ఇంగ్లిష్, హిందీల్లోనే జేఈఈ మెయిన్స్‌ | The National Testing Agency (NTA) SaysThat JEE Main Exams Conducted In Language Requested by states | Sakshi
Sakshi News home page

ఇంగ్లిష్, హిందీల్లోనే జేఈఈ మెయిన్స్‌

Nov 13 2019 2:54 AM | Updated on Nov 13 2019 2:54 AM

The National Testing Agency (NTA) SaysThat JEE Main Exams Conducted In Language Requested by states - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) మెయిన్స్‌ పరీక్షను ఇంగ్లిష్, హిందీ భాషల్లోనే నిర్వహిస్తున్నామని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) స్పష్టం చేసింది. జేఈఈ మెయిన్స్‌ ద్వారా ఆయా రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశాలు చేపట్టేందుకు అంగీకరించిన, తమ ప్రాంతీయ భాషలో పరీక్షను నిర్వహించాలని కోరిన రాష్ట్రాల భాషల్లో మాత్రమే (ఇంగ్లిష్, హిందీతోపాటు) జేఈఈ మెయిన్స్‌ నిర్వహి స్తున్నామని తెలి పింది. 2013లో జేఈఈ మెయిన్స్‌ ప్రారంభమయ్యాక గుజరాతీలో పరీక్ష నిర్వహిం చాలని గుజ రాత్‌ కోరిందని తెలిపింది. 2014లో మహారాష్ట్ర కూడా మరాఠీతోపాటు ఉర్దూలో పరీక్ష నిర్వహించాలని కోరిందని పేర్కొంది. దాంతో గుజరాతీ, మరాఠీ, ఉర్దూ భాషల్లోనూ జేఈఈ మెయిన్స్‌ ప్రశ్న పత్రం ఇస్తున్నామని వెల్లడించింది. మిగతా రాష్ట్రాలు తమ ప్రాంతీయ భాషల్లో ప్రశ్న పత్రం ఇవ్వాలని తమను అడగలేదని ఎన్‌టీఏ స్పష్టం చేసింది. జేఈఈ మెయిన్స్‌ ప్రశ్నపత్రం ఏ భాషలో ఇచ్చినా మూల్యాంకనంలో మాత్రం ఇంగ్లిష్‌ ప్రశ్నపత్రాన్నే ప్రామాణికంగా తీసుకుంటామని వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement