ఫైరింజిన్..మొరాయించెన్! | fire accident | Sakshi
Sakshi News home page

ఫైరింజిన్..మొరాయించెన్!

Mar 31 2014 1:13 AM | Updated on Sep 5 2018 9:45 PM

మంటలను అదుపుచేసేందుకు వచ్చిన ఫైరింజిన్లే మొరాయిస్తే..పరిస్థితి అగమ్యగోచరమే.

నార్కట్‌పల్లి, న్యూస్‌లైన్ : మంటలను అదుపుచేసేందుకు వచ్చిన ఫైరింజిన్లే మొరాయిస్తే..పరిస్థితి అగమ్యగోచరమే. అలాంటి సంఘటనే ఇది. నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల గ్రామంలోని మునుగోడు రోడ్డులో వ్యవసాయ భూముల వద్ద విద్యుత్ మెయిన్ వైరు ఆదివా రం మధ్యాహ్నం తెగిపడింది. ఆ ప్రాంతంలోని పత్తి, కందిచేలు, గడ్డివాములకు మంటలు అంటుకున్నాయి.
 
 
 గాలి తోడవడంతో దాదాపు 15 ఎకరాల మేర మంటలు పాకాయి. గమనించిన స్థానికులు నల్లగొండ అగ్నిమాపక కేంద్రానికి ఫోన్‌చేయగా రెండు ఫైరింజిన్లు వ చ్చాయి. ఫైరింజిన్లు ఘటన స్థలానికి చేరుకున్న తర్వాత చాలా సేపు మొరాయించాయి. ఇంజన్ల వైపు మంటలు వస్తుండడంతో స్థానికులు వాటిని కాపాడేందుకు ఎక్కువగా శ్రమించా రు. చివరకు మూడు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement