శ్రీకాంత్ చారి కుటుంబాన్నిపరామర్శించిన గద్దర్
Published Fri, Jun 2 2017 1:15 PM | Last Updated on Tue, Sep 5 2017 12:40 PM
మోత్కూరు: తెలంగాణ అమరవీరుడు, మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలిసారి ప్రాణాలు త్యాగం చేసిన శ్రీకాంత్ చారి కుటుంబాన్ని గద్దర్ పరామర్శించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పుడిచేడు గ్రామంలోని వారి ఇంట్లో అమరజ్యోతి వెలిగించి శ్రద్ధాంజలి ఘటించారు. శ్రీకాంత్ చారి ఆశయాల కోసం పోరాటం చేస్తామని ఈ సందర్భంగా గద్దర్ తెలిపారు.
Advertisement
Advertisement