కరీంనగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.
సాక్షి, కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని సైదాపూర్ మండలం బొమ్మకల్లో ఒంటిపై కిరోసిన్ పోసుకొని తల్లి, కుమార్తె ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను అనసూయ(70), విజయ(40)గా గుర్తించారు. వీరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.