నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ విజయవిహార్ లో టీఆర్ఎస్ శిక్షణా తరగతులు శనివారం ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారి పాలనా పగ్గాలు..
నాగార్జున సాగర్ : నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ విజయవిహార్ లో టీఆర్ఎస్ శిక్షణా తరగతులు శనివారం ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారి పాలనా పగ్గాలు చేపట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) గెలిచిన ప్రజా ప్రతినిధులకు మూడు రోజుల పాటు ఈ రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఈ శిక్షణా తరగతులను పర్యవేక్షిస్తున్నారు. ఆయన ఎమ్మెల్యేలకు స్వయంగా పాఠాలు చెప్పనున్నారు. కాగా ప్రారంభ కార్యక్రమంలో కేసీఆర్ తో పాటు మాజీ చీఫ్ ఎన్నికల కమిషనర్ జేఎం లింగ్డో, ప్రొఫెసర్ సీహెచ్ హన్మంతరావు, ఆస్కి డైరెక్టర్ జనరల్ రవికాంత్ తదితరులు పాల్గొన్నారు.