మాకూ వేతనాలు పెంచాలి ఎమ్మెల్యేల సంతకాల సేకరణ | mlas wants more salaries | Sakshi
Sakshi News home page

మాకూ వేతనాలు పెంచాలి ఎమ్మెల్యేల సంతకాల సేకరణ

Published Sun, Mar 15 2015 3:07 AM | Last Updated on Sat, Sep 2 2017 10:51 PM

mlas wants more salaries

సాక్షి,  హైదరాబాద్ : తమకూ వేతనాలూ పెంచాలని ఎమ్మెల్యేలు సంతకాల సేకరణ చేపట్టారు. అధికారపార్టీ ఎమ్మెల్యేలు గువ్వల బాల రాజు, ఎ.జీవన్‌రెడ్డి శనివారం అసెంబ్లీలో ప్రతీ టేబుల్ వద్దకు వెళ్లి ఎమ్మెల్యేలను సంతకాలు పెట్టాల్సిందిగా కోరారు. జిల్లా పరిషత్ చైర్మన్లు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, సర్పంచులు తదితరులకు వేతనాలు పెంచుతూ సీఎం శుక్రవారం ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీంతో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు సీఎంను కలసి తమ కూ వేతనాలు పెంచాలని విజ్ఞప్తి చేసినట్లు స మాచారం. ఈ నేపథ్యంలో వివిధ పార్టీలకు చెందిన సుమారు 60మంది వేతనాలు పెంచాలని సంతకాలు పెట్టినట్లు సమాచారం.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement