Boinapally Vinod Kumar
-
ఉద్యోగాలిచ్చి కూడా చెప్పుకోలేకపోయాం: వినోద్కుమార్
సాక్షి,హైదరాబాద్:బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ ఉద్యోగాలిచ్చి కూడా ప్రచారం చేసుకోకపోవడం వల్లే నష్టపోయామని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సీనియర్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. తెలంగాణ భవన్లో వినోద్కుమార్ గురువారం(అక్టోబర్10) మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని విమర్శించారు. తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ గురి పెట్టిన చరిత్ర రేవంత్రెడ్డిది. మార్కెటింగ్లో మాత్రం ఆయనను మించినవాడు లేడు. మలిదశ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన చరిత్ర నాకుంది. నాకెవవరూ ఉద్యోగం ఇవ్వలేదు. నేను స్వయంగా అడ్వకేట్ను. నేను తెలంగాణ వాదిని. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని రేవంత్రెడ్డి గతంలో చెప్పాడు. ఎన్నికల హామీ మేరకు డిసెంబర్ నాటికి 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. కేసీఆర్ ప్రభుత్వం లక్షా 60వేల ఉద్యోగాలు నింపలేదని భట్టి చెప్పగలరా? ఖాళీగా ఉన్న ఉద్యోగాలను గుర్తించే బాధ్యతను ఎమ్మెల్సీ కోదండరాం తీసుకోవాలి.జేఏసీని నడిపిన అనుభవం ఉన్న కోదండరాం.. సీఎం రేవంత్కు ఉద్యోగాలపై సమాచారం ఇవ్వాలి. రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో కూడా ప్రభుత్వం దగ్గర సమాచారం లేదు. నియామక పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని రేవంత్ రాజకీయ సభల మాదిరి నిర్వహిస్తున్నారు.ఉద్యోగాల నియామకం ఎలా జరుగుతుందో కూడా మంత్రులు భట్టి, పొన్నంకు తెలియదు.బీఆర్ఎస్ హాయాంలో ఒక లక్షా 61వేల 572మందికి ఉద్యోగాలు ఇచ్చాం.కేసీఆర్ సీఎంగా ఇచ్చిన ఉద్యోగాలకు రేవంత్ రెడ్డి నియామక పత్రాలు ఇస్తున్నారు.కేసీఆర్ హాయాంలో నింపిన ఉద్యోగాల సమాచారం.. మంత్రులకే తెలియకపోవడం దౌర్భాగ్యం’అని వినోద్కుమార్ అన్నారు.కేసీఆర్ హయాంలో ‘2014 నుంచి 2023’ వరకు జరిగిన ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు ఇవే..ఇదీ చదవండి: కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం దావా -
చంద్రబాబుపై బీఆర్ఎస్ నేత సంచలన వ్యాఖ్యలు
సాక్షి, కరీంనగర్: చంద్రబాబు నాయుడిపై బీఆర్ఎస్ సీనియర్ నేత, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో గనుక చంద్రబాబు గెలిస్తే తన శిష్యుడితో హైదరాబాద్ను ఉమ్మడి రాజధాని చేస్తాడని అన్నారు. వినోద్ కుమార్ కరీంగనగర్లో మంగళవారం మీడియాతో మాట్లాడారు.‘హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు దగ్గర పడింది. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీతో పొత్తు పెట్టుకుని హైద్రాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తాడు. బీజేపీ ఆలోచనలు కూడా హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాలన్నట్టుగానే సాగుతున్నాయి. పార్లమెంట్లో గళం విప్పాలంటే నేను గెలువాలి. బండి సంజయ్ బీజేపీ కుర్చోమంటే కూర్చుంటూ.. లెమ్మంటే లేచే వ్యక్తి’ అని మండిపడ్డారు. -
కరీంనగర్ లోక్సభ సెగ్మెంట్: నెగిటివ్ ప్రచారం కొత్త పుంతలు!
ఎన్నికల టైమ్లో ప్రత్యర్థుల లోపాలు వెతికి నెగిటివ్ ప్రచారం చేయడం మామూలే. కాని కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఈ నెగిటివ్ ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోందని టాక్. మూడు పార్టీల ప్రధాన నేతలు ఎదుటివారి మైనస్లను పట్టుకుని ప్రచారం చేస్తున్నారు. వ్యక్తిగత ప్రచారాలను ఆపడానికి ఏకంగా పోలీసుల ఫిర్యాదుల వరకు వెళుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల ముంగిట ప్రత్యర్థి నేతల విమర్శలు, ప్రతి విమర్శలతో రచ్చ రచ్చగా మారుతోంది. ఈ నాయకులు చేస్తున్న ఆరోపణలేంటి? ఆ నేతలు ఎవరు? గులాబీ పార్టీ తరపున కరీంనగర్ లోక్సభ స్థానానికి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ మరోసారి పోటీ చేస్తారని వినిపిస్తోంది. ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ఆయనైతే ప్రచారంలో నిమగ్నమైపోయారు. ఇదిలా ఉంటే..వినోద్కుమార్కు సమీప బంధువు ఒకరికి జెన్కోలో ఉద్యోగం ఇప్పించారంటూ సోషల్ మీడియాలో జరిగిన రచ్చ... ఆ మాజీ ఎంపీ మనస్సును తీవ్రంగా గాయపర్చింది. తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ.. వినోద్ ఓ ప్రెస్ మీట్ నిర్వహించి వివరణ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో క్యాష్ చేసుకునేందుకే తనను బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరైతే జెన్కోలో ఉద్యోగం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారో ఆ వ్యక్తి ఇంటి పేరు.. తన ఇంటి పేరూ ఒకటైనంత మాత్రాన తన బంధువని ఎలా అంటారంటూ ఫైరయ్యారు వినోద్. బండి సంజయ్ తన అనుచరులతో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో తనను ఎదుర్కోలేక బీజేపీ, కాంగ్రెస్లు ఏకమై తన మీద దుష్ప్రచారం చేస్తున్నాయన్నది బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ వాదన. అయితే ఈ రచ్చ అంతటితో ఆగలేదు. వినోద్ విమర్శలపై బీజేపీ నేతలు కూడా కౌంటర్ అటాక్ ప్రారంభించారు. ఈ ఇద్దరు నేతల మాటల యుద్ధం పార్లమెంట్ ఎన్నికల ముంగిట కరీంనగర్ లో పొలిటికల్ హీట్ను బాగా పెంచాయి. బంధుప్రీతి లేకుంటే కరీంనగర్ మేయర్ గా సునీల్ రావు ఎలా అయ్యాడని.. కరీంనగర్ కార్పొరేషన్లో అవినీతి ఎలా రాజ్యమేలుతుందో చెప్పాలంటూ బీజేపీ నేతలు పలు అంశాలపై ప్రశ్నలు సంధించారు. వినోద్ ప్రమేయం లేకుంటే ఆయనెందుకంత ఉలికి పడుతున్నారో చెప్పాలని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా మరోసారి గెలవాలన్న తలంపుతో అందరికంటే ముందస్తుగానే బండి సంజయ్ తన వ్యూహాల్ని తాను రచించుకుంటున్నారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థిగా ఇప్పటివరకూ వినోద్ పేరే వినిపిస్తుండటం.. ఆయనే పార్లమెంట్ సెగ్మెంట్ మొత్తం కలియ తిరుగుతుండటంతో.. ఇప్పటివరకు వీరిద్దరి మధ్యే గట్టి పోటీ కనిపిస్తోంది. ఇక కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సోదరుడైన శ్రీనుబాబుతో పాటు.. ఈటల రాజేందర్ పేరు కూడా ప్రచారంలోకొస్తున్నాయి. బరిలోకి దిగే అభ్యర్థిని బట్టి కరీంనగర్లో జరగబోయేది ముఖాముఖీ పోటీనా.. లేక, ముక్కోణపు పోటీనా అన్నది తేలుతుంది. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల పేర్లు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే బీజేపీ తరపున సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్, బీఆర్ఎస్ తరపున మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్లు మరోసారి తలపడతారని తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి కూడా ఎవరో తేలితే ఇక కరీంనగర్ హీట్ మామూలుగా ఉండదంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. చదవండి: బీజేపీ, కాంగ్రెస్ మళ్లీ కలిసి పని చేయబోతున్నాయి: కేటీఆర్ -
ప్రతీ 600 మందికి ఒక వైద్యుడు
సాక్షి, హైదరాబాద్: ప్రతీ జిల్లాకు వైద్య కళాశాల ఏర్పాటు చేయడం వల్ల రాబోయే రోజుల్లో తెలంగాణలో ప్రతీ 600 మందికి ఒక డాక్టర్ ఉంటారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. హైదరాబాద్లో మంగళవారం జరిగిన అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఏఐఎఫ్టీవో) జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యా రంగానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోందని, వెయ్యికి పైగా రెసిడెన్షియల్ కాలేజీలు ఏర్పాటు చేసిందని, ప్రతీ విద్యార్థిపై ఏడాదికి రూ.1.20 లక్షలు ఖర్చు చేస్తోందని తెలిపారు. విదేశాల్లో చదివే పేద విద్యార్థులకు రూ.20 లక్షలు అందిస్తోందన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన ఏఐఎఫ్టీవో జాతీయ అధ్యక్షుడు అశ్వినికుమార్ మాట్లాడుతూ.. ఉద్యోగులకు నష్టం కలిగిస్తున్న కాంట్రి బ్యూటరీ పెన్షన్ విధానానికి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఉద్యమ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో సంఘం సెక్రటరీ జనరల్ చగన్లాల్ రోజ్, జాతీయ ఉపాధ్యక్షుడు పి. శ్రీపాల్రెడ్డి, ఎమ్మెల్సీ కూర రఘోత్తమరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్రావు పాల్గొన్నారు. -
రైల్వేలో ఖాళీగా ఉన్న 3 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలి
సాక్షి, హైదరాబాద్: రైల్వే శాఖలో వివిధ కేటగిరీలలో ఖాళీగా ఉన్న 3,15,823 ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రైల్వేశాఖలో ఉన్న ఖాళీ ఉద్యోగాల జాబితాను రాజ్యసభలో కేంద్ర రైల్వేమంత్రి అశ్విన్ వైష్ణవ్ విడుదల చేశారని, ఇందులో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనే 17,134 వివిధ కేటగిరీల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వివరించారు. రాష్ట్రం నుంచి ఎన్నికైన నలుగురు బీజేపీ ఎంపీలు ఖాళీగా ఉన్న రైల్వే ఉద్యోగాల భర్తీ కోసం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రానికి చెందిన నిరుద్యోగులు రైల్వే ఉద్యోగాలు పొందే విధంగా బీజేపీ ఎంపీలు కృషి చేయాలని సూచించారు. కేంద్రం వెంటనే రైల్వే శాఖతో పాటు ఇతర శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం చర్యలు తీసుకోవాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. -
ఒక్క గుజరాత్కే కేంద్రం నిధులా..?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాలకు కేంద్ర నిధులను విడుదల చేసే విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివక్ష చూపుతున్నారని, కేవలం గుజరాత్ రాష్ట్రానికే నిధుల మంజూరు విషయంలో పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ విమర్శించారు. 9 నెలల కాలంలో ఒక్క గుజరాత్ రాష్ట్రానికే రూ.1,37,655 కోట్ల విలువైన ప్రాజెక్టులు, పరిశ్రమలు, ఇతర పనులకు ప్రధాని మోదీ కేంద్ర నిధులు మంజూరు చేశారని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ దాదాపు 40 సార్లు రాష్ట్రంలో పర్యటించి నిధుల వరద పారించారని తెలిపారు. ఇతర రాష్ట్రాలకు నిధులు మంజూరు చేసే విషయంలో మాత్రం మోదీ వివక్ష చూపుతున్నారన్నారు. ప్రధాని హోదాలో దేశంలోని అన్ని రాష్ట్రాలకు సమానంగా చూడాల్సిన మోదీ, ఒక్కో రాష్ట్రాన్ని ఒక్కో రకంగా చూడటం ప్రజాస్వామ్య మనుగడకు మంచిది కాదన్నారు. -
తెలంగాణ పంచాయతీరాజ్ గ్రూప్ ఏర్పాటు చేయాలి
దిల్సుఖ్నగర్: ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్ (ఐపీజీ) తరహాలోనె తెలంగాణ పంచాయతీరాజ్ గ్రూపును ఏర్పాటు చేయాల్సిన అవశ్యకత ఉందని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. పార్లమెంట్ స్పీకర్ అధ్యక్షుడుగా ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్ 1949లో ఏర్పాటు అయిందని, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ఈ గ్రూప్కు ఆద్యులని తెలిపారు. బీజేఆర్ భవన్లో స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అథితిగా పాల్గొని మాట్లాడారు. స్థానిక సంస్థల ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులు కలిసి తెలంగాణ పంచాయతీరాజ్ గ్రూప్ను చట్టబద్ధంగా ఏర్పాటు చేయాలని సూచించారు. పంచాయతీరాజ్ చట్టాలు, ప్రభుత్వ ఉత్తర్వులపై ఎప్పటికప్పుడు సమీక్షలు, అప్పుడప్పుడు సెమినార్లు, అంతర్జిల్లాల స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చలు జరిపి, ఆయా అంశాలను ఎంపీలు, ఎమ్మేల్యేలు, ఎమ్మేల్సీల దృష్టికి తీసుకొని రావాలన్నారు. ప్రజాప్రతినిధులు సోషల్ ఇంజనీర్లని, సమాజ నిర్మాణంలో వారి పాత్ర కీలకమని అభిప్రాయపడ్డారు. -
ప్రముఖులతో పాఠాలు
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ విద్యార్థులకు తరగతి గదుల్లో పాఠ్యపుస్తకాల చదువులను తగ్గించి, సామాజిక అవగాహన మేళవించి సరికొత్త బోధనను అందుబాటులోకి తేనున్నారు. రాజకీయ ప్రముఖులు, ఆర్థికవేత్తలు, మాజీ ఐఏఎస్లు, ఇతర మేధావులతో పాఠాలు చెప్పించబోతున్నారు. ఈ దిశగా తెలంగాణ ఉన్నత విద్యా మండలి బీఏ ఆనర్స్ కోర్సులను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెస్తోంది. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ మంగళవారం హైదరాబాద్ కోఠి ఉమెన్స్ కాలేజీలో ఈ కొత్త కోర్సును లాంఛనంగా ప్రారంభించారు. ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న కోఠి ఉమెన్స్ కాలేజీలో బీఏ ఆనర్స్ (పొలిటికల్), నిజామ్ కాలేజీలో బీఏ ఆనర్స్ (ఎకనామిక్స్)ను అమలు చేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఈ విద్యా సంవత్సరం నుంచే మొదలుపెట్టనున్న ఈ కోర్సులో ఒక్కో కాలేజీలో 60 సీట్లు ఉంటాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న దోస్త్ మూడో దశ కౌన్సెలింగ్లో వీటిని చేరుస్తారు. రెండు కాలేజీల్లో లభించే ఆదరణను బట్టి రాష్ట్రవ్యాప్తంగా కోర్సును విస్తరించే వీలుందని మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. ప్రస్తుతానికి మూడేళ్ల కాలపరిమితితోనే కోర్సు ఉంటుందని, మున్ముందు నాలుగేళ్లకు పెంచుతామని అధికారులు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణీదేవీ, ఉన్నత విద్య కమిషనర్ నవీన్ మిట్టల్, ఉస్మానియా విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ రవీందర్, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకట రమణ పాల్గొన్నారు. కోర్సు లక్ష్యం ఇదీ.. ఉమ్మడి రాష్ట్రంలో కొన్నేళ్ల క్రితం బీఏ ఆనర్స్ కోర్సును సమర్థవంతంగా నిర్వహించారు. అప్పట్లో ఈ కోర్సు చేసిన వారికి ఇంటర్మీడియెట్ బోధించే అర్హత కూడా ఉండేది. సైన్స్ కోర్సుల ప్రాధాన్యం పెరగడంతో ఆనర్స్ తెరమరుగైంది. సంప్రదాయ బీఏ కోర్సుల్లో చేరే వారి సంఖ్య 16 శాతానికి పరిమితమైంది. మరోవైపు ఇతర రాష్ట్రాల్లో బీఏ చదివే వారి సంఖ్య పెరుగుతోంది. అదీగాక ఈ కోర్సు కోసం ఇక్కడి నుంచి విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణలోనూ అందుబాటులోకి తెస్తున్నారు. సామాజిక అవగాహన పెంచడమే దీని ముఖ్య ఉద్దేశమని ఉన్నత విద్యామండలి తెలిపింది. పాఠ్యపుస్తకాల్లో అంశాలకు 50 శాతం మార్కులిస్తే, సామాజిక అవగాహనకు మరో 50 మార్కులు ఇస్తారు. ఆనర్స్ కోర్సును వ్యాపారం కాకుండా, ప్రభుత్వ కాలేజీల్లో నిర్వహిస్తే బాగుంటుందని వినోద్కుమార్ సలహా ఇచ్చారు. సమాజాన్ని అర్థం చేసుకోకపోతే అది చదువే కాదని, దీన్ని గుర్తించే ఆనర్స్ తెస్తున్నట్టు తెలిపారు. -
కేసీఆర్ వెంటే మేము.. మంత్రి హరీశ్, బి. వినోద్ రాకతో..
సాక్షి, హైదరాబాద్/కమలాపూర్: టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే కొనసాగుతామని హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలానికి చెందిన ఆ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. ఈ మేరకు వారు మంత్రి హరీశ్రావు, మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్కుమార్లతో శనివారం హైదరాబాద్లో భేటీ అయ్యారు. భేటీ అయినవారిలో కమలాపూర్ ఎంపీపీ తడక రాణీ శ్రీకాంత్, పీఏసీఎస్ చైర్మన్ పేరాల సంపత్రావు, డీసీసీబీ డైరక్టర్ పి.కృష్ణప్రసాద్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వారికి హరీశ్, వినోద్ కౌన్సెలింగ్ నిర్వహించారు. ‘పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న మీరందరూ అధినేత కేసీఆర్ నిర్ణయాన్ని గౌరవించి టీఆర్ఎస్ వెంటే నడవండి. పార్టీ మీకు అన్నివిధాలా అండగా నిలబడుతుంది. ఈటల రాజేందర్ పట్ల ఎవరికీ వ్యక్తిగతంగా ద్వేషం లేదు. కానీ, పార్టీకి నష్టం చేసే కార్యకలాపాలు చేసినందు వల్లే ముఖ్యమంత్రి ఆయనను మంత్రి పదవి నుంచి భర్తరఫ్ చేశారు’అని పేర్కొన్నారు. అనంతరం కమలాపూర్ నేతలు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఆవిర్భావం నుంచి టీఆర్ఎస్లో ఉన్నామని, రెండో ఆలోచనకు తావు లేకుండా తాము టీఆర్ఎస్ నీడలోనే పనిచేస్తామని స్పష్టం చేశారు. పార్టీ కేడర్ అంతా కేసీఆర్ వెంటే నడుస్తుందని, నియోజకవర్గ అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కొనసాగుతున్న మంతనాలు పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇన్చార్జీలుగా పనిచేస్తున్న నేతలు కేడర్తో మంతనాలను ముమ్మరం చేశారు. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, కరీంనగర్ మేయర్ సునీల్రావు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావులు పార్టీ ప్రజాప్రతినిధులు, వివిధ స్థాయిల నేతలెవరూ మాజీమంత్రి ఈటల వైపు వెళ్లకుండా కౌన్సెలింగ్ చేస్తున్నారు. జిల్లాస్థాయిలో మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్రస్థాయిలో హరీశ్, వినోద్కుమార్లు నేతలతో మాట్లాడి నచ్చచెబుతున్నారు. ఇదిలా ఉండగా, శుక్రవారం సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటన సందర్భంగా ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసానికి వెళ్లారు. వారి మధ్య హుజూరాబాద్ నియోజకవర్గ రాజకీయాలు ప్రస్తావనకు వచ్చి ఉంటాయని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. -
టీఆర్ఎస్ కేడర్ కట్టడికి కమిటీ.. రంగంలోకి మంత్రి హరీశ్ రావు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ను ఏకాకిని చేయడం లక్ష్యంగా సాగుతున్న పరిణామాల్లో మరింత వేడి పెరిగింది. ఇప్పటికే ఈటల అనుకూల, ప్రతికూల వర్గాలుగా హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో కేడర్ చీలిపోయింది. ప్రతికూల వర్గం నేతలు తాము పార్టీ వెంటే ఉంటామని ప్రకటనలు చేస్తుండగా, అనుకూల నేతలు ఈటల రాజేందర్ వెంట నడుస్తామని తేల్చి చెబుతున్నారు. మంగళవారం నుంచి 3 రోజుల పాటు నియోజకవర్గంలో మకాం వేయాలని ఈటల నిర్ణయించారు. దీంతో రాజకీయ విమర్శలు ఊపందుకోవడంతో పాటు, అనుకూల ప్రతికూల వర్గాల నడుమ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. పార్టీ కేడర్పై పట్టు సాధించేందుకు అటు టీఆర్ఎస్, ఇటు ఈటల పావులు కదుపుతుండటంతో హుజూరాబాద్లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. కేడర్పై పట్టు కోసం కమిటీ ఇప్పటికే మంత్రి గంగుల కమలాకర్ హుజూరాబాద్ నియోజకవర్గ రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించి టీఆర్ఎస్ కేడర్పై పట్టు బిగిస్తున్నారు. దీంతో ఈటల, గంగుల పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకుంటుండటంతో కరీంనగర్ జిల్లా రాజకీయం వేడెక్కుతోంది. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీకి ఈటల రాజీనామా చేసినా కేడర్ చెక్కు చెదరకుండా ఉండాలని పార్టీ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. ఈ మేరకు అంతర్గత కమిటీ ఏర్పాటు చేశారు. రాష్ట్రస్థాయిలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్కుమార్, కరీంనగర్ జిల్లా స్థాయిలో గంగుల కమలాకర్.. పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేయనున్నారు. వీరితో పాటు క్షేత్ర స్థాయిలో మరో నలుగురు ముఖ్య నేతలకు కూడా హుజూరాబాద్ బాధ్యతలు అప్పగించారు. క్షేత్ర స్థాయి కేడర్తో మంతనాలు.. హుజూరాబాద్ నియోజకవర్గంలోని మున్సిపాలిటీలు, మండలాలకు నలుగురు ముఖ్య నేతలను ఇన్చార్జిలుగా నియమించారు. హుజూరాబాద్లో కరీంనగర్ మేయర్ సునీల్రావు, ఇల్లంతకుంట, జమ్మికుంట మండలాల్లో శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) చైర్మన్ జీవీ రామకృష్ణారావు ఇన్చార్జీలుగా పనిచేస్తారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు వీణవంక, కిమ్స్ రవీందర్రావుకు కమలాపూర్ మండల బాధ్యతలు అప్పగించారు. తమకు అప్పగించిన మండలాలు, మున్సిపాలిటీల్లో పార్టీ కేడర్తో పాటు, స్థానిక సంస్థల ప్రతినిధులు, సర్పంచ్లు పార్టీ వెంట నడిచేలా వీరు చూడాల్సి ఉంటుంది. గంగుల, ఈటల నడుమ మాటల యుద్ధం ఇటీవలి వరకు మంత్రివర్గంలో సహచరులుగా ఉన్న గంగుల కమలాకర్, ఈటల రాజేందర్ నడుమ మాటల యుద్ధం ముదురుతోంది. ఈటల హైదరాబాద్లో ఓసీ.. హుజూరాబాద్లో బీసీ అని విమర్శిస్తూ.. ఆయన భూ కబ్జాలు చేశారంటూ గంగుల ఆరోపించారు. కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ వ్యాపారంలో అక్రమాలపై గంగులను ఉద్దేశించి ఈటల మంగళవారం విమర్శలు గుప్పించారు. మరోవైపు ఒకరినొకరు తీవ్ర స్థాయిలో వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. -
ప్రభుత్వ పాలనలో ప్రణాళికా శాఖ పాత్ర కీలకం
సాక్షి, హైదరాబాద్: దైనందిన పాలనలో ప్రణాళికా శాఖ పాత్ర కీలకమని, ప్రభుత్వంలోని ప్రతి శాఖకు ప్రణాళిక శాఖ దిక్సూచిగా నిలుస్తోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. మంగళవారం గణాంకభవన్లో ‘తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్’పుస్తకాన్ని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళికా శాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావుతో కలిసి వినోద్ కుమార్ ఆవిష్కరించారు. రాష్ట్రానికి సంబంధించిన జీఎస్డీపీ అంచనాలు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వివిధ పథకాల పురోగతి, పలు సర్వేలు, గణాంక శాఖల సమాచారం, రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతి వివరాలను ఈ పుస్తకంలో పొందుపర్చారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ప్రణాళికా శాఖ ముఖ్య భూమికను పోషిస్తోందని తెలిపారు. రాష్ట్ర సమగ్ర కార్యాచరణ సమాచారాన్ని క్రోడీకరించి పుస్తక రూపంలో అందుబాటులోకి తీసుకు రావడం గొప్ప విషయమని చెప్పారు. ఈ సమగ్ర సమాచారం http://tsdps. telangana.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉందని, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, స్థానిక ప్రజాప్రతినిధులు విధిగా ఈ వెబ్సైటును ఉపయోగించాలని, ఆయా సమావేశాల్లో ఈ గణాంకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ సీఈవో జి.దయానంద్, రాష్ట్ర రిమోట్ సెన్సింగ్ శాఖ అడిషనల్ డైరెక్టర్ జనరల్ శ్రీనివాస్రెడ్డి, సిజిస్ సంస్థ ప్రతినిధి రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
దేశం గర్వించే నేత పీవీ నర్సింహారావు..
సాక్షి, హైదరాబాద్ : సామాజిక విప్లవం తీసుకొచ్చిన నేత దివంవత పీవీ నరసింహరావు అని పీవీ శతాబ్ది ఉత్సవ కమిటీ చైర్మన్, ఎంపీ కే కేశవరావు అన్నారు. బడుగు, బలహీన వర్గాలకు పీవీ రాజకీయ ప్రాతినిధ్యం కల్పించారని, ఎల్పీజీ సృష్టికర్త అని కొనియాడారు. పీవీ నరసింహరావు శత జయంతి ఉత్సవాల లోగోను గురువారం కేశవరావు రవీంద్ర భారతిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీవీ దేశనాయకుడని అన్నారు. ఈనెల 28న హైదరాబాద్లోని పీవీ జ్ఞానభూమిలో శతజయంతి ఉత్సవాలు ప్రారంభమవుతాయని, ఏడాదిపాటు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. (అందుకు గర్వపడుతున్నా: మహమూద్ అలీ) జయంతి వేడుకల వివరాలను ముఖ్యమంత్రి కేసీఆర్ వివరిస్తారని కేశవరావు తెలిపారు. ఉత్సవాలపై పలు కమిటీలు వేస్తామని పేర్కొన్నారు. తెలంగాణ బిడ్డలుగా ఈ ఉత్సవాలు నిర్వహించడం గర్వకారణమన్నారు. పీవీ డాక్యుమెంటరీని తయారు చేస్తామని, పీవీతో సన్నిహితంగా ఉన్న వ్యక్తులతో కమిటీని విస్తరిస్తాన్నారు. ఆర్థిక సంస్కర్తగా, భూసంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తిగా పీవీకి మంచి పేరు ఉందన్నారు. దేశం గర్వించే నేత, విద్యా సంస్కరణలు అనేకం తీసుకొచ్చారని పీవీ నరసింహరావును ప్రశంసించారు. శతజయంతి ఉత్సవాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని పీవీ నరసింహరావు కుమార్తె వీణాదేవి అన్నారు. వేడుకలు నిర్వహిస్తున్నందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. (హరితహారం: మొక్కలు నాటిన కేటీఆర్) కేశవరావు నాయకత్వంలో కేసీఆర్ ఓ కమిటీని ఏర్పాటు చేయడం హర్షనీయమని టీఆర్ఎస్ నేత వినోద్ తెలిపారు. యాభై దేశాల్లో ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రపంచ పటంలో దేశం గర్వపడేలా తీర్చిదిద్దిన నేత పీవీ అని, దేశ ఆర్ధిక స్థితిగతుల్ని మార్చిన నేత అని పేర్కొన్నారు. రాజకీయాల కారణంగా ఆయనకు రావాల్సిన కీర్తి ప్రతిష్టలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దక్షిణ భారత్ నుంచి దేశాన్ని పాలించిన నేత పీవీ అని వినోద్ గుర్తు చేశారు. ఉత్సవాలు నిర్వహించాలన్న కేసీఆర్ నిర్ణయం గొప్పదని పీవీ ప్రభాకర్ అన్నారు. పీవీ గురించి తెలిసింది తక్కువ అని తెలియాల్సింది ఎక్కువ ఉందన్నారు. నాన్నకు టెక్నాలజీ అంటే చాలా ఇష్టమని, ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రాం కోసం ఆయన పని చేశారని గుర్తు చేశారు. ఇదే విషయాన్ని అటల్ జీ కూడా చెప్పారన్నారు. ఇవాళ చంద్ర మండలం వెళ్తున్నామంటే పీవీ వేసిన బాటలేనని ప్రభాకర్ పేర్కన్నారు. -
కరీంనగర్ కింగ్ ఎవరు..?
సాక్షి, కరీంనగర్ : ఉత్తర తెలంగాణలో కీలక నియోజకవర్గంగా కరీంనగర్ లోక్సభ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. డిసెంబర్ 7న రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తికాగా సరిగ్గా 125 రోజులకు అంటే ఏప్రిల్ 11న లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయదుందుభి మోగించింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీతో పోలిస్తే లోక్సభ ఎన్నికల ఓటింగ్ సరళిలో లేదా ఓటర్ల తీర్పులో మార్పు ఉంటుందా? రాష్ట్ర, జాతీయ రాజకీయాలకు, సీఎంను ఎన్నుకునే విషయంలో ఒక విధంగా, ప్రధానిని ఎన్నుకునే విషయంలో మరోలా ప్రజలు స్పందిస్తారా అనేది ఇప్పుడు కరీంనగర్ విషయంలో ఆసక్తికరంగా మారింది. అదీగాకుండా ఇటీవల ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు రావడంతో, మొత్తం మూడు ఎమ్మెల్సీ సీట్లలో రెండు కరీంనగర్ పరిధిలో ఉండడంతో లోక్సభ ఎన్నికలపై ఈ ఫలితాల ప్రభావం ఏ మేరకు ఉంటుందన్నది చర్చనీయాంశమైంది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ముందుండి నడిపిస్తున్నారు. ముఖ్యంగా కరీంనగర్ లోక్సభ స్థానంలో భారీ మెజారిటీ సాధించాలనే లక్ష్యంతో టీఆర్ఎస్ ప్రచార పర్వాన్ని కొనసాగిస్తోంది. టీఆర్ఎస్ పక్షాన ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్, కాంగ్రెస్ తరఫున మాజీ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్కుమార్ బరిలో నిలిచారు. ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఎన్నికల్లో వీరి మధ్య త్రిముఖపోరు నెలకొంటుందా లేక టీఆర్ఎస్–కాంగ్రెస్ లేదా టీఆర్ఎస్–బీజేపీ మధ్య ద్విముఖ పోటీగా మారుతుందా అనేది వేచిచూడాలి. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతో గతంతో పోలిస్తే తమ జీవితాలు మెరుగ్గానే ఉన్నాయని, ఉద్యోగ, ఉపాధి కల్పనతో పాటు, రైతులను ఆదుకునేందుకు మరిన్ని చర్యలు కావాలని ప్రజలు కోరుతున్నారు. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఇదీ పరిస్థితి సిరిసిల్ల: ఇది టీఆర్ఎస్కు పెట్టని కోట. సంస్థాగతం గా బలంగా ఉంది. గతంలో సిరిసిల్ల నుంచి గెలిచిన వారెవరూ మంత్రిగా బాధ్యతలు నిర్వహించలేదు. 2014లో గెలిచి కేటీఆర్ మంత్రి అయ్యాక విస్తృతం గా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. రోడ్లు, వంతెనలు, ఇతర పనుల రూపంలో గత ఐదేళ్లలో రూ. వేలాది కోట్ల మేర నిధులు ఖర్చుచేశారు. చేనేత కార్మికుల సంక్షేమానికి చర్యలు తీసుకున్నారు. ఇక్క డ కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకులు కరువయ్యా రు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ నాయకుడు కేకే మహేందర్రెడ్డి నిరుత్సాహంతో ఉన్నారు. బీజేపీ పరిస్థితీ ఏమంత మెరుగ్గా లేదు. వేములవాడ: ఇది టీఆర్ఎస్కు బలమైన సెగ్మెంట్. గతంతో పోలిస్తే ఇక్కడ మంచినీటి సరఫరా మెరుగుపడింది. వేసవిలో తరచుగా ఎదురయ్యే సమస్యలు అంతగా లేవని స్థానికులు చెబుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సిరిసిల్ల, వేములవాడ ఇతర నియోజకవర్గాలు ప్రయోజనం పొందనున్నాయి. మిషన్ భగీరథ ద్వారా ఇప్పటికే 60 నుంచి 70 శాతం దాకా తాగునీరు సరఫరా అవుతోంది. ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ ఇప్పుడు అందుబాటులో ఉంటున్నారని ప్రజలు అంటున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభావం కొంత ఉంటుంది. లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్కు ఇక్కడి వారితో అనుబంధం ఉంది. బీజేపీ ప్రభావం అంతంత మాత్రమే. హుజూరాబాద్: రాజకీయంగా టీఆర్ఎస్ బలంగానే ఉంది. మంత్రి ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ సెగ్మెంట్లో అభివృద్ధి పనులు బాగానే చేపట్టారు. 2014తో పోలిస్తే గత ఎన్నికల్లో తన మెజారి టీ కొంత మేర తగ్గడంపై ఇటీవల కార్యకర్తల సమావేశంలో ఈటల అసంతృప్తి వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ నుంచి లక్ష మెజా రిటీని సాధించడం ద్వారా దానిని భర్తీచేయాలని టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలున్నారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీకి కొంత మేర మద్దతు దొరికే అవకాశాలున్నాయి. ఆ పార్టీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ సామాజిక వర్గం వారు ఇక్కడ ఎక్కువమంది ఉండడం ఆయనకు కలిసొచ్చే అంశం. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ నుంచి జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీచైర్మన్ తుమ్మిడి సమ్మిరెడ్డి, వి.రవీందర్రెడ్డి టీఆర్ఎస్లో చేరారు. ఇక్కడి యువకులు కొందరిపై వీహెచ్పీ, బజ్రంగ్దళ్ ప్రభావం ఉండటంతో సామాజిక మాధ్యమాల్లో లోక్సభ అభ్యర్థి సంజయ్ కుమార్కు అనుకూల ప్రచారం సాగుతోంది. చొప్పదండి: అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ ఇక్కడ పటిష్టంగానే ఉంది. గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లో భారీ గా చేరికలు సాగాయి. కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయి లో పుంజుకోవాల్సి ఉంది. ప్రధాని మోదీ ప్రభావం యువతపై కొంత మేర ఉండే అవకాశాలున్నాయి. హిందుత్వ భావజాలం కారణంగా బీజేపీ అభ్యర్థిపై ఇక్కడి యువకులు ఆకర్షితులవుతున్నట్టు చెబుతున్నారు. కరీంనగర్: ఇక్కడ టీఆర్ఎస్కు సానుకూలత ఉంది. కాంగ్రెస్, బీజేపీ కంటే టీఆర్ఎస్ ఆశీర్వాద సభలు, రోడ్షోలు, కుల సంఘాల సమావేశాలతో ప్రచారం లో ముందుంది. వరస విజయాలతో ఎమ్మెల్యే గంగుల కమలాకర్కు స్థానికంగా సంబంధాలు మరింత మెరుగయ్యాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేసిన బండి సంజయ్, పొన్నం ప్రభాకర్ రెండు, మూడు స్థానాలకు పరిమితమయ్యారు. వీరిద్దరూ కూడా కరీంనగర్ పట్టణవాసు లు కావడంతో వారి మద్దతుదారులు పెద్దసంఖ్య లోనే ఉన్నారు. వీరికి బీసీ సామాజికవర్గాల ఓట్లు పడే అవకాశాలున్నాయి. సంస్థాగతంగా కాంగ్రెస్ ఇక్కడ బలంగానే ఉంది. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలొచ్చాక కాంగ్రెస్ నుంచి ఐదుగురు కార్పొరేటర్లు టీఆర్ఎస్లో చేరారు. ఇది కాంగ్రెస్కు ప్రతికూలం కావచ్చు. హిందూ అనుకూల ఓటుబ్యాంక్తో అసెంబ్లీ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన సంజయ్ లోక్సభ ఎన్నికల్లోనూ అదే జోరు కొనసాగిస్తారా అనేది చర్చనీయాంశమైంది. మానకొండూరు: ఇక్కడి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్కు ప్రజలతో సంబంధాలు బాగానే ఉన్నాయి. టీఆర్ఎస్ కేడర్ బలంగానే ఉంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఓడిన సీనియర్ నేత ఆరేపల్లి మోహన్ తాజాగా టీఆర్ఎస్ లో చేరడం కాంగ్రెస్ పార్టీపై కొంత మేర ప్రభావం చూపొచ్చునని చెబుతున్నారు. సీనియర్నేత కవ్వం పల్లి సత్యనారాయణకు సముచిత స్థానం కల్పించడం ద్వారా ఆ నష్టం భర్తీకి పొన్నం చర్యలు తీసుకుంటున్నారు. హిందువుల కోసం పోరాడే వ్యక్తిగా సంజయ్కు ఇక్కడి యువతలో గుర్తింపు ఉంది. ఇక్కడ టీఆర్ఎస్–కాంగ్రెస్–బీజేపీల మధ్య పోటా పోటీగా ఉండొచ్చునని అంచనావేస్తున్నారు. హుస్నాబాద్: ఈ నియోజకవర్గాన్ని అన్నీ తానై మా జీ మంత్రి టి.హరీశ్రావు నడిపించారు. ఎమ్మెల్యే సతీష్కుమార్తో పాటు తాను జవాబుదారీగా ఉం టూ ఇక్కడి ప్రజల్లో నమ్మకం కలిగించారు. ప్రస్తుతం ఈ సెగ్మెంట్లోని కొంత భాగం కొత్తగా ఏర్పడిన సిద్దిపేట జిల్లాలో ఉంది. టీఆర్ఎస్కు స్థానిక నాయకులు, కార్యకర్తల మద్దతుంది. కాంగ్రెస్కు ఇక్కడ మద్దతుదారులున్నా పార్టీని చురుకుగా నడిపించే నాయకులు లేరు. ఇక్కడ కొంతమేర సీపీఐ ప్రభావం ఉంటుంది. భారతీయ జనతా పార్టీకి ఇక్కడ పెద్దగా కేడర్ లేదు. అభివృద్ధే ఎజెండా రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో అభివృద్ధి ప్రధాన ఎజెండాగా ముందు కెళుతున్నాం. ప్రచారానికి వెళ్లినపుడు ప్రజల్లో స్పందన బాగుంటోంది. ఓటర్లు స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ నాయకత్వంలో జాతీయస్థాయిలో తమ ఎంపీ ఉండాలని కరీంనగర్ ప్రజలు కోరుకుంటున్నారు. ఐదేళ్లలో రాష్ట్ర ఎంపీలుగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగలిగాం. నీటిపారుదల ప్రాజెక్టులు, ఇతర కార్యక్రమాలకు అనుమతులు, మంజూర్లు పొందగలిగాం. కేంద్ర ప్రభుత్వంలో కూడా టీఆర్ఎస్కు పాత్ర ఉంటే ఇంకా సాధిస్తాం. విభజన చట్టంలో పేర్కొన్న తెలంగాణలోని ఒక ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడంలో కాంగ్రెస్, బీజేపీ విఫలమయ్యాయి. ఈసారి దానిని సాధించేందుకు కృషి చేస్తాం. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే ప్రసక్తే లేదు. ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి 4,5 వార్డుల్లో ప్రభావం చూపగలుగుతారు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు కూడా ఆ పార్టీకి రావు. అందువల్ల కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులెవరూ నాకు పోటీ కాదు. – బోయినపల్లి వినోద్కుమార్, టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ ఆయన ఓడినా నష్టమేం లేదు.. స్థానికుడిని. ప్రజలకు అన్నివేళలా అందుబాటులో ఉంటాను. 2009–14 మధ్యకాలంలో ఎంపీగా సాధించిన అభివృద్ధి, తెలంగాణ రాష్ట్ర సాధనకు ఢిల్లీలో పోషించిన కీలకపాత్ర నన్ను గెలిపిస్తాయి. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఓడినా ప్రజలకొచ్చే పెన్షన్లు, రైతుబంధు ఇతర సంక్షేమ పథకాలు ఆగిపోవు. రాష్ట్ర ప్రభుత్వంపై ఏ ప్రభావం పడదు. హిందూ–ముస్లింల మధ్య వైషమ్యాలు పెంచడం ద్వారా ఇక్కడ రాజకీయంగా లాభపడాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నాలు ఫలించవు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నేను పోటీ చేయడం పొరబాటు. కరీంనగర్ లోక్సభ పరిధిలోని మిగతా 6 నియోజకవర్గాలను కవర్ చేశాక, చివరకు కరీంనగర్ అసెంబ్లీపై దృష్టి పెడదామనుకున్నా. అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు రావడంతో అధిష్టానం ఆదేశాలతో పోటీ చేయాల్సి వచ్చింది. పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుకగా, కరీంనగర్ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేసే వ్యక్తిగా ప్రజలు ఈసారి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్, ఇతర జిల్లాల బుద్ధిజీవులు టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పే ఎంపీ ఎన్నికలపుడు కూడా కాంగ్రెస్కు అనుకూలంగా ఇస్తారని ఆశిస్తున్నాను. – పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ అభ్యర్థి నన్ను గెలిపించే ఆలోచనలో ఉన్నారు.. మరోసారి నరేంద్రమోదీని ప్రధానిని చేసేందుకు ఇక్కడి నుంచి బీజేపీ ఎంపీగా నన్ను పంపించాలనే అభిప్రాయంతో ఇక్కడి ప్రజలున్నారు. నేను గెలిస్తే స్వయంగా ప్రధానిని, కేంద్రమంత్రులను కలిసి, నియోజకవర్గ అభివృద్ధికి నేరుగా నిధులు తెచ్చే అవకాశం ఉంది. అదే టీఆర్ఎస్ నాయకుల విషయానికొస్తే వారు సీఎం కేసీఆర్నే కలిసే పరిస్థితే ఉండదు. లోక్సభ ఎన్నికలు జాతీయ రాజకీయాలకు సంబంధించినవి కాబట్టి ప్రజలు భిన్నమైన తీర్పునిస్తారనే నమ్మకముంది. ఇక్కడ టీఆర్ఎస్కు ఓటేసినా ఎంఐఎంకు వేసినట్టే. కాంగ్రెస్కు వేస్తే టీఆర్ఎస్కు వేసినట్లే. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత బయటపడింది. బీజేపీకి గెలుపు అవకాశాలు మెరుగయ్యాయని భావిస్తున్నాను. రెండు సార్లు అసెంబ్లీకి పోటీచేసి ఓటమి చెందాననే సానుభూతి ప్రజల్లో ఉంది. ఏడు సెగ్మెంట్లలో బీజేపీకి ఆదరణ పెరుగుతోంది. గతంలో కాంగ్రెస్, టీఆర్ఎస్కు అవకాశమిచ్చినందున ఈసారి నన్ను గెలిపిద్దామనే ఆలోచనతో ప్రజలున్నారు. మాకు సైలెంట్ ఓటింగ్ పడుతుంది. – బండి సంజయ్కుమార్, బీజేపీ అభ్యర్థి లోక్సభ ఓటర్లు పురుషులు :8,07,233 మహిళలు : 8,25,565 ఇతరులు : 26 మొత్తం ఓటర్లు : 16,32,824 2018 అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ పరిధిలో పార్టీలకు పోలైన ఓట్లు టీఆర్ఎస్ 6,91,885 కాంగ్రెస్ 3,45,149 బీజేపీ 1,02,014 మొత్తం పోలైన ఓట్లు 15,42,685 -
అనర్గళ విద్యా ‘సాగరు’డు
సాక్షి, కరీంనగర్: రాజకీయాల్లో తలపండిన నేతలు.. కాకలు తీరిన యోధులు.. ఒక్కసారైనా రాజ్యాంగపరంగా ప్రాధాన్యత ఉన్న గవర్నర్ పదవి చేపట్టాలని ఆశిస్తారు. అలాంటి రాజ్యాంగపరమైన పదవిలో రాణిస్తున్నారు చెన్నమనేని విద్యాసాగర్రావు (77). మూడు దశాబ్దాల పాటు రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న విద్యాసాగర్రావు 2014 ఆగస్ట్ 30న మహారాష్ట్ర గవర్నర్గా బాధ్యతలు స్వీకరించారు. విద్యాసాగర్రావు మూడుసార్లు శాసనసభ్యుడిగా, రెండుసార్లు పార్లమెంట్ సభ్యుడిగా.. ఐదేళ్లు కేంద్ర మంత్రిగా పని చేశారు. తెలంగాణ ప్రాంతం నుంచి గవర్నర్ స్థాయికి ఎదిగిన రెండో వ్యక్తి విద్యాసాగర్రావు. మొదటి వ్యక్తి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి. పిట్టకథలు, వాగ్దాటితో ఆకట్టుకునే ‘సాగర్జీ’ ప్రస్థానంపై కథనం.. విద్యార్థి దశలో రచన, రాజకీయం.. విద్యాసాగర్రావు ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ చదువుతుండగా విద్యార్థి నాయకుడిగా వర్సిటీ స్థాయి ఎన్నికల్లో పాల్గొన్నారు. బీఎస్సీ ఎల్ఎల్బీ చదివారు. ఇందిర ఎమర్జెన్సీ సమయంలో అరెస్టయి జైలుకెళ్లారు. జైలులో ఉండగా పలు కథలు, వ్యాసాలు రాశారు. విద్యాసాగర్రావు సోదరుడు చెన్నమనేని రాజేశ్వర్రావు కమ్యూనిస్టు నేతగా ఉండగా విద్యాసాగర్రావు మాత్రం ఆర్ఎస్ఎస్ సభ్యుడిగా పనిచేశారు. 1983లో తొలిసారి కరీంనగర్ జిల్లా చొప్పదం డిలో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. 1985లో మెట్పల్లి నుంచి పోటీచేసిన విద్యాసాగర్రావు ఆపై 1989, 1994 ఎన్నికల్లో వరుస విజయా లు సాధించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా, శాసనసభలో శాసనసభాపక్ష నేతగా పనిచేశారు. 1998లో కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి 12వ లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించారు. అప్పట్లో వాజ్పేయి ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంలో ఓడిపోవడంతో 1999లో వచ్చిన ఎన్నికల్లో రెండోసారి ఎంపీ అయ్యారు. వాజ్పేయి ప్రభుత్వంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. కేసీఆర్పై పోటీ.. 2004 లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఉద్యమ నేతగా కరీంనగర్ నుంచి కేసీఆర్ పోటీ చేయగా అప్పటికే సిట్టింగ్ ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఉన్న విద్యాసాగర్రావు మూడోసారి బరిలో దిగారు. తెలంగాణ వాదం బలంగా ఉండటంతో విద్యాసాగర్రావు ఓటమిపాలయ్యారు. 2009లో వేములవాడ ఎమ్మెల్యేగా పోటీచేసిన విద్యాసాగర్రావు తన సోదరుడు రాజేశ్వర్రావు, తనయుడు రమేశ్బాబు చేతిలో ఓటమిపాలయ్యా రు. బాబాయిని ఓడించిన అబ్బాయిగా రమేశ్బాబు వార్తల్లో నిలిచారు. 2014లో కరీంనగర్ లోక్సభ నుంచి పోటీ చేసిన విద్యాసాగర్రావు మరోసారి ఓటమిపాలయ్యారు. మహారాష్ట్ర గవర్నర్గా.. తెలంగాణ ప్రాంత సీనియర్ బీజేపీ నేతగా గుర్తింపు పొందిన విద్యాసాగర్రావు 2014లో బీజేపీ సర్కార్ కేంద్రంలో అధికారంలోకి రావడంతో మహారాష్ట్ర గవర్నర్గా 2014 ఆగస్టు 30న బాధ్యతలు స్వీకరించారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో మరణించిన సందర్భంగా తమిళనాట నెలకొన్న నాటకీయ పరిణామాలను నిశితంగా గమనించిæనాటి తమిళనాడు ఇంఛార్జి గవర్నర్గా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించారు. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నారు. మాటల మరాఠీ.. విద్యాసాగర్రావుకు మాటల మాం త్రికుడని పేరు. వేదికలపై అనర్గళంగా మాట్లాడుతూ కుల సంఘాల పేర్లను ఉచ్చరిస్తారు. ప్రసంగం మధ్యలో పిట్టకథలు చెబుతూ సభికులను ఆకట్టుకుంటారు. అసెంబ్లీ వేదికగా సాగే చర్చల్లోనూ తనదైన శైలిలో సాధికారంగా మాట్లాడటం ఆయన ప్రత్యేకత. సభ ఏదైనా తన వాగ్ధాటితో మెప్పిస్తారు. విద్యాసాగర్రావును ముద్దుగా ‘సాగర్జీ’ అంటారు. ప్రసంగం మధ్యలో చమత్కారాలు, తెలంగాణ నుడికారాలు, సామెతలు చెబుతూ రక్తికట్టిస్తారు. ఇంతట ‘మాటల నేత’ ప్రస్తుతం గవర్నర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో ఒక్కమాటా మాట్లాడకుండా గంభీరంగా ఉండటం విశేషం. కుటుంబమంతా.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలం నాగారానికి చెందిన చెన్నమనేని శ్రీనివాస్రావు–చంద్రమ్మ దంపతుల చిన్నకొడుకుగా 1942 ఫిబ్రవరి 12న జన్మించిన విద్యాసాగర్రావు పాఠశాల స్థాయి నుంచే చురుకైన వక్త. ఆయన భార్య వినోద. పిల్లలు వివేక్, వినయ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. చిన్నబ్బాయి వికాస్ డాక్టర్. విద్యాసాగర్రావు పెద్దన్నయ్య రాజేశ్వర్రావు సీనియర్ రాజకీయ నేత కాగా మరో అన్నయ్య పద్మవిభూషణ్ హన్మంతరావు ఆర్థికవేత్త. ఇంకో అన్నయ్య వెంకటేశ్వర్రావు కమ్యూనిస్టు నాయకుడు. విద్యాసాగర్రావు సోదరి కుమారుడు బోయినపల్లి వినోద్కుమార్ ప్రస్తుత కరీంనగర్ ఎంపీ కాగా సోదరుడు రాజేశ్వరరావు కొడుకు రమేశ్బాబు వేములవాడ శాసనసభ్యుడిగా ఉన్నారు. సొంత డబ్బుతో స్కూలు, చెరువు.. నాగారంలోని రెండున్నర ఎకరాల భూమిని గురుకుల విద్యాలయానికి దానంగా ఇచ్చారు. గ్రామం లోని 85 మంది రైతులకు రూ.1.32 కోట్ల సొంత ఖర్చులతో బోర్లు వేయించారు. 105 మంది పేద బీడీ కార్మికులకు ప్రభుత్వ పరంగా ఇళ్లు కట్టించారు. 1993లో నాగారంలో రూ.60 లక్షలతో తొలి ఊట చెరువు నిర్మించారు. తల్లి చంద్రమ్మ పేరిట ట్రస్ట్ పెట్టి సిరిసిల్లలో సాగునీటి కాలువలు తవ్వించారు. కార్గిల్ వీరుల స్మారకార్థం 2000లో కార్గిల్ లేక్ను ఏర్పాటు చేశారు. - వూరడి మల్లికార్జున్, సిరిసిల్ల -
అవిశ్వాసం ఎందుకు పెట్టారో?
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘అవిశ్వాస తీర్మానం ఎవరిని అడిగి పెట్టారు? వారెందుకు పెట్టారో, ఏం కారణాలు చెబుతున్నారో చూసి మేం చర్చలో మాట్లాడతాం’’అని టీఆర్ఎస్ ఎంపీ బి.వినోద్ అన్నారు. బుధవారమిక్కడ ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ‘‘వారు అవిశ్వాసం పెట్టుకున్నా.. పెట్టుకోకపోయినా మాకు సంబంధం లేదు. ఏపీకి ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుకుంటున్నాం’’అని వ్యాఖ్యానించారు. ‘‘ఈ రోజు ఉన్న వాతావరణమే ఈ 18 రోజులు ఉండి బిల్లులు ఆమోదం పొందుతాయని అనుకుంటున్నాం. హైకోర్టు విభజన చేయాలని కేంద్రాన్ని కోరుతున్నాం. హైకోర్టు విభజనకు గతంలోనే కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. దాన్ని అమలుకు సభలో కోరతాం. బయ్యారం ఉక్కు కర్మాగారం అంశాన్ని లేవనెత్తుతాం. కాళేశ్వరం ఆపాలని, అనుమతులు రద్దు చేయాలని ఏపీ సీఎస్ మూడు పేజీల లేఖ రాశారు. వాళ్ల(ఏపీ) ఆలోచనలు, మా ఆలోచనలు వేరు’’ అని అన్నారు. మాకు నచ్చలేదు: సీతారాం నాయక్ ‘‘కాళేశ్వరాన్ని అడ్డుకోవడం ఏపీకి తగదు. ఓవైపు ప్రాజెక్టులను అడ్డుకుంటూ మరోవైపు అవిశ్వాసానికి మా మద్దతు అడగడం నచ్చలేదు. చర్చలో పాల్గొంటం. కేంద్రం ద్వంద్వ వైఖరిని నిలదీస్తాం’’ అని సీతారాం నాయక్ చెప్పారు. -
వేములవాడను గొప్పక్షేత్రంగా తీర్చిదిద్దుతాం
వేములవాడ : వేములవాడ ఆలయాన్ని గొప్ప క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఎంపీ వినోద్కుమార్ అన్నారు. వేములవాడలో ఆలిండియా వెలమసంఘం భవనాన్ని సోమవారం ఎమ్మెల్సీ భానుప్రసాద్, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు, మాజీ ఎమ్మెల్యే కడారి దేవేందర్రావు, ఆలిండియా వెలమ సంఘం అధ్యక్షుడు చల్మెడ లక్ష్మీనర్సింహారావులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మిడ్మానేరు నుంచి నేరుగా వేములవాడ గుడి చెరువు, మూలవాగులో 365 రోజులు గోదావరి జలాలు ఉండేలా ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. త్వరలోనే సీఎం కేసీఆర్ శృంగేరి పీఠాధిపతులను వేములవాడకు తీసుకుని రానున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ భానుప్రసాద్రావు మాట్లాడుతూ ఆలిండియా వెలమ సంఘం భవనాన్ని వెలమలకే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని కోరారు. ఆలిండియా వెలమ సంఘం అధ్యక్షుడు చల్మెడ లక్ష్మీనర్సింహారావు మాట్లాడుతూ అనాథలు, నిరుపేదలను ఆదుకోవడమే సంస్థ లక్ష్యమన్నారు. స్థలదాత పాలెపు నర్సింగారావు, ఐవా జనరల్ సెక్రటరీ రామ్మోహన్రావు, ట్రెజరర్ జోగినపల్లి వెంకటనర్సింగారావు, శ్రీనివాస్రావు, మున్సిపల్ చైర్పర్సన్ నామాల ఉమ, వెలమ సంఘం నాయకులు, సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
‘ఎంపీ వినోద్ సహకారం మరువలేనిది’
సాక్షి, వరంగల్ : ఉప్పల్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణలో ఎంపీ వినోద్ కుమార్ సాకారం మరువలేనిదని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. సోమవారం కమలాపూర్ మండలం ఉప్పల్లో 66 కోట్ల రూపాయలతో నిర్మించనున్న రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, కరీంనగర్ ఎంపీ వినోద్కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పాత హుజురాబాద్ నియోజకవర్గంలో 175 కోట్ల రూపాయలతో 4 జాతీయ రహదారులు నిర్మించుకున్నామని తెలిపారు. కమలాపూర్ మండలంలో నిత్యం 5000 మంది విద్యార్థులు ఉండేలా విద్యా హబ్ రూపు దిద్దుకుంటుందని, కమలాపూర్ మండలాన్ని సరస్వతి నిలయంగా తయారు చేస్తామని పేర్కొన్నారు. విద్య, వైద్య రంగాల్లోనే కాకుండా రహదారుల విషయంలో కూడా కమలాపూర్ మండలంలో అభివృద్ధి జరుగుతుందని బరోసా ఇచ్చారు. త్వరలోనే ఉప్పల్ రైల్వే స్టేషన్ ఆర్వోబీ వంతెనను పూర్తి చేసి కమలాపూర్ ప్రజలకు అంకితం చేస్తామన్నారు. నియోజకవర్గ ప్రజల కల సాకారం కాబోతోంది: ఎంపీ వినోద్ వరంగల్ : దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న పాత కమలాపూర్ నియోజకవర్గ ప్రజల కల ఆర్వోబీ వంతెనతో సాకారం కాబోతోందని కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. ఉప్పల్ వంతెన తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి హాఫ్ ఆర్వోబీ వంతెనని, ఇది మొదటిసారిగా నూతన టెక్నాలజీతో రూపుదిద్దుకోబోతుందని తెలిపారు. -
రామయ్యను దర్శించుకున్న ఎంపీ వినోద్కుమార్
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారిని కరీంనగర్ ఎంపీ వినోద్కుమార్ మంగళవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. గర్భగుడిలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన వినోద్ కుటుంబసభ్యులు.. ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీతాయా రు అమ్మవారు, అభయాంజనేయ స్వామి వారి ఆలయాలను కూడా దర్శించుకొని పూజలు చేశా రు. వారికి ఆలయ అర్చకులు స్వామి వారి ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఏఈఓ శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
‘వారి పాలన రైతులకు చుక్కలు చూపించింది’
సాక్షి, రాజన్న సిరిసిల్ల: మంత్రి కేటీఆర్, ఎంపీ వినోద్ కుమార్ జిల్లాలోని బోయినపల్లి మండలం విలాసాగర్లో మంగళవారం రైతు బంధు చెక్కులు, పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, టీడీపీ పాలన రైతులకు చుక్కలు చూపిస్తే, టీఆర్ఎస్ ప్రభుత్వం చెక్కులు ఇస్తుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం 50 ఏళ్ళు అధికారంలో ఉండి రైతులకు ఐదు రూపాయల సహాయం చేయలేదని, కానీ నాలుగేళ్ళ టీఆర్ఎస్ పాలనలో నాలుగు వేల చెక్కు ఇస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలు జానారెడ్డి మాటలు వింటే బాదేస్తుందని, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డిలా గడ్డం పెంచుకుంటే సన్నాసుల్లో కలుస్తారు తప్ప సమస్యలు పరిష్కారం కావని తెలిపారు. రెండు లక్షల వరకు పంట రుణం మాఫీ చేస్తామంటున్న కాంగ్రెస్ నాయకులకు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదని ఆయన అన్నారు. రైతు మోహంలో ఎప్పూడూ సంతోషం ఉండడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రైతు బంధు పథకంతో దేశానికే తెలంగాణ ఆదర్శంగా మారిందని కేటీఆర్ అన్నారు. దేశంలో హరిత విప్లవానికి తెలంగాణా కేంద్ర బిందువు అవుతుందని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 46 వేల చెరువులు నింపేందుకు మిషన్ కాకతీయ ద్వారా కృషి చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 86 ఏళ్ల తర్వాత భూ రికార్డుల ప్రక్షాళన చేసి 60 లక్షల మంది రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు ఇస్తున్న నాయకుడని కొనియాడారు. తెలంగాణలో కోటి 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే బృహత్తర కార్యక్రమానికి కేసీఆర్ కంకణం కట్టుకున్నారని తెలిపారు. వ్యవసాయానికి ఉపాధి హామీని అనుసంధానం చేసే విధంగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలన్నారు. -
హామీ వస్తే కూర్చుంటాం..!
సాక్షి, న్యూఢిల్లీ: తమ న్యాయమైన డిమాండ్లపై హామీ ఇస్తే సభలో కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నామని టీఆర్ఎస్ ప్రకటించింది. సోమవారం ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమై, వాయిదా పడిన సందర్భంలో టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటు ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఎంపీలు ఎ.పి.జితేందర్రెడ్డి, బి.వినోద్కుమార్, సీతారాం నాయక్, బూర నర్సయ్య గౌడ్, నగేశ్, కొత్త ప్రభాకర్రెడ్డి, కొండా విశ్వేశ్వర్రెడ్డి, సీహెచ్ మల్లారెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, బీబీ పాటిల్ పాల్గొన్నారు. ధర్నా వద్ద టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత జితేందర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ‘మా డిమాండ్లను పార్లమెంటు ముందు పెట్టాం. రిజర్వేషన్లను రాష్ట్రాలకు వదిలిపెట్టాలి. రాష్ట్రాల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇచ్చేందుకు రాష్ట్రాలు పనిచేస్తాయి. కేంద్రంలో ఉన్న ఉద్యోగాల కోసంగానీ, విద్యా శాఖ లో కానీ రిజర్వేషన్లు అడగడం లేదు. మా రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలు, విద్యావకాశాల్లో మాత్రమే రిజర్వే షన్లు పెంచుకుంటాం. ఆ దిశగా బిల్లు తెచ్చాం. 9వ షెడ్యూలులో పొందుపరచాలని అడిగాం. నాలుగేళ్లుగా వేచిచూస్తున్నాం. కానీ ఇప్పటివరకు కేంద్రం ఏ ఒక్క అంశాన్ని అమలుచేయలేదు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన అంశాలను అమలు చేయలేదు. ఎయిమ్స్, బయ్యారం స్టీలు ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐఐఎం.. ఏవీ ఇవ్వలేదు. హైకోర్టు విభజించలేదు. అందుకే రెండు వారాలుగా పోరాడుతున్నాం. కచ్చితమైన హామీ వచ్చే వరకు పోరాటం చేస్తాం’ అని స్పష్టం చేశారు. ఆందోళన కొనసాగుతుంది: జితేందర్రెడ్డి కేంద్రంపై పెట్టిన అవిశ్వాస తీర్మానాలు సభ ముందుకు వచ్చేలా మీరు మద్దతుగా నిలబడితే ఈ అంశాలన్నీ చర్చకు వస్తాయి కదా అని మీడియా ప్రశ్నించగా ‘రెండు వారాలుగా మా డిమాండ్ల కోసం ఆందోళన చేస్తున్నాం. డిమాండ్లను హౌస్లో పెట్టి పరిష్కరించుకుంటాం. ఎవ్వరినీ అనుసరించాల్సిన అవసరం మాకు లేదు. సరైన హామీ లభించే వరకు ఆందోళన కొనసాగుతుంది’అని జితేందర్ రెడ్డి పేర్కొన్నారు. టీఆర్ఎస్ పరోక్షంగా బీజేపీకి సహకరిస్తోందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయని ప్రస్తావించగా ‘వాళ్లకు వాళ్లు ఆరోపణలు చేసుకోవడం కాదు. ఈరోజు వాళ్లకు అవిశ్వాస తీర్మానం పెట్టాలని మనసొచ్చింది. మా ప్రజల ఆకాంక్షలు, డిమాండ్లు మాకు ముఖ్యం. మా డిమాండ్లపై వాళ్లు వాగ్దానం చేసి మమ్మల్ని కూర్చోబెడితే కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నాం’అని స్పష్టం చేశారు. చర్చ జరిగితే మాట్లాడుతాం: వినోద్ ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ ‘16వ లోక్సభ ప్రారంభమైన మొదటి రోజు నుంచి పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీస్తున్నాం. ఏపీలోకి 7 మండలాలు పోయిన రోజు నుంచి ఆందోళన చేస్తున్నాం. బీజేపీని నిలదీస్తున్న పార్టీల్లో టీఆర్ఎస్ మొదటి వరసలో ఉంది. రిజర్వేషన్లను జనాభా దామాషా ప్రకారం పెంచుతూ తెచ్చిన బిల్లును రాజ్యాంగంలోని 9వ షెడ్యూలులో చేర్చాలని మేం బడ్జెట్ మలివిడత సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజు నుంచీ పోరాటం చేస్తున్నాం. అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ అనుమతిస్తే చర్చలో కూడా మేం మాట్లాడుతాం. విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను లేవనెత్తుతాం. టీడీపీ ఇప్పటికీ విభజన అశాస్త్రీయంగా జరిగిందని మాట్లాడుతోంది. వాళ్ల హక్కుల గురించి మాట్లాడితే మద్దతు ఇస్తాం. కానీ, ఇప్పటికీ విభజ నను వ్యతిరేకించేలా స్వరం వినిపిస్తోంది. కాం గ్రెస్ నేతల గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. యూపీలో రెండు ప్రాంతీయ పార్టీలు గెలిస్తే వీళ్లు సంబరాలు చేసుకున్నారు’అని అన్నారు. మేం ఎవరిపై కేసు పెట్టాలి: సీతారాంనాయక్ ఎంపీ సీతారాం నాయక్ మాట్లాడుతూ ‘గిరిజనులు, దళితుల మనోభావాలను కించపరిచినవారిపై అట్రా సిటీ కేసు పెట్టే హక్కును రాజ్యాంగం కల్పించింది. మేం నెలరోజులుగా గిరిజనుల రిజర్వేషన్లపై మాట్లా డుతున్నా పట్టించుకోనప్పుడు ఎవరిపై కేసు పెట్టాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎస్సీ, ఎస్టీ జనాభా లేనిపక్షంలో రిజర్వేషన్లు కొనసాగించేవారా? నా ఉద్దేశం ఎవరిపైనో కేసులు పెట్టా లని కాదు. ఇంతమంది ఎంపీలం ఆందోళన పట్టించుకోకుంటే ఎవరిని దోషులను చేయాలి’ అని వాపోయారు. -
కాజీపేట - కరీంనగర్ రైల్వే లైన్కు ప్రతిపాదన
సాక్షి, హైదరాబాద్ : కాజీపేట నుంచి కరీంనగర్కు నేరుగా రైల్వేలైన్ నిర్మించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు టీఆర్ఎస్ ఎంపీ వినోద్ తెలిపారు. ప్రస్తుతం కాజీపేట నుంచి కరీంనగర్ వెళ్లేందుకు పెద్దపల్లి మార్గంలో రైల్వే లైన్ ఉంది. కొత్త ప్రతిపాదనల ప్రకారం.. కాజీపేట నుంచి వయా హుజురాబాద్ మీదుగా కరీంనగర్కు రైల్వేలైన్ నిర్మించేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు అధ్యయనం చేయనున్నట్లు ఎంపీ వినోద్ పేర్కొన్నారు. సికింద్రాబాద్ రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్ కుమార్తో తెలంగాణ ఎంపీలు బుధవారం సమావేశమై కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో రాష్ర్టానికి రైల్వే కేటాయింపుల ప్రాధాన్యాలు, పెండింగ్ పనులపై చర్చించారు. ఈ సమావేశానికి ఎంపీలు జితేందర్రెడ్డి, వినోద్, కే కేశవరావు, నగేష్, గుత్తా సుఖేందర్రెడ్డి, సీతారాం నాయక్, కొండా విశ్వేశ్వర్రెడ్డి, పసునూరి దయాకర్, కొత్త ప్రభాకర్రెడ్డి, మల్లారెడ్డి హాజరయ్యారు. రైల్వే జీఎంతో సమావేశం ముగిసిన అనంతరం ఎంపీ వినోద్ మీడియాతో మాట్లాడుతూ విభజన చట్టంలోని హామీలని నెరవేర్చాలని రైల్వే జీఎంను కోరినట్లు వినోద్ తెలిపారు. తెలంగాణలో మూడు రైల్వే లైన్లు మాత్రమే ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కొత్తపల్లి - మనోహరాబాద్ పనులు వేగంగా జరుగుతున్నాయని స్పష్టం చేశారు. పెద్దపల్లి - నిజామాబాద్ రైల్వే లైన్ను ఎలక్ట్రిఫికేషన్ చేయాలని కోరామని తెలిపారు. ఇందుకు టెండర్లు కూడా పిలిచినట్లు లిఖితపూర్వంగా రైల్వే జీఎం సమాధానం ఇచ్చారని చెప్పారు. ఈ మార్గాన్ని ఎలక్ట్రిఫికేషన్ చేస్తే మెమో, లోకల్ రైళ్లు తిరిగేందుకు అవకాశం ఉంటుందన్నారు. తెలంగాణలో జాతీయ రహదారులు, రైల్వే లైన్లు తక్కువగా ఉన్నాయని వినోద్ తెలిపారు. ఈ క్రమంలో రైల్వే లైన్ల కిలోమీటర్లను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి మాట్లాడుతూ... దక్షిణ మధ్య రైల్వే ఆదాయంలో ముందు ఉందని పేర్కొన్నారు. కానీ సమస్యల పరిష్కారంలో దక్షిణ మధ్య రైల్వే ఆలస్యం చేస్తున్నదని తెలిపారు. 1997లో నల్లగొండ - మాచర్ల మధ్య లైన్ మంజూరైనప్పటికీ.. 20 ఏండ్లు అయినా పనులు ప్రారంభం కాలేదని ఎంపీ గుర్తు చేశారు. పగిడిపల్లి - నల్లపాడు డబ్లింగ్ పనుల గురించి అడిగితే కేంద్రం పట్టించుకోలేదని తెలిపారు. జగ్గయ్యపేట - మేళ్లచెర్వు గూడ్స్ మార్గాన్ని ప్యాసింజర్ లైన్గా మార్చాలని రైల్వే జీఎంకు విజ్ఞప్తి చేశామని గుత్తా సుఖేందర్రెడ్డి స్పష్టం చేశారు. -
అలా అయితే బిల్లును అడ్డుకుంటాం: టీఆర్ఎస్ ఎంపీ
కరీంనగర్ : తెలంగాణలో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయకుండా ఏపీకి మాత్రమే ఇస్తూ పార్లమెంటులో బిల్లు పెడితే అడ్డుకుంటామని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ హెచ్చరించారు. కరీంనగర్లో ఎంపీ వినోద్ కుమార్ విలేకరులతో మాట్లాడారు. ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చడం లేదని విమర్శించారు. విభజన చట్టంలోని హామీలపై శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై కోర్టు వివరణ ఇవ్వాలని కోరారు. ఎవ్వరైనా చట్టాన్ని గౌరవించక తప్పదని చెప్పారు. -
అభివృద్ధిని అడ్డుకోవడమే కాంగ్రెస్ పని
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కొత్తగా ఏర్పడిన తెలంగాణలో జరుగుతున్న కనీవినీ ఎరుగని అభివృద్ధిని చూసి.. తమ ఉనికిని కోల్పోతామనే భయంతో కాంగ్రెస్ పార్టీ నేతలు అభివృద్ధి పనులను అడ్డుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నారని కరీంనగర్ ఎంపీ వినోద్కుమార్ విమర్శించారు. శనివారం కరీంనగర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రైతాంగానికి వరప్రదాయినిగా మారనున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు జరగకుండా అడుగడుగునా కాంగ్రెస్ మోకాలడ్డుతోందని ఆరోపించారు. కోర్టు కేసులను ఛేదించి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అనుమతులను సకాలంలో తీసుకువచ్చామన్నారు. ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ సాధించలేని ఘనతను టీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిందని, మహారాష్ట్ర సర్కార్తో మాట్లాడి అనుమతులు పొందామని ఎంపీ వినోద్ వివరించారు. చివరకు జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసి నాలుగు నెలలు పనులు అడ్డుకున్నారని అన్నారు. తెలంగాణ ఎంపీలమంతా ఢిల్లీలో మకాం వేసి కాంగ్రెస్ ఎత్తులను చిత్తుచేశామన్నారు.విభజన సమయంలో ఏపీలోని పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిదులు ఇచ్చేందుకు ఒప్పుకుని ఇప్పటికీ 9 వేల కోట్లు కట్టబెట్టిందన్నారు. అదే తరహాలో మన కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులు తెచ్చేందుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తామని అన్నారు. విలేకరుల సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, మేయర్ రవీందర్సింగ్, డిప్యూటీ మేయర్ గుగ్గిల్లపు రమేశ్, గ్రంథాలయ చైర్మన్ రవీందర్రెడ్డి, మైనార్టీ ఫైనాన్స్ చైర్మన్ అక్బర్హుస్సేన్ పాల్గొన్నారు. -
గ్యాస్ కనెక్షన్లు పెంచండి: ఎంపీ వినోద్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ కనెక్షన్ల మంజూరు సంఖ్యను పెంచాల్సిందిగా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్కు ఎంపీ వినోద్ కుమార్ విజ్ఞప్తి చేశారు. సోమవారం ఢిల్లీలో ఆయనను కలసిన వినోద్ వినతిపత్రాన్ని సమర్పించారు. అలాగే గ్యాస్ డీలర్లకు ఇస్తున్న కమీషన్ను పెంచాలని, వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. తెలంగాణలోని గ్రామీణ పాంత్రాల్లో గ్యాస్ సరఫరాకు వీలుగా రాష్ట్ర ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో ప్లాంట్లను ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం వినోద్ మీడియాతో మాట్లాడుతూ మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. ప్రదాన్ను కలసిన వారిలో గ్యాస్ డీలర్ల సమాఖ్య అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు దీపక్సింగ్ గెహ్లాట్ తదితరులు ఉన్నారు. -
ఎల్ఎండీ, మిడ్మానేరు కట్టిందెవరూ?
ఎంపీ వినోద్కుమార్పై జీవన్రెడ్డి ఫైర్ సాక్షి, జగిత్యాల: కరీంనగర్ ఎంపీ బి. వినోద్కుమార్పై సీఎల్పీ ఉపనేత తాటిపర్తి జీవన్రెడ్డి ధ్వజమెత్తారు. ‘గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో రూ. కోట్లు వృథా అయ్యాయని.. ఇలా చేస్తే ఇతర దేశాల్లో ఉరి తీసేవారని.. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు సాగు నీరందుతుందంటూ’ఎంపీ కవితతో కలసి ఆదివారం వినోద్కుమార్ చేసిన వ్యాఖ్యలపై జీవన్రెడ్డి స్పందించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘ఎల్ఎండీ, మిడ్మానేరు ఎవరి హయాంలో పూర్తయ్యాయి? 2004–09 వరకు వైఎస్ హయాంలో వరద కాలువ ప్రవహించింది నిజం కాదా? మిడ్మానేరు ప్రాజెక్టు పూర్తయి మూడేళ్లు గడుస్తున్నా ఇంతవరకు సాగునీరివ్వని దయనీయ స్థితి మీ ప్రభుత్వానిది కాదా?’ అని ప్రశ్నించారు. శాంతిగా ఉన్న సిరిసిల్ల జిల్లాను అప్రకటిత కల్లోలిత ప్రాంతంగా మార్చింది టీఆర్ఎస్సే అన్నారు. ప్రచార్భాటాలకే పరిమితమైన టీఆర్ఎస్ నేతలు ఎన్ని విశ్వప్రయత్నాలు చేసినా.. జగిత్యాలలో మాత్రం మాయ చేయలేరని స్పష్టంచేశారు. ప్రచారార్భాటాలకే పరిమితమైన టీఆర్ఎస్ నేతలు ఎన్ని విశ్వప్రయత్నాలు చేసిన జగిత్యాలలో మాత్రం మాయ చేయలేరని స్పష్టం చేశారు. -
ఎంపీ జన్మదినం తెచ్చిన తంటా
ఎంపీపీ సహా నలుగురి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల సస్పెన్షన్ వేములవాడ: కరీంనగర్ ఎంపీ బి.వినోద్కుమార్ జన్మదిన వేడుకలు టీఆర్ఎస్కు చెందిన నలుగురు ప్రజా ప్రతినిధుల సస్పెన్షన్కు దారి తీశాయి. వేములవాడ నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ స్థానిక ప్రజాప్రతినిధులు శని వారం ఎంపీపీ రంగు వెంకటేశ్గౌడ్ ఆధ్వర్యంలో ఎంపీ జన్మదిన వేడుకలను భారీఎత్తున నిర్వహించారు. తొలుత ర్యాలీ నిర్వహించారు. తన ఇలాఖాలో ఎంపీ జన్మదిన వేడుకలు నిర్వహించడం ఏమిటంటూ స్థానిక ఎమ్మెల్యే రమేశ్బాబు కోపోద్రిక్తులయ్యారు. వేడుకలు నిర్వహించినందుకు వివిధ కారణాలు చూపుతూ ఎంపీపీ రంగు వెంకటేశ్గౌడ్తోపాటు నాయకులు చిలుక పెంటయ్య, పూడూరి రాజిరెడ్డి, రాజాగౌడ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని ప్రకటించారు. వీరికి టీఆర్ఎస్ తో ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. ఈ చర్య గులాబీ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది. -
ఆస్ట్రేలియాలో ఎంపీ వినోద్కు ఘన స్వాగతం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు ముఖ్య అతిధిగా విచ్చేసిన కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్కు సిడ్నీ నగరంలో ఏటీఎస్ఏ సభ్యులు, టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శ్రేణుల ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. తనకు భారీ ఎత్తున స్వాగతం తెలిపిన ఆస్ట్రేలియాలోని తెలంగాణ వాసులకు ఎంపీ వినోద్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. జూన్ ౩వ తేదీన సిడ్నీ నగరంలో ఏటీఎస్ఏ ఆధ్వర్యంలో, 4న టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్వర్యంలో నిర్వహించబోయే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలో ముఖ్య అతిథిగా కరీంనగర్ ఎంపీ హాజరు కానున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, తెరాస ప్రభుత్వం చేస్తున్న పలు సంక్షేమ పథకాలపై జరిగే చర్చా కార్యక్రమాలలో, తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడుల కోసం వివిధ కంపెనీల ప్రతినిదులతో జరిగే సమావేశాలలో ఎంపీ పాల్గొంటారని, టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల తెలిపారు. -
రైతులపై కేసులు ఉపసంహరించుకోవాలి
ఉచిత ఎరువులకు దేశవ్యాప్తంగా ప్రశంసలు: ఎంపీ వినోద్ సాక్షి, సిరిసిల్ల: రైతు సంక్షేమంపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ప్రాజెక్టు నిర్మాణాలను అడ్డుకునే కోర్టు కేసులను ఉపసంహరించు కోవాలని కరీంనగర్ ఎంపీ బి.వినోద్కుమార్ డిమాండ్ చేశారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రొఫెసర్ కోదండరాం, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి హైకోర్టులో కేసులు వేయిస్తున్నారని ఆరోపించారు. సుందిళ్ల, మేడిగడ్డ, కాళేశ్వరం వద్ద నిర్మించే ప్రాజెక్టులను అడ్డుకోవడానికి కేసులు వేశారని గుర్తు చేశారు. రైతులకు పరిహారం పెంచాలని డిమాండ్ చేస్తే తప్పు లేదని అన్నారు. తొలకరి జల్లుపడగానే మే చివరలో రైతులు ఎరువులు కొనుగోలు చేయడానికి ఎకరాకు రూ.4 వేలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ప్రకటించగానే దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తాయని చెప్పారు. ఉచిత ఎరువుల పథకాన్ని తమ వద్ద కాపీ కొట్టారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారని, కానీ, కాంగ్రెస్ బుర్రలకు అలాంటి ఆలోచనలు రావని అన్నారు. -
టీఆర్ఎస్ ప్లీనరీ తీర్మానాల కమిటీ భేటీ
12 ప్రాధాన్య అంశాల గుర్తింపు: కేకే సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్లీనరీలో తీర్మానాలు ప్రవేశ పెట్టడానికి 12 ప్రాధాన్య అంశాలను గుర్తించామని టీఆర్ఎస్ ప్లీనరీ తీర్మానాల కమిటీ చైర్మన్, పార్టీ పార్లమెంటరీ నేత కె.కేశవరావు చెప్పారు. ఆయన నివాసంలో పార్టీ ప్లీనరీ తీర్మానాల కమిటీ శనివారం భేటీ అయింది. కమిటీ సభ్యులు ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్రావు, పల్లా రాజేశ్వర్రెడ్డి, పర్యాద కృష్ణమూర్తి హాజరయ్యారు. కమిటీ గుర్తించిన ప్రాధాన్య అంశాలను చర్చించి రాజకీయ తీర్మానాలు కూడా ఆమోదిస్తామని, సంక్షేమానికే ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. బీసీ, ఎంబీసీల అభివృద్ధి, ఎస్సీ ఎస్టీల ప్రత్యేక అభివృద్ధి ప్రణాళికలపై తీర్మానాలు ఉంటాయన్నారు. నీటిపారుదల రంగం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు తదితర తీర్మానాలు చేస్తామన్నారు. పదహారో ప్లీనరీని ఈ నెల 21న కొంపల్లిలోని జీబీఆర్ గార్డెన్స్లో, పార్టీ ఆవిర్భావ దినం సందర్భంగా 27న వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. -
అతిపెద్ద పర్యాటక కేంద్రంగా కరీంనగర్: ఎంపీ వినోద్
కరీంనగర్: అతిపెద్ద పర్యాటక కేంద్రంగా కరీంనగర్ మారనుందని ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. సేఫ్ అండ్ స్మార్ట్ సిటీలో భాగంగా నగరంలోని వైద్యుల వీధిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆదివారం ఎంపీ వినోద్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నగరాభివృద్దికి ప్రతిఒక్కరు సహకరించాలని కోరారు. స్మార్ట్ సిటీకి ఎంపికైన కరీంనగర్ను వెయ్యి కోట్ల నిధులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నామని ఎంపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కలెక్టర్ సర్పరాజ్ ఆహ్మద్, సీపీ కమలాసన్ రెడ్డిలు పాల్గొన్నారు. ఇప్పటికే పలు చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని జనసందడిగల ప్రతి ప్రదేశంలో సీసీ కెమెరాలు ఉన్నాయని సీపీ తెలిపారు. విద్యాసంస్థలు, హస్పిటల్, పంక్షన్ హాల్, షాపింగ్ మాల్స్, ప్రార్థన మందిరాలు టెంపుల్స్ ఏరియాలో ప్రజల బాగస్వామ్యంతో సిసి కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. -
రాష్ట్ర పథకాలకు కేంద్రం సాయం చేయాలి
లోక్సభలో ఎంపీ జితేందర్రెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తు న్న సంక్షేమ పథకాలకు కేంద్రం సాయం చేయాలని ఎంపీ జితేందర్రెడ్డి కోరారు. సోమవారం లోక్సభలో బడ్జెట్పై చర్చ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఉత్తర ప్రదేశ్ మాదిరిగా ఇతర రాష్ట్రాల్లో కూడా రైతు రుణమాఫీకి కేంద్రం సహకరించాలని కోరారు. కేంద్రం ఇటీవల ఆమోదించిన జాతీయ ఆర్యోగ పాలసీలో ఆశావర్కర్ల ప్రయోజనాలను విస్మరించిందని ప్రత్యేక ప్రస్తావన కింద ఎంపీ వినోద్ కుమార్ సభ దృష్టికి తీసుకొచ్చారు. గర్భిణీలు.. ప్రసవించే సమయంలో ప్రైవేట్ ఆస్పత్రిలో చేరితే ఆశావర్కర్లకు రాయితీ రావడం లేదని పేర్కొన్నారు. ఆశావర్కర్లకు రాయితీలు పెంచి వారికి రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ప్రోత్సాహకాలు అందజేయాలని కోరారు. -
కరీంనగర్–కాజీపేట రైల్వే లైన్పై సర్వే చేయాలి
లోక్సభలో కేంద్రాన్ని కోరిన ఎంపీ వినోద్ సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో వస్తు, ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించే దిశగా కాజీపేట–కరీంనగర్ రైల్వే మార్గానికి సర్వే చేయాలని టీఆర్ఎస్ ఎంపీ బి.వినోద్కుమార్ కేంద్రాన్ని కోరారు. మంగళవారం లోక్సభలో రైల్వే పద్దులపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. కాజీపేట నుంచి హసన్పర్తి రోడ్, ఎల్లాపూర్, హుజురాబాద్, శంకరపట్నం, మానకొండూరుల మీదుగా కరీంనగర్కు రైల్వే లైను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉందని పేర్కొన్నారు. ఈ 70 కి.మీ.లను అనుసంధానించడం ద్వారా కరీంనగర్, వరంగల్ ప్రజలకు మేలు జరుగుతుందని వివరించారు. ప్రస్తుతం పెద్దపల్లి–నిజామాబాద్ రైల్వే లైన్ ద్వారా కరీంనగర్.. రైల్వే సేవలు పొందుతోందని తెలిపారు. మనోహరాబాద్–కొత్తపల్లి ప్రాజెక్టుకు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారని, కాజీపేట్–కరీంనగర్ లింకును కూడా పూర్తిచేస్తే దక్షిణాది నుంచి వచ్చే రైళ్లను ఈ మార్గం ద్వారా మహారాష్ట్ర, గుజరాత్ తదితర పశ్చిమ ప్రాంతాలకు మళ్లించవచ్చని పేర్కొన్నారు. -
‘రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఖండిస్తున్నాం’
హైదరాబాద్సిటీ: తెలంగాణ మంత్రులు ఈటెల రాజేందర్, ఇంద్రకరణ్ రెడ్డిలపై కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ.. ఈటెల ప్రజల మనిషి అని, సమర్ధుడు కాబట్టే సీఎం కేసీఆర్ ఆర్ధిక, పౌరసరఫరాల శాఖలు ఇచ్చారన్నారు. కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ సైతం జీఎస్టీ మీటింగ్లో ఈటెలను అభినందించారని తెలిపారు. సీఎం ఆలోచనలకు అనుగుణంగా పని చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను కేంద్రం నుంచి రాబట్టేందుకు ఈటెల చక్కగా కృషి చేస్తున్నారని అన్నారు. ఆయన చేస్తున్న కృషి పేద ప్రజలకు తెలుసు, కానీ రేవంత్ రెడ్డి లాంటి పెద్దోళ్ళకు ఎం తెలుసు ? అని ఎద్దేవా చేశారు. ఈటెల సంక్షేమ హాస్టల్లో చదువుకున్న వ్యక్తి అని, కులవృత్తులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించడాన్ని కొందరు బీసీ నాయకులు తప్పు పట్టడం దురదృష్టకరమని ఎంపీ వినోద్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఏదైనా మాట్లాడాలనుకుంటే అసెంబ్లీలో మాట్లాడొచ్చు. మంత్రులను దోషులనడం సమంజసం కాదన్నారు. -
తెలంగాణలో 4 కోట్ల మంది పాలన
-
తెలంగాణలో 4 కోట్ల మంది పాలన
దిగ్విజయ్ ‘నలుగురి పాలన’ వ్యాఖ్యలపై ఎంపీ వినోద్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నలుగురి పాలనే నడుస్తోందంటూ కాంగ్రెస్ అగ్రనేత దిగ్విజయ్సింగ్ చేసిన విమర్శలపై టీఆర్ఎస్ ఎంపీ వినోద్కుమార్ మండిపడ్డారు. తెలంగాణలో నడుస్తున్నది నలుగురి పాలన కాదని.. నాలుగు కోట్ల మంది పాలన అని పేర్కొన్నారు. ప్రజలంతా ఈ ప్రభుత్వం తమ దని భావిస్తున్నారని చెప్పారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవమున్న దిగ్విజయ్ ఈ విషయంలో కనీసపరిజ్ఞానం లేకుండా మాట్లాడటం శోచనీ యమని వ్యాఖ్యా నించారు. కేసీఆర్ పాలన బాగుండబట్టే ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ లో తెలంగాణకు మొదటి ర్యాంక్ వచ్చిం దన్నారు. శనివారం ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాస్రెడ్డితో కలసి వినోద్ విలేకరులతో మాట్లాడారు. -
‘వితంతు’ కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి
ఎంపీ వినోద్కుమార్ హుజూరాబాద్: భర్తను కోల్పోయిన మహిళల కోసం ప్రత్యేకంగా ‘వితంతు’కార్పొరేషన్ ఏర్పాటు విషయం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని ఎంపీ వినోద్కుమార్ పేర్కొన్నారు. హుజూరాబాద్లో వితంతు వివక్షత విముక్తి ఉద్యమ సమాఖ్య, బాల వికాస సంయుక్త ఆధ్వర్యంలో ‘మూఢ∙నమ్మకాల నిర్మూలన–వితంతు హక్కుల పరిరక్షణ’అనే అంశంపై సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో వినోద్కుమార్ మాట్లాడుతూ.. భార్య మృతి చెందితే భర్తలకు వెంటనే పెళ్లి చేస్తుంటారని, అదే మహిళల విషయంలో నిర్లక్ష్యం తగదన్నారు. వితంతువును పెళ్లి చేసుకున్న వారికి కల్యాణలక్ష్మి పథకంలో రూ.లక్షతో పాటుగా, డబుల్ బెడ్రూం ఇంటిని ఇచ్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. వితంతువుల పిల్లలకు నవోదయ స్కూళ్లలో రిజర్వేషన్ కోసం ఆ శాఖ మంత్రికి లేఖ రాస్తానన్నారు. బాల వికాస్ డైరెక్టర్ శౌరీరెడ్డి, ఏరియా ఇన్చార్జ్ ప్రతాపరెడ్డి, రాష్ట్ర వినియోగదారుల సంఘం సమాఖ్య అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హామీల అమలులో కేంద్రం విఫలం
మండిపడ్డ ఎంపీ వినోద్ కుమార్ సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్రం ప్రభుత్వం విఫలమైందని ఎంపీ వినోద్ కుమార్ విమర్శించారు. బుధవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణలో ఎయిమ్స్ ఏర్పాటు, హైకోర్టు విభజన, అసెంబ్లీ స్థానాల పెంపులాంటి హామీలు విభజన చట్టంలో ఇచ్చిన కేంద్రం వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర విభజన జరిగి రెండున్నరేళ్లు కావస్తున్నా కేంద్రం ఇప్పటికీ హైకోర్టు విభజన చేయలేదన్నారు. పార్లమెంటు సమావేశాల్లో బడ్జెట్ ఓటింగ్కు వచ్చేముందైనా ఎయిమ్స్పై ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణపై కేంద్ర నిర్లక్ష్య ధోరణికి నిరసనగా పార్లమెంటు సమావేశాలకు వెళ్లకూడదని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. సమావేశంలో చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిన కాంగ్రెస్ నేతలు
న్యూశాయంపేట : ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిన కాం గ్రెస్ నేతలు మరోసారి ఎంపీ వినోద్కుమార్పై అవాకులు చె వాకులు పేలితే జనం తరిమి కొడతారని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు అన్నారు. మంగళవారం హన్మకొండ రాంనగర్లోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మచ్చలేని వ్యక్తి ఎంపీ వినోద్కుమార్పై పొన్నం ప్రభాకర్ వి మర్శలు చేయడం ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. కాంగ్రెస్ నాయకులు ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేతలు ఢిల్లీ నుంచి గల్లీ దా కా వచ్చి సవాళ్లు విసురుతున్న తీరు చూస్తే వారి మానసిక స్థితి ఏ స్థాయికి చేరుకుందో అర్థం చేసుకోవాలన్నారు. టీఆర్ఎస్ రాష్ట్రాభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తుడంతో ఆ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరుతున్నారన్నా రు. అనంతరం గొర్రెలు,మేకల పెంపకందారుల కార్పొరేషన్ చైర్మన్ కన్నెబోయిన రాజయ్యయాదవ్ మాట్లాడుతూ మాజీ ఎంపీగా హుందాతనంతో మాట్లాడాల్సిన పొన్నం పొన్నం ప్రభాకర్ పిల్లాడిలా మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. చేసిందే చెప్పే వ్యక్తి ఎంపీ వినోద్కుమార్ గురించి మాజీ ఎంపీ పొన్నం ఒంకర టింకరగా మాట్లాడం తగదని, ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. కమలాపూర్ ఏర్పా టు కానున్న ఎల్పీజీ గ్యాస్ ప్లాంట్ మంజూరు అయింది కాం గ్రెస్ హయాంలో అయినా ఎంపీ వినోద్కుమార్, మంత్రి ఈ టల రాజేందర్ కృషితో పూర్తిస్తాయి పరిపాలన అనుమతులు వచ్చాయన్నారు. సమావేశంలో నాయకులు గుడిమళ్ల రవికుమార్, జన్ను జకార్య, కార్పొరేటర్లు జోరిక రమేష్, చింతల యాదగిరి, మైనారిటీ నాయకుడు ఎండీ.నయీముద్దీన్, తదితరులు పాల్గొన్నారు. -
సీతారాం ఏచూరితో మంద కృష్ణ భేటీ
వర్గీకరణకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి సాక్షి, న్యూఢిల్లీ: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ బుధవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వం వర్గీకరణకు సముఖత చూపుతున్న తరుణంతో.. తదుపరి తమకు మద్దతు ఇవ్వాలని ఏచూరిని కోరినట్టు మంద కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీ ఎంపీ వినోద్కుమార్తో మంద కృష్ణ సమావేశమై వర్గీకణకు మద్దతివ్వాలని కోరారు. ఆరెకటిక కులాన్ని ఎస్సీలో చేర్చండి: ఆరెకటిక కులాన్ని ఎస్సీ జాబితాల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆరెకటిక పోరాట సమితి బుధవారం ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ధర్నా చేపట్టింది. దేశంలోని 12 రాష్ట్రాల్లో ఆరెకటిక కులాన్ని ఎస్సీ జాబితాల్లో చేర్చారని, అరుుతే రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బీసీ-డీలో ఉన్నారని సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు జి.సుధాకర్ తెలిపారు. -
వర్షాల వల్ల రూ.2,740 కోట్ల నష్టం
లోక్సభలో ఎంపీ వినోద్ సాక్షి, న్యూఢిల్లీ: ఈ ఏడాది సెప్టెంబర్లో కురిసిన భారీ వర్షాల వల్ల తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లిందని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ మంగళవారం లోక్సభలో జీరో అవర్లో కేంద్రం దృష్టికి తీసుకొచ్చారు. వ్యవసాయ పంటలు, రహదారులు దెబ్బతిని రూ.2,740 కోట్ల మేర నష్టం ఏర్పడిందని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన నివేదికను కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇది వరకే అందజేశారన్నారు. ఈ నివేదిక మేరకు రాష్ట్రానికి నష్టపరిహారం కింద నిధులివ్వాలని కేంద్రాన్ని కోరారు. -
ప్రైవేట్ మెంబర్ బిల్లుపై నేడు చర్చ!
రాష్ట్రానికి ఆర్థిక సాయంపై లోక్సభలో ప్రవేశపెట్టిన ఎంపీ వినోద్ సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి ఏపీలో అభివృద్ధికి నోచుకోని తెలంగాణలో వెనుకబడిన షెడ్యూల్డ్ కులాలు, గిరిజనులు, మైనారిటీల సంక్షేమానికి ప్రత్యేక ఆర్థిక సహా యాన్ని అందివ్వాలని కోరుతూ టీఆర్ఎస్ ఎంపీ బి.వినోద్కుమార్ లోక్సభలో ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లు శుక్రవారం సభలో చర్చకు రానుంది. గతంలో తెలంగాణలో 10 జిల్లాలు ఉన్నప్పుడు అందులో 9 జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా కేంద్రం గుర్తించిందన్నారు. ఈ 9 జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు వెనుకబడిన ప్రాంతాల గ్రాంట్ కూడా రావడం లేదన్నారు. -
గుజరాత్కు మంత్రి ఈటెల బృందం: ఎంపీ వినోద్
న్యూ ఢిల్లీ: సబర్మతి నదీ పరీవాహక ప్రాంత తరహాలో కరీంనగర్లోని మిడ్మానేరును అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సంకల్పించిందని ఎంపీ వినోద్ తెలిపారు. అందులో భాగంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఆధ్వర్యంలోని బృందం శనివారం అహ్మదాబాద్లోని సబర్మతి నదిని పరిశీలించడానికి వెళ్లనుందని తెలిపారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో జాతీయ ఉపరితల రవాణా శాఖ కార్యదర్శి సంజయ్ మిత్రను కలసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో జాతీయ రహదారుల కోసం ప్రకటించిన నిధులు వెంటనే విడుదల చేయాలని, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న రోడ్డు నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని కోరినట్టు ఆయన తెలిపారు. జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణను త్వరితగతిన పూర్తి చేస్తే.. వెంటనే పనులు ప్రారంభించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని సంజయ్మిత్ర చెప్పినట్టు వినోద్ తెలిపారు. -
ప్రజాభీష్టం మేరకే కొత్త జిల్లాలు
ఎంపీ వినోద్ సాక్షి, హైదరాబాద్: ప్రజల అభీష్టం మేరకే కొత్త జిల్లాలు ఏర్పాటవుతున్నాయని, ఇందులో రాజకీయకోణం లేదని కరీంనగర్ ఎంపీ బి.వినోద్కుమార్ అన్నారు. ప్రజలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో సిరిసిల్ల, జనగామ, గద్వాల జిల్లాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావును కోరామని చెప్పారు. పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్లతో కలసి ఆయన సోమవారం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం పది జిల్లాల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమై అభిప్రాయాలు సేకరించారని చెప్పారు. గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ సరైన ఫార్మాట్లో రాజీనామా లేఖ ఇవ్వలేదని, స్పీకర్ దానిని చెత్తబుట్టలో వేస్తారని, అసలు అది రాజీనామానే కాదని అన్నారు. ఎంపీ సుమన్ మాట్లాడుతూ డీకే అరుణ గద్వాల ప్రజల పక్షాన నిలబడలేదని, దానికి ఆమె రాజీనామా చేసిన ఫార్మాటే సాక్ష్యమని అన్నారు. కరీంనగర్ జిల్లాను నాలుగు జిల్లాలు చేయమని జిల్లా నేతలమంతా సీఎంను కోరినట్లు చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగానే జిల్లాల ఏర్పాటు ప్రక్రియ జరుగుతోందని, రాజ్యాంగానికి లోబడే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదలైందన్నారు. తెలంగాణ కన్నా చిన్న రాష్ట్రాల్లో ఎక్కువ జిల్లాలు ఉండి అభివృద్ధి చెందుతున్నాయనే విషయాన్ని గత పాలకులు గ్రహించలేకపోయారని అన్నారు. ఎమ్మెల్యే రమేష్ మాట్లాడుతూ పారదర్శకంగా సమస్యలపై చర్చించి సీఎం సానుకూల నిర్ణయాలు తీసుకుంటున్నారని, సిరిసిల్ల జిల్లా ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసిన సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. విలేకరుల సమావేశంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు కూడా పాల్గొన్నారు. -
అభివృద్ధి సంక్షేమమే ప్రభుత్వ ఎజెండా
ఎంపీ వినోద్కుమార్ ఇల్లంతకుంటలో సబ్పోస్టల్ కార్యాలయం ప్రారంభం ఇల్లంతకుంట: అభివృద్ధి సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ఎజెండా అని కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. శనివారం ఇల్లంతకుంటలో సబ్పోస్టల్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణ నిర్మాణమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ముందడుగు వేస్తున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ పథకాలను ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని ఆరోపించారు. ప్రజలకు మెరుగైన∙సేవలందించేందుకే ఇల్లంతకుంటలో సబ్పోస్టల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని.. సుకన్య యోజన పథకం ద్వారా ఆడపిల్లల పేరుమీద 14 ఏళ్లు డబ్బులు జమచేస్తే 20 సంవత్సరాలకు రెట్టింపు వస్తాయన్నారు. మెరుగైన పాలన అందించేందుకే ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, పోస్టల్ సూపరిండెంట్ పండరి, ఎంపీపీ ఐలయ్య, జెడ్పీటీసీ సిద్దం వేణు, మార్కెట్ చెర్మన్ సరోజన, సెస్ డైరెక్టర్ వెంకటరమణారెడ్డి, సర్పంచ్ సంజీవ్, సింగిల్విండో చెర్మన్లు రాఘవరెడ్డి, రవిందర్రెడ్డి, ఎంపీటీసీ భాస్కర్ పాల్గొన్నారు. సర్కారు పాఠశాలల్లో నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యనందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఎంపీ వినోద్కుమార్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. ఎమ్మార్సీ కార్యాలయంలో ఆంగ్లబోధనపై ఉపాధ్యాయులకు జరుగుతున్న శిక్షణ తరగతులను పరిశీలించారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించి మెరుగైన విద్యనందిస్తే ప్రైవేటు పాఠశాలలకు విద్యార్థులు వెళ్లరని తెలిపారు. సమయపాలన పాటించి నాణ్యమైన విద్యనందించేందుకు కృషి చేయాలని సూచించారు. -
అంబేద్కర్ స్టేడియం సుందరీకరణకు రూ.10 లక్షలు
పరిశీలించిన ఎంపీ, ఎమ్మెల్యే అథ్లెటిక్ పోటీలను విజయవంతం చేయాలి కరీంనగర్ స్పోర్ట్స్ : జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో అక్టోబర్ 4, 5 తేదీల్లో జరిగే సౌత్ ఇండియా అథ్లెటిక్ పోటీలను అట్టహాసంగా నిర్వహించాలని ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. జిల్లా కీర్తిని జాతీయస్థాయిలో ఇనుమడింపజేయాలని, స్టేడియం సుందరీకరణకు ఎంపీ, ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.10లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. స్టేడియంలో అథ్లెటిక్ పోటీలు జరగనున్న నేపథ్యంలో వారు స్టేడియాన్ని సోమవారం పరిశీలించారు. అథ్లెటిక్ ట్రాక్, స్టేడియంలోని మైదానాలు చూశారు. స్టేడియానికి కావాల్సిన వాటిపై నివేదికలు ఇవ్వాలని డీఎస్డీఓకు సూచించారు. మైదానంలో నీరు నిలుస్తున్నందున డ్రెయినేజీ వ్యవస్థను బాగా చేయించుకుని సుందరంగా తీర్చిదిద్దేలా చేయాలన్నారు. సింథటిక్ ట్రాక్ను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. రూ.10లక్షలతో గ్యాలరీలకు రంగులు వేయాలని, మరమ్మతు పనులకు వినియోగించాలని డీఎస్డీఓ శివకుమార్కు సూచించారు. అథ్లెటిక్ పోటీలను విజయవంతం చేయాలి రాష్ట్ర, జిల్లా అథ్లెటిక్ సంఘాల ఆధ్వర్యంలో అక్టోబర్ 4,5 తేదీల్లో జరగనున్న దక్షిణ భారతస్థాయి అథ్లెటిక్ పోటీలను విజయవంతంచేయాలని పోటీల నిర్వహణ కమిటీ చీఫ్ ప్యాట్రన్, ఎంపీ వినోద్ కుమార్, చైర్మన్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. స్టేడియం పరిశీలించిన అనంతరం వారు విలేకరులకు పోటీల వివరాలను వెల్లడించారు. అండర్ 16, 18, 20, 22 బాలబాలికలకు నిర్వహించే ఈ పోటీలకు 7రాష్ట్రాల నుంచి సుమారు 900 మంది క్రీడాకారులు హాజరుకానున్నారని తెలిపారు. క్రీడాకారులకు ఉచితభోజన వసతిని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కరీంనగర్ మేయర్, పోటీల అధ్యక్షుడు రవీందర్ సింగ్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్రెడ్డి, జిల్లా అథ్లెటిక్ సంఘం అధ్యక్షుడు, పోటీల నిర్వహణ కార్యదర్శి నందెల్లి మహిపాల్, డీఎస్డీవో శివకుమార్, యోగా సంఘం కార్యదర్శి సిద్దారెడ్డి పాల్గొన్నారు. -
వ్యవసాయానికి ప్రభుత్వం వెన్నుదన్ను
అనవసర భూసేకరణ చేయం ప్రతిపక్షాలది స్వార్థబుద్ధి అందుకే రాద్ధాంతం : ఎంపీ వినోద్ తిమ్మాపూర్ : రాష్ట్రప్రభుత్వం వ్యవసాయరంగానికి వెన్నుదన్నుగా నిలుస్తోందని, అందుకే ప్రతి ఎకరాకూ నీరు అందించి సస్యశ్యామలం చేసేందుకు ప్రణాళికతో ముందుకెళ్తోందని ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టం చేశారు. బుధవారం తిమ్మాపూర్లో మహాత్మజ్యోతిబాపూలే బాలికల గురుకుల కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కేజీబీవీ పాఠశాలను పరిశీలించారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ మూడునెలల్లో వెయ్యి టీఎంసీల నీరు కాళేశ్వరం మీదుగా వృథాగా సముద్రం పాలయ్యాయని, ఆ నీటిని నిల్వ చేసేందుకే మేడిగడ్ద వద్ద ప్రాజెక్టు నిర్మించేందుకు ప్రభుత్వం సంకల్పించిందని, దీనిని ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. ప్రాజెక్టులను అడ్డుకునేప్రయత్నం మంచిదికాదని హితవుపలికారు. ప్రాజెక్టులు అవసరమున్న చోటే భూసేకరణ చేస్తామని, అనవసరంగా ఒక్క ఎకరా తీసుకోబోమని స్పష్టం చేశారు. రైతులకు నీరందితే తమకు భవిష్యత్తు ఉండదని కొన్ని దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. ఎన్సీడీసీ పథకానికి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ పథకం కింద జిల్లాకు రూ.60కోట్లు వచ్చాయన్నారు. పంటల నష్టం, రైతుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. జెడ్పీ వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, ఎంపీపీ ప్రేమలత, జెడ్పీటీసీలు పద్మ, శరత్రావు, కరీంనగర్ ఏఎంసీ చైర్మన్ గోగూరి నర్సింహారెడ్డి, వైస్ ఎంపీపీ భూలక్ష్మీ, సర్పంచ్ మాతంగి స్వరూప, ఎంపీటీసీ సుగుణమ్మ, ఎంపీడీవో పవన్కుమార్, తహసీల్దార్ కోమల్రెడ్డి, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ నాగభూషణచారి, ప్రజాప్రతినిధులు, నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
ఎన్ఆర్ఐలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలి
వర్జీనియా: అమెరికాలోని ఎన్ఆర్ఐలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కరీంనగర్ ఎంపీ వినోద్కుమార్ కోరారు. అమెరికా పర్యటనలో భాగంగా నిజామాబాద్ ఎమ్మెల్యే గణేశ్గుప్తతో కలిసి వర్జీనియాలో శనివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఎంపీ వినోద్కుమార్ మాట్లాడుతూ, అమెరికా వంటి అగ్రదేశంలో ఉపాధి పొందుతున్న ఎన్ఆర్ఐలు తెలంగాణలోనే పెట్టుబడులు పెట్టి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని కోరారు. హైదరాబాద్తో పాటు ప్రధాన నగరాల్లో పెట్టుబడులు పెట్టేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్నారని వివరించారు. నిర్వాహకులు రవి పల్ల, ఉజ్జల భూమేశ్, జయంతి, రాజేశ్ మందారెడ్డి, జయంత్చంద్ తదితరులు పాల్గొన్నారు. -
యూరప్ దర్శకురాలికి ఎంపీ విందు
సప్తగిరికాలనీ: శాతవాహన విశ్వవిద్యాలయంలో మూడురోజులుగా థియేటర్ వర్క్షాప్పై అవగాహన కల్పిస్తున్న యూరప్ దేశానికి చెందిన దర్శకురాలు మాయాతెంగ్బర్గ్ గిరిచిన్ను ఆదివారం ఎంపీ వినోద్కుమార్ విందుకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీ ఆమెతో మాట్లాడారు. స్వీడన్, ఫిన్లాండ్, జర్మనీ సంస్కృతులు అడిగి తెలుసుకున్నారు. స్మార్ట్ సిటీ సాధనలో భాగంగా ఆర్ట్ కల్చర్కు ప్రాధాన్యతను పెంపొందించడానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఉన్నారు. -
దత్తత గ్రామాల్లో వీర్నపల్లికి 11వస్థానం
తెలంగాణలో ఎంపికైన ఏకైక దత్తత గ్రామం సాగి వెబ్సైట్లో పొందుపర్చిన అధికారులు మండల పరిషత్లో సంబరాలు ఎల్లారెడ్డిపేట: ఎంపీ వినోద్కుమార్ దత్తత తీసుకున్న వీర్నపల్లి గ్రామానికి దేశంలో 11వస్థానం దక్కింది. దేశంలో ఎంపీలు 756 గ్రామాలను దత్తత తీసుకోగా.. అభివృద్ధిలో 50గ్రామాలను ఎంపిక చేశారు. మొదటిదఫాలో 15 దత్తత గ్రామాలను అభివృద్ధిలో ఎంపిక చేయగా.. అందులో 11వ స్థానంలో వీర్నపల్లికి చోటు లభించింది. కేంద్ర ప్రభుత్వ సాగి వెబ్సైట్లో ఎంపిక గ్రామాలను పొందుపర్చారు. అందులో వీర్నపల్లికి 11వ స్థానం లభించడంతో బుధవారం మండల పరిషత్లో ప్రజాప్రతినిధులు, అధికారులు సంబరాలు జరుపుకున్నారు. నాడే సాగి బృందం ప్రశంస ఎంపీలు దత్తత తీసుకున్న గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ సాగి బృందం సభ్యులు పర్యటించారు. గతనెల 28న వీర్నపల్లిలో సభ్యులు కుషాల్పతాక్, సతీష్రాజన్సిన్హా, అమీత్జైన్ వీర్నపల్లికి వచ్చారు. వీర్నపల్లికి జాబితాలో చోటు ఉంటుందని వారు అప్పుడే చెప్పారు. అదేరోజు మంత్రి కేటీఆర్ ఎంపీ వినోద్కుమార్, కలెక్టర్ నీతూప్రసాద్తో కలిసి గ్రామంలో పర్యటించారు. అభివృద్ధి పనులు, వందశాతం అక్షరాస్యత, బ్యాంకు, కుట్టు శిక్షణకేంద్రం, రోడ్లు ఇతర సౌకర్యాలపై సాగి సభ్యులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బుధవారం సాగి వెబ్సైట్లో దత్తతలో వీర్నపల్లికి 11వ స్థానం కల్పించడంతో తెలంగాణలోనే ఎంపీలు దత్తత తీసుకున్న గ్రామాల్లో ఏకైక గ్రామంగా ఎంపిక కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. -
'మహారాష్ట్రతో చారిత్రాత్మక ఒప్పందం'
హైదరాబాద్: మహారాష్ట్ర ప్రభుత్వంతో మంగళవారం చారిత్రాత్మకమైన ఒప్పందం జరగనుందని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. హైదరాబాద్లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ...కాంగ్రెస్ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రాజెక్టులపై కాంగ్రెస్ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని వినోద్ అన్నారు. ప్రజలను అబద్ధాలతో నమ్మించాలని చూస్తున్నారని మండిపడ్డారు. పదేళ్లలో మేడిగడ్డను కాంగ్రెస్ ఎందుకు నిర్మించలేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ను చూసి పారిపోయినవారు...కొత్త ప్రచారం చేస్తున్నారని వినోద్ చెప్పారు. -
వీర్నపల్లికి పదోస్థానం
ముకరంపుర: సంసద్ ఆదర్శ గ్రామ యోజన పథకం కింద జాతీయస్థాయిలో వీర్నపల్లి పదో స్థానంలో నిలిచిందని కరీంనగర్ ఎంపీ వినోద్కుమార్ తెలిపారు. శనివారం ఎంపీ ల్యాండ్ వినియోగంపై సమీక్షించారు. ఇటీవల గ్రామంలో పర్యటించిన కేంద్ర బృందం 50వ ర్యాంకు నుంచి 10వ ర్యాంకుకు తెచ్చిందన్నారు. మంజూరైన 439 పనుల్లో 313 పూర్తయినట్లు తెలిపారు. మిగిలినవి ప్రగతిలో ఉన్నాయని తెలుసుకున్నారు. సీసీ రోడ్లు నాణ్యతతో ఉండాలలని, కమ్యూనిటీహాల్స్ త్వరగా పూర్తి చేయాలన్నారు. సిరిసిల్ల ఆస్పత్రిలో లేబర్ రూంలో ఏసీలను రూ.5లక్షలతో మంజూరు చేసినట్లు తెలిపారు. ఏజేసీ నాగేంద్ర, డీఆర్వో వీరబ్రహ్మయ్య, సీపీవో సుబ్బారావు, ఏవో రవీందర్, తహసీల్దార్ జయచంద్ర పాల్గొన్నారు. -
మొక్కలను సంరక్షించాలి
కరీంనగర్రూరల్ : హరితహారంలో భాగంగా కరీంనగర్ మండలం ఎలగందల్లో గురువారం 50వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎంపీ వినోద్కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. వారు మాట్లాడుతూ మొక్కలను నాటడంతోపాటు సంరక్షించే బాధ్యతను తీసుకోవాలన్నారు. ఎంపీపీ వాసాల రమేశ్, జెడ్పీటీసీ సభ్యులు ఎడ్ల శ్రీనివాస్, ఎం.డీ జమీలొద్దీన్, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు నిమ్మల అంజయ్య, సర్పంచ్ ప్రకాశ్, ఎంపీటీసీ రామస్వామి, తహశీల్దార్ జయచంద్రారెడ్డి, ఎంపీడీవో దేవేందేర్రాజు, ఈజీఎస్ ఏపీవో శోభ, ఆర్టీఏ సభ్యులు రమేశ్ పాల్గొన్నారు. రేకుర్తిలో సర్పంచ్ నందెల్లి పద్మప్రకాశ్ ఆధ్వర్యంలో ఖర్జురా, ఈత మొక్కలు నాటారు. ఉపసర్పంచ్ కృష్ణకుమార్, ఎంపీటీసీ శేఖర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. -
లీకేజీ ఎన్నాళ్ల నుంచో బయటపడాలి : ఎంపీ వినోద్
కరీంనగర్ : ఎంసెట్ లీకేజీ వ్యవహారం ఎన్నేళ్ల నుంచి జరుగుతుందో బయటపడబోతుందని కరీంనగర్ ఎంపీ బి.వినోద్కుమార్ అన్నారు. శనివారం కరీంనగర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ లీకేజీ వ్యవహారంలో తిమింగలాన్ని తమ ప్రభుత్వం పట్టుకొందని, మొత్తం డొంక కదులుతోందన్నారు. సీఎం, మంత్రులు రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న డిమాండ్ను ఆయన కొట్టిపారేశారు. తామే దొంగలను పట్టుకొని, ఎప్పటి నుంచి దొంగతనం జరుగుతుందనేది ఆరా తీస్తుంటే కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. ఎంసెట్ లీకేజీ ఐదేండ్లు, పదేండ్లు... ఎప్పటినుంచి జరుగుతుందనేనిది త్వరలో తెలుస్తుందన్నారు. అప్పుడు ఆ లీకేజీకి ఎవరు మద్దతునిచ్చారనేది కూడా బయటపడుతుందన్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. -
జీఎస్టీ బిల్లుకు మద్దతిస్తాం: ఎంపీ వినోద్
న్యూఢిల్లీ: పార్లమెంట్లో వస్తు సేవల పన్ను(జీఎస్టీ) బిల్లుకు టీఆర్ఎస్ మద్దతిస్తుందని ఎంపీ వినోద్ వెల్లడించారు. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ముఖ్యమంత్రి కేసీఆర్తో ఆదివారం టీఆర్ఎస్ ఎంపీలు సమావేశమయ్యారు. అనంతరం వినోద్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అపరిష్కృత సమస్యలపై సోమవారం కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలుస్తారని తెలిపారు. పార్లమెంట్లో హైకోర్టు విభజన అంశంపై పోరాడుతామని మరో ఎంపీ జితేందర్ రెడ్డి తెలిపారు. అంశాలవారిగా కేంద్రానికి సహకారం అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. -
'న్యాయం కోరితే సస్పెండ్ చేయడం బాధాకరం'
ఢిల్లీ: తెలంగాణ జడ్జిల సస్పెన్షన్ను వెంటనే వెనక్కి తీసుకోవాలని కరీంనగర్ ఎంపీ వినోద్ డిమాండ్ చేశారు. ఢిల్లీలో మంగళవారం ఆయన మాట్లాడుతూ న్యాయాధికారులు న్యాయం చేయాలని కోరితే సస్పెండ్ చేయడం బాధాకరమన్నారు. హైకోర్టు విభజన, న్యాయమూర్తుల సస్పెన్షన్పై కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, సదానంద గౌడ్ లను కలుస్తామని వినోద్ చెప్పారు. -
పింఛనీయండి సారూ..!
కరీంనగర్: ఈమె కోమిడి రాధమ్మ. వయసు అరవై ఏళ్లు. ఊరు కరీంనగర్ జిల్లా కదిపికొండ. భర్త కోమిడి వెంకట్రెడ్డి. స్వాతంత్య్ర సమరయోధుడు. అనారోగ్యంతో భర్త మరణించిన తరువాత రెండేళ్ల వరకు ఆయన పింఛన్ రాధమ్మకు వచ్చింది. కుటుంబానికి ఇదే ఆధారం. కానీ ఏం జరిగిందో తెలియదు... సర్కారోళ్లు ఐదేళ్లుగా ఆమె పింఛన్ నిలిపివేశారు. ఏమిటని అడిగితే స్పందించిన అధికారి లేడు. ఎంపీ వినోద్ లెటర్ సాయంతో ఢిల్లీలో పెన్షన్ ఆఫీసుకు వెళితే... హైదరాబాద్కు పంపిస్తాం వెళ్లమని అక్కడి అధికారులు చెప్పారు. అయినా రాధమ్మకు నేటికీ పెన్షన్ అందలేదు. సీఎంను కలసి తన గోడు వినిపించుకొందామని సోమవారం సచివాలయానికి వచ్చారు. కానీ లోపలికి వెళ్లేందుకు అధికారులు అనుమతించలేదు. ‘రాత్రి నుంచి జ్వరం. పొద్దుటి నుంచి తిండి ముట్టలేదు. నా బాధ ఎవరితో చెప్పుకోవాలి? భర్త చనిపోయినప్పటి నుంచీ బతుకు భారమైపోయింది. చనిపోవాలనిపిస్తోంది’ అంటూ సచివాలయంలో మీడియా ప్రతినిధుల ముందు రాధమ్మ కంటనీరు పెట్టుకున్నారు. ఓ ప్రమాదంలో గాయపడ్డ తన కుమారుడికి భార్య, ఇద్దరు పిల్లలు. ప్రైవేట్లు చెప్పుకుని చాలీచాలని జీతంతో బతుకీడుస్తున్న అతడికి భారం కాకూడదని తాను విజయవాడ సమీపంలోని ఓ అనాథ ఆశ్రమంలో తలదాచుకొంటున్నానని, తనకు పింఛన్ ఇప్పించాలని ఆమె దీనంగా వేడుకోవడం అక్కడి వారిని కదిలించింది. -
ఎంపీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి
చేతులకు సంకెళ్లతో వినూత్న నిరసన హుస్నాబాద్: హుస్నాబాద్ను జిల్లా కేంద్రం ఏర్పాటు చేసి ఎంపీ వినోద్కుమార్ మాట నిలబెట్టుకొవాలని స్థానిక జిల్లా సాధన సమితి నాయకులు డిమాండ్ చేశారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో సోమవారం జిల్లా సాధన సమితి నాయకులు చేతులకు సంకెళ్లతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మట్లాడుతూ ఎన్నికల ముందు హుస్నాబాద్ జిల్లా కేంద్రం ఏర్పాటుకు అన్ని అవకాశాలున్నాయని ఎంపీ వినోద్కుమార్ తెలిపారని అన్నారు. ఎన్నికల ముందు ఎవరు అడగకముందే హామీలు గుప్పించి, ప్రస్తుతం జిల్లాల పునర్విభజన పేరుతో ప్రజలను గందరగోళంలో పడేస్తున్నారని విమర్శించారు. కరువు దృష్టిని మళ్లించేందుకే సీఎం కేసీఆర్ జిల్లాల లొల్లి తెరపైకి తెచ్చాడని అన్నారు. రాజకీయ సౌలభ్యం కోసం నియోజకవర్గాన్ని, మండలాలను చీలిస్తే ప్రజలు వ్యతిరేక పోరాటాలు చేస్తారని అన్నారు. హుస్నాబాద్ను జిల్లా చేయడం వీలుకాకపోతే, హుస్నాబాద్కు ఆర్డీఓ కార్యాలయం మంజూరు చేసి కరీంనగర్లోనే హుస్నాబాద్ను ఉంచాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆకాంక్షను పరిగణలోకి తీసుకొని కొత్త జిల్లాల ఏర్పాటును ప్రకటించాలని లేనిపక్షంలో ప్రత్యేక జిల్లా కోసం పోరుబాట తప్పదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షుడు బొలిశెట్టి శివయ్య, డీసీసీ అధికార ప్రతినిధి కేడం లింగమూర్తి, హుస్నాబాద్ జిల్లా సాధన సమితి కన్వీనర్ అయిలేని మల్లికార్జున్రెడ్డి, కో కన్వీనర్లు దొడ్డి శ్రీనివాస్, వరయోగుల శ్రీనివాస్, కాంగ్రెస్,బీజేపీ, టీడీపీ నాయకులు చిట్టి గోపాల్రెడ్డి, అయిలేని మల్లికార్జున్రెడ్డి, పచ్చిమట్ల రవీందర్, అక్కు శ్రీనివాస్, మల్లేశం, ముప్పిడి రాజిరెడ్డి, గొర్ల వెంకన్న, వెంకటస్వామి, సతీష్ పాల్గొన్నారు. -
దమ్ముంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకోండి
కాంగ్రెస్ నేతలపై ఎంపీ వినోద్కుమార్ ఫైర్ కరీంనగర్ కార్పొరేషన్: సీఎం కేసీఆర్పై చీటింగ్ కేసు పెట్టాలంటూ కాంగ్రెస్ నేతలు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంపై కరీంనగర్ ఎంపీ బి.వినోద్కుమార్ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే ప్రజాక్షేత్రం లో తేల్చుకోవాలన్నారు. ఆదివారం కరీంనగర్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కరీంనగర్లో రోడ్లు, జిల్లాలో జాతీయ రహదారులు తాము అధికారంలోకి వచ్చాకే తీసుకొచ్చామన్నారు. -
తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు పెంచాలి
కేంద్ర మంత్రి సదానంద గౌడకు ఎంపీ వినోద్ విజ్ఞప్తి సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడను గురువారం తెరాస ఎంపీ వినోద్ కుమార్ కలుసుకొని తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు, తెలంగాణ కు ప్రత్యేక హైకోర్టు, హైకోర్టులో తెలంగాణ న్యాయమూర్తుల వాటా తదితర అంశాలపై చర్చించారు. అసెంబ్లీ స్థానాల పెంపునకు అనువుగా ఆంధ్రప్రదేశ్ పునర్వవ్యవస్థీకరణ చట్ట సవరణల బిల్లు ఈ నెల 25 వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టేందుకు బిల్లుకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని కేంద్ర మంత్రిని వినోద్ కోరారు. కేంద్ర మంత్రితో సమావేశం తర్వాత విలేకరులతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 26 లో చేయాల్సిన సవరణపై కేంద్ర మంత్రితో చర్చించామని వినోద్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 26 లో చేసే చిన్న సవరణ ద్వారా రాష్ట్ర అసెంబ్లీ స్థానాలు పెంచే ఆస్కారం ఉందన్నారు. ఈ సవరణ కు సంబంధించి కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు, న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గతంలోనే లేఖలు రాశారని వినోద్ గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఒకటి, రెండు రోజుల్లో తమ మంత్రిత్వ శాఖ తగు నిర్ణయాలు తీసుకుంటుందని కేంద్ర మంత్రి సదానంద గౌడ తెలిపారని వినోద్ చెప్పారు. తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టు ఉన్నందున న్యాయమూర్తుల ఎంపికలో తెలంగాణ కు దక్కాల్సిన వాటాపై చర్చించామన్నారు. ఈ విషయంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో చర్చిస్తామని మంత్రి హామీ ఇచ్చారన్నారు. -
రాజన్న రహదారులకు మహర్దశ
జాతీయ రహదారులుగా గుర్తింపు ఎంపీ వినోద్కుమార్ వెల్లడి వేములవాడ : ఆధ్యాత్మిక కేంద్రాలను అనుసంధానం చేస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జాతీయ రహదారుల అనుసంధానంలో వేములవాడ రాజన్నను చేర్చినట్లు ఎంపీ వినోద్కుమార్ ప్రకటించారు. వేములవాడలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. వై-జంక్షన్ లాగా వేములవాడ చుట్టూ ఉన్న రహదారులు జాతీయ హోదాకు మారనున్నట్లు ఆయన తెలిపారు. తద్వారా రోడ్ల నిర్వహణ సక్రమంగా ఉంటుందని అన్నారు. ఇప్పటికే జగిత్యాల, కరీంనగర్ మీదుగా వరంగల్ వరకు, వేములవాడ నుంచి సిరిసిల్ల, సిద్దిపేట మీదుగా సూర్యపేట వరకు, వేములవాడ నుంచి కామారెడ్డి, ఎల్లారెడ్డి మీదుగా పిట్లం వరకు జాతీయ రహదారులు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. దీంతో వేములవాడ రాజన్న భక్తులకు సులువుగా వేములవాడకు చేరుకునే మార్గాలు సుగమం అయ్యాయని అన్నారు. ఇంతేగాకుండా వేములవాడ రాజన్న క్షేత్రం అభివృద్ధి కోసం అథారిటీ కమిటి ఏర్పాటు చేశామని, త్వరలోనే అభివృద్ధి పనులకు మోక్షం లభిస్తోందన్నారు. ఈ సమావేశంలో నగర పంచాయతీ చైర్పర్సన్ నామాల ఉమ, ఎంపీపీ రంగు వెంకటేశ్గౌడ్, సెస్ డెరైక్టర్లు రామతీర్థపు రాజు, జడల శ్రీనివాస్, కౌన్సిలర్లు కూరగాయల శ్రీనివాస్, నిమ్మశెట్టి విజయ్, కుమ్మరి శ్రీనివాస్, ముద్రకోల వెంకటేశ్, నాయకులు నామాల లక్ష్మిరాజం, రాపెల్లి శ్రీధర్, శ్రీనివాస్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. -
సీఎం దృష్టికి మానసిక వికలాంగుల సమస్య
ఎంపీ వినోద్కుమార్ తిమ్మాపూర్ : మానసిక వికలాంగుల సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ద్వారా ఆర్థికసాయం అందేలా చూస్తానని కరీంనగర్ ఎంపీ వినోద్కుమార్ అన్నారు. ఎల్ఎండీ కాలనీలో స్వాతంత్య్ర సమరయోధుల ట్రస్టు ఆధ్వర్యంలోని మానసిక వికలాంగుల పాఠశాల రజతోత్సవాలు ఆదివారం ముగిశారుు. ఈసందర్భంగా ఎంపీ మాట్లాడారు. మానసిక వికలాంగులను అన్నివిధాలా తీర్చిదిద్దుతున్నా స్వాతంత్య్రసమరయోధులు అభినందనీయులన్నారు. అయతే, స్వచ్ఛంద సంస్థలు నిధులు దుర్వినియోగం చేస్తున్నాయనే కారణంతో మోదీ ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదన్నారు. అయినా, త్వరలోనే పాఠశాల బడ్జెట్ ఇప్పిస్తానని మామీ ఇచ్చారు. మానసిక వికలాంగులు పుట్టకుండానే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రధానంగా మేనరికం వివాహాలు చేసుకోవద్దని, ఈవిషయంపై ప్రభుత్వాలు ఇప్పటికే విస్తృత ప్రచారం చేశాయన్నారు. మంచిముహూర్తం పేరిట గడువు ముందు కొందరు ఆపరేషన్ల ద్వారా శిశువులకు జన్మనిస్తున్నారని, ఇలాంటివి సైతం మానసిక వైకల్యానికి దారితీస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. పాఠశాలలో పని చేస్తున్న ఉద్యోగులకు త్వరలోనే శుభవారత వినిపిస్తానని చెప్పారు. కాగా, తాను డిజిటల్ సిస్టమ్స్, హార్డ్వేర్ అందిస్తానని అల్ఫోర్స్ కళాశాల చైర్మన్ నరేందర్రెడ్డి హామిచ్చారు. అనంతరం క్రీడా విజేతలకు బహుమతులు అందజేశారు. ఈసందర్భంగా చేపట్టిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నారు. ట్రస్టు అధ్యక్షుడు చాడ వెంకటరెడ్డి అధ్యక్షత వహించగా టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు మారం జగదీశ్వర్, జెడ్పీటీసీలు ఉల్లెంగుల పద్మ, తన్నీరు శరత్రావు, వైస్ ఎంపీపీ పొన్నాల భూలక్ష్మి, సర్పంచ్ మాతంగి స్వరూప, వైద్యుడు భూంరెడ్డి, కేడీసీసీబీ ఉపాధ్యక్షుడు ఉచ్చిడి మోహన్రెడ్డి, ప్రిన్సిపాల్ పద్మావతి, ఉద్యోగ సంఘం నాయకులు లక్ష్మణ్రావు, మామిడి రమేశ్, గంగారపు రమేశ్, పోలు కిషన్, సీపీఐ జిల్లా కార్యదర్శి రాంగోపాల్రెడ్డి, ట్రస్మా అధ్యక్షుడు శేఖర్రావు, స్వాతంత్య్ర సమరయోధులు, నాయకులు మధుసూదన్రావు, జనార్దన్రావు, వెంకటయ్య, ఎల్లారెడ్డి, బాపురెడ్డి, మల్లేశం, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
సిగ్గుపడదాం... తలదించుకుందాం
- అక్షరాస్యతలో తెలంగాణకు 32వ స్థానం: ఎంపీ వినోద్కుమార్ సాక్షి ప్రతినిధి, కరీంనగర్: అక్షరాస్యతలో తెలంగాణ దేశంలోనే 32వ స్థానంలో ఉండటం సిగ్గుచేటని కరీంనగర్ ఎంపీ బి.వినోద్కుమార్ అన్నారు. ‘‘దేశంలో 29 రాష్ట్రాలు, 6 కేంద్ర పాలిత ప్రాంతాలుంటే అందులో 32వ స్థానం మనది. స్వాతంత్య్రం వచ్చి 68 ఏళ్లయినా ఇంకా నిరక్షరాస్యతను నిర్మూలించలేకపోయాం.’ అని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ కలెక్టరేట్లో ఆసరా, ఉపాధి హామీ, గృహ నిర్మాణం, వయోజన విద్య, వైద్యం వంటి అంశాలపై గురువారం జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. కమిటీ చైర్మన్ వినోద్కుమార్తోపాటు ఎంపీలు కల్వకుంట్ల కవిత, బాల్క సుమన్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ తుల ఉమ, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్ హాజరయ్యారు. -
పర్యటనల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదా ?
-
దీని భావమేమి!
ఈ ఫొటో చూస్తుంటే... ఏమనిపిస్తోంది... కరీంనగర్ ఎంపీ బి.వినోద్కుమార్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్రెడ్డి నడిరోడ్డుపై తీవ్రస్థాయిలో గొడవపడుతున్నట్లు లేదూ. ఇటీవల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పర్యటన సందర్భంగా చిగురుమామిడి మండలం ముల్కనూరులో జరిగిన ఘటనకు సంబంధించిన ఫొటోలివి. ఆ రోజు నుంచి ఈ ఫొటోలు వాట్సాప్లో హల్చల్ చేస్తున్నాయి. ఇద్దరూ వాగ్వాదానికి దిగినట్లు, ఆవేశకావేశాలకు లోనై, ఒకరిపై మరొకరు అరుచుకున్నట్లు కనిపిస్తున్న ఈ ఫొటోలు పెను సంచలనాన్నే సృష్టిస్తున్నాయి. అధికార టీఆర్ఎస్తోపాటు అన్ని రాజకీయ పార్టీల్లోనూ ప్రస్తుతం ఈ ఫొటోలపైనే చర్చ సాగుతోంది. జిల్లాలో హాట్టాపిక్గా మారిన ఈ ఫొటోలపై ఈద శంకర్రెడ్డిని సంప్రదిస్తే, ఆయన నవ్వుతూ తేలిగ్గా తీసిపారేశారు. ‘ఆ రోజు సీఎం కేసీఆర్ అధికారిక కార్యక్రమం కావడంతో టీఆర్ఎస్ నాయకులకు అనుమతి లేదు. ఆ సందర్భంలో తాము మాట్లాడుకున్న సన్నివేశాన్ని ఎవరో ఫొటోలు తీసి, గొడవపడుతున్నట్లు చిత్రీకరించారు’ అని చెప్పారు. తనకు వినోద్కుమార్ అంటే అపార గౌరవమని, తాను ఆయనతో గొడవపడడమేంటని ఎదురు ప్రశ్నించారు. కాగా గొడవ జరిగినా, జరగకపోయినా ఈ ఫొటోలు మాత్రం జిల్లాలో ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. - కరీంనగర్ సిటీ -
మీడియాలో వస్తున్న వార్తలు..గాలి వార్తలే
-
చంద్రబాబు అవినీతికి స్వేచ్ఛ కావాలా?
-
చంద్రబాబు అవినీతికి స్వేచ్ఛ కావాలా?
న్యూఢిల్లీ: 'ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛకు గొప్ప అర్థం ఉంది. టీడీపీ మంత్రులు మాట్లాడేది ఎలాంటి స్వేచ్ఛ గురించి? చంద్రబాబు విచ్చలవిడి అవినీతికి స్వేచ్ఛ కావాలా?' అని కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ ప్రశ్నించారు. ఉమ్మడి రాజధానిలో తమ స్వేచ్ఛకు భంగం కలుగుతోందని ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన మంత్రివర్గ సహచరులు గగ్గోలు పెట్టడం అర్థరహితమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై మంగళవారం ఢిల్లీలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో సెక్షన్- 8 అమలుచేయాల్సిన అవసరం లేదన్న వినోద్.. ఉమ్మడి రాజధానిలో విద్వేషాలు హెచ్చరిల్లినప్పుడుగానీ, పౌర హక్కులకు భంగం వాటిల్లడంకానీ, ఆస్తుల విధ్వంసం లేదా ఇతరత్రా హింసాయుత పరిస్థితులు తలెత్తినప్పుడు మాత్రమే విభజన చట్టంలోని సెక్షన్- 8 అమలుచేయాల్సి వస్తుందని, అదికూడా తెలంగాణ మంత్రివర్గాన్ని సంప్రదించిన తర్వాతే గవర్నర్ తుదినిర్ణయం తీసుకోవాలని చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారని గుర్తుచేశారు. ఓటుకు నోటు వ్యవహారం ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తుందికాబట్టి తెలంగాణ ఏసీబీ బాబుపై చర్య తీసుకోదని ఏపీ మంత్రులు వ్యాఖ్యానించడం వారి అజ్ఞానానికి నిదర్శనమని వినోద్ అన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ చట్టం తన పని తాను చేసుకుపోవడం సహజమన్నారు. -
ఉద్యోగ సాధనకు ‘వారధి’ యువతకు బంగారు భవిష్యత్
- రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు కృషి - అవగాహన సదస్సులో ఎంపీ వినోద్కుమార్ - మొదటి రోజు 1000 మంది దరఖాస్తుల స్వీకరణ ముకరంపుర: ఉద్యమాల ద్వారా సాధించుకున్న తెలంగాణలో యువతకు బంగారు భవిష్యత్ ఉందని కరీంనగర్ ఎంపీ బి.వినోద్కుమార్ అన్నారు. జిల్లా యంత్రాంగం తరపున కలెక్టర్ చైర్మన్గా ఉన్న వారధి స్వచ్ఛంద సంస్థ కార్యాలయాన్ని ఎంపీ బుధవారం కలెక్టరేట్లో ప్రారంభించారు. అనంతరం ఆడిటోరియంలో నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు జిల్లా కేంద్రంలో వారధి సంస్థ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో విస్తృత అవకాశాలున్నాయని, వాటిని అందిపుచ్చుకోవడంలో యువత వెనుకంజలో ఉండడం విచారకరమన్నారు. ఇప్పటివరకుఎన్డీఏ (నేషనల్ డిఫెన్స్ అకాడమీ) పరీక్షను ఎవరూ రాయలేదని పేర్కొనడంతో విచారం వ్యక్తం చేశారు. బ్యాంకింగ్ సెక్టార్లోనూ ఆంధ్రావారికే ఉద్యోగాలున్నాయని, రానున్న 15 ఏళ్లలో రెండు రాష్ట్రాల్లోనూ సీమాంధ్ర ఐఏఎస్లు ఉండే అవకాశముందని పేర్కొన్నారు. తెలంగాణ యువత వచ్చే నాలుగేళ్లలో కనీసం 20 మంది ఐఏఎస్లు కావాలని ఆకాంక్షించారు. ఉద్యోగ సాధనకు పునాది లాంటి వారధి సంస్థ పనితీరును పరిశీలించి రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు కృషి చేస్తానన్నారు. కలెక్టర్ నీతూప్రసాద్ మాట్లాడుతూ ఔట్ సోర్సింగ్తోపాటు అన్ని రకాల ఉద్యోగాలను వారధి సంస్థ ద్వారా భర్తీ చేస్తామన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్నో ఆశలు పెట్టుకున్న యువత కలలు నెరవేరుతాయన్నారు. నగర మేయర్ రవీందర్సింగ్ మాట్లాడుతూ యువత కష్టపడితే సాధించలేని లేదని అన్నారు. ఎస్పీ శివకుమార్ మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో తమ శక్తి సామర్థ్యాల మేరకు లక్ష్యాన్ని ఎంచుకుని ముందుకు పోవాలన్నారు. ర్యాంకులు ముఖ్యం కాదని విషయ పరిజ్ఞానం అవసరమని సూచించారు. కార్యక్రమంలో ఏజేసీ నాగేంద్ర, డీఆర్డీఏ పీడీ అరుణశ్రీ, ఆర్డీవో చంద్రశేఖర్ జిల్లా అధికారులు పాల్గొన్నారు. కిక్కిరిసిన కలెక్టరేట్ అవగాహన సదస్సుకు జిల్లా నలుమూలలనుంచి పెద్ద ఎత్తున నిరుద్యోగులు తరలిరావడంతో కలెక్టరేట్ కిక్కిరిసిపోయింది. 2 వేల మంది వరకు రావడంతో ఆడిటోరియం సరిపోక అవస్థలు పడ్డారు. చంటిపిల్లలతో వచ్చిన మహిళలు ఇక్కట్లకు గురయ్యారు. స్థలం లేక కొందరు బయటే ఉండి విన్నారు. ఆడిటోరియంలో వేడి భరించలేక, కుర్చీలు లేక చాలా మంది వెనుదిరిగారు. ఈ విషయమై కలెక్టర్ స్పందిస్తూ ఊహించినంతకంటే ఎక్కువ రావడంతో ఇబ్బందిని గమనించామని, మరోసారి అందరికీ సౌకర్యంగా ఉండే చోట సదస్సు నిర్వహిస్తామని, మిగతావారు వారధి కార్యాలయంలో సంప్రదించి దరఖాస్తులు తీసుకోవాలని సూచించారు. బుధవారం కేవలం వెయ్యి దరఖాస్తులు మాత్రమే ఇచ్చారు. అండగా ‘వారధి’ జిల్లా యువతకు వారధి సొసైటీ అండగా ఉంటుందని వారధి( నాలెడ్జ్ రేయిస్ ఫౌండేషన్, వరంగల్) సంస్థ కో ఆర్డినేటర్ భూపతిరాజు, సెక్రటరీ ఆంజనేయులు తెలిపారు. ఆడిటోరియంలో లైవ్ ప్రొజెక్టర్ ద్వారా ఉద్యోగ సాధనకు అవసరమైన అంశాలపై క్లుప్తంగా అవగాహన కల్పించారు. వారధి సంస్థ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, బ్యాంకు ఆఫీసర్స్, రైల్వే ఉద్యోగాలు, ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, పోలీసు ఉద్యోగాలు, ప్రముఖ కార్పొరేట్ కంపెనీల ఉద్యోగాలపై అవగాహన కల్పిస్తూ నిష్ణాతుల ద్వారా శిక్షణ ఇప్పించనున్నట్లు వెల్లడించారు. కలెక్టరేట్ కాంప్లెక్స్ మొదటి అంతస్తులోని రెడ్క్రాస్ కార్యాలయం పక్కన సంస్థ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. -
'ఉనికి కోసమే విమర్శలు'
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ జాతీయ నాయకుడు దిగ్విజయ్ సింగ్ అక్కసుతో, తమ ఉనికిని కాపాడుకోవడం కోసమే విమర్శలు చేశారని కరీంనగర్ ఎంపీ బి.వినోద్కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల హామీల అమలులో పూర్తి స్పష్టతతో ముందుకు వెళుతోందని ఆయన వివరించారు. ఈ మేరకు ఎంపీ వినోద్కుమార్ గురువారం ఒక ప్రకటనలో దిగ్విజయ్ సింగ్ విమర్శలను తిప్పి కొట్టారు. రాష్ట్ర విభజన సమయంలో చేసిన విద్యుత్ ఒప్పందాల వల్ల మోసపోయామని, అయినా ప్రాజెక్టుల రూపకల్పనలో విజయం సాధించామన్నారు. వాటర్గ్రిడ్ ద్వారా మొదటి దశలో 10వేల గ్రామాలకు తాగునీరు అందించేందుకు ముందుకు వెళుతుంటే, సీఎంకు నీటి సరఫరా గురించి కంటే నీటి పైపుల మీదనే శ్రద్ధ ఉందని దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించడం హాస్యాస్పదమన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలోని అన్ని అంశాలను అమలు చేసేందుకు తాము కృషి చేస్తుంటే, దిగ్విజయ్ వంటి సీనియర్ నేత అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని వినోద్కుమార్ విమర్శించారు. -
'ప్రాణహితకు సీడబ్ల్యూసీ అనుమతి త్వరగా ఇవ్వండి'
- ఉమాభారతికి ఎంపీ వినోద్ లేఖ న్యూఢిల్లీ: బి.ఆర్.అంబేడ్కర్ ప్రాణహిత - చేవెళ్ల సుజల స్రవంతి పథకానికి కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) అనుమతి త్వరగా వచ్చేలా చూడాలని కేంద్ర మంత్రి ఉమాభారతిని కోరుతూ కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ లేఖ రాశారు. ఆ లేఖను మంగళవారం ఇక్కడ మీడియా కు విడుదల చేశారు. ‘ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించేం దుకు ఇప్పటికే ప్రధాని సానుకూలత వ్యక్తం చేశారు. దీనికి సీడబ్ల్యూసీ అనుమతి కోసం 2010లోనే సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను ప్రాజెక్టు సీఈ సమర్పించా రు. ‘రాష్ట్ర నీటి పారుదల శాఖలో సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్(సీడీవో) ఉన్నప్పుడు సీడబ్ల్యూసీ పాత్రను కేవలం అంతర్రాష్ట్ర వివాదాలు, హైడ్రాలజీ వంటి అంశాలకే పరిమితం కావాలని నిబంధనలు చెబుతున్నాయి. సీడబ్ల్యూసీ తన పాత్ర వరకే పరి మితమై అనుమతులు త్వరగా మంజూరు చేసేలా చైర్మన్కు ఆదేశాలు జారీచేయగల రు. త్వరగా అనుమతి వస్తే జాతీయ ప్రా జెక్టు హోదా ప్రకటనకు మార్గం సుగమం అవుతుంది’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. -
'ప్రతి కార్యకర్త ఓ కేసీఆరే'
కరీంనగర్: కరీంనగర్ జిల్లా అలుగునూరులో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కరీంనగర్ ఎంపీ బి.వినోద్కుమార్ బుధవారం లాంఛనప్రాయంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... టీఆర్ఎస్ పార్టీలో ప్రతి కార్యకర్త ఓ కేసీఆరే అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని నడపాల్సింది కార్యకర్తలేనని వినోద్ పిలుపునిచ్చారు. పనిచేసే వారికే పదవులు లభిస్తాయని, ప్రభుత్వానికి ఆసరాగా ప్రతి ఒక్కరూ నిలవాలని కార్యకర్తలను, ప్రజలను ఆయన కోరారు. -
ఏపీ హైకోర్టుకు 30 మంది..
తెలంగాణకు 19 మంది న్యాయమూర్తుల కేటాయింపు టీఆర్ఎస్ ఎంపీ వినోద్కు కేంద్ర న్యాయశాఖ మంత్రి లేఖ సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ఆంధ్రప్రదేశ్కు కొత్తగా హైకోర్టు ఏర్పాటు చేయాల్సి ఉందని కేంద్ర న్యాయశాఖ పేర్కొంది. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న హైకోర్టు తెలంగాణకు వర్తిస్తుందని స్పష్టం చేసింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా టీఆర్ఎస్ ఎంపీ బి.వినోద్కుమార్ 377వ నిబంధన కింద ప్రస్తావించిన ఈ అంశంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి డి.వి.సదానందగౌడ ఆయనకు లేఖ రాశారు. ‘ఏపీలో కొత్త హైకోర్టు ఏర్పాటయ్యేవరకు ప్రస్తుత హైకోర్టు 2 రాష్ట్రాలకు సేవలు అందిస్తుంది. కొత్త హైకోర్టు ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం, ప్రస్తుత ఉమ్మడి హైకోర్టు సంప్రదింపులు జరిపి ఒక ప్రణాళిక రూపొందించుకోవాలి. అందులో భాగంగా కొత్త హైకోర్టు ఏర్పాటు చేయాల్సిన ప్రాంతాన్ని గుర్తించాలి. కోర్టు భవనాలు, న్యాయమూర్తులు, సిబ్బంది నివాసాలు, ఇతర మౌలిక వసతుల ఏర్పాటుపై కసరత్తు చేయాలి. ఇదంతా ఏపీ ప్రభుత్వం ఉమ్మడి హైకోర్టుతో సంప్రదింపుల ద్వారా ఖరారు చేయాలి. ఈ ప్రక్రియ ప్రారంభం విషయంలో ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఏపీ అభిప్రాయాలు తెలపాలని కోరాం. వారి నుంచి ఇంకా అభిప్రాయాలు అందలేదు. ఇరు రాష్ట్రాలు ఉమ్మడి హైకోర్టుతో సంప్రదింపు లు జరిపి ఓ నిర్ణయానికి వచ్చిన తరువాతే కేంద్రం చర్యలు తీసుకుంటుంది. భారత ప్రధాన న్యాయమూర్తి సమ్మతితో ఏపీ, తెలంగాణ హైకోర్టులకు న్యాయమూర్తుల సంఖ్యను నిర్ధారిం చాం. ఏపీకి 30 మంది, తెలంగాణకు 19 మంది న్యాయమూర్తులను కేటాయించాలని నిర్ణయిం చాం. ఈ విషయాన్ని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు, ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తెలిపాం’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. -
'సవరణలు ఎమ్మెల్సీ సంఖ్యకు పరిమితం కావడం బాధాకరం'
న్యూఢిల్లీ: ఏపీ విభజన చట్టసవరణ కేవలం ఎమ్మెల్సీల సంఖ్య పెంచేందుకు పరిమితం కావడం బాధాకరమని ఎంపి వినోద్, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి రామచంద్ర అన్నారు. విభజన చట్టానికి అనేక సరవరణలు ప్రతిపాదిస్తున్నట్లు వారు తెలిపారు. వాటన్నిటిపై ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్రం చర్చించాలన్నారు. పోలవరం ముంపు మండలాలు, భద్రాచలం ఆస్తులు తదితర అంశాలపై సవరణలు చేయాలని వారు కోరారు. -
'ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు మేల్కోవాలి'
న్యూఢిల్లీ: శంషాబాద్ దేశీయ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పెట్టడమే అంటే ఆయనను చిన్నబుచ్చడమేనని టీఆర్ఎస్ ఎంపీ వినోద్కుమార్ అన్నారు. విజయవాడ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పెట్టాలని సూచించారు. ఎన్టీఆర్ మరణానికి కారణమైన చంద్రబాబు, మరణం తర్వాత కూడా ఆయనను అవమానిస్తున్నారని అన్నారు. ఇకనైనా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు మేల్కోవాలని పేర్కొన్నారు. -
విభజన చట్టాన్ని అమలు చేయాలి
హన్మకొండ : రాష్ట్ర విభజన చట్టాన్ని అమలు చేసి.. అధికారుల కేటాయింపు త్వరగా పూర్తి చేయూలని కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. హన్మకొండ రాంనగర్లోని టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్ను టీఆర్ఎస్ ఎంపీలు కలిసి.. రాష్ట్ర సమస్యలు వివరించామన్నారు. రాష్ట్ర విభజన చట్టం అమలుకాక ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించామన్నారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు కేటాయింపు పూర్తి కాకపోవడంతో ఇక్కడ పాలన కుంటుపడిందని అన్నారు. విభజన అనంతరం రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రగులుతాయని, దీంతో నేరాలు పెరుగుతాయని భావించారన్నారు. దీనికి భిన్నంగా రెండు రాష్ట్రాల ప్రజలు కలిసి పోతున్నారని, ప్రశాంతంగా ఉంటున్నారన్నారు. హైదరాబాద్లో పరిస్థితులు శాంతియుతంగా ఉన్నాయని వివరించి.. గవర్నర్ పెత్తనం లేకుండా చేశామన్నారు. కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వివరించామన్నారు. పత్తి ధర మద్దతు ధర క్వింటాల్కు రూ.5వేలు పెంచాలని వివరించామన్నారు. తెలంగాణలో పత్తి 17.50 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారని, 65 లక్షల బేళ్లు ఉత్పత్తి అవుతుందన్నారు. దేశంలో 1.72 ఎకరాల్లో పత్తి సాగుచేస్తుండగా.. 4 కోట్ల బేళ్లు ఉత్పత్తి అవుతుందని వివరించారు. ఈ పత్తిలో 25 శాతం తెలంగాణలో ఉత్పత్తి అవుతుందని వివరించారు. ఇందులో 3 కోట్ల బేళ్లను దేశ అవసరాలకు వినియోగించుకొంటుండగా, కోటి బేళ్లను విదేశాలకు ఎగుమతి చేసేవారమన్నారు. రాష్ట్రంలో పండుతున్న పత్తిని రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు పత్తి ఆధారిత పరిశ్రమలైన జన్నింగ్, స్పిన్నింగ్ మిల్లులు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరామన్నారు. సమావేశంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎంపీ ఆజ్మీర సీతారాంనాయక్, పార్టీ జిల్లా ఇన్చార్జి పెద్ది సుదర్శన్రెడ్డి, టీజీఏ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి యాదవరెడ్డి, నాయకులు గుడిమళ్ల రవికుమార్, బీరవెల్లి భరత్కుమార్రెడ్డి, నన్నపునేని నరేందర్, ఎల్లావుల లలితాయాదవ్, కె.వాసుదేవరెడ్డి, జోరిక రమేష్ పాల్గొన్నారు. -
'కాంగ్రెస్, టీడీపీలు దుష్ప్రచారాన్ని మానుకోవాలి'
కరీంనగర్: తెలంగాణ కాంగ్రెస్, టీడీపీ నేతలపై కరీంనగర్ ఎంపీ వినోద్ మండిపడ్డారు. ప్రజా సమస్యలపై టీఆర్ఎస్ స్పందించడం లేదంటూ చేస్తున్న దుష్ప్రచారాన్ని కాంగ్రెస్,టీడీపీలు మానుకోవాలన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన వినోద్.. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో కలవడానికి కాంగ్రెస్సే కారణమన్నారు. ప్రస్తుతం లోక్ సభలో ప్రతిపక్షంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీనా?టీఆర్ఎస్ పార్టీనా?అనే పరిస్థితి ఏర్పడిందని వినోద్ ఎద్దేవా చేశారు. -
రాజ్నాథ్ ను కలవనున్న టీఆర్ఎస్ ఎంపీలు
హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్ను గురువారం ఉదయం టీఆర్ఎస్ ఎంపీలు కలవనున్నారని ఆ పార్టీకి చెందిన ఎంపీ వినోద్ తెలిపారు. ఉమ్మడి రాజధానిలో గవర్నర్ కు ప్రత్యేకాధికారాలు కట్టబెట్టడంపై మంత్రితో చర్చిస్తామని చెప్పారు. ఉమ్మడి రాజధానిలో పరిస్థితి ప్రశాంతంగా ఉందని, గవర్నర్కు ప్రత్యేక అధికారాలు అవసరమేలేదని ఆయన అన్నారు. ఈ విషయంలో రాజ్యాంగానికి లోబడి కేంద్రం వ్యవహరిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. పోలవరం ముంపు మండలాల కోసం న్యాయపోరాటం చేస్తామన్నారు. సమగ్ర కుటుంబ సర్వేపై కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టిందనడంలో వాస్తవం లేదని వినోద్ కొట్టిపారేశారు. -
రైల్వే బడ్జెట్పై.. నేతల అభిప్రాయాలు
ఇది పీపీపీ బడ్జెట్: వినోద్ కేంద్ర రైల్వేశాఖ మంత్రి సదానందగౌడ మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగం లో అంతా పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్) అన్న పదమే ఉందని, ఇది రైల్వే బడ్జెట్ అన డం కన్నా పీపీపీ బడ్జెట్ అంటే బాగుంటుందని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ ఎద్దేవా చేశారు. ఈ విధానం గతంలోనూ విజయవంతమైన దాఖలాలు లేవన్నారు. పార్లమెంట్ సమావేశం అనంతరం విజ య్చౌక్లో మీడియాతో మాట్లాడారు. దేశ ప్రజల సమస్యలు, రైల్వే సమస్యలు పరిష్కారంపై ఎలాంటి ప్రస్తావన లేకుండా రైల్వే బడ్జెట్ ఉందన్నారు. తెలంగాణకు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదన్నారు. రెండు రాష్ట్రాలకు కలిపి కమిటీ వేయడాన్ని వినోద్ తప్పుపట్టారు. రైల్వే బడ్జెట్ నిరాశపర్చింది: ఎంపీ కవిత రైల్వే బడ్జెట్ ప్రజలను తీవ్రంగా నిరాశపర్చిందని టీఆర్ ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. రెండు రాష్ట్రాల్లో ఇచ్చే కొత్త ప్రాజెక్టులు కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత కేటాయిస్తే సమంజసంగా ఉంటుందని, అయితే చాలా ఏళ్లుగా పెండింగ్లో ఉన్న పాత ప్రాజెక్టులను సైతం కమిటీ నివేదిక వరకు ఆగాలనడం బాధాకరమన్నారు. రెండింటికీ మొండిచెయ్యే: గుత్తా మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి రైల్వే బడ్జెట్ స్వాతంత్య్ర చరిత్రలోనే చెత్తదిగా కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఈ బడ్జెట్లో మెండిచెయ్యి దక్కిందన్నారు. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న సీఎం చంద్రబాబు రైల్వే ప్రాజెక్టుల విషయంలో ఏం ఒత్తిడి తెచ్చారు. మసిపూసి మారేడుకాయ చేయలేదు: కిషన్రెడ్డి ‘‘రైల్వే బడ్జెట్ వాస్తవ పరిస్థితికి దగ్గరగా ఉంది. ఏ రాష్ట్రాన్నీ చిన్నచూపు చూడకుండా అన్ని రాష్ట్రాలకు సమ ప్రాధాన్యం ఇచ్చారు. గత ప్రభుత్వం లాగా మసిపూసి మారేడుగాయ చేయకుండా ప్రజలకు భద్రతతో కూడిన బడ్జెట్ను సిద్ధం చేయటం అభినందనీయం. 14 వేల మంది రైల్వే పోలీసుల నియామకం, 4 వేల మంది మహిళా పోలీసుల ఏర్పాటు లాంటివి దీనికి నిదర్శనం. ప్రజలంతా ఈ బడ్జెట్ను స్వాగతిస్తారని ఆశి స్తున్నా. అమలు చేయలేని హామీలివ్వటం కం టే... చేయదగ్గ పనులనే ప్రస్తావించటం మంచి చర్య. తెలంగాణకు రెండు సెమీ బుల్లెట్ రైళ్లను కేటాయించటం సంతోషకరం’ సాధారణ బడ్జెట్ చూశాక స్పందిస్తాం: యనమల కేంద్ర సాధారణ బడ్జెట్ను కూడా చూశాక తమ స్పందన తెలియచేస్తామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు రైల్వే బడ్జెట్పై వ్యాఖ్యానించారు. పార్లమెంటులో బడ్జెట్ను రైల్వే మంత్రి చదువుతున్నప్పుడు విన్నామే తప్ప అందులో ఏమేమున్నాయో పూర్తిగా చూడలేదన్నారు. మంగళవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ, తెలంగాణకు సంబంధించి 29 ప్రాజెక్టులున్నాయని, వాటిపై కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారన్నారు. జనాకర్షణకు స్వస్తి: జేపీ జనాకర్షణ సంస్కృతికి స్వస్తి చెప్పి రవాణాలో మెరుగైన మౌలిక వసతులకు పునాది వేసేందుకు రైల్వే బడ్జెట్ ద్వారా కేంద్రం చేసిన ప్రయత్నాలు అభినందనీయమని లోక్సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్నారాయణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత ప్రభుత్వం దశాబ్దాకాలం పాటు అనుసరించిన తాత్కాలిక ధోరణులను విడిచిపెట్టి, ప్రభుత్వ- ప్రైవేట్ భాగస్వామ్యానికి, ప్రైవేట్ పెట్టుబడులకు ప్రాధాన్యమిస్తూ రైల్వే మంత్రి వ్యవహరించడం స్వాగతించాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. ఆశించినట్లు లేదు: బీజేపీ ఏపీ శాఖ రాష్ట్రానికి ఏ మాత్రం ప్రయోజనం కలిగించే తీరున రైల్వే బడ్జెట్ లేదని ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు పి. విష్ణుకుమార్రాజు ‘సాక్షి’తో అన్నారు. బడ్జెట్ గురించి తాము ఊహిం చింది ఒకటి, జరిగింది మరొకటి అని చెప్పారు. విశాఖ కేంద్రంగా రాష్ట్రానికి కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేసే ప్రకటన బడ్జెట్లో ఉంటుందని ఆశించామని.. అలాం టి ప్రకటన లేకుండా పోయిందన్నారు. బడ్జెట్లో కొత్త జోను ప్రకటించకపోయినా ఇందుకు సంబంధించి రైల్వే మంత్రి త్వరలోనే ప్రకటన చేస్తారన్న నమ్మకం ఉందన్నారు. తీవ్ర నిరాశ మిగిల్చింది: వామపక్షాలు కేంద్ర రైల్వే బడ్జెట్ తీవ్ర నిరాశ మిగి ల్చిందని సీపీఐ, సీపీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శులు కె.రామకృష్ణ, పి.మధు వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. రైల్వే ప్రైవేటీకరణ వైపే పరుగులు తీస్తున్నట్టు కని పించిందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తారని భావిం చినా నిరాశే మిగిలిందని చెప్పారు. విజయవాడ-న్యూఢిల్లీ మధ్య రైలు మినహా రాష్ట్రానికి బడ్జెట్లో దక్కిందేమీ లేదన్నారు.