ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఘట్కేసర్: ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ పరిధిలోని మాధవరెడ్డి బ్రిడ్జి సమీపంలో శనివారం జరిగింది. వివరాలు.. కాలనీకి చెందిన శ్రీధర్(43) కల్లు ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో బ్రిడ్జి సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.