
హైదరాబాద్ : ప్రముఖ మ్యూజిషియన్ ఏఆర్ రెహమాన్ కన్సర్ట్కు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ హాజరుకానున్నారు. ‘ఏఆర్ రెహమాన్ ఎన్కోర్ - ది కన్సర్ట్’ పేరుతో రెహమాన్ దేశ వ్యాప్తంగా నగరాల్లో లైవ్ కన్సర్ట్లను ప్లాన్ చేసుకున్న విషయం తెలిసిందే. రెహమాన్ తొలి కన్సర్ట్కు హైదరాబాద్ వేదిక కానుంది. ఇదే సమయంలో హైదరాబాద్లో గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ జరగనుంది. ఈ సమ్మిట్కు హైదరాబాద్ విచ్చేస్తున్న వైట్ హౌస్ సలహాదారు ఇవాంకా రెహమాన్ కన్సర్ట్కు హాజరవుతారని తెలిసింది. గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో కన్సర్ట్ జరగనుంది. అదే సమయంలో హెచ్ఐసీసీలో జరిగే గ్లోబల్ ఎంటర్ప్రినర్ సమ్మిట్(జీఈఎస్)కు 1200 మంది హజరవుతారు.
Comments
Please login to add a commentAdd a comment