తమను మినీ కానిస్టేబుళ్లుగా గుర్తించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు రాష్ట్ర హోంగార్డులు విజ్ఞప్తి చేశారు.
సాక్షి, హైదరాబాద్: తమను మినీ కానిస్టేబుళ్లుగా గుర్తించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు రాష్ట్ర హోంగార్డులు విజ్ఞప్తి చేశారు. చాలీ చాలని జీతంతో పోలీసు కానిస్టేబుళ్లతో సమానంగా పనిచేస్తున్న తమ జీవితాలు దుర్భరంగా సాగుతున్నాయని వారు వాపోయారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నెలకు ఇస్తున్న రూ.9 వేల వేతనాన్ని రూ.15 వేలకు పెంచాలని వారు కోరారు.