‘సీఎం మానవీయతకు ప్రతీకలే గురుకులాలు’ | Gangula Kamalakar Comments on Gurukul School In Telangana | Sakshi
Sakshi News home page

‘సీఎం మానవీయతకు ప్రతీకలే గురుకులాలు’

Sep 16 2019 3:47 AM | Updated on Sep 16 2019 4:01 AM

Gangula Kamalakar on Gurukul School In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గురుకులాల స్థాపనలో సీఎం కేసీఆర్‌ మానవీయ కోణాన్ని గంగుల ఆవిష్కరించారు. దేశంలో మరెక్కడాలేని విధంగా బీసీలకోసం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు బీసీల బతుకుల్లో వెలుగులు నింపుతున్నాయన్నారు. మంత్రి ప్రసంగానికి సభ్యులు తమ చప్పట్లతో హర్షాతిరేకాన్ని ప్రకటించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణలో బీసీ బిడ్డలకోసం ఏర్పాటయిన గురుకులాలు సీఎం గారి మానవత్వానికి నిదర్శనాలన్నారు. మంత్రిగా గంగుల తొలి ప్రసంగం అందరినీ ఆకట్టుకున్నది. ‘అధ్యక్షా... ఒక బీసీ బిడ్డగా గురుకులాలకు సంబంధించిన ప్రశ్నకు సమాధానం ఇవ్వడం నా అదృష్టం. సీఎం నిర్ణయం కారణంగానే 19గా ఉన్న గురుకులాలు, తెలంగాణ ఏర్పడిన తర్వాత 261కి పెరిగాయి. సభ్యులు ఎగ్గె మల్లేశం, పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రశ్నలకు గంగుల బదులిచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement