సిద్ధయ్యది వీరమరణం: కేసీఆర్ | kcr condolence to SI siddaiah death | Sakshi
Sakshi News home page

సిద్ధయ్యది వీరమరణం: కేసీఆర్

Published Tue, Apr 7 2015 5:26 PM | Last Updated on Tue, Oct 16 2018 8:50 PM

సిద్ధయ్యది వీరమరణం: కేసీఆర్ - Sakshi

సిద్ధయ్యది వీరమరణం: కేసీఆర్

హైదరాబాద్: ఎస్ఐ సిద్ధయ్య మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సిద్ధయ్య కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. సిద్ధయ్య ప్రాణాలకు తెగించి పోరాడారని,  ఆయనది వీరమరణమని కేసీఆర్ నివాళులు అర్పించారు. పోలీసుల అంకితభావానికి సిద్ధయ్య ప్రతీకని కేసీఆర్ పేర్కొన్నారు.

నల్గొండ జిల్లా జానకీపురంలో శనివారం ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సిద్ధయ్య మంగళవారం సాయంత్రం మరణించారు. నాలుగు రోజులుగా ఆయన ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు కృషి చేసినా ఫలితం లేకపోయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement