ఎంజే మార్కెట్‌ను సందర్శించిన కేటీఆర్‌ | KTR Visits MJ Market | Sakshi
Sakshi News home page

ఎంజే మార్కెట్‌ను సందర్శించిన కేటీఆర్‌

Published Mon, Apr 16 2018 9:23 PM | Last Updated on Tue, Apr 17 2018 8:09 AM

KTR Visits MJ Market - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : చారిత్రక మోజంజాహీ మార్కెట్‌కు పుర్వ వైభవం తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ ఎంజే మార్కెట్‌ని దత్తత తీసుకున్నారు. జీహెచ్‌ఎంసీ కూడా ఎంజే మార్కెట్‌ పునరుద్దరణకు 10కోట్ల రూపాయల ప్రాథమిక అంచనాతో ప్రణాళికలు సిద్ధం చేసింది.

ఈ నేపథ్యంలో రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ సోమవారం ఎంజే మార్కెట్‌ని సందర్శించారు. మార్కెట్‌ లోని వ్యాపారులతో ముచ్చటించిన కేటీఆర్‌.. అక్కడ లభించే ఫేమస్‌ ఐస్‌ క్రీమ్‌ రుచి చూశారు. జీహెచ్‌ఎంసీ చేపట్టబోయే పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. అభివృద్ధి పనులను నాలుగు నెలల్లో పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. కేటీఆర్ వెంట మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ అధికారులు ,తదితరులు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement