ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు హాల్టింగ్‌ ఇవ్వండి: ఈటల | Etela Rajender Request To Central Railway Minister  | Sakshi
Sakshi News home page

ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు హాల్టింగ్‌ ఇవ్వండి: ఈటల

Published Tue, Jun 5 2018 2:39 AM | Last Updated on Tue, Jun 5 2018 2:39 AM

Etela Rajender Request To Central Railway Minister  - Sakshi

ఈటెల రాజేందర్‌

సాక్షి, న్యూఢిల్లీ: పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు రాష్ట్రంలో హాల్టింగ్‌ సదుపాయం కల్పించాలని కేంద్ర రైల్వే మంత్రి పియూష్‌ గోయల్‌ను మంత్రి ఈటల రాజేందర్‌ కోరారు. ఈటల నేతృత్వంలోని ఎంపీలు వినోద్‌ కుమార్, కొండా విశ్వేశ్వరరెడ్డి బృందం సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముంబై–నిజామాబాద్‌ రైలును కరీంనగర్‌ వరకు పొడిగించాలని వినతిపత్రాన్ని అందజేశారు. అంతేకాకుండా కాగజ్‌నగర్‌–సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఉప్పల్‌లో, ఇంటర్‌సిటీ, పట్నా ఎక్స్‌ప్రెస్‌కు జమ్మికుంటలో హాల్టింగ్‌ ఇవ్వాలని కోరారు. మరోవైపు రాష్ట్రంలో చేపడుతున్న ఫ్లైఓవర్ల నిర్మాణాలకు రైల్వే శాఖ నుంచి రావాల్సిన అనుమతులను త్వరగా మంజూరు చేయాలని ఈటల కోరారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement