పింఛనీయండి సారూ..! | Give the pention sir | Sakshi
Sakshi News home page

పింఛనీయండి సారూ..!

Published Tue, Jun 21 2016 3:07 AM | Last Updated on Thu, Aug 9 2018 8:51 PM

పింఛనీయండి సారూ..! - Sakshi

పింఛనీయండి సారూ..!

కరీంనగర్: ఈమె కోమిడి రాధమ్మ. వయసు అరవై ఏళ్లు. ఊరు కరీంనగర్ జిల్లా కదిపికొండ. భర్త కోమిడి వెంకట్‌రెడ్డి. స్వాతంత్య్ర సమరయోధుడు. అనారోగ్యంతో భర్త మరణించిన తరువాత రెండేళ్ల వరకు ఆయన పింఛన్ రాధమ్మకు వచ్చింది. కుటుంబానికి ఇదే ఆధారం. కానీ ఏం జరిగిందో తెలియదు... సర్కారోళ్లు ఐదేళ్లుగా ఆమె పింఛన్ నిలిపివేశారు. ఏమిటని అడిగితే స్పందించిన అధికారి లేడు. ఎంపీ వినోద్ లెటర్ సాయంతో ఢిల్లీలో పెన్షన్ ఆఫీసుకు వెళితే... హైదరాబాద్‌కు పంపిస్తాం వెళ్లమని అక్కడి అధికారులు చెప్పారు. అయినా రాధమ్మకు నేటికీ పెన్షన్ అందలేదు. సీఎంను కలసి తన గోడు వినిపించుకొందామని సోమవారం సచివాలయానికి వచ్చారు.

కానీ లోపలికి వెళ్లేందుకు అధికారులు అనుమతించలేదు. ‘రాత్రి నుంచి జ్వరం. పొద్దుటి నుంచి తిండి ముట్టలేదు. నా బాధ ఎవరితో చెప్పుకోవాలి? భర్త చనిపోయినప్పటి నుంచీ బతుకు భారమైపోయింది. చనిపోవాలనిపిస్తోంది’ అంటూ సచివాలయంలో మీడియా ప్రతినిధుల ముందు రాధమ్మ కంటనీరు పెట్టుకున్నారు. ఓ ప్రమాదంలో గాయపడ్డ తన కుమారుడికి భార్య, ఇద్దరు పిల్లలు. ప్రైవేట్లు చెప్పుకుని చాలీచాలని జీతంతో బతుకీడుస్తున్న అతడికి భారం కాకూడదని తాను విజయవాడ సమీపంలోని ఓ అనాథ ఆశ్రమంలో తలదాచుకొంటున్నానని, తనకు పింఛన్ ఇప్పించాలని ఆమె దీనంగా వేడుకోవడం అక్కడి వారిని కదిలించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement