ, హుజూర్నగర్, సూర్యాపేట, తుంగతుర్తి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, నాగర్కర్నూల్, గద్వాల, అచ్చంపేట, సిరిసిల్ల, పెద్దపల్లి, సిద్దిపేట, జహీరాబాద్, వికారాబాద్, ఆమనగల్, షాద్నగర్, ఎల్లారెడ్డిపేట, ఆర్మూరు, భీంగల్, దోమకొండ, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని, అక్కడ మళ్లీ గుడుంబా బట్టీలు రాజుకుంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టేనని ఆబ్కారీ అధికారులంటున్నారు. ఈ ప్రాంతాల్లో గుడుంబా వినియోగం పెరిగితే ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతుందని, మళ్లీ కోలుకోడానికి చాలా సమయం పడుతుందని అంటున్నారు. ఇది ఏ పరిణామాలకు దారితీస్తుం దోననే చర్చ ఎక్సైజ్ వర్గాల్లో జరుగుతోంది. ఆ గుర్తింపు మాయం! వాస్తవానికి, లాక్డౌన్కు ముందు తెలంగాణ గుడుంబారహిత రాష్ట్రంగా గుర్తింపు పొందింది. 2017లో గుడుంబాపై ఉక్కుపాదం మోపడం మొదలుపెట్టిన ఎక్సైజ్ యంత్రాంగం ఏడాదిపాటు అహోరాత్రులు శ్రమించి 2018 నాటికి రాష్ట్రంలో గుడుంబా ఆనవాళ్లు లేకుండా చేసింది. ఏడాది పాటు ఆ శాఖ చేసిన కష్టమంతా ఈ 40 రోజుల్లో గుడుంబా బట్టీల పాలైంది. మద్యానికి అలవాటు పడ్డ గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఇప్పుడు మళ్లీ నాటుసారా బాట పట్టారని, మళ్లీ రాజుకున్న సారా బట్టీ మంటలను ఆర్పడం ఇప్పట్లో సాధ్యం కాదని ఎక్సైజ్ అధికారులే చెబుతున్నారు. బెల్లం నానబెట్టిన డ్రమ్ములు స్వాధీనం లాక్డౌన్ నేపథ్యంలో వైన్స్ షాపులు మూతపడగా గ్రామీణ ప్రాంతాలు, తండాల్లో గుడుంబా తయారీ ఊపందుకుంది. అయితే, ఎక్సైజ్ అధికారుల తనిఖీలు ముమ్మరం కావడంతో సమీపంలోని అటవీ ప్రాంతాలను ఎంచుకొని ఇలా డ్రమ్ముల్లో బెల్లాన్ని నానబెట్టి గుడుంబా తయారు చేస్తున్నారు. వరంగల్ రూరల్ జిల్లా ఖానాపురం మండలంలో మంగళవారం అధికారులు జరిపిన తనిఖీల్లో ఈ డ్రమ్ములు బయటపడ్డాయి. ఎక్సైజ్ అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని పారబోశారు. – ఖానాపురం -
ఇంట్లో మద్యం తయారీ.. ఇద్దరి అరెస్టు
మంగుళూరు: అక్రమంగా మద్యం తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆబ్కారీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. దక్షిణ కన్నడ జిల్లాలోని కొడమాన్ కోడిలోని ఓ ఇంట్లో మద్యం తయారు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో ఎక్సైజ్ సిబ్బంది దాడి చేశారు. మద్యం తయారీకి ఉపయోగిస్తున్న 1200 లీటర్ల బెల్లం ద్రావణం, 950 కేజీల బెల్లం, 500 లీటర్ల నకిలీ మద్యం, 300 లీటర్ల బంగాళాదుంప-బెల్లం మిక్సర్ను స్వాధీనం చేసుకున్నామని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కేసు నమోదు చేశామని వెల్లడించారు. ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ శైలజా కోటే ఆదేశాలతో ఎక్సైజ్ ఎస్పీ వినోద్కుమార్ దాడులకు నేతృత్వం వహించారు. -
లాక్డౌన్: మహిళా ఎక్సైజ్ ఎస్ఐ అత్యుత్సాహం
సాక్షి, ములుగు : లాక్డౌన్ ముసుగులో కొందరు ఎక్సైజ్ అధికారులు కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ములుగు జిల్లా కేంద్రంలో ఎక్సైజ్ శాఖ మహిళా ఎస్ఐ భారతి అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎక్సైజ్ ఎస్ఐ భారతి... వెంకటేశ్ అనే వ్యక్తి మద్యం బాటిళ్లు దొంగ చాటుగా సరఫరా చేస్తున్నాడని సమాచారం అందడంతో అతని ఇంటికి చేరుకొని నానా బీభత్సం సృష్టించారు. ఆ సమయంలో వెంకటేశ్ ఇంట్లో ఎవరు లేకపోవడంతో ఇంటి తాళాలు పగులుగొట్టి వస్తువులన్ని చిందరవందరగా పడేసి అక్కడినుంచి వెళ్లిపోయారు. అయితే ఇంటికి చేరుకున్న బాధితుడు కక్ష సాధింపు చర్యలతోనే తన ఇంటిపై దాడి చేశారంటూ భారతిపై ములుగు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ములుగు పోలీసులు ఎస్ఐ భారతిపై కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అక్రమాలకు పాల్పడితే పథకాల నిలిపివేత
సాక్షి, అమరావతి/తిరుపతి అన్నమయ్య సర్కిల్: మద్యం అక్రమాల్లో ప్రమేయమున్న వారికి ప్రభుత్వ పథకాలు నిలిపివేస్తామని డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ శాఖ మంత్రి కె.నారాయణ స్వామి వెల్లడించారు. నాటు సారా, అక్రమ మద్యం అమ్మకాలు చేపట్టే వారిపై పీడీ యాక్టులు నమోదు చేయిస్తామన్నారు.ఎక్సైజ్ అధికారులతో శనివారం ఆయన తిరుపతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎక్సైజ్ సిబ్బంది అక్రమాలకు పాల్పడితే సస్పెండ్ చేస్తామని అవసరమైతే ఉద్యోగం నుంచీ తొలగిస్తామన్నారు. రాష్ట్రంలో అన్ని బార్లు, మద్యం షాపుల్లో స్టాక్ తనిఖీలు చేసి తేడాలుంటే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నా మాటలు బాధించి ఉంటే క్షమాపణ కోరుతున్నా కరోనా మహమ్మారి బారి నుంచి అందరూ బయటపడాలనే ఉద్దేశంతో ఢిల్లీకి వెళ్లి వచ్చినవారు, వారితో కలిసి మెలిగినవారు పరీక్షలు చేయించుకుని, అవసరమైతే వైద్యం చేయించుకోవాలని విజ్ఞప్తి చేశానని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. ఈ క్రమంలో తన మాటలు ఏవైనా బాధించి ఉంటే క్షమాపణలు కోరుతున్నానని పేర్కొన్నారు. తన వ్యాఖ్యలను తక్షణం ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ట్వీట్ చేశారు. -
అలా చేస్తే ప్రభుత్వ రాయితీలు రద్దు చేస్తాం
సాక్షి, చిత్తూరు: ప్రతి జిల్లాలో, ప్రతి బార్లో టీడీపీ నాయకులు గోల్ మాల్ చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ డిప్యూటి సీఎం నారాయణ స్వామి మండిపడ్డారు. కరోనా వైరస్ నియంత్రణ పై మాట్లాడకుండా చంద్రబాబు తన స్వ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎక్సైజ్ శాఖ అధికారులతో శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫెరెన్స్లో నారాయణ స్వామి ధ్వజమెత్తారు. ఎక్సైజ్ శాఖలో ఎవరు తప్పు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాఖ పరమైన విచారణ చేసి ఉద్యోగం కూడా తొలగిస్తామని హెచ్చరించారు. రెండు రోజులగా చిత్తూరు జిల్లాలో నాటు సారా విక్రయం జరుగుతోందని తమ దృష్టికి వచ్చిందని, అలా చేసేది ఎవరైనా పిడి యాక్ట్ పెడతామమన్నారు. రెండు సార్లు దొరికితే ప్రభుత్వం ఇచ్చే రాయితీలు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఆయన మాట్లాడుతూ... టీడీపీ నేతలు చంద్రబాబు పాలసీలను అమలు చెయ్యాలని చెప్పడం హస్యాస్పదంగా ఉందన్నారు. దుర్యోధనుడు ప్రాణాలు కాపాడుకోవడానికి నీటిలో దాక్కున్నట్లు చంద్రబాబు కూడా హైదరాబాదులో దాక్కున్నారని ఎద్దేవా చేశారు. ఖజానాలో డబ్బు లేకపోయినా కమిట్మెంట్తో పనిచేస్తున్న వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. దీంతో పాటు ప్రజలకు ఆయన కొన్ని విషయాలు విజ్ఞప్తి చేశారు. డాక్టర్లు,నర్సులు చాలా కష్టపడుతున్నారని, కరోనా పాజిటివ్ వస్తే డాక్టర్లకు సహకరించాలని కోరారు. మైనారిటీలు కూడా ఇంట్లో ఉంటూ ప్రార్ధనలు చేసుకోవాలని సూచించారు. ఇక రాష్ట్ర మాజీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ని తొలగించడంలో వివాదం లేదన్న ఆయన ... గతంలో చంద్రబాబు ఆయనకు కావలసిన వారిని అధికారులుగా నియమించారని ఇప్పుడు వారు గురు భక్తి చాటుకున్నారన్నారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం అందరికి ఆమోదయోగ్యమన్నారు. జగన్ మంచి నిర్ణయాలు తీసుకుంటుంటే ప్రతిపక్షం కావాలనే కోర్టు వెళ్లి అడ్డుకుంటుందని మండిపడ్డారు. చంద్రబాబు క్యారెక్టర్ లేని నాయకుడని ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చారన్నారు. కానీ జగన్ ప్రజల మన్ననలు పొంది తన బలం నిరూపించుకున్నారన్నారు. చంద్రబాబుని ముంచేసింది ఆయన అనుకూల మీడియానే అని... సార వ్యాపారం ప్రారంభించింది చంద్రబాబే అని ఆరోపించారు. -
టీడీపీ నేత బార్లో మద్యం విక్రయాలు
చిత్తూరు అర్బన్: భౌతిక దూరం పాటించి కరోనా మహమ్మారిని పారదోలాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ పిలుపు ఇస్తే అవేమీ పట్టనట్లు ఓ టీడీపీ నేత యధేచ్చగా మద్యం విక్రయాలు సాగించాడు. చిత్తూరుకు చెందిన టీడీపీ నాయకుడు బార్లో మద్యం విక్రయిస్తుండగా శనివారం రాత్రి పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. పెద్ద ఎత్తున మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. ► చిత్తూరు నగరం కొంగారెడ్డిపల్లెలో ఎన్పీఎస్ బార్ అండ్ రెస్టారెంట్ను టీడీపీ నేత ప్రకాష్నాయుడు నిర్వహిస్తున్నాడు. లాక్డౌన్లోనూ గత కొన్ని రోజులుగా ఎన్పీఎస్ బార్లో పెద్ద ఎత్తున అమ్మకాలు జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ► రూ.800 విలువచేసే మద్యం బాటిళ్లను రూ.4 వేలకు, రూ.3 వేల విలువైనవి రూ.10 వేలకు అమ్ముతున్నారని ఎక్సైజ్ కమిషనర్కు, జిల్లా పోలీసులకు ఫిర్యాదులు వెళ్లాయి. ► పోలీసులు, ఎక్సైజ్ అధికారులు కలిసి శనివారం రాత్రి ఓ వ్యక్తిని బార్లోకి పంపి మద్యం ఫుల్బాటిల్ తీసుకురావాలని చెప్పారు. ఇక్కడున్న మేనేజరు మద్యం బాటిల్ విక్రయిస్తుండగా పోలీసులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ► రూ.లక్షల విలువైన 960 బీర్లు, 60 ఫుల్బాటిల్ మద్యం సీజ్ చేసి కేసు నమోదు చేశారు. మేనేజర్ను అదుపులోకి తీసుకున్నారు. ► ఈ దాడుల్లో ఎక్సైజ్ సూపరింటెండెంట్ మధుసూదనరావు, ఏఈఎస్ గోవిందనాయక్, సీఐలు పురుషోత్తంరెడ్డి, భాస్కర్రెడ్డి, యుగంధర్, నీరజ తదితరులు పాల్గొన్నారు. -
మందుబాబుల దాహం తీరదు!
సాక్షి, హైదరాబాద్: మద్యపాన వ్యసనపరుల ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని డాక్టర్ చీటీ ఉంటే లిక్కర్ ఇస్తారన్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నా యి. ఈనెల 14 వరకు కచ్చితంగా మందు వి క్రయాలు ఉండవని, అప్పటివరకు మద్యంపై ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దని స్పష్టం చేస్తున్నాయి. కేరళ తరహాలో డాక్టర్ల సూచన మేరకు మద్యం ఇవ్వాలన్న ప్రతిపాదన అసలు మన రాష్ట్రంలో లేనేలేదని ఎక్సైజ్ ఉన్నతాధికారులు కొట్టిపారేస్తున్నారు. గత నెల 29న రోజుకు రెండు గంటలపాటు రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరుస్తారనే ఊహాగానాలు ప్రచారం లోకి వచ్చాయి. ఈ ప్రచారాన్ని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కొట్టిపారేసింది. మద్యం దుకాణాల మూసివేతపై గత నెల 31 వరకు ప్రకటించిన గడువు ముగిసిన రోజే, ఈనెల 14 వరకు మళ్లీ మూసివేత ఉత్తర్వులు జారీ చేశాయి. అయితే, వ్యసనపరుల ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కేరళ రాష్ట్రం తరహాలో డాక్టర్లు సూచిస్తే లిక్కర్ ఇచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయనే ప్రచారం ఇంకా జరుగుతోంది. దీంతో మందుబాబులు మళ్లీ లిక్కర్పై ఆశలు పెట్టుకుంటున్నారు. దీన్ని ఎక్సైజ్ యంత్రాంగం కొట్టిపారేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈనెల 14 వరకు రాష్ట్రంలోని మద్యం దుకాణాలు తెరచుకునే అవకాశం లేదని స్పష్టం చేస్తున్నాయి. ఈనెల 14 తర్వాతే అప్పటి పరిస్థితిని బట్టి రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరవాలా వద్దా అనే నిర్ణయాన్ని సీఎం కేసీఆర్ తీసుకుంటారని తెలుస్తోంది. దీంతో ఇక మందుబాబులు ఈ నెల 14 వరకు నోరు కట్టేసుకోవాల్సిందే. -
ఎక్సైజ్ సీఐపై సస్పెన్షన్ వేటు, 5లక్షల ఫైన్
సాక్షి, అనపర్తి: కరోనా నేపథ్యంలో ప్రభుత్వం లాక్డౌన్ విధించి, మద్యం అమ్మకాలను కూడా నిషేధించింది. ఈ తరుణంలో మద్యం అమ్మకాలు జరగకుండా చూడాల్సి న ఎక్సైజ్ సీఐ కంచే చేను మేసిందన్న చందంగా మద్యం అక్రమ తరలింపునకు పాల్పడి, చివరకు సస్పెన్షన్ వేటుకు గురయ్యారు. అంతేకాకుండా ఆయనపై రూ.5 లక్షల జరిమానా విధించారు. మరోవైపు తూర్పుగోదావరి జిల్లా రాయవరం ఎక్సైజ్ సీఐ రెడ్డి త్రినాథ్ మద్యం అక్రమ తరలింపు వ్యవహారంపై మంత్రి నారాయణ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్సైజ్ సీఐపై సస్పెన్షన్ వేటు వేయడమే కాకుండా, రూ.5 లక్షల జరిమానా విధించినట్లు ఆయన తెలిపారు. మంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ ఎక్సైజ్ సీఐ త్రినాథ్ అక్రమంగా మద్యం తరలించారని, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వివరాలలోకి వెళితూ.. కుతుకులూరు మారుతీనగర్లోని ప్రభుత్వ మద్యం దుకాణానికి సీల్ వేయాలంటూ రాయవరం ఎక్సైజ్ సీఐ రెడ్డి త్రినాథ్రావు ఆదివారం అక్కడికి వచ్చారు. సీఐ వాహనంతో పాటు, ఇంకా రిజిస్ట్రేషన్ కాని వాహనంలో మరికొందరు వచ్చారు. రూ.1.5 లక్షల మద్యం బాటిళ్లను ఆ వాహనాల్లో తరలించే ప్రయత్నం చేశారు. తమకు ఇబ్బంది అవు తుందని షాపు సూపర్వైజర్లు జె.శేఖర్, షేక్ మౌషీ చె ప్పినా తాను చూసుకుంటానంటూ సీఐ మద్యం బాటిళ్లను వాహనాల్లో వేశారు. స్థానికులు అడ్డుకోబోగా సీఐ సొంత వాహనాన్ని డ్రైవర్ అక్కడి నుంచి వేగంగా తరలించాడు. మద్యం సీసాలతో మరో వాహనాన్ని స్థానికులు అడ్డుకుని అనపర్తి పోలీస్ స్టేషన్కు తరలించారు. కఠిన చర్యలు తీసుకోవాలి : ఎమ్మెల్యే విషయం తెలిసి, ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్య నారాయ ణరెడ్డి సంఘటన స్థలానికి చేరుకున్నారు. మద్యం అక్ర మ తరలింపుపై సీఐ త్రినాథ్ను నిలదీశారు. తనకు ఎ టువంటి సంబంధం లేదని, గ్రామంలో మద్యం తరలింపుపై సమాచారం రావడంతోనే తాను వచ్చానని, షాపు సూపర్వైజర్ల మాటల్లో వాస్తవం లేదని సీఐ చెప్పారు. దీనిపై ఎమ్మెల్యే ఎక్సైజ్ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. కాగా సీఐ త్రినాథ్ను సస్పెండ్ చేస్తూ ఎక్సైజ్ సూపరింటిండెంట్ ప్రభుకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రశ్నలకు బదులేది సీఐ సారూ? షాపునకు సీలు వేసేందుకు వస్తే సీఐ వాహనం వెంట మరో వాహనం ఎందుకు వచ్చింది? స్థానికులు ప్రశ్నిస్తే కారులో ఉన్న వారు ఎక్సైజ్ సీఐ సెల్కు ఎందుకు ఫోన్ చేశారు? సీఐ ఆదేశం లేకుండా మద్యం బాటిళ్లు కారులోకి ఎలా వెళ్లాయి? అక్రమంగా మద్యం దొరికితే రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో పంచనామా జరగకుండానే తన కార్యాలయానికి హడావుడిగా ఎందుకు తరలించారనే ప్రశ్నలకు సీఐ జవాబు చెప్పాల్సి ఉంది. -
సామాజిక మాధ్యమాల్లో ‘మందు’ గోల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వైన్షాపులు తెరుస్తున్నారంటూ శనివారం మధ్యాహ్నం సామాజిక మాధ్యమాల్లో జరిగిన ప్రచారం ఒక రకంగా సంచలనానికి దారి తీసింది. ఈనెల 29 నుంచి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు వైన్షాపులు తెరుస్తున్నారని, ప్రతి షాపు దగ్గర ఐదుగురు ఎక్సైజ్ కానిస్టేబుళ్లు కాపలా ఉంటారని వాట్సాప్లో వచ్చిన ఫేక్ డాక్యుమెంట్ క్షణాల్లో వైరల్ అయింది. అలా వాట్సాప్లోకి వచ్చిందో లేదో నిమిషాల్లో వందలు, వేల వాట్సాప్ గ్రూపుల్లో ప్రత్యక్షమైంది. దీంతో ఒక్కసారిగా రాష్ట్రంలో మళ్లీ మద్యం గురించి చర్చ మొదలైంది. మద్యం కోసం తహతహలాడుతున్న మందు బాబులు మళ్లీ వైన్షాపులు తెరుస్తున్నారన్న ఆశతో తమ సహచరులు, సన్నిహితులు, మీడియా వ్యక్తులకు ఫోన్లు చేసి ఆరా తీశారు. అయితే వాట్సాప్లో ఈ ఫేక్ సమాచారం ఎంత వేగంగా ప్రచారమైందో అంతే వేగంగా ఎక్సైజ్ అధికారులు కూడా స్పందించారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన డాక్యుమెంట్ నకిలీదని, శాఖా పరంగా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ అధికారికంగా వివరణ ఇచ్చారు. పైగా నకిలీ పోస్టును ప్రచారం చేసిన వారిపై హైదరాబాద్ సీసీఎస్లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈజీ కాదు రాష్ట్రంలో మద్యం తాగేవారి సంఖ్య దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కొంచెం ఎక్కువే ఉంటుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా గత వారం రోజులుగా రాష్ట్రంలో పూర్తిస్థాయిలో మందు దొరక్కపోవడంతో ఎప్పుడెప్పుడు వైన్షాపులు తెరుస్తారా అనే ఆశతో మందుబాబులు ఎదురుచూస్తున్నారు. మందు కోసం వీరంతా రోజూ ఏదోలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. శనివారం వెలుగులోకి వచ్చిన నకిలీ డాక్యుమెంట్ వీరిలో లేనిపోని ఆశలు కల్పించింది. అయితే దీనిపై నిర్ణయం తీసుకోవడం అంత తేలిక కాదని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. ఒక్కసారి షాపులు తెరిస్తే నియంత్రించడం కష్టమవుతుందని, అలాంటి పరిస్థితుల్లో ఇప్పట్లో మద్యం దుకాణాలు తెరవడం జరిగే పని కాదని ఎక్సైజ్ అధికారులు అంటున్నారు. అవసరమైన వారికి మద్యం ఇంటికే సరఫరా చేసేందుకు కసరత్తు జరుగుతుందన్న వార్తల్లో కూడా వాస్తవం లేదని చెబుతున్నారు. అయితే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మద్యం దుకాణాలపై సీఎం కేసీఆర్ మాత్రమే నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఎక్సైజ్ అధికారుల చేతిలో ఈ నిర్ణయం ఉండదని, ఒక్కసారి నిత్యావసరాల చట్టం అమల్లోకి వచ్చాక శాఖల చేతిలో ఏమీ ఉండదని, సీఎం సూచన మేరకు ఉన్నత స్థాయిలోనే నిర్ణయం ఉంటుందని పేర్కొంటున్నారు. ఇది ఒక్క ఎక్సైజ్ శాఖకే కాదని, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలకూ ఇదే నిర్ణయం వర్తిస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కాగా, సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఈ నకిలీ డాక్యుమెంట్ తయారుచేసిన వారిపై ఎక్సైజ్ అధికారులు దృష్టి సారించారు. ఈ వదంతులను పంపిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఆర్మీ రావడం అవాస్తవం: డీజీపీ కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో జన సంచారాన్ని నియంత్రించేందుకు సైన్యం రంగంలోకి దిగిందన్న ప్రచారాన్ని డీజీపీ కార్యాలయం శనివారం ఓ ప్రకటనలో ఖండించింది. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్డౌన్ను నియంత్రించడానికి రాష్ట్ర బలగాలు సరిపోతాయని, అదనపు బలగాలు, ఆర్మీని పంపాలని రాష్ట్రం నుంచి కేంద్రానికి ఎలాంటి విజ్ఞప్తి చేయలేదని తెలిపింది. మరికొన్ని ఫేక్న్యూస్ల హల్చల్ కరోనా నియంత్రణలో ప్రభుత్వాలు విఫలమయ్యాయంటూ కొందరు తప్పుడు పోస్టులు పెడుతున్నారు. కరోనా నియంత్రణకు అనుమానితులను చైనా కాల్చేసిందని, రష్యా రోడ్లపై సింహాలను వదిలిందంటూ కొన్ని ఫేక్ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. జన సంచారం నియంత్రణకు ఆర్మీ వస్తోందని పాత వీడియోలు షేర్ చేస్తున్నారు. -
శానిటైజర్ల తయారీలో డిస్టిలరీలు
సాక్షి, అమరావతి: కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో శానిటైజర్ల కొరత లేకుండా చూసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వాటి తయారీ కోసం డిస్టిలరీలకూ ఎక్సైజ్ శాఖ లైసెన్సులు మంజూరు చేసింది. - రాష్ట్రంలో 17 డిస్టిలరీలున్నాయి. వీటన్నిటికీ శానిటైజర్లను తయారు చేసేందుకు లైసెన్సులు మంజూరు చేశారు. వాటిలో నాలుగు డిస్టిలరీలు ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించాయి. - శానిటైజర్ల తయారీకి దరఖాస్తు చేసుకున్న ఫార్మా కంపెనీలకూ కొత్తగా 10 లైసెన్సులిచ్చారు. - రెక్టిఫైడ్ స్పిరిట్ను మద్యం డిస్టిలరీలు తయారు చేస్తాయి. శానిటైజర్ తయారు చేయాలంటే ఈ రెక్టిఫైడ్ స్పిరిట్(ఆర్ఎస్)దే ప్రాధాన్యం. - రెక్టిఫైడ్ స్పిరిట్లో ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్, ఇథనాల్ ఉంటాయి. వీటినే శానిటైజర్కు వాడతారు. - రాష్ట్రంలో ఫార్మా కంపెనీలకు రెక్టిఫైడ్ స్పిరిట్ వాడేందుకు అనుమతి ఉండదు. దీన్ని వాడాలంటే ఆర్ఎస్–3 లైసెన్స్ పొందాల్సి ఉంటుంది రెండు గంటల్లోపే లైసెన్స్ ఇస్తున్నాం.. శానిటైజర్ల తయారీకి రెక్టిఫైడ్ స్పిరిట్ కావాలని ఎవరు దరఖాస్తు చేసుకున్నా రెండు గంటల్లోపే అనుమతులిస్తున్నాం. డిస్టిలరీలు శానిటైజర్లను తయారుచేసి మార్కెట్లోకి తక్కువ ధరలకే అందుబాటులోకి తెచ్చేలా ఆదేశాలిచ్చాం. – వాసుదేవరెడ్డి, కమిషనర్ ఆఫ్ డిస్టిలరీస్ అండ్ బ్రూవరీస్ -
నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర చరిత్రలో తొలిసారి మద్యం అమ్మకాలు 48 గంటల కన్నా ఎక్కువ సమయం నిలిచిపోయాయి. 1995–97లో మద్యనిషేధం అమల్లో ఉన్నప్పుడు మినహా రాష్ట్రంలో ఎప్పుడూ ఇన్ని రోజులు లిక్కర్ అమ్మకాలు జరగ కుండా ఉన్న సందర్భాల్లేవని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. ఎన్నికల సందర్భాల్లో పోలింగ్కు 48 గంటల ముందు వైన్ షాపులు, బార్లు బందయ్యేవి. కానీ, ఇప్పుడు ఆరోగ్య అత్యయిక పరిస్థితుల నేపథ్యంలో గత 8 రోజులుగా బార్లు, మూడు రోజులుగా మద్యం దుకాణాలు మూతపడ్డాయి. దీంతో రాష్ట్రంలోని మందుబాబులకు కరోనా ‘చుక్కలు’కనిపిస్తున్నాయి. వెసులుబాట్లు కూడా లేవు... అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మద్య నిషేధం అమల్లో ఉన్నప్పుడు కల్లు, అనధికారికంగా గుడుంబా అందుబాటులో ఉండేవి. సరిహద్దు రాష్ట్రాల్లో నిషేధం లేకపోవడంతో గుట్టుచప్పుడు కాకుండా రాష్ట్రానికి అరకొరగా మద్యం వచ్చేది. ఇప్పుడు అలాంటి వెసులుబాట్లు కూడా లేకుండాపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా గుడుంబాను దాదాపు నిర్మూలించగా, కల్లు దుకాణాలు కూడా కరోనా దెబ్బకు మూతపడ్డాయి. గ్రామాల్లో చెట్ల నుంచి తీసిన కల్లు మాత్రమే లభిస్తోంది. రాష్ట్ర సరిహద్దులను మూసివేయడంతో పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం వచ్చే అవకాశం లేకుండా పోయింది. పొరుగు రాష్ట్రాలు కూడా లాక్డౌన్ విధించడంతో అక్కడ కూడా మద్యం లభించడం లేదు. దీంతో రాష్ట్రంలో త్వరలోనే పూర్తిస్థాయిలో మద్యం కొరత ఏర్పడనుందని ఎక్సైజ్ వర్గాలంటున్నాయి. కరోనా దెబ్బకు ఇప్పట్లో లాక్డౌన్ ఎత్తేసే అవకాశం లేదని, కనీసం మరో నెలైనా ఇదే పరిస్థితి ఉంటుందని తెలుస్తోంది. బ్లాక్లో ధర ‘చుక్కలే’... బార్లు, వైన్ షాపులు మూతపడటంతో బ్లాక్ మార్కెట్లో మద్యం అమ్మకాలు అక్కడక్కడా జరుగుతున్నాయి. బ్లాక్లో కొని తాగాలనుకునే మందుబాబులకు వాటి ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. సాధారణ బ్రాండ్ మద్యం కూడా క్వార్టర్కు రూ.350 వరకు అమ్ముతున్నారు. ప్రీమియం బ్రాండ్ల మద్యమైతే ఇష్టారాజ్యంగా అమ్ముతున్నారు. అంత ధర పెట్టి తాగేకన్నా మందు మానడమే ఉత్తమమని కొందరు సర్దుకుంటుండగా, మరికొందరు బేరాలాడి కొనుక్కొంటున్నారు. మద్యానికి బానిసలైన వారు మాత్రం ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నారు. అయితే, ఈ పరిస్థితి కొంత మేలు చేస్తుందని, అనధికార మద్యనిషేధం వ్యసనపరులకు ఉపయోగపడుతుందని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితులను వ్యసనపరులు సద్వినియోగం చేసుకుని మద్యానికి దూరంగా ఉండటం అలవాటు చేసుకోవాలని, లేదంటే మద్యం నుంచి పూర్తిగా విముక్తి పొందేందుకు సువర్ణావకాశమని అంటున్నారు. ఏదేమైనా తాగి అందరికీ చుక్కలు చూపించే మందుబాబులకు ‘కరోనా’నిజంగానే చుక్కలు చూపిస్తోంది. -
మద్యం, డబ్బు పంపిణీపై ఉక్కుపాదం
సాక్షి, అమరావతి: మద్యం, డబ్బు పంపిణీ ప్రసక్తే లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగాలన్న ప్రభుత్వ ఆశయాన్ని సాధించడానికి పోలీస్, ఎక్సైజ్ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నట్టు ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్ వినీత్ బ్రిజ్లాల్ తెలిపారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా డబ్బు, మద్యం పంపిణీపై ఉక్కుపాదం మోపుతున్నట్లు చెప్పారు. ఆయన శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. అభ్యర్థులు మద్యం, డబ్బుతో పట్టుబడితే అనర్హులు అవుతారంటూ ప్రభుత్వం ఇప్పటికే ఆర్డినెన్స్ తెచ్చిందని గుర్తు చేశారు. ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేలా వారం రోజులుగా తీసుకుంటున్న చర్యలను వినీత్ బ్రిజ్లాల్ వెల్లడించారు. - ఎన్నికల సందర్భంగా మద్యం, డబ్బు పంపిణీ, ఇతర ప్రలోభాలు లేకుండా దాడులు ముమ్మరం చేశాం. ఏపీ పోలీస్ శాఖకు చెందిన 10 వేల మంది పోలీసులు, ఎక్సైజ్ శాఖకు చెందిన 4 వేల మంది సిబ్బంది ప్రత్యేకంగా దాడులు నిర్వహిస్తున్నారు. రెండు రోజుల క్రితం నిర్వహించిన ‘ఆపరేషన్ సురా’లో నాటుసారా స్థావరాలను ధ్వంసం చేశాం. - గత వారం రోజుల్లో 2,752 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నాం. 5,005 లీటర్ల నాటుసారా, 2 లక్షల లీటర్ల నాటుసారా తయారీకి సిద్ధం చేసిన ఊటను ధ్వంసం చేశాం. 3,072 కిలోల గంజాయి, 30,028 గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నాం. 1,605 కేసులు నమోదు చేసి 1,562 మందిని అరెస్టు చేశాం. 145 వాహనాలు సీజ్ చేశాం. - ఎన్నికల కోసం తరలిస్తున్న నగదు రూ.1,84,84,800, బంగారం 2.551గ్రాములు(విలువ రూ.1,40,34,021), వెండి 50.558గ్రాములు(విలువ రూ.18,16,920), 87 చీరలు, 3 ల్యాప్టాప్లు, 140 సంచుల బియ్యం స్వాధీనం చేసుకున్నాం. - రాష్ట్రంలో 701 పోలీస్ మొబైల్ చెక్పోస్టులు ఉన్నాయి. వాటితోపాటు 62 ప్రత్యేక మొబైల్ చెక్పోస్టులు, 18 బోర్డర్(రాష్ట్ర సరిహద్దు) చెక్పోస్టులు ఏర్పాటు చేశాం. - మద్యం, డబ్బు పంపిణీ వంటి అక్రమాలపై టోల్ ఫ్రీ నంబర్ 14500, డయల్ 100, 112లతోపాటు జిల్లా ఎస్పీ కార్యాలయాల్లో సమాచారం ఇవ్వొచ్చు. -
ఎక్సైజ్ దూకుడు
ఒంగోలు: ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు బుధవారం జిల్లాలో దూకుడు పెంచారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో మద్యం, ధన ప్రభావం ఉండకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో ప్రశాంత ఎన్నికల నిర్వహణపై ఎక్సైజ్ శాఖ దృష్టి సారించింది. తాజాగా శాండ్ ఎన్పోర్సుమెంట్, ఎక్సైజ్ శాఖ ఐజీగా బాధ్యతలు చేపట్టిన వినీత్ బ్రిజ్లాల్ రాష్ట్రవ్యాప్తంగా నాటుసారా, అక్రమ మద్యం తయారీ, అక్రమంగా మద్యం కలిగి ఉండటం.. తరలించడం వంటి వాటిపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో బుధవారం విజయవాడ నుంచి ఒక స్పెషల్ టాస్క్ఫోర్సు టీంతోపాటు జిల్లాలోని ఒంగోలు, మార్కాపురం ఈయస్ పరిధిలోని ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ఫోర్సు టీంలు, జిల్లాలోని 14 పోలీసుస్టేషన్ల పరిధిలోని 14 బృందాలు వెరసి మొత్తం 19 బృందాలుగా ఏర్పడ్డాయి. సభ్యుల ఆధ్వర్యంలో కలిసి నాటు సారా తయారీ కేంద్రాలుగా ఉన్న పశ్చిమ ప్రకాశంతో పాటు చీరాల ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఒంగోలు, చీరాల, అద్దంకి, చీమకుర్తి, మార్కాపురం, కందుకూరు, సింగరాయకొండ, కంభం, వై.పాలెం, గిద్దలూరు ఎక్సైజ్ పోలీసుస్టేషన్ల పరిధిలోని 19 గ్రామాలపై దాడులు చేశారు. ఈ సందర్భంగా మొత్తం 46 కేసులు నమోదుచేసి 10 మందిని అరెస్టు చేశారు. 90 లీటర్ల నాటుసారాను సీజ్ చేయడంతోపాటు 6900 లీటర్ల సారా తయారీకి వినియోగించే బెల్లం ఊట ధ్వంసం చేశారు. అదే విధంగా 150 కేజీల నల్లబెల్లం, 52 కేజీల ఆలం, 16 కేజీల నవసరం, 20 కేజీల కరక్కాయ సీజ్చేశారు. సింగరాయకొండ పరిధిలో ఒక వ్యక్తి కారులో 36 బాటిళ్ల మద్యం తీసుకువెళ్ళడంతో అతనిని అరెస్టు చేసి కారును సీజ్ చేశామని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వై.శ్రీనివాసచౌదరి తెలిపారు. రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్: ఒంగోలు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు ఒంగోలు ఎక్సైజ్ పోలీసులు స్థానిక మంగమ్మ కాలేజీ జంక్షన్ వద్ద రెండు ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నారు. మద్దిపాడు మండలం లింగంగుంటకు చెందిన జాన్ అనే వ్యక్తిని, పేర్నమిట్టకు చెందిన మోషే అనేవారిని అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని గుర్తించి తాలూకా పోలీసులకు అప్పగించారు. ఇసుక అక్రమంగా తరలించినా పట్టుకోవడం జరుగుతుందని, కేసుల నమోదుకు కూడా మార్గదర్శకాలు త్వరలోనే విడుదల కానున్నాయని ఒంగోలు ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ ఎస్సై సయ్యద్ మునీర్ అహ్మద్, హెడ్కానిస్టేబుల్ సి.హెచ్.హనుమరాజు, ఎస్.ఈశ్వరరెడ్డి, ఎస్.రామచంద్ర, డి.నరసింహులు తదితరులు పాల్గొన్నారు. -
ఎట్టి పరిస్ఠితుల్లోనూ గ్రామాల్లో బెల్ట్షాపులు నడపకూడదు
-
ముమ్మరంగా ఎక్సైజ్ శాఖ దాడులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులను ముమ్మరం చేశారు. 11రోజులు పాటు 512 ఎకరాల్లో సారా తయారు చేస్తున్న వారిపై పోలీసులు దాడులు చేశారు. సారా తయారు చేయడానికి గంజాయి మొక్కల ధ్వంసం కారణంగా బహిరంగ మార్కెట్లో 76 కోట్లు నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు. కాగా అక్రమంగా సారా తయారు చేస్తున్న 15మందిని అరెస్ట్ చేశామని, 13 కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు 84వేల 115 లీటర్ల సారా ధ్వంసం చేస్తున్నామని, గత ఐదు నెలల్లో అక్రమ దుకాణాలపై 4010 కేసులు నమోదు చేశామని పోలీసు అధికారులు తెలిపారు. రాత్రి 8 గంటలకే మధ్యం దుకాణాలు మూతపడుతుండటం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీకి చెందిన వ్యక్తులే గతంలో పెద్ద ఎత్తున మద్యం దుకాణాలు నడిపేవారని ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి కె.నారాయణస్వామి విమర్శించారు. -
తప్పు చేస్తే తీవ్ర చర్యలు
సాక్షి, అమరావతి : తప్పు చేసే ఎక్సైజ్ అధికారులపై తీవ్ర చర్యలుంటాయని డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ శాఖ మంత్రి కె.నారాయణస్వామి హెచ్చరించారు. సచివాలయంలో గురువారం ఎక్సైజ్ ఎగ్జిక్యూటివ్ అధికారుల సంఘం డైరీని మంత్రి ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇటీవలి కాలంలో ఎక్సైజ్ అధికారులపై ఆరోపణలొస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వ మద్యం షాపుల అద్దెల్లో అక్రమాలకు ఊతమిస్తున్నారని సమాచారం అందుతోందన్నారు. దశలవారీ మద్య నిషేధ కార్యక్రమానికి ఎక్సైజ్ అధికారులు ఆటంకాలు కల్పించేలా వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. రాష్ట్రంలో టీడీపీ ముఖ్య నేతల అక్రమ మద్యం దందాను అడ్డుకునేందుకు ఎందుకు భయపడుతున్నారని మంత్రి ప్రశ్నించారు. ప్రభుత్వ మద్యం దుకాణాల నుంచి నేరుగా బార్లకు లిక్కర్ను సరఫరా చేస్తున్నారని, ఇవన్నీ తెలిసినా కొందరు సీఐలు ఉద్దేశపూర్వకంగా వదిలేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం డిపోల్లో డీఎంల వ్యవహార శైలిని గమనించాలని ఏపీఎస్బీసీఎల్ ఎండీ వాసుదేవరెడ్డిని ఆదేశించారు. నాటుసారా తయారీ, అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ హరికుమార్కు సూచించారు. కార్యక్రమంలో ఎక్సైజ్ ఎగ్జిక్యూటివ్ అధికారుల సంఘం అధ్యక్షుడు బోయపాటి నరసింహులు, ప్రధాన కార్యదర్శి చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. -
13 ప్రభుత్వ ఆస్పత్రుల్లో డ్రగ్ డి–అడిక్షన్ సెంటర్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 13 జిల్లాల్లో డ్రగ్ డి–అడిక్షన్ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ, వైద్య శాఖలు సంయుక్తంగా ఈ కేంద్రాల్ని నెలకొల్పనున్నాయి. ఈ మేరకు జిల్లా ఆస్పత్రుల్లో డి–అడిక్షన్ కేంద్రాల్ని ఏర్పాటు చేసేందుకు ఏపీ వైద్య విధాన పరిషత్ కమిషనర్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. వ్యసనపరుల్ని మద్యం మాన్పించి వారికి చికిత్స అందించడంతో పాటు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు ఈ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ఒక్కో కేంద్రంలో మెడికల్ ఆఫీసర్, కౌన్సిలర్, నర్సు, అటెండర్లు ఉంటారు. మెడికల్ ఆఫీసరుగా ఓ సైక్రియాటిస్ట్ ఆ కేంద్రంలో ఉంటారు. మద్యపానంతో వచ్చే దుష్పరిణామాలు వివరించడంతో పాటు ఆ వ్యసనాన్నుంచి విముక్తి కలిగించేలా కౌన్సెలింగ్ ఇస్తారు. ప్రైవేటు కేంద్రాలకు దీటుగా సేవలు గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడి మద్యం అమ్మకాలతో చాలామంది మత్తుకు బానిసలయ్యారు. అప్పటి విధానం మేరకు ఎక్సైజ్ సిబ్బంది పనిచేసేవారు. ఇప్పుడు మద్యం వినియోగాన్ని ఎలా తగ్గించాలి? వ్యసనపరుల్ని మద్యానికి ఎలా దూరం చేయాలి? అన్న అంశాలపై ఎక్సైజ్ శాఖ దృష్టి సారించింది. తొలుత వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో తొలి దశలో జిల్లాకో డి–అడిక్షన్ సెంటర్ ఏర్పాటుచేసి తర్వాత దశలో విస్తరించనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో వెయ్యికిపైగా ప్రైవేటు, ఎన్జీవోల ఆధ్వర్యంలో డి–అడిక్షన్ కేంద్రాలు నడుస్తున్నాయి. ప్రైవేటు కేంద్రాలకు దీటుగా సేవలందించేలా జిల్లా ఆస్పత్రుల్లో ఏర్పాట్లు చేయనున్నారు. కేరళ, పంజాబ్ల్లోని డి–అడిక్షన్ కేంద్రాలపై అధ్యయనం కేరళ, పంజాబ్లలో అక్కడి ప్రభుత్వాలే భారీగా వెచ్చించి డి–అడిక్షన్ కేంద్రాలు నిర్వహిస్తున్నాయి. కేరళలో ‘విముక్తి’ అనే పథకం ద్వారా మద్యం వ్యసనపరులకు కౌన్సిలింగ్, చికిత్సలను డి–అడిక్షన్ కేంద్రాల్లో ఇవ్వడానికి అక్కడి అధికారులు ఏర్పాటు చేశారు. కేరళలో ఆ సెంటర్ల నిర్వహణ మెరుగ్గా ఉండటంతో అక్కడి విధానాల్ని మన వైద్య, ఎక్సైజ్ అధికారులు అధ్యయనం చేశారు. ఏపీలో కూడా మెరుగైన వసతులు కల్పించే విధంగా ఏర్పాట్లు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిర్ణయించారు. -
ఆబ్కారీ శాఖకు మామూళ్ల కిక్!
134 వైన్స్లు.. 9బార్ అండ్ రెస్టారెంట్లు.. గ్రామీణ ప్రాంతాల్లో సిండికేట్ల పుణ్యమాని.. ఊరికి ఒకటీ.. రెండు బెల్ట్షాపులు.. మరికొన్ని చోట్ల మూడు.. సిండికేట్ పరిధిలోని షాపులనుంచి రూ.20వేలు.., సిండికేట్ లేని దుకాణాలనుంచి నెలకు రూ.13వేలు, ఇక, బార్లనుంచి రూ.30 వేలు... ఇలా నెలనెలా ముక్కుపిండి వసూలు చేస్తున్న ముడుపుల మొత్తం ఏటా రూ.3కోట్ల పైమాటే. వెరసి జిల్లా ఎక్సైజ్శాఖ మామూళ్ల మత్తులో ఊగుతోంది..! సాక్షి, నల్లగొండ : ‘జిల్లా కేంద్రానికి సమీపంలోని ఓ గ్రామంలో ఒక మహిళ బెల్ట్షాప్ నిర్వహిస్తోంది.. అయితే ఆమె తమ మండలంలోని వైన్స్నుంచి కాకుండా.. నల్లగొండలోని ఓ వైన్స్ నుంచి మద్యం తీసుకెళ్లి విక్రయిస్తోంది. సిండికేట్లోని వైన్స్ నుంచి కాకుండా, బయటి ప్రాంతంనుంచి మద్యం ఎలా తెచ్చి అమ్ముతావని ఆబ్కారీశాఖలోని ఓ సీఐ స్థాయి అధికారికి తీవ్రమైన ఆగ్రహం కలిగింది. ఇంకేముంది తన సిబ్బందిని పురమాయించి ఆ మహిళను తీసుకురావాలని హుకుం జారీ చేశారు. గతంలో తాను బెల్ట్షాప్ నిర్వహించానని, ఇప్పుడు మానుకున్నానని ఆ మహిళ ఎంత మొత్తుకున్నా వినని ఎక్సైజ్ సిబ్బంది ఆమెను నానా దుర్భాషలాడారు. దీంతో ఆమె తనకు తెలిసిన వారి ద్వారా పరిస్థితిని ఓ ఎమ్మెల్యేకు వివరించింది. ఆయన మందలింపుతో ఎక్సైజ్ శాఖ అధికారి వెనక్కి తగ్గారు.’ ఈ ఉదంతం తేటతెల్లం చేసిందేమిటి? ‘బెల్ట్షాప్లు నడుపుకోండి. అభ్యంతరం లేదు.. కానీ, తమ మండలంలోని వైన్స్నుంచి మాత్రమే మద్యం కొనుక్కుని పోవాలి’ అన్నది ఆబ్కారీ అధికారుల పంతం. కారణం.. సిండికేట్గా ఏర్పడిన వైన్స్ నుంచి తమకు నెలా నెలా ఇబ్బడి ముబ్బడిగా అందుతున్న మామూళ్లే. ఈ వైన్స్లలో ఎక్కువ విక్రయాలు జరిగే బాధ్యతను ఎక్సైజ్ శాఖలోని కొందరు అధికారులు భుజానికి ఎత్తుకున్నారన్నది తేటతెల్లమవుతోంది. సిండికేట్ షాపుల్లో ఎందుకు కొనరంటే..? బెల్ట్షాపుల నిర్వాహకులు .. తమ ప్రాంతంలోని వైన్స్నుంచి మద్యం ఎందుకు కొనడం లేదంటే.. సదరు సిండికేట్ షాపులనుంచి ఎంఆర్పీకి మద్యం దొరకదు. రూ.5 నుంచి రూ.10 అదనంగా వసూలు చేసి విక్రయిస్తున్నారు. ఎక్కువ డబ్బులు పెట్టి తీసుకెళ్లిన మద్యాన్ని బెల్ట్షాపుల్లో మరో రూ.5 నుంచి రూ.10 అదనంగా తీసుకుని విక్రయించుకోవాల్సి వస్తుంది. ఈ కారణంగానే బెల్ట్షాపుల నిర్వాహకులు సిండికేట్లో భాగం లేని వైన్స్లనుంచి మద్యం తీసుకుని గ్రామాల్లో విక్రయిస్తున్నారు. దీంతో మండలాల్లోని వైన్స్లో విక్రయాలు తగ్గిపోతున్నాయి. ఈ పరిస్థితి నుంచి వాటిని గట్టెక్కించేందుకు అధిక మామూళ్లు ఇస్తున్న సిండికేట్ వైన్షాపుల బిజినెస్ దెబ్బతినకుండా ఉండేందుకు ఎక్సైజ్శాఖలోని కొందరు అధికారులు బెల్ట్షాపుల వారికి ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇదీ.... పరిస్థితి.. జిల్లాలో 134 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటికితోడు నల్లగొండ, దేవరకొండలో కలిపి 9 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు పట్టణ ప్రాంతాల్లోని మద్యం దుకాణాలు సిండికేట్కు దూరంగా ఉన్నాయి. ఇక, మండలాల్లోని దుకాణాలు మాత్రం సిండికేట్గా ఏర్పడ్డాయి. జిల్లాలో నల్లగొండ, మిర్యాలగూడ, నకిరేకల్, చండూరు, నాంపల్లి, హాలియా, దేవరకొండల్లో ఎక్సైజ్ సర్కిళ్లు ఉన్నాయి. వీటి పరిధిలోని పట్టణ ప్రాంతాలు మినహా మిగిలిన అన్ని చోట్లా సిండికేట్లను ఎక్సైజ్ శాఖే ప్రోత్సహిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. కొద్ది నెలల కిందట.. ఈ శాఖ ఎన్ని బెల్ట్షాపులు ఉన్నాయో లెక్క తేల్చేందుకు ఓ సర్వే నిర్వహించింది. కనీసం 1800 బెల్ట్షాపులు ఉన్నట్లు లెక్క తేలిందని సమాచారం. అంటే జిల్లాలోని 844 గ్రామాల్లో సరాసరిన ఊరికి ఒకటీ .. రెండు బెల్ట్షాపులు.. మరికొన్ని చోట్ల మూడు దాకా ఉన్నట్లు అంచనా. మామూళ్లు ఇవ్వకుంటే కొర్రీలు అన్ని నిబంధనలను పాటించి సక్రమంగా నడుపుకునే వైన్స్నుంచి కూడా నెలనెలా మామూళ్లు ఇచ్చుకోవాల్సి వస్తోందన్న ఆరోపణ ఉంది. ఇవ్వకుంటే సవాలక్ష కొర్రీలతో సతాయించడం ఎక్సైజ్ శాఖకు వెన్నతో పెట్టిన విద్య అన్న అభిప్రాయం ఉంది. దీంతో సిండికేట్లో లేని దుకాణాలనుంచి నెలకు రూ.13వేలు, సిండికేట్ పరిధిలోని షాపుల నుంచి రూ.20వేలు... ఇక, బార్లనుంచి రూ.30 వేలు చొప్పున... నెలనెలా ముక్కుపిండి వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇలా ప్రతినెలా వైన్స్, బార్ల నుంచి రూ.28.80లక్షలు వసూలు అవుతున్నాయని సమాచారం. ఇలా లెక్కగడితే ఏడాదికి వీరి మామూళ్లు మొత్తం 3.45కోట్ల పైమాటేనని చెబుతున్నారు. -
మద్యం షాపుల అద్దెలపై రివర్స్ టెండర్లు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ మద్యం దుకాణాల అద్దెలకు సంబంధించి రివర్స్ టెండర్లు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు అన్ని జిల్లాల కలెక్టర్లకు లేఖలు రాశారు. తొలుత విశాఖపట్టణం, విజయవాడ, గుంటూరులో రివర్స్ టెండర్లు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అద్దె టెండర్లలో గోల్మాల్ కొత్త మద్యం విధానంలో భాగంగా సంయుక్త కలెక్టర్, డిప్యూటీ కమిషనర్ల ఆధ్వర్యంలో గతేడాది అక్టోబరులో ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటు చేసేందుకు గదుల అద్దెలు ఖరారు చేశారు. అయితే ఈ టెండర్లలో గోల్మాల్ జరిగినట్లు ఫిర్యాదులు అందాయి. గతంలో ప్రైవేట్ వ్యక్తులు నిర్వహిస్తున్న దుకాణాలనే అధిక ధరలకు అద్దెకు తీసుకున్నారని విమర్శలు వ్యక్తం కావటంతో విచారణకు ఆదేశించారు. అద్దె టెండర్లలో అవకతవకలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు. విశాఖలో మద్యం షాపుల అద్దె చదరపు అడుగుకి ఎక్కడా లేని విధంగా రూ.566 చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. సాధారణంగా పట్టణాల్లో/నగరాల్లో అద్దెలు చదరపు అడుగుకి రూ.22 నుంచి గరిష్టంగా రూ.40 వరకు మాత్రమే ఉన్నాయి. మద్యం షాపులకు రూ.50 నుంచి రూ.70 వరకు చెల్లించవచ్చనుకుంటే ఏకంగా రూ.250 నుంచి రూ.560 వరకు చెల్లించేలా భవన యజమానులతో ఎక్సైజ్ అధికారులు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మద్యం దుకాణాన్ని 150 నుంచి 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలని నిబంధనల్లో పేర్కొన్నారు. విశాఖలో 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో మద్యం దుకాణానికి నెలకు రూ.1.70 లక్షలు అద్దె చెల్లించేందుకు అంగీకారం కుదుర్చుకున్నారు. కొన్నిచోట్ల ఉచితంగా ఇచ్చిన స్థానికులు మరోవైపు రాష్ట్రంలో కొన్ని చోట్ల ప్రభుత్వ మద్యం దుకాణాల గదులకు ఎలాంటి అద్దె లేకుండా ఎక్సైజ్ శాఖకు అప్పగించారు. కృష్ణా జిల్లా నందిగామ, పెనుగంచిప్రోలు, గంపలగూడెం తదితర ప్రాంతాల్లో మద్యం షాపులకు అద్దె లేకుండా స్థానికులు గదుల్ని అప్పగించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో రూపాయి అద్దె చొప్పున భవనాలు అప్పగించారు. మద్యం వ్యసనాన్ని ప్రజలకు దూరం చేసేందుకు ప్రభుత్వమే షాపుల్ని నిర్వహిస్తుండటంతో ఉచితంగా భవనాలు అప్పగించారు. విజయవాడలో రూ.లక్షల్లో అద్దె విజయవాడలో గతంలో లిక్కర్ మార్ట్లు నిర్వహించిన చోట ఏపీఎస్బీసీఎల్ ఆధ్వర్యంలో ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటు చేశారు. ఓ దుకాణానికి నెలకు రూ.3.50 లక్షలు, మరో షాపునకు రూ.2.70 లక్షలు చొప్పున అద్దె నిర్ణయించడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ప్రైవేట్ మద్యం దుకాణాలను నిర్వహించిన చోటే ప్రభుత్వ మద్యం షాపులు ఏర్పాటు చేయాలని ఎక్సైజ్ ఉన్నతాధికారులు సూచించడంతో అధిక ధరలతో అద్దెకు తీసుకున్నారనే విమర్శలున్నాయి. ప్రభుత్వ మద్యం దుకాణాల ఏర్పాటుకు స్థలాలను పరిశీలించి ప్రజలకు ఇబ్బంది లేకుండా నిర్ణయించాల్సిన అధికారులు హడావుడిగా అధిక మొత్తంలో అద్దె చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పుడు వీటికి రివర్స్ టెండర్లు నిర్వహించి ఖజానాకు ఆదా చేయనున్నారు. -
ఈవెంట్ పర్మిట్లపై ఆబ్కారీ ఆంక్షలు
సాక్షి, అమరావతి: నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి డిసెంబర్ 31 రాత్రి నిర్వహించే ఈవెంట్లకు ఇచ్చే పర్మిట్లపై ఎక్సైజ్ శాఖ ఆంక్షలు విధించింది. ముందుగా పోలీసుల అనుమతి తీసుకుని ఎక్సైజ్ శాఖకు దరఖాస్తు చేసుకుంటేనే మద్యం సరఫరా అనుమతులు ఇచ్చే విషయం పరిశీలించాలని నిర్ణయించింది. మద్య నియంత్రణలో వైఎస్ జగన్ ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉండడంతో ఈవెంట్ పర్మిట్ల విషయం లోనూ ఎక్సైజ్ శాఖ జాగ్రత్తలు తీసుకుంటోంది. గతంలో అయితే ఈవెంట్ల నిర్వహణకు సంబంధించి లిక్కర్ సరఫరా కోసం నిర్వాహ కులు ఎక్సైజ్ శాఖకు దరఖాస్తు చేసుకునే వారు. ఎక్సైజ్ శాఖలో సూపరింటెండెంట్ స్థాయి అధికారి అంశాల ప్రాతిపదికగా (సబ్జెక్ట్ టు కండిషన్) అనుమతులు ఇచ్చేవారు. ఇప్పుడు అలా కుదరదు. సాధారణంగా నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నిర్వహించే ఈవెంట్లలో మద్యం వినియోగం ఎక్కువగా ఉంటుంది. గతంలో నూతన సంవత్సరం సందర్భంగా ఒక్క రోజే రూ.150 కోట్ల వరకు మద్యం అమ్మకాలు ఉండేవి. గత ప్రభుత్వం ఆదాయం పెంచుకు నేందుకు మద్యం అమ్మకాలను అర్ధరాత్రి వరకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసేది. ఇప్పుడు నిబంధనలు కఠినతరం చేయడంతో ఈ సారి కొత్త ఏడాది వేడుకల ఈవెంట్ల పర్మిట్లకు దరఖాస్తులు భారీగా తగ్గాయి. గతంలో ఒక్క విజయవాడలో 30 నుంచి 40 ఈవెంట్ల పర్మిట్లకు ఎక్సైజ్ శాఖ అనుమతులిచ్చేది. ఈ సారి కేవలం ఐదు ఈవెంట్లకు మాత్రమే దరఖాస్తులు అందాయి. విశాఖలోనూ దరఖాస్తులు పెద్దగా రాలేదని ఎక్సైజ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. -
బెల్టు షాపుల మూసివేతపై 'ఆ' శాఖల మధ్య వివాదం
సాక్షి, బాల్కొండ: విచ్చలవిడిగా మద్యం అమ్మకాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతుండగా.. ప్రభుత్వం తమకు ఇచ్చిన టార్గెట్కు అనుగుణంగా మద్యం అమ్మకాలను ఎక్సైజ్ శాఖ ప్రోత్సహిస్తుంది. బెల్టుషాపుల కొనసాగింపుపై ఎక్సైజ్ శాఖ సానుకూలంగా వ్యవహరిస్తుండగా, పోలీసులు కఠినంగా ఉన్నారు. దీంతో ఇరుశాఖల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది. మూసి ఉన్న బెల్టుషాపులను పునఃప్రారంభించుకోవచ్చని ఎక్సైజ్ అధికారులు నిర్వాహకులకు అనధికారికంగా సూచించిగా ఒక రోజు దుకాణాలు తెరిచారు. దీంతో ఆగ్రహించిన పోలీసులు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించడంతో బెల్టుషాపులకు తాళాలు పడ్డాయి. ఇలా బెల్టుషాపుల నిర్వహణపై ఎక్సైజ్, పోలీసు శాఖలు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. జిల్లాలో లైసెన్స్డ్ మద్యం దుకాణాలు 95 ఉన్నాయి. నిజామాబాద్ నగర కార్పొరేషన్ పరిధిలోని మద్యం దుకాణాలను మినహాయించి జిల్లాలోని మూడు మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు, మేజర్ పంచాయతీల్లో ఉన్న మద్యం దుకాణాలకు అనుబంధంగా బెల్టుషాపులు కొనసాగుతున్నాయి. లైసెన్స్డ్ మద్యం దుకాణాల్లో రోజుకు రూ.లక్ష మద్యం విక్రయిస్తే బెల్టు షాపులకు తరలించిన మద్యం ద్వారా అదనంగా రూ.రెండు లక్షల గిరాకీ పెరుగుతుంది. బెల్టుషాపుల ద్వారానే అత్యధికంగా మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి. అనధికార సూచనలు! ప్రభుత్వం తమకు ఇచ్చిన టార్గెట్ ప్రకారం మద్యం అమ్మకాలు జరగడానికి ఐఎంఎల్ డిపోల నుంచి వ్యాపారులు మద్యం కొనుగోలు చేసేలా ఎక్సైజ్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. మద్యం అమ్మకాలు పెరగాలంటే బెల్టుషాపులు ప్రధానం అని భావించిన ఎక్సైజ్ అధికారులు లైసెన్స్డ్ మద్యం దుకాణాలు లేని గ్రామాల్లో బెల్టుషాపులు కొనసాగించడానికి అనధికార అనుమతి ఇచ్చారు. ‘దిశ’ ఘటన మద్యం మత్తులో జరిగిందనే విషయాన్ని గుర్తించిన పోలీసులు మద్యం అమ్మకాలను నియంత్రించడంపై దృష్టి సారించారు. లైసెన్స్డ్ మద్యం దుకాణాలను మూయించే అధికారం లేకపోవడంతో పోలీసులు బెల్టు దుకాణాలపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. ఈ మేరకు నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని బెల్టుషాపులను మూయించడానికి ఉన్నతాధికారులు ఆయా స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు ఆదేశాలు ఇచ్చారు. సుమారు పదిహేను రోజుల నుంచి బెల్టుషాపులను పోలీసుల ఆదేశాలతో నిర్వాహకులు మూసి ఉంచుతున్నారు. బెల్టుషాపులు మూసి ఉండటంతో మద్యం అమ్మకాలు అనుకున్నంత సాగడం లేదని వ్యాపారులు ఎక్సైజ్ అధికారులకు వివరించారు. తాము పోలీసు ఉన్నతాధికారులతో చర్చించామని ఎక్సైజ్ అధికారులు చెప్పడంతో నిర్వాహకులు బుధవారం బెల్టుషాపులను తెరిచారు. దీనిపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో గురువారం నుంచి మళ్లీ దుకాణాలను మూసి ఉంచుతున్నారు. బెల్టుషాపులు మూసి ఉంచడంతో ఐఎంఎల్ డిపోల నుంచి ఎక్కువ మొత్తం మద్యం కొనుగోలు చేయలేమని వ్యాపారులు పేర్కొంటున్నారు. అటు ప్రభుత్వం మద్యం అమ్మకాలకు టార్గెట్ నిర్ణయించడం, ఇటు బెల్టుషాపులు మూసి ఉండటంతో ఎక్సైజ్ అధికారులు సందిగ్ధంలో పడ్డారు. మద్యం అమ్మకాల విషయంలో రెండు ప్రభుత్వ శాఖల మధ్య భిన్నమైన అభిప్రాయాలు ఏర్పడటం చర్చనీయాంశం అయింది. మాకు టార్గెట్ ఉంది మద్యం దుకాణాల ద్వారా నిర్ణీత లక్ష్యం మేరకు మద్యం అమ్మాలని టార్గెట్ నిర్ణయించారు. లైసెన్స్డ్ వ్యాపారులు ఐఎంఎల్ డిపోల నుంచి టార్గెట్ ప్రకారం మద్యం కొను గోలు చేయాలి. ప్రస్తుత పరిస్థితిలో మద్యం అమ్మకాలు తగ్గడం మాకు కొంత ఇబ్బందే. – శేఖర్, ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్, మోర్తాడ్ -
ఎక్సైజ్శాఖ డైరెక్టర్గా సర్ఫరాజ్ అహ్మద్
సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్కు ప్రభుత్వం కీలకమైన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ పదవిని కట్టబెట్టింది. రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి సోమేశ్కుమార్ ఇప్పటివరకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కమిషనర్గా అదనపు బాధ్యతలు చూస్తుండగా, ఆయన్ను తప్పించి ఆ విభాగాన్ని సర్ఫరాజ్కు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మూడేళ్ల పాటు కరీంనగర్ జిల్లా కలెక్టర్గా పనిచేసిన సర్ఫరాజ్ ఇటీవల వార్తల్లో నిలిచారు. గత అసెంబ్లీ ఎన్నికల వ్యయం విషయంలో తనకు వ్యతిరేకంగా సర్ఫరాజ్ బీజే పీ ఎంపీ బండి సంజయ్తో కలసి కుట్ర చేశారని జిల్లా మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. దీనిపై ఆయన సీఎం కేసీఆర్కు ఫిర్యాదు చేశా రు. ఈ వివాదం తర్వాత సర్ఫరాజ్కు కీలకమైన ఎక్సై జ్ శాఖ పోస్టు లభించడం గమనార్హం. రెవెన్యూ కార్యదర్శిగా ‘బుసాని’ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం అదనపు డైరెక్టర్ జనరల్ బుసాని వెంకటేశ్వర్లు ను రెవెన్యూ శాఖ (విపత్తుల నిర్వహణ) కార్యదర్శిగా ప్రభుత్వం బదిలీ చేసింది. వెయిటింగ్లో ఉన్న ఎ.అశోక్ను డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం అదనపు డైరెక్టర్ జనరల్గా బదిలీ చేసింది. జోగులాంబ–గద్వాల జిల్లా కలెక్టర్ కె.శశాంక కరీంనగర్ జిల్లా కలెక్టర్గా బదిలీ అయ్యారు. వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతికి జోగులాంబ–గద్వాల జిల్లా కలెక్టర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. -
పెచ్చుమీరుతున్న సారా తయారీ
జిల్లాలో 84 మద్యం దుకాణాలు మూతపడ్డాయి. విక్రయ వేళలు తగ్గాయి. బార్లను కూడా 40 శాతం మూసేయడానికి కసరత్తు ప్రారంభమైంది. దీన్ని అదనుగా తీసుకున్న కొందరు సారా తయారీపై దృష్టిపెట్టారు. విచ్చలవిడిగా తయారుచేసి పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అబ్కారీ శాఖ ఇప్పటికే దాడులు ముమ్మరం చేసినా.. సిబ్బంది కొరత వేధిస్తుండడంతో అన్ని వైపులా దృష్టి పెట్టలేకపోతోంది. సాక్షి, చిత్తూరు: ‘జిల్లా వ్యాప్తంగా సారా తయారీ కేంద్రాలపై శనివారం నిర్వహించిన దాడుల్లో ఎక్సైజ్ శాఖ అధికారులు 2,900 లీటర్ల ఊట ధ్వంసం చేశారు. ఆరుగురు నిందితులను అరెస్టుచేశారు. 14 వాహనాలను స్వాదీనం చేసుకున్నారు. 64 లీటర్ల సారాను సీజ్ చేశారు. అధికారులు దాడులు చేస్తున్న ప్రతిసారీ వేల లీటర్ల సారా ఊట లభ్యమవుతోంది’ మద్యానికి ముకుతాడు మద్యం విక్రయాలు, పాలసీపై ప్రభుత్వం ప్రవేశపెడుతున్న విధానాలపై మహిళలతో పాటు అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ఇందులో భాగంగా జిల్లాలో అప్పటివరకు ఉన్న 430 మద్యం దుకాణాల్లో.. ప్రస్తుతం 344 మిగిలాయి. ఏటా మరో 20 శాతం దుకాణాలను తగ్గించుకుంటూ వెళుతామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో 40కు పైగా ఉన్న బార్లలో తాజాగా విడుదలచేసిన నోటిఫికేషన్లో 20 మాత్రమే మిగిలాయి. అలవాటు మానుకోలేక.. గతంలో వేళాపాళా లేని మద్యం విక్రయాలు, 24 గంటల పాటు గ్రామాల్లో అందుబాటులో ఉన్న బెల్టు దుకాణాల ద్వారా మందుబాబులకు ఎనీటైమ్ మద్యం లభించే పరిస్థితి ఉండేది. తాజాగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో రాత్రి 8 గంటలు దాటితే మద్యం దుకాణాలు మూసేస్తున్నారు. బార్లలో రేట్లు అధికంగా ఉండడంతో మద్యాన్ని క్రమంగా మానేయడానికి కొందరు ప్రయత్నిస్తుంటే.. గత ప్రభుత్వ హయాంలో ఆదాయానికి అలవాటుపడ్డ వారు మాత్రం మద్యం స్థానంలో సారాను విచ్చలవిడిగా తయారు చేస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతోంది. ఈ ప్రాంతాల్లోనే అధికం జిల్లాలో సారా తయారీలో 8 నియోజకవర్గాల్లో ఎక్కువగా ఉంది. ప్రధానంగా తమిళనాడుకు సరిహద్దుగా ఉన్న ప్రాంతాల్లో సారాను ఓ కుటీర పరిశ్రమగా నడుపుతున్నారు. గుడిపాల, చిత్తూరు రూరల్, చిత్తూరు నగరం, పాలసముద్రం, గంగాధరనెల్లూరు, బైరెడ్డిపల్లె, వాలీ్మకిపురం, పులిచెర్ల, ములకలచెరువు, కుప్పం, ప్రాంతాల్లో సారా తయారీ ఎక్కువగా ఉన్నట్లు అధికారులు ఇటీవల గుర్తించారు. రోజూ ఈ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న దాడుల్లో 3 వేల లీటర్ల వరకు సారా ఊట ధ్వసం చేస్తూ.. పదుల సంఖ్యలో నిందితులను అరెస్టు చేస్తున్నారు. తెరవెనుక వాళ్లేరి? సారా తయారీ, విక్రయాల వల్ల పేదల సంపాదన గంట మత్తు కోసం ఖర్చు పెట్టేస్తుండడంతో పాటు ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. మరోవైపు సారా తయారీ, విక్రయాల్లో కూలి పనిచేసే పేదలు మాత్రమే పోలీసులకు చిక్కుతున్నారే తప్ప.. వారికి తెరవెనుక ఉంటూ నడిపిస్తున్న ప్రధాన వ్యక్తులను అధికారులు పట్టుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఇటీవల రాష్ట్ర ఎక్సైజ్శాఖ మంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ సారాపై ఉక్కుపాదం మోపాలని, ఎవర్నీ ఉపేక్షించొద్దని అబ్కారీశాఖ అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చారు. అయినాసరే అధికారులు మాత్రం చిన్నా చితక కూలీలను అరెస్టు చేసి చేతులు దులుపుకుంటున్నారు. దీనికితోడు ఎక్సైజ్ శాఖలో వందకు పైగా కానిస్టేబుల్ పోస్టులు దశాబ్ద కాలంగా భర్తీకి నోచుకోకపోవడంతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు అధికారులు వాపోతున్నారు. ఎవర్నీ వదలడం లేదు సారా తయారీలో కూలీలు, యజమానులు అని తేడా లేదు. తయారీ, విక్రయాల వద్ద అరెస్టు చేస్తున్నవాళ్లు తెలిపే వివరాల ఆధారంగా వారి వెనుక ఉన్నవారిపై కూడా కేసులు పెడుతున్నాం. ఇందుకోసం పోలీసుశాఖ కూడా మాకు బాగా సహకరిస్తోంది. మూడు నెలల్లో 40 శాతం వరకు సారా విక్రయాలు, తయారీని అరికట్టాం – నాగలక్షి్మ, డిప్యూటీ కమిషనర్, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ -
బార్ల లైసెన్స్ దరఖాస్తుకు 9 వరకు గడువు
సాక్షి, అమరావతి: మద్యాన్ని ప్రజలకు దూరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. బార్ల లైసెన్సులకు దరఖాస్తులను ఆహ్వానించగా.. స్పందన లేకపోవడమే ఇందుకు తార్కాణంగా నిలుస్తోంది. రాష్ట్రంలో 40 శాతం బార్ల సంఖ్యను తగ్గించి 487 బార్ల ఏర్పాటుకు ఎక్సైజ్ శాఖ దరఖాస్తుల్ని ఆహ్వానించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి జారీ చేసిన నోటిఫికేషన్లో దరఖాస్తుల స్వీకరణకు డిసెంబర్ 5వ తేదీ వరకు గడువు విధించారు. పెద్దగా స్పందన లేకపోవడంతో మళ్లీ ఒక రోజు గడువు పెంచి సవరణ నోటిఫికేషన్ జారీ చేశారు. శుక్రవారం రాత్రికి రాష్ట్ర వ్యాప్తంగా 301 దరఖాస్తులు అందాయి. రాష్ట్రంలో 105 మున్సిపాలిటీలు ఉండగా, అసలు 45 మున్సిపాలిటీల్లోని బార్లకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. దీంతో ఎక్సైజ్ శాఖ రెండో సవరణ నోటిఫికేషన్ జారీ చేసింది. గడువును డిసెంబరు 9వ తేదీ వరకు పొడిగిస్తూ ఎక్సైజ్ కమిషనర్ వివేక్ యాదవ్ నోటిఫికేషన్ జారీ చేశారు. మద్యం విధానంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని ప్రదర్శిస్తూ దశల వారీగా మద్య నిషేధం వైపు అడుగులు వేయడం వల్లే దరఖాస్తులు రావడం లేదని ఎక్సైజ్ వర్గాలు పేర్కొంటున్నాయి. -
భారీగా తగ్గిన మద్యం అమ్మకాలు
సాక్షి, అమరావతి: దశలవారీగా మద్య నిషేధం అమలు చేసే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. మద్యం అమ్మకాలు రోజురోజుకూ గణనీయంగా తగ్గుతున్నాయి. గత ఏడాది నవంబర్ నెలలో అమ్మకాలతో పోలిస్తే.. ఈ ఏడాది నవంబర్ మద్యం అమ్మకాల్లో 22.31 శాతం మేర తగ్గుదల నమోదైంది. గత ఏడాది నవంబర్లో బీర్ల అమ్మకాలతో పోలిస్తే.. ఈ ఏడాది నవంబర్లో సగానికి పైగా అమ్మకాలు తగ్గాయి. గతేడాది కంటే ఈ నవంబర్లో 54.30% తగ్గుదల నమోదైంది. షాపుల్ని తగ్గించి.. వేళల్ని నియంత్రించటమే కారణం గతంలో ఉన్న 4,380 మద్యం దుకాణాలను ప్రభుత్వం 3,500కు తగ్గించింది. విక్రయ వేళల్ని ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల వరకు పరిమితం చేశారు. కొత్త మద్యం విధానంలో భాగంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో అమ్మకాలు తగ్గాయని, ప్రైవేట్ వ్యక్తుల ప్రమేయం లేకపోవడం, వేళల్ని కచ్చితంగా పాటించడంతో మద్యం విక్రయాలు క్రమక్రమంగా నియంత్రణలోకి వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. గతంలో పర్మిట్ రూములతో కొన్నిచోట్ల, పర్మిట్లు లేకుండా మరికొన్ని చోట్ల మద్యం సేవించేవారు. ఇప్పుడు పర్మిట్ రూములను రద్దు చేయడంతో మద్యం షాపులు కేవలం అమ్మకానికి మాత్రమే పరిమితమవుతున్నాయి. గ్రామాల్లోని బెల్ట్ షాపులను ఎక్సైజ్ అధికారులు, పోలీసులు తొలగించడంతో అక్కడా మద్యం వినియోగం భారీగా తగ్గింది. -
487 బార్లకు నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: నూతన బార్ల విధానం 2020–21కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్, ఆఫ్లైన్లో డిసెంబర్ 6వతేదీ వరకు దరఖాస్తులు స్వీకరించి మరుసటి రోజు రాత్రి 7 గంటలకు లాటరీ తీసి బార్ల కేటాయింపు జాబితా ప్రకటిస్తారు. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలను యూనిట్లుగా నిర్థారించి బార్లను కేటాయించనున్నట్లు ఎక్సైజ్ కమిషనర్ వివేక్ యాదవ్ గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. దరఖాస్తు ఇలా - ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ నవంబరు 29 నుంచి మొదలైంది. - డిసెంబర్ 6వతేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. - ఆఫ్లైన్లోనూ డిసెంబరు 6న సాయంత్రం 5 గంటల దాకా దరఖాస్తుకు అవకాశం. - జిల్లా ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ల కార్యాలయాల్లోనూ దరఖాస్తులు ఇవ్వొచ్చు. - డిసెంబర్ 7వతేదీ మధ్యాహ్నం 2 గంటలకు కలెక్టర్ల సమక్షంలో లాటరీ తీసి అదే రోజు రాత్రి బార్ల కేటాయింపు జాబితా ప్రకటిస్తారు. రెండేళ్ల పాటు కొత్త విధానం - నూతన విధానం కింద బార్ లైసెన్స్ దరఖాస్తు ఫీజు రూ.10 లక్షలుగా నిర్ణయించారు. - జనవరి 1వతేదీ నుంచి 2021 డిసెంబర్ 31 వరకు రెండేళ్లపాటు కొత్త బార్ల పాలసీ అమల్లో ఉంటుంది. - బార్ లైసెన్సు ఇచ్చినా ఇవ్వకున్నా దరఖాస్తు ఫీజు రూ.10 లక్షల్ని తిరిగి చెల్లించరు. 40% బార్ల తొలగింపు జనవరి 1వతేదీ నుంచి నూతన బార్ల విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దశలవారీ మద్య నిషేధంలో భాగంగా రాష్ట్రంలో బార్ల సంఖ్యను 40 శాతం తగ్గించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే ఆదేశించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న 797 బార్లలో 40 శాతం తొలగించి 487 బార్లకు మాత్రమే లైసెన్సులు జారీ చేయనున్నారు. -
మద్యం కేసుల్లో శిక్ష పడితే నో లైసెన్స్
సాక్షి, అమరావతి: జనవరి 1 నుంచి బార్ల కేటాయింపులో నూతన పాలసీకి ప్రభుత్వం పదును పెట్టింది. ఆ మేరకు నియమ నిబంధనలతో సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. నూతన విధానం ప్రకారం.. పర్యాటక ప్రాంతాల్లో ఎక్కడా బార్లు, మైక్రో బ్రూవరీలు ఉండవు. మద్యం కేసుల్లో శిక్ష పడిన వారు, 21 ఏళ్ల లోపు వయస్సున్న వారు, ప్రభుత్వానికి ఎక్సైజ్ రెవెన్యూ ఎగవేతదారులకు, కుష్టు వ్యాధి, ఇతర వ్యాధులున్న వారికి లైసెన్సులు మంజూరు చేయరు. బార్ను కనీసం 200 చదరపు మీటర్లలో ఏర్పాటు చేయాలి. వాటికి అనుబంధంగా ఏర్పాటయ్యే రెస్టారెంట్, కిచెన్ 15 చదరపు మీటర్లలో ఉండాలి. గుర్తింపున్న విద్యా సంస్ధలకు, దేవదాయ శాఖ గుర్తించిన దేవాలయాలు, వక్ఫ్బోర్డు గుర్తింపున్న మసీదులు, రిజిస్టర్డ్ క్రైస్తవ సంస్థలు నిర్వహించే చర్చిలకు, ఆస్పత్రులకు 100 మీటర్లలోపు బార్లు ఏర్పాటు చేయరాదు. జాతీయ, రాష్ట్ర రహదార్లకు 500 మీటర్ల లోపు దూరంలో ఉండకూడదు. అక్టోబర్ 2, ఆగష్టు 15, జనవరి 26 తేదీలను డ్రై డేలుగా గుర్తించారు. ప్రస్తుతం ఉన్న బార్లలో 40 శాతం తగ్గించి వాటి సంఖ్యను ఎక్సైజ్ కమిషనర్ ప్రకటిస్తారు. దరఖాస్తు , లైసెన్సు ఫీజుల్ని ప్రకటించారు. బార్ల లైసెన్స్కు ఇతర నియమ నిబంధనలివే.. - బార్, మైక్రో బ్రూవరీని నగర పంచాయతీలు, మున్సిపాలిటీల్లో రెండు కి.మీ. పరిధిలోనూ, కార్పొరేషన్లలో 5 కి.మీ. పరిధిలో ఏర్పాటు చేయాలి. - దరఖాస్తు రుసుం రూ.10 లక్షలు. దీన్ని తిరిగి ఇవ్వరు - స్టార్ హోటళ్లు, బ్రూవరీలను మినహాయించి మిగిలిన 797 బార్లలో 40 శాతం తగ్గించి 478 బార్లకే లైసెన్సులిస్తారు. ఉదాహరణకు ఏదైనా మున్సిపాలిటీలో పది బార్లుంటే.. వాటిలో నాలుగు తగ్గిస్తారు. అదే ఒక బార్ ఉంటే అలానే ఉంచుతారు. - బార్కు దరఖాస్తు చేసుకునే వారు ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి. లేదా ఫుడ్ సేఫ్టీ స్టాండర్ట్ యాక్టు–2006 ప్రకారం లైసెన్స్ పొందాలి. - వ్యాపార వేళలు ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటలు. ఆహార సరఫరా 11 వరకూ ఉంటుంది. త్రీస్టార్, ఆపైస్థాయి హోటళ్లకు వ్యాపార వేళలు ఉదయం 11 నుంచి రాత్రి 11 వరకు, ఆహార సరఫరా అర్ధరాత్రి 12 వరకు. - లైసెన్సు మార్పిడి, కొత్త లైసెన్స్ ప్రకటన ఎక్సైజ్ కమిషనర్ అనుమతితోనే ఉంటుంది. ఎక్సైజ్ చట్టం 31, 32 ప్రకారం లైసెన్స్ రద్దు చేసే, ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. -
నీరా ఉత్పత్తుల తయారీ అధ్యయనానికి కమిటీ
సాక్షి, హైదరాబాద్: నీరా, అనుబంధ ఉత్పత్తుల తయారీపై అధ్యయనం చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటకశాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ తెలిపారు. నీరా ఉత్పత్తుల తయారీ అంశంపై ఆయన ఆదివారం హైదరాబాద్లో అబ్కారీ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గీత కార్మికుల సహకార ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ అలోక్కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసే కమిటీలో అబ్కారీ శాఖ ఉన్నతాధికారులు, గీత వృత్తిదారు ల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారని మంత్రి వెల్లడించారు. రాజమండ్రి సమీపంలోని పందిరిమామిడిలో ఉన్న డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీలో టాడి అండ్ అలైడ్ ప్రొడక్టŠస్ రీసెర్చ్ సెంటర్లో నీరా, అనుబంధ ఉత్పత్తుల తయారీని అధ్యయనం చేయాలని ఆదేశించారు. -
బార్ల లైసెన్సుల రద్దు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న బార్ల లైసెన్సులను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బార్లతోపాటు స్టార్ హోటళ్లు, మైక్రో బ్రూవరీల లైసెన్సులు కూడా రద్దు కానున్నాయి. దశల వారీ మద్యనిషేధం, నియంత్రణలో భాగంగా ప్రస్తుతం ఉన్న 797 బార్లలో 40 శాతం(319) మూసేయనున్నారు. మిగిలిన 60 శాతం (478 బార్లు)కు జనవరి 1 నుంచి కొత్తగా లైసెన్సులు జారీ చేయనున్నారు. అదేవిధంగా కొత్త బార్లకు లైసెన్సు ఫీజులను భారీగా పెంచింది. ఈ మేరకు బార్ల రద్దు, కొత్త బార్ల పాలసీకి సంబంధించి ప్రభుత్వం శుక్రవారం వేర్వేరుగా ఉత్తర్వులు ఇచ్చింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి.. 2021 డిసెంబర్ 31 వరకు రెండేళ్లపాటు కొత్త బార్ల పాలసీ అమల్లో ఉంటుంది. దీని ప్రకారం.. బార్ లైసెన్స్ దరఖాస్తు ఫీజును రూ.10 లక్షలుగా నిర్ణయించారు. దరఖాస్తు చేసుకున్నవారికి బార్ లైసెన్సు వచ్చినా, రాకున్నా ఈ రుసుం తిరిగి చెల్లించరు. బార్లలో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే మద్యం సరఫరా చేస్తారు. ఆహార పదార్థాలను 11 గంటల వరకు అందిస్తారు. త్రీస్టార్,ఆపై స్థాయి హోటళ్లలో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మద్యం అందుబాటులో ఉంటుంది. ఆహారాన్ని అర్ధరాత్రి 12 గంటల వరకు సర్వ్ చేస్తారు. లాటరీ విధానంలో బార్ల కేటాయింపు పేద, సామాన్య ప్రజానీకానికి మద్యాన్ని దూరం చేసేందుకు సెప్టెంబర్ 30న మద్యం బాటిళ్ల రేట్లను భారీగా పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పినట్లే ఇప్పుడు బార్లలోనూ మద్యం ముట్టుకుంటే భారీ షాక్ కొట్టేలా అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ కింద ధరలను పెంచారు. ఈ నిర్ణయం శనివారం నుంచి అమల్లోకి వస్తుంది. జనవరి 1 నుంచి ఏర్పాటయ్యే బార్లను లాటరీ విధానంలో ఆయా జిల్లాల కలెక్టర్లు దరఖాస్తుదారులకు కేటాయిస్తారు. బార్ల లైసెన్సుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. రూ.10 లక్షల చలానా, బార్ ఏర్పాటు చేసే ప్రదేశానికి చెందిన ప్లాన్, అద్దెకు తీసుకుంటే యజమాని నుంచి కన్సెంట్ లెటర్ను సమర్పించాలి. -
మద్యం.. షాక్ తథ్యం
సాక్షి, అమరావతి: దశలవారీ మద్య నియంత్రణ, నిషేధంలో భాగంగా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న బార్లలో 40 శాతం మూసేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. మద్యం ముట్టుకుంటే షాక్ కొడుతుందన్న భావన ఉండాలని, అప్పుడే చాలా మంది దానికి దూరం అవుతారని సీఎం వ్యాఖ్యానించారు. నూతన బార్ల విధానం, తదుపరి చర్యలపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు తీసుకున్న, ఇకపై తీసుకోవాల్సిన చర్యల గురించి సమావేశంలో చర్చించారు. బార్ల సంఖ్యను కుదించడంపై సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. రాష్ట్రంలో 38 స్టార్ హోటళ్లు, 4 పబ్బులతో సహా మిగతా మొత్తం 839 మంది బార్ల నిర్వహణకు లైసెన్స్లు తీసుకున్నారని అధికారులు వివరించారు. ఆతిథ్య రంగానికి సంబంధించిన స్టార్ హోటళ్లు, పబ్బులు మినహాయిస్తే 797 బార్లు నడుస్తున్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వీటిలో సగానికి పైగా బార్ల సంఖ్యను తగ్గించాలని సీఎం సూచించగా.. మద్యం పాలసీలో భాగంగా ఇప్పటికే 20 శాతం దుకాణాలను తగ్గించామని (4,380 దుకాణాలు 3,500కు కుదింపు), మద్య నియంత్రణ కార్యక్రమాన్ని దశల వారీగా చేపడుతున్నందున బార్ల సంఖ్యను కూడా దశల వారీగా తగ్గించుకుంటూపోతే బాగుంటుందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. చివరకు 797 బార్లలో 40 శాతం తగ్గించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 797లో 40 శాతం అంటే 319 బార్లు మూసివేయనున్నారు. ప్రస్తుత బార్ల విధానాన్ని రద్దు చేసి, నూతన విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఆ మేరకు ఇప్పుడున్న బార్ల సంఖ్యలో 40 శాతం తగ్గించి, మిగిలిన బార్లకు నూతన విధానం ప్రకారం కొత్తగా లైసెన్స్లు జారీ చేస్తారు. లాటరీ పద్ధతిలో బార్లను కేటాయించాలని నూతన విధానంలో చేర్చనున్నారు. అప్లికేషన్, లైసెన్స్ ఫీజులు భారీగా ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు. అంతిమంగా మద్య నిషేధం దిశగా అడుగులు వేయాలన్న మౌలిక లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాలని సూచించారు. మద్యం సరఫరా వేళల కుదింపు.. ధరల పెంపు బార్ల సంఖ్యను కుదించడంతోపాటు మద్యం సరఫరా వేళలను కూడా కుదించాలని సమావేశంలో నిర్ణయించారు. గత సమీక్షా సమావేశాల్లో ఇచ్చిన ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని బార్లలో మద్యం సరఫరా సమాయాన్ని రెండు గంటలు కుదించామని (ఉదయం, రాత్రి గంట చొప్పున) అధికారులు వివరించారు. ఉదయం 11 నుంచి రాత్రి 10 వరకు మాత్రమే మద్యం సరఫరాను అనుమతిస్తామని, రాత్రి 11 గంటల వరకు ఆహారాన్ని అనుమతిస్తామని చెప్పారు. స్టార్ హోటళ్లలో మాత్రం ఉదయం 11 నుంచి రాత్రి 11 వరకు మద్యం విక్రయించడానికి అనుమతి ఉంటుందన్నారు. బార్లలో అమ్మే మద్యం ధరలను పెంచాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చట్టానికి పదును నాటు సారా తయారీ, మద్యం స్మగ్లింగ్, కల్తీపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలన్నారు. ఆరు నెలల జైలు శిక్ష విధించేలా చట్టంలో సవరణలు తీసుకురావాలన్నారు. బార్ యజమానులు నియమాలను ఉల్లంఘిస్తే లైసెన్స్ ఫీజుకు 5 రెట్లు జరిమానా విధించాలన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లు తీసుకురావాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇసుక అక్రమాలకు పాల్పడితే రూ.2 లక్షల జరిమానాతో పాటు 2 ఏళ్ల జైలు శిక్ష విధించే నిర్ణయంపై కూడా చట్ట సవరణకు బిల్లు తీసుకురావాలని చెప్పారు. మద్యం, ఇసుక స్మగ్లింగ్లను అరికట్టడానికి చెక్పోస్టుల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేయాలన్నారు. రాత్రిళ్లు కూడా పనిచేసే సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం దుకాణాల వద్ద కూడా సీసీ కెమెరాలు ఉండాలని సీఎం ఆదేశించారు. జనవరి 1 నుంచి కొత్త మద్యం విధానం రాష్ట్రంలో కొత్త మద్యం విధానాన్ని జనవరి 1వ తేదీ నుంచి అమలులోకి తెస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి కళత్తూరు నారాయణస్వామి తెలిపారు. నూతన మద్యం విధానంపై సీఎం సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 40 శాతం బార్లను తగ్గించాక, మిగిలిన బార్లకు నూతన విధానం ప్రకారం రాజకీయ ఒత్తిడులకు తావులేని రీతిలో అనుమతులు ఇస్తామని తెలిపారు. -
మద్యం ధరలు పెంపు?
సాక్షి, హైదరాబాద్: త్వరలో రాష్ట్రంలో మద్యం ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదాయాన్వేషణలో భాగంగా మద్యం ధరల ను సవరించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కసర త్తు చేస్తోంది. ఈ మేరకు ముగ్గురు మంత్రు లతో కూడిన కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి మద్యం ధరలను నిర్ధారించే బాధ్యతలను అప్పగించబోతోందని ఎక్సైజ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సబ్కమిటీ ఏర్పాటు త్వరలోనే ఉంటుందని, ఈ కమిటీ సిఫారసుల మేరకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని ఆ శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ను బట్టి.. కొత్త మద్యం విధానం అమల్లోకి వచ్చిన వెంటనే మద్యం ధరల పెంపుపై కొంత కసరత్తు చేసిన ఎక్సైజ్ శాఖ ఇప్పటికే వివిధ రకాల మద్యం ధరలను 5–10 శాతం మేరకు పెంచే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటిని ఆమో దిస్తే ఏటా రూ. 1,200–1,700 కోట్ల వరకు అదనపు ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరుతుందని ఆ వర్గాల అంచనా. ఈ ప్రతిపాదనలను త్వరలోనే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లే అంశంపై మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎక్సైజ్ ఉన్నతాధికారులకు మధ్య ఇటీవల చర్చ జరిగిన ట్టు తెలుస్తోంది. సీఎం దృష్టికి తీసుకెళ్లిన అనంతరం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటవుతుందని, ఈ కమిటీ నిర్ధారించిన ధరలపై కేసీఆర్ తుది నిర్ణయం తీసుకుంటారని సమా చారం. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ను బట్టి మద్యం ధరల సవరణపై నిర్ణయం తీసుకోనున్నారు. త్వరలోనే ఎన్నికలు వస్తే అవి ముగిసిన తర్వాత సవరించాలని, మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్కు జాప్యం జరిగితే వీలున్నంత త్వరలో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. ఈవెంట్ల స్థాయిని బట్టి ఫీజు! కొత్త మున్సిపల్ చట్టం ద్వారా ఏర్పాటైన 73 మున్సిపాలిటీల్లో కూడా బార్ నోటిఫికేషన్ రానుంది. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. దీంతో పాటు రాజధాని తో పాటు శివార్లలో, రాష్ట్రంలోని ఇతర ప్రాం తాల్లో నిర్వహించే ఈవెంట్లను వర్గీకరించాలని, ఈవెంట్ల స్థాయిని బట్టి ఫీజును సవరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నేపథ్యం లో మద్యం ధరల పెంపు, కొత్త మున్సిపాలిటీల్లో బార్లకు నోటిఫికేషన్, ఈవెంట్ చార్జీల పెంపు ద్వారా వీలైనంత ఎక్కువ ఆదాయం రాబట్టుకునేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోనుందని ఎక్సైజ్ వర్గాలు అంటున్నాయి. -
ఎక్కడున్నా నాగులూరిని అరెస్టు చేస్తాం..
సాక్షి, ప్రకాశం : పశ్చిమ ప్రాంతంలో నాటుసారా సరఫరాలో కింగ్ మేకర్గా పేరు పొందిన నాగులూరి ఏసును ఎక్కడున్నా అరెస్టు చేసి తీరుతామని మార్కాపురం ఈఎస్ ఆవులయ్య హెచ్చరించారు. సోమవారం రాత్రి 120 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకొని నలుగురిని అరెస్టు చేసినట్లు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈఎస్ కథనం ప్రకారం.. పొదిలి సీఐ వెంకట్రావు ఆధ్వర్యంలో గోగినేనివారిపాలెం సమీపంలో 100 లీటర్ల నాటుసారా స్వా«దీనం చేసుకుని అరుణ్కుమార్, కోటేశ్ అనే ఇద్దరిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. వీరిని విచారణ చేయగా వచ్చిన సమాచారం మేరకు చీమకుర్తి మండలం గురవారెడ్డిపాలేనికి చెందిన షేక్ బీబీని అరెస్టు చేశారు. మరో వైపు విచారణలో సారా అమ్మకాలు సాగిస్తున్న పోలా ఏసును సింగరాయకొండ సీఐ లత ఆధ్వర్యంలో అరెస్టు చేశారు. వీరి నుంచి 20 లీటర్ల నాటుసారా, 75 కేజీల నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నారు. వీరికి కింగ్ మేకర్గా నాగులూరి ఏసు వ్యవహరిస్తున్నారు. నాగులూరి కుటుంబ సభ్యుల సహకారంతో విచ్చలవిడిగా నాటుసారా కేంద్రాలను గతంలో నిర్వహించారు. అతడిని పది రోజుల్లో అరెస్టు చేస్తామని ఈఎస్ ఆవులయ్య విలేకరుల సమావేశంలో హెచ్చరించారు. నాటుసారా తయారీని అరికట్టేందుకు తమ శాఖ కృత నిశ్చయంతో ఉందన్నారు. దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్ను నియమించినట్లు చెప్పారు. నాగులూరి ఏసు ఎక్కడ కనిపించినా తమకు సమాచారం ఇవ్వాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
నూతన విధానం
-
ఆ బార్లు 'ఏటీఎంలు'!
గుంటూరు నగరంలో గుంటూరు–విజయవాడ రాష్ట్ర రహదారి పక్కనే ఉన్న ఓ బార్లో అర్ధరాత్రి దాటినా అమ్మకాలు జరుగుతాయి. పార్సిల్ సేల్స్ పేరిట మద్యాన్ని బయటకు తరలించి, అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇక్కడే డైల్యూషన్స్, బ్రాండ్ మిక్సింగ్ జరుగుతున్నా ఎక్సైజ్ శాఖ చోద్యం చూస్తోంది. గుంటూరులో అర్ధరాత్రి దాటినా మద్యం ఎక్కడ దొరుకుతుందంటే ఈ బార్ గురించే మందుబాబులు ఠక్కున చెబుతారు. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో దశల వారీగా మద్య నిషేధంలో భాగంగా ప్రభుత్వం నూతన విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. మద్యం విక్రయాల సమయాన్ని కుదించారు. పర్మిట్ రూములను ఎత్తేశారు. లిక్కర్, బీరు బాటిళ్లు మూడుకు మించి కొనుగోలు చేసేందుకు అవకాశం లేదు. మద్యాన్ని ఆదాయ వనరుగా చూడొద్దని.. ప్రజారోగ్యం, శాంతిభద్రతలే ముఖ్యమని భావించిన ప్రభుత్వం తొలి ఏడాది మద్యం దుకాణాల సంఖ్యను 20 శాతం తగ్గించింది. మిగిలిన 3,500 దుకాణాలను ప్రభుత్వమే నిర్వహిస్తోంది. నిబంధనల ప్రకారమే విక్రయాలు సాగిస్తోంది. గతంలో మాదిరిగా ఎల్లవేళగా మద్యం దొరకడం లేదు. దీంతో మద్యం సిండికేట్లు బార్లపై దృష్టి పెట్టాయి. ప్రభుత్వ మద్యం దుకాణాలను రాత్రి 8 గంటలకు మూసేస్తున్నారు. తర్వాత మద్యం దొరకదు. ఇదే అదనుగా బార్ల నిర్వాహకులు అక్రమాలకు పాల్పడుతున్నారు. మందుబాబుల బలహీనతను సొమ్ము చేసుకుంటున్నారు. రాష్ట్రంలో 840 బార్లలో యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ప్రభుత్వ ఆశయానికి తూట్లు పొడుస్తున్నారు. పార్సిల్ సేల్స్ పేరిట బయటకు.. మద్యం సీసాలను బయటకు అమ్మకూడదనేది బార్ల లైసెన్సులో ప్రధాన నిబంధన. బార్ అండ్ రెస్టారెంట్ల నిర్వాహకులు పార్శిల్ సేల్స్ పేరుతో అధిక ధరలకు బయటకు విక్రయిస్తున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే పనిచేస్తాయి. బార్లలో రాత్రి 11 గంటల వరకు మద్యం సరఫరా చేస్తారు. రాత్రి 12 గంటలు దాటిన తర్వాత కూడా ఫుడ్ సర్వింగ్ పేరుతో అమ్మకాలు సాగుతున్నాయి. రెస్టారెంట్కు అన్ని అనుమతులు ఉంటేనే బార్ లైసెన్సు ఇస్తారు. రెస్టారెంట్ కూడా మున్సిపాలిటీ/కార్పొరేషన్ నిర్దేశించిన విధంగా నిర్మించాలి. దీనికి ట్రేడ్ లైసెన్సు ఉండాలి. ఇవేవీ లేకుండా బార్ నిర్వాహకులు రెస్టారెంట్ ఫుడ్ అమ్మకాల కంటే మద్యం విక్రయాలపైనే దృష్టి పెడుతున్నారు. వేళాపాళా లేకుండా ఇష్టం వచ్చిన ధరలకు అమ్మకాలు జరుపుతున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం మద్యం దుకాణాలు ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లిపోవడంతో సిండికేట్లు బార్లను ఆదాయ వనరుగా మార్చుకున్నాయి. బార్లలో మద్యాన్ని లూజు సేల్స్గా అమ్ముకోవచ్చు. దీంతో కొత్త దందాకు తెరతీశారు. మద్యంలో నీళ్లు కలిపి జనానికి అంటగడుతున్నారు. విచ్చలవిడిగా కల్తీ చేస్తున్నారు. బ్రాండ్ మిక్సింగ్ చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించే బార్లపై కేసులు ‘‘రాష్ట్రంలో బార్లపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న విషయం వాస్తవమే. ఎక్సైజ్ ఎన్ఫోర్సుమెంట్ విభాగం దాడులు చేసి, కేసులు నమోదు చేస్తోంది. పదేపదే ఉల్లంఘనలకు పాల్పడే బార్ల లైసెన్సులను రద్దు చేస్తాం. బార్లలో నిబంధనల ఉల్లంఘనల విషయంలో చూసీ చూడనట్లు వ్యవహరించే ఎక్సైజ్ అధికారులపై ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం’’ – ఎం.ఎం.నాయక్, ఎక్సైజ్ శాఖ కమిషనర్ -
కాపుసారాపై మెరుపు దాడులు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కాపుసారాను అరికట్టేందుకు కఠినంగా వ్యవహరించాలని అన్ని జిల్లాల డిప్యూటీ కమిషనర్లను ఎక్సైజ్ శాఖ ఆదేశించింది. ప్రత్యేక బృందాల ద్వారా ఈ వారం అంతా ఆకస్మిక దాడులు చేపట్టాలని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిర్ణయించారు. నాటుసారాపై ఫిర్యాదులు స్వీకరించి దాడులు చేసేందుకు ఎక్సైజ్ కమిషనరేట్లో 1800 425 4868 టోల్ ఫ్రీ నంబరుతోపాటు రెండు బెటాలియన్ల పోలీసులను సిద్ధం చేశారు. గ్రామ వలంటీర్లు, గ్రామ సచివాలయాల్లో నియమించిన మహిళా పోలీసుల సహకారంతో సారా మహమ్మారిని తరిమికొట్టాలని ఎక్సైజ్ యంత్రాంగాన్ని ఆదేశించారు. మూడు కేటగిరీలుగా విభజన రాష్ట్రంలోని 191 మండలాల్లో కాపుసారా ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. 682 గ్రామాల్లో కాపుసారా తయారీ, విక్రయాలు జోరుగా జరుగుతున్నట్లు ఎక్సైజ్ అధికారుల వద్ద సమాచారం ఉంది. తూర్పు గోదావరి, కర్నూలు, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో దీనిప్రభావం అత్యధికంగా ఉంది. కాపు సారా తయారీని ‘ఏ’ కేటగిరీ, విక్రయాలను ‘బి’ కేటగిరీ, సరఫరాను ‘సీ’ కేటగిరీగా విభజించారు. ఏ కేటగిరీలో 141 గ్రామాలు, బీ కేటగిరీలో 249 గ్రామాలు, సీ కేటగిరీలో 292 గ్రామాలున్నాయి. నాలుగు నెలల్లో 5,687 కేసులు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత నాలుగు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా కాపుసారా తయారీపై 5,687 కేసులు నమోదు చేసినట్లు ఎక్సైజ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 3,410 మందిని అరెస్ట్ చేసి కేసులు నమోదు చేశారు. అక్రమ మద్యం కేసులు అధికంగా అనంతపురం, కర్నూలు జిల్లాల్లో నమోదయ్యాయి. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కేవలం ఒక కేసు మాత్రమే నమోదు కావడం గమనార్హం. దాడుల్లో 378 వాహనాల్ని సీజ్ చేశారు. రెండు నెలల్లో నియంత్రిస్తాం రాష్ట్రంలో సారా అనేది లేకుండా చేయాలని సీఎంవో నుంచి ఆదేశాలు అందాయి. రెండు నెలల్లో కాపు సారాను నియంత్రించేలా కార్యాచరణ రూపొందించాం. ‘ఏ’ కేటగిరీ గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి తయారీదారుల సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. – ఎం.ఎం. నాయక్, ఎక్సైజ్ కమిషనర్ -
సారుకు సగం.. బార్లకు సగం..!
మద్య నిషేధానికి అడుగులు వేస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పాలసీ ఓ ఎక్సైజ్ అధికారికి కాసులు కురిపిస్తోంది. మద్యం పాలసీని పకడ్బందీగా అమలు చేయాల్సిన ఆయన.. ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారు. మద్యానికి ఆయనే ఓ రేటు నిర్ణయించి ఇష్టానుసారం అమ్మిస్తున్నాడు. ఇక బార్ల నిర్వాహకులతో చేతులు కలిపి మందుబాబులను భారీగా దోచేస్తున్నాడు. ఫలితంగా అనతి కాలంలోనే కోటీశ్వరుడయ్యారు. ఆయన పేరు ఏమంటే కదిరిలో ఎవరైనా ‘టఖీ’మని చెప్పేస్తారు. సాక్షి, కదిరి: నిరుపేదల రెక్కల కష్టం మద్యం షాపునకు కాకుండా వారి పిల్లల భవిష్యత్కు పెట్టుబడి కావాలని ముఖ్యమంత్రి భావించారు. అందుకే ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే మద్యనిషేధానికి తొలి అడుగులు వేశారు. ఈ క్రమంలోనే నూతన మద్యం పాలసీని తీసుకొచ్చారు. జిల్లా వ్యాప్తంగా 247 మద్యం దుకాణాలు ఉండగా.. 20 శాతం తగ్గిస్తూ 197కు పరిమితం చేశారు. అంతేకాకుండా సమయాన్ని కూడా తగ్గించేశారు. కానీ మద్యం పాలసీని పకడ్బందీగా అమలు చేయాల్సిన ఓ ఎక్సైజ్ అధికారి నిరుపేదల జేబుకు చిల్లు పెడుతూ తన పర్సు నింపుకుంటున్నారు. ప్రభుత్వ దుకాణంలోనే అదనం కదిరి ఎక్సైజ్ శాఖ పరిధిలో ప్రస్తుతం 9 మద్యం దుకాణాలున్నాయి. ఇందులో పనిచేసే సిబ్బందిని ఇటీవల ప్రభుత్వమే నియమించింది. వీటిపై పెత్తనం ఎక్సైజ్ శాఖకు ఉండటంతో ఓ అధికారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు మద్యం విక్రయించాలని దుకాణాల్లోని యువకులకు ఆదేశించారు. టిన్ బీర్పై ఎంఆర్పీ రూ.100 ఉండగా రూ.130లకు విక్రయిస్తున్నారు. ఇలా ప్రతి లిక్కర్ను అధిక ధరకు విక్రయిస్తుండగా.. మందుబాబులు లబోదిబోమంటున్నారు. దోపిడీ ‘బార్లా’ తెరిచారు కదిరి పట్టణంలో రెండు బార్లు ఉన్నాయి. ఆర్టీసీ బస్టాండ్కు సమీపంలో పీవీఆర్ బార్ అండ్ రెస్టారెంట్లో రోజుకు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వ్యాపారం జరుగుతోంది. ఆర్ఎస్ రోడ్లో ఉన్న చందు బార్ అండ్ రెస్టారెంట్లో రోజుకు రూ.3.50 లక్షల నుంచి రూ.4 లక్షల దాకా వ్యాపారం జరుగుతున్నట్లు ఎక్సైజ్ అధికారులే చెబుతున్నారు. నిబంధనల ప్రకారం పట్టణంలోని మద్యం దుకాణాలు రాత్రి 8 గంటలకు మూతపడగానే ఈ బార్లలో మద్యం వ్యాపారం రెట్టింపు అవుతుంది. ధరలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. రూ.100 టిన్ బీర్ రూ.150 అమ్ముతారు. రూ.130 ఉన్న నాకౌట్ బీర్ రూ.160 నుంచి రూ.180, కొరియర్ గ్రీన్ విస్కీ క్వాటర్ బాటిల్ రూ.230 ఉంటే రూ.300 అమ్ముతున్నారు. ఇలా ఏ బ్రాండ్ తీసుకున్నా ఫుల్ బాటిల్ మీద రూ.100 నుంచి రూ.300 దాకా అధికంగా వసూలు చేస్తున్నారు. సారుకు సగం.. బార్లకు సగం బార్లలో రాత్రి 8 తర్వాత జరిగే వ్యాపారంలో బార్ల నిర్వాహకులకు సగమైతే.. ఆ మిగిలిన సగం వాటా ఎౖక్సైజ్ సారుకు అందుతోంది. ఆ డబ్బు ఎప్పటికప్పుడు రోజూ ఆయనే స్వయంగా వెళ్లి కలెక్షన్ చేసుకుంటున్నారని సంబంధిత శాఖ సిబ్బందే చెబుతున్నారు. ఇలా మద్యం దుకాణాల ద్వారా అధిక ధరలకు మద్యం అమ్మినందుకు ఆయనకు రోజుకు రూ.లక్ష నుంచి రూ.1.20 లక్షలు దాకా వస్తోందని, ఆ రెండు బార్ల ద్వారా రోజూ ఆయనకు రూ.80 వేల నుంచి రూ.లక్ష దాకా అక్రమ ఆదాయం వస్తోందని తెలుస్తోంది. ఎక్సైజ్ నిబంధనలు తుంగలో తొక్కి ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్న సదరు ఎక్సైజ్ అధికారి అక్రమార్జనకు అడ్డూఅదుపు లేకుండా పోవడం స్థానికంగా చర్చనీయాంశమవుతోంది. -
టెంట్హౌస్లో అక్రమ మద్యం పట్టివేత
పీఎం పాలెం(భీమిలి): ప్రైవేటు మద్యం దుకాణాల గడువు ముగిసిన తరువాత కూడా మద్యాన్ని ప్రభుత్వానికి అప్పగించకుండా అక్రమంగా వ్యాపారం కొనసాగిస్తున్న వారి ఆటకట్టించారు ఎక్సైజ్, టాస్క్ఫోర్సు అధికారులు. పోతినమల్లయ్యపాలెం సమీపంలోని హౌసింగ్ బోర్డు కాలనీలోని ఓ టెంట్హౌస్ కేంద్రంగా జరుగుతున్న ఈ బాగోతాన్ని బట్టబయలు చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన రూ.3 లక్షల విలువైన మద్యాన్ని స్వాదీనం చేసుకుని ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఎక్సైజ్శాఖ అధికారులు వెల్లడించిన వివ రాలు ఇలా ఉన్నాయి. మదురవాడలో ఆర్కే నా యుడు వైన్స్, నర్సింగ్ వైన్స్, మిథులాపురి లే అవుట్లోని శ్రీసాయి వైన్స్ లైసన్స్లు ప్రభుత్వ నూతన మద్యం పాలసీ ప్రకారం సెప్టంబర్ 30తో ముగిశాయి. ఆయా దుకాణాల్లో ఉన్న లిక్కర్, బీ ర్లు ఏపీఎస్బీసీఎల్కు అప్పగించాల్సి ఉంది. అయితే సెప్టెంబర్ 30 నాటికి తమ వద్ద ఉన్న సరకు అంతా అమ్ముడుపోయిందని ఆయా దుకాణాల యజమానులు అధికారులకు తప్పుడు లెక్క లు చూపారు. అనంతరం మద్యాన్ని టెంట్హౌస్కు తరలించారు. ఆయా మద్యాన్ని మదురవాడ ప్రాంతంలోని బెల్ట్ దుకాణాలకు గుట్టుగా తరలించి అధిక ధరలకు అమ్మకాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఓ వ్యక్తి మోటర్ సైకిల్పై రెండు కేసుల మద్యాన్ని తరలిస్తుండగా టెంట్హౌస్కు సమీపంలో మాటు వేసిన ఎక్సైజ్, టాస్క్ఫోర్స్ విభాగం సిబ్బంది తడ్ని అదుపులోకి తీసుకు ని విచారించారు. అతడు చెప్పిన సమాచారంతో టెంట్హౌస్కు వెళ్లి పరిశీలించగా అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం బయటపడింది. 42 కేసుల బీర్లు, 19 కేసుల బ్రీజర్లు, వివిద రకాల బ్రాండ్ల లిక్కర్ 88 కేసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు బంకా నర్శింగరావు, వి.పుల్లాజీ, ప్రసాద్, రామకృష్ణ, మన్మధరావు, సోంపాత్రుడులను అరెస్ట్ చేశా రు. ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ ఎన్.అన్నపూర్ణ, సహాయ సూపరింటెండెంట్ ఆర్.ప్రసాద్ ఆధ్వర్యంలో సీఐ దొర, ఎస్ఐ బాబూరావు, సి బ్బంది దాడుల్లో పాల్గొన్నారు. అక్రమ మద్యం ప ట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సీఐ, ఎస్ఐలను ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు.