‘కొండపోచమ్మ సాగర్‌’ భూ సర్వేను అడ్డుకున్న రైతులు | kondapochamma Sagar Project Land Acquisition Survey | Sakshi
Sakshi News home page

‘కొండపోచమ్మ సాగర్‌’ భూ సర్వేను అడ్డుకున్న రైతులు

Published Mon, Sep 4 2017 1:05 AM | Last Updated on Tue, Sep 12 2017 1:46 AM

kondapochamma Sagar Project Land Acquisition Survey

గజ్వేల్‌/జగదేవ్‌పూర్‌: కొండపోచమ్మసాగర్‌ ప్రాజెక్టు కాల్వల భూసేకరణ సర్వే పనులను ఆదివారం రెండు ప్రాంతాల్లో రైతులు అడ్డుకున్నారు. మర్కూక్‌లో తహసీల్దార్‌ మల్లేశం, వీఆర్వోలు భూసర్వే జరిపి హద్దులు పాతుతున్నారు. అంతలో రైతులు వచ్చి.. ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాకుండానే కాల్వల పేరిట మా భూముల్లోకి వచ్చి హద్దులు పాతుతారా.. అంటూ వాగ్వాదానికి దిగారు.

భూములను ఇవ్వబోమంటూ రైతులు సర్వేను అడ్డుకొన్నారు. అధికారులు వేసిన హద్దులను తొలగించారు. కాగా, మర్కూక్‌ మండలం చేబర్తిలో ఉదయం 10 గంటలకు సర్వేయర్లు, నీటిపారుదల శాఖ అధికారులు సర్వే పనులు ప్రారంభించగా, రైతులు అక్కడకు వెళ్లి వెంటనే ఆపాలని, లేకుంటే ఆందోళన చెస్తామని హెచ్చరించారు. దీంతో అధికారులు సర్వే పనులు ఆపేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement