మెట్రో ప్రయాణికులకు శుభవార్త | Hyderabad Metro will now run trains every 7 minutes during peak hours  | Sakshi
Sakshi News home page

మెట్రో ప్రయాణికులకు శుభవార్త

Published Fri, Apr 20 2018 4:35 PM | Last Updated on Tue, Oct 16 2018 5:07 PM

Hyderabad Metro will now run trains every 7 minutes during peak hours  - Sakshi

సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు శుభవార్త. నగరంలోని మెట్రో రైళ్లు దూకుడు పెంచాయి. మియాపూర్‌- అమీర్‌పేట్‌- నాగోల్‌ మధ్య రద్దీ సమయాల్లో 7 నిమిషాలకో మెట్రో టైన్‌ నడవనుంది. ఈ విషయాన్ని ఐటీ మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. శనివారం ఉదయం నుంచి రద్దీ సమయాల్లో ప్రతి 7 నిమిషాలకో మెట్రో రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.

కొత్త సిగ్నలింగ్ వ్యవస్థకు కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ(సీఎంఆర్‌ఎస్) అనుమతి ఇచ్చిందని ఆయన తెలిపారు. ఈ విషయం నగర ప్రయాణికులతో పంచుకోవడం సంతోషంగా ఉందని కేటీఆర్‌ ట్వీట్ చేశారు. మియాపూర్ - అమీర్‌పేట్ - నాగోల్ మధ్య రేపు ఉదయం 6 గంటల నుంచి రద్దీ సమయాల్లో ప్రతి 7 నిమిషాలకు మెట్రో రైలు, రద్దీ లేని సమయాల్లో ప్రతి 8 నిమిషాలకు ఓ రైలు నడవనుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement