హైదరాబాద్: విలువైన ప్రభుత్వ ఖాళీ స్థలాలు, భవనాల అమ్మకానికి సర్కారు కసరత్తు ప్రారంభించింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఏ ప్రభుత్వ శాఖ పరిధి లో ఎంత భూమి ఉందో వెంటనే వివరాలందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని విభాగాల అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సమీక్ష జరిపారు. రెండు రోజుల్లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రభుత్వకార్యాలయాలు, ఖాళీ స్థలాల సర్వేనంబర్లతోపాటు సమగ్ర సమాచా రం బుధవారంలోగా తమ వెబ్సైట్లో ఉంచాలని సూచించారు. ప్రభుత్వ భూములు, ఆక్రమణ వివరాలను కూడా పొందుపరచాలని పేర్కొన్నారు. ఈ స్థలాలను ప్రజావసరాలకు ఏ విధంగా ఉపయోగించాలన్న అంశంపై ప్రధానంగా చర్చించారు.
భూముల అమ్మకమే టార్గెట్
Published Tue, Feb 3 2015 2:45 AM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM
Advertisement
Advertisement