conducted
-
అవయవదాతలకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
చెన్నై: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అవయవదాతల అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తుందని ప్రకటించారు. అవయవదానంలో తమిళనాడు దేశంలోనే అగ్రగామిగా ఉందని స్టాలిన్ తెలిపారు. తాజా ప్రకటన అవయవదానానికి మరింత ప్రోత్సాహం ఇచ్చినట్లవుతుందని అన్నారు. విపత్కర పరిస్థితుల్లో తమ ఆత్మీయుల అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చిన కుటుంబాల నిస్వార్థ త్యాగాల వల్లే తమిళనాడు ఈ స్థానంలో ఉందని స్టాలిన్ కొనియాడారు. అవయవదాతలకు, వారి కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం గౌరవం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. ఇదీ చదవండి: కుండపోత వర్షం.. నీటమునిగిన నాగ్పూర్.. రంగంలోకి కేంద్ర బలగాలు -
రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ప్రైడ్ ఆధ్వర్యంలో తలసేమియా పరీక్షలు
హైదరాబాద్: రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ప్రైడ్ అధ్వర్యంలో తలసేమియా(సికిల్ సెల్ అనీమియా) వ్యాధిని గుర్తించే హెచ్పీఎల్సీ(హై పెర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమాటోగ్రఫీ) పరీక్షలను నిర్వహించారు. రోటరీ క్లబ్ అధ్యక్షులు నర్గీస్ సకీనా యార్ ఖాన్, కార్యదర్శి ఫాతిమా తాహిర్లు.. జిన్నారం మండలంలోని వావిలాల గ్రామంలో 23 మంది మహిళలకు ఈ పరీక్షలను నిర్వహించారు. ఈ హానికర రక్త హీనత(సికిల్ సెల్ అనీమియా) వంశపారంపర్యంగా వ్యాపిస్తుంది. రక్తంలోని హిమోగ్లోబిన్లో లోపం కారణంగా ఇది సంభవిస్తుంది. జన్యువులలో మ్యుటేషన్ కారణంగా ఈ వ్యాధి రావచ్చని వైద్యులు తెలిపారు. పుట్టుకతో వచ్చే ఈ వ్యాధి తల్లి నుంచి శిశువుకు వ్యాపించకుండా నిరోధించడానికి గర్భిణీలకు ముందస్తు నిర్ధారణ చాలా ముఖ్యమని డాక్టర్లు వెల్లడించారు. తలసేమియా వ్యాధి కలిగిన వ్యక్తులను గుర్తించడానికి ఈ హెచ్పీఎల్సీ (హై పెర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమాటోగ్రఫీ) స్క్రీనింగ్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. తల్లి నుంచి శిశువుకు వ్యాధి వ్యాపించకుండా నిర్దారణకు ఈ టెస్టు ఉపయోగపడుతుందని డాక్టర్లు పేర్కొన్నారు. సికిల్ సెల్ అనీమియాను కనిపెట్టడానికి హెచ్పీఎల్సీ టెస్టింగ్ నిర్దిష్టమైన ఫలితాలను ఇస్తుందని వెల్లడించారు. ఈ పరీక్షలు నిర్వహించడానికి తమకు ఎఫ్పీఏఐ సహాయం చేసినట్లు చెప్పారు. తలసేమియాను గుర్తించిన మహిళలకు కాల్షియం సిరప్, మల్టీవిటమిన్ సిరప్ బాటిల్లను అందించారు. ఇదీ చదవండి: హుస్సేన్సాగర్కు భారీగా వరద నీరు.. అప్రమత్తమైన బల్దియా -
సాక్షి మీడియా ఆధ్వర్యంలో గుడివాడలో స్పెల్ బీ, మ్యాథ్స్ బీ పరీక్షలు
-
ఇక తెలుగులోనూ జేఈఈ మెయిన్!
సాక్షి, హైదరాబాద్: మాతృ భాషలో చదువుకున్న విద్యార్థులు ఇబ్బందులు పడకుం డా ఉండేందుకు జేఈఈ మెయిన్ పరీక్షలను 9 ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహిం చేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) కసరత్తు ప్రారంభించింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్ఆర్డీ) ఆదేశాల మేరకు ఈ కసరత్తును ప్రారంభించింది. ప్రాంతీయ భాషల్లో చదువుకున్న వారు ఇంగ్లిష్/హిందీ లేదా గుజరాతీలో ఇచ్చే జేఈఈ మెయిన్ పరీక్ష పత్రాల కారణంగా ఇబ్బందులు పడుతు న్నట్లు ఎంహెచ్ఆర్డీ గుర్తించింది. అలాగే పలు రాష్ట్రాలు కూడా ప్రాంతీయ భాషల్లో జేఈఈ మెయిన్ను నిర్వహించాలని విజ్ఞప్తులు చేస్తుండటంతో ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చింది. 2021 జనవరి నుంచి జేఈఈ మెయిన్ను ఇంగ్లిష్, హిందీ సహా 11 భాషల్లో నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని ఎన్టీఏను ఎంహెచ్ఆర్డీ ఆదేశించింది. అందుకు అనుగుణంగా ఎన్టీఏ కసరత్తు ప్రారంభించింది. దాదాపు లక్షన్నర మందికి పైగా తెలుగు విద్యార్థులు రాసే ఈ పరీక్షలను తెలుగులోనూ నిర్వహించేలా చర్యలు చేపడుతోంది. వచ్చే ఏప్రిల్లో మాత్రం మూడు భాషల్లోనే.. ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో బీఈ/బీటెక్, బీఆర్క్లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్నూ మూడు భాషల్లోనే నిర్వహిస్తోంది. ఇంగ్లిష్, హిందీతోపాటు గుజరాతీలోనూ ఈ పరీక్షలను నిర్వహిస్తోంది. 2013లో జేఈఈ మెయిన్ అమల్లోకి తెచ్చినపుడు తమ భాషలోనూ పరీక్ష నిర్వహించాలని గుజరాత్ కోరడంతో గుజరాతీలోనూ పరీక్ష నిర్వహిస్తోంది. తెలుగు రాష్ట్రాలు అప్పట్లో అడగకపోవడంతో తెలుగులో నిర్వహించడం లేదు. 2018 వరకు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఈ పరీక్షలను నిర్వహించగా, 2019 నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) జేఈఈ మెయిన్ పరీక్షలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకు కూడా మూడు భాషల్లోనే ఈ పరీక్షలను నిర్వహించింది. వచ్చే ఏప్రిల్ 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నిర్వహించే జేఈఈ మెయిన్ను కూడా మూడు భాషల్లోనే నిర్వహిస్తామని ఎన్టీఏ స్పష్టం చేసింది. 11 భాషల్లో నిర్వహించేలా.. వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న విజ్ఞప్తులు, మాతృ భాషల్లో చదువుకున్న వారు నష్టపోకుండా ఉండేందుకు 11 భాషల్లో జేఈఈ మెయిన్ను నిర్వహించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ఎన్టీఏను ఆదేశించింది. ఆ 11 భాషల్లో 9 ప్రాంతీయ భాషలు ఉన్నాయి. 2021 జనవరిలో నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షలను ఇంగ్లిష్, హిందీతోపాటు ప్రాంతీయ భాషలైన అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మరాఠీ, ఒడియా, తమిళ్, తెలుగు, ఉర్దూ భాషల్లో నిర్వహించేలా చర్యలు చేపడుతోంది. 2021 జనవరి తరువాత కూడా ఇకపై ప్రతి ఏటా 11 భాషల్లో ఈ పరీక్షలను నిర్వహించనుంది. ఇంకా ఏమైనా రాష్ట్రాలు అడిగితే ఆయా భాషల్లోకి ప్రశ్నపత్రాలను అనువాదం చేసి ఇచ్చే అంశాలను కూడా ఎన్టీఏ పరిశీలిస్తోంది. ‘ఆ జవాబులు సరైనవే’ జేఈఈ మెయిన్ పరీక్షలోని 5 న్యూమరికల్ వ్యాల్యూ ప్రశ్నలకు ‘కీ’లో పేర్కొన్న 5 సంబంధిత జవాబులు సరైనవేనని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పేర్కొంది. 5, 5.0, 5.00, 5.000, 5.0000, 05, 05.0, 05.00, 05.000, 05.0000 జవా బులన్నీ సరైనవేనని ఓ ప్రకటనలో ఎన్టీఏ తెలిపింది. అభ్యర్థులు దీన్ని గమనించాలని సూచించింది. ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకు జేఈఈ మెయిన్ పరీక్షలు నిర్వహించారు. -
ఇంగ్లిష్, హిందీల్లోనే జేఈఈ మెయిన్స్
సాక్షి, హైదరాబాద్: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్ పరీక్షను ఇంగ్లిష్, హిందీ భాషల్లోనే నిర్వహిస్తున్నామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) స్పష్టం చేసింది. జేఈఈ మెయిన్స్ ద్వారా ఆయా రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు చేపట్టేందుకు అంగీకరించిన, తమ ప్రాంతీయ భాషలో పరీక్షను నిర్వహించాలని కోరిన రాష్ట్రాల భాషల్లో మాత్రమే (ఇంగ్లిష్, హిందీతోపాటు) జేఈఈ మెయిన్స్ నిర్వహి స్తున్నామని తెలి పింది. 2013లో జేఈఈ మెయిన్స్ ప్రారంభమయ్యాక గుజరాతీలో పరీక్ష నిర్వహిం చాలని గుజ రాత్ కోరిందని తెలిపింది. 2014లో మహారాష్ట్ర కూడా మరాఠీతోపాటు ఉర్దూలో పరీక్ష నిర్వహించాలని కోరిందని పేర్కొంది. దాంతో గుజరాతీ, మరాఠీ, ఉర్దూ భాషల్లోనూ జేఈఈ మెయిన్స్ ప్రశ్న పత్రం ఇస్తున్నామని వెల్లడించింది. మిగతా రాష్ట్రాలు తమ ప్రాంతీయ భాషల్లో ప్రశ్న పత్రం ఇవ్వాలని తమను అడగలేదని ఎన్టీఏ స్పష్టం చేసింది. జేఈఈ మెయిన్స్ ప్రశ్నపత్రం ఏ భాషలో ఇచ్చినా మూల్యాంకనంలో మాత్రం ఇంగ్లిష్ ప్రశ్నపత్రాన్నే ప్రామాణికంగా తీసుకుంటామని వెల్లడించింది. -
రెండు రోజులు నిర్వహించాలి..!
సాక్షి,ఆదిలాబాద్: ఎజెండా అంశాలు 42.. సమావేశం ప్రారంభమైంది ఉదయం 11గంటలకు.. మొదటి ఎజెండా అంశం విద్య. రెండోది వ్యవసాయంపై చర్చసాగే సరికి మధ్యాహ్నం 2గంటలైంది. దీంతో భోజన విరామం నుంచి మళ్లీ 2.30 గంటల నుంచి తిరిగి సమావేశమయ్యారు. ఇక వడివడిగా ఎజెండా అంశాలను ముగించాలని చూశారు. రెండో సెషన్ మధ్యాహ్నం జరిగిన సమావేశంలో వైద్యం మీద కొంత చర్చ జరిగినా. మిగితా ఎజెండా అంశాల పరంగా ఇలా చదివి.. అలా నెట్టేశారు. మొత్తం మీద సాయంత్రం 5.30 గంటల్లోపు 20అంశాల వరకు పూర్తి కానిచ్చారు. మిగితా అంశాల జోలికే వెళ్లలేదు. గతనెల 27న జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం తీరిది. మరోమారు డిమాండ్.. జెడ్పీ సర్వసభ్య సమావేశం మూడు నెలలకోసారి నిర్వహించేది. మొన్నటి సమావేశం ఆగస్టు చివరి వారంలో నిర్వహించగా, మళ్లీ నవంబర్లో జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశాలను రెండు రోజుల పాటు నిర్వహించాలనేది ఇప్పటి డిమాండ్ కాదు. గతం నుంచే ఉన్నది. ఉమ్మడి జిల్లాలో జెడ్పీ పరంగా 52మంది జెడ్పీటీసీలు, 52మంది ఎంపీపీలు, పది మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొనేవారు. సభ్యులు, ఎమ్మెల్యేలలో కొందరు 200కిలో మీటర్ల దూరం నుంచి వచ్చేవారు. అయితే అప్పుడు సమావేశాల్లో ఎజెండా అంశాలపై పూర్తిస్థాయిలో చర్చ జరగడం లేదని పలువురు సభ్యులు వాపోయేవారు. దీంతో గత పాలకవర్గంలో ఒకట్రెండు సార్లు, అంతకుముందు పాలకవర్గంలో ఒకసారి రెండు రోజుల పాటు సమావేశాలను నిర్వహించారు. అధిక మంది సభ్యులు ఉండడంతో వారికి వసతులు, భోజనాలు సౌకర్యాలు కల్పించడం ఇబ్బందిగా పరిణమించింది. అప్పట్లో జెడ్పీకి నిధుల కొరత కారణంగా జెడ్పీ సమావేశాల నిర్వహణను ఒకరోజుతోనే కానిచ్చారు. ప్రస్తుతం కొత్త జిల్లాలు ఏర్పడటం, ఆదిలాబాద్ జెడ్పీ 17మంది జెడ్పీటీసీలు, 17 మంది ఎంపీపీలు, నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, ఎమ్మెల్సీలు సభ్యులుగా ఉన్నారు. సభ్యులు ఒక గంటలోపే జిల్లా కేంద్రానికి చేరుకునే అవకాశం ఉంది. దూరభారం లేదు. 17మండలాల సభ్యులు తమ మండలాలకు వెళ్లి మరుసటి రోజుకూడా వచ్చేందుకు అవకాశం ఉంది. గతనెల నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్ తలమడుగు జెడ్పీటీసీ గోక గణేష్రెడ్డి రెండు రోజుల పాటు ఈ సమాశాలు నిర్వహించాలనే డిమాండ్ను తెరపైకి తీసుకొచ్చారు. సమావేశం అనంతరం అధికార పార్టీ సభ్యులతో పాటు మిగితా వారు కూడా సమస్యలను చర్చించాలి, సమస్యలందరు మాట్లాడాలంటే రెండు రోజుల పాటు సమావేశాలు నిర్వహించడంతోనే ఇది సాధ్యమవుతుందనే రీతిలో చర్చించుకోవడం జరిగింది. దీనిపై మరోసారి చర్చ సాగుతోంది. ప్రధానంగా కోరం సభ్యులు కోరిన పక్షంలో రెండు రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉంది. సభ్యులు కోరితే ప్రజల సమస్యలపై చర్చించేందుకు రెండు రోజులు నిర్వహించేందుకు సిద్ధమన్న రీతిలో పాలకవర్గం పేర్కొంటుంది. మళ్లీ నిర్వహించే సమావేశాల్లోనే ఇది అమలైతే ఆమోదయోగ్యంగా ఉంటుందన్న అభిప్రాయం సభ్యుల్లో వ్యక్తమవుతోంది. గతంలో సభ్యులకు గౌరవ వేతనంతో పాటు టీఏ, డీఏలు ఉండేవి. ప్రస్తుతం సభ్యులకు గౌరవ వేతనం ఉన్నప్పటికీ టీఏ, డీఏలు ప్రభుత్వం ఇవ్వడం లేదు. తద్వారా సభ్యులు రెండు రోజుల పాటు సమావేశాల్లో పాల్గొన్నా జెడ్పీపై పడే అదనపు భారం కేవలం నిర్వహణ ఖర్చులు. సభ్యులు సబ్జెక్టుతో వస్తే.. యాభై నుంచి అరవై శాఖలకు సంబంధించి 42 ఎజెండా అంశాలను జెడ్పీ సమావేశంలో రూపొందించడం జరుగుతోంది. ఇందులో కొన్ని శాఖలకు అనుబంధంగా జోడించడంతో ఎజెండా అంశాలు శాఖల పరంగా పోల్చితే కొన్ని తక్కువగా ఉంటాయి. ప్రధానంగా జెడ్పీ సమావేశంలో సభ్యులు పూర్తి అవగాహనతో వస్తే మాత్రం ఎజెండా అంశాలు చర్చించడానికి ఒక్కరోజు అసలుకే సరిపోదు. గత సర్వసభ్య సమావేశంలో విద్య శాఖతో ఎజెండా అంశం ప్రారంభమైంది. ఉదయం 11గంటలకు ప్రారంభం కాగా ముగ్గురు నలుగురు సభ్యులు దీనిపై మాట్లాడారు. ఆ తర్వాత వ్యవసాయ శాఖపై చర్చ సాగింది. ఈ రెండు అంశాలకే మూడుగంటల సమయం తీసుకుంది. విద్య శాఖ చర్చ సాగుతున్న సమయంలో కాంగ్రెస్ సభ్యుడు గోక జీవన్రెడ్డి మాట్లాడుతూ తాను పదవీ చేపట్టిన తర్వాత తన మండలం తలమడుగులోని 75శాతం పాఠశాలల్లో పర్యటించినట్లు తెలిపారు. ఈ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు కరువయ్యాయని వాపోయారు. పాలకవర్గం సభ్యుని మాటలు కుదించితే మిగితా సభ్యులు మాట్లాడేందుకు అవకాశం దక్కుతుందని పేర్కొన్నప్పుడే తాను ఐదు నిమిషాలు కూడా మాట్లాడలేదని గణేష్రెడ్డి పేర్కొనడం, సమావేశాలను రెండు రోజుల పాటు నిర్వహిస్తే సుదీర్ఘ చర్చ జరుగుతుందన్న వాదనను తెరపైకి తేవడం జరిగింది. సమావేశాల్లో ప్రధాన అంశాలపైనే చర్చ సాగించి మిగితావి మమ అనిపిస్తున్నారు. అంశాల వారీగా చర్చ సాగుతున్నప్పుడు సభ్యులు వాటి ప్రకారమే సమస్యలను లేవనెత్తినప్పుడే పరిష్కారానికి దోహద పడుతుంది. అలాంటప్పుడే జిల్లాలోని సమస్యలపై తీర్మాణాలు చేసి ప్రభుత్వానికి పంపినప్పుడు దానికి పరిష్కార మార్గం లభిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 42అంశాల్లో ఒక్కో అంశంపై సుమారు 15నిమిషాల పాటు చర్చించినా అన్ని అంశాలపై చర్చ సాగాలంటే సుమారు 11గంటల సమయం పడుతుంది. మొన్నటి సమావేశం కేవలం ఆరు గంటలు మాత్రమే నిర్వహించారు. ఇలాంటి పరిస్థితుల్లో రెండు రోజుల పాటు సమావేశాలు నిర్వహించి మొదటి రోజు సగం, రెండో రోజు సగం ఎజెండా అంశాలను చర్చిస్తే పరిష్కారం లభిస్తుందన్న అభిప్రాయం సభ్యుల్లో వ్యక్తమవుతుంది. సమయం సరిపోకపోతే పరిశీలిస్తాం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎజెండా అంశాలపై సమయం సరిపోకపోతే మరుసటి రోజు కొనసాగించే విషయాన్ని పరిశీలిస్తాం. ప్రజల సమస్యల పరిష్కారంలో వెనకడుగు వేసేది లేదు. సభ్యుల కోరిక మేరకు ముందుకు వెళ్తాం. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. – రాథోడ్ జనార్దన్, జెడ్పీ చైర్మన్, ఆదిలాబాద్ డిమాండ్ను పరిశీలిస్తాం రెండు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలనే దానిపై పరిశీలన చేస్తాం. దీనికి 1/3వ వంతు సభ్యులు కోరితే రెండు రోజులు చేపట్టేందుకు అవకాశం ఉంది. స్థానికంగా ఉన్న పరిస్థితులను బట్టి ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కొంతమంది సభ్యులు సమావేశంలో ప్రస్తావించారు. ప్రత్యేకంగా దృష్టికి మాత్రం తీసుకురాలేదు. – కిషన్, జెడ్పీ సీఈఓ, ఆదిలాబాద్ -
ట్రిపుల్ఐటీలో ముగిసిన వైజ్ఞానిక మేళా
బాసర(ముథోల్) : బాసర ట్రిపుల్ఐటీలో గత మూడు రోజుల నుంచి నిర్వహిస్తున్న వైజ్ఞానిక మేళా గురువారం రాత్రి ముగిసింది. దాదాపు 221 మందికి పైగా విద్యార్థులు వివిధ ప్రయోగాలను ప్రదర్శించారు. గురువారం రాత్రి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ముగింపు సమావేశానికి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్, తెలంగాణ యూనివర్సిటీ సాంబయ్య, ఎ¯Œఆర్ఎస్ఏ డైరెక్టర్ సూజాత గోశ్, పాలమూరు యూనివర్శిటీ వైస్ ఛాన్సులార్ రాజరత్నం, వీసీ డాక్టర్ అశోక్కుమార్, ముఖ్య అథితులుగా హాజరయ్యారు. విద్యార్థులు తయారు చేసిన ప్రయోగాలను ఆకస్తిగా తిలకించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ట్రిపుల్ఐటీ ఉండడం అదృష్టమన్నారు. విద్యార్థుల్లో అంతర్గతంగా దాగి ఉన్న వైజ్ఞానిక దృష్టి కోణాన్ని బహిర్గతం చేయడానికి విజ్ఞాన ప్రదర్శన ఉపయోగపడిందన్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఏవో వెంకటస్వామి, అకాడమిక్ డీన్ రణదీర్ సాగీ, టెక్ ఫెస్టు కన్వీనర్ స్వప్నిల్, నాగరాజు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
అణు పరీక్షలు జరిపిన ఉత్తరకొరియా
-
ఎంసెట్ ‘తీన్’మార్
హాజరైన 1,499 మంది విద్యార్థులు ప్రతి సెంటర్లో పోలీసు బందోబస్తు చివరి నిమిషంలో ఉరకలు పరుగులు ఖమ్మం: ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశం కోసం తెలంగాణ ప్రభుత్వం ఆదివారం నిర్వహించిన ఎంసెట్–3 జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. నగరంలోని మొత్తం నాలుగు కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 2,172 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 1,499 మంది హాజరయ్యారని, 673 మంది గైర్హాజరయ్యారని జిల్లా కోఆర్డినేటర్ పుష్పలత వివరించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించారు. నిమిషం నిబంధన ఉండటంతో అభ్యర్థులు ఉదయం 9 గంటల వరకే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. పేపర్ లీకేజీ వ్యవహారంతో ఎంసెట్–2 రదై్దన నేపథ్యంలో ఎంసెట్–3కి భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఖమ్మం డీఎస్పీ సురేష్కుమార్ నేతృత్వంలో పోలీసులు బందోబస్తును కఠినతరం చేశారు. పరీక్ష కేంద్రం వద్ద పోలీసు పహారా ఏర్పాటు చేసి ప్రతి వ్యక్తిని తనిఖీ చేసి లోనికి పంపించారు. పరీక్ష నిర్వహణ తీరును జేఎన్టీయూ అధికారులతో పాటు జిల్లా కోఆర్డినేటర్ పర్యవేక్షించారు. – ఖమ్మంలోని ఎస్ఆర్అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల–1 సెంటర్కు 550 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 386 మంది హాజరయ్యారు. 164 మంది గైర్హాజరయ్యారు. – ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల–2 సెంటర్కు 550 మంది గాను 391 మంది హాజరయ్యారు. 159 మంది గైర్హాజరయ్యారు. – ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల సెంటర్లో 675 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 452 మంది మాత్రమే రాశారు. 223 మంది పరీక్షకు హాజరుకాలేదు. – యూనివర్సిటీ పీజీ కళాశాల సెంటర్లో 397 మందికి 270 హాజరుకాగా 127 మంది గైర్హాజరయ్యారు. – పలువురు అభ్యర్థులు ఉరకలు పరుగులు తీస్తూ కనిపించారు. పరీక్ష కేంద్రాల విషయంలో కొందరు అభ్యర్థులు గందరగోళానికి గురయ్యారు. ఇల్లెందు పట్టణానికి చెందిన లావణ్య అనే అభ్యర్థిని ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ కళాశాల అనుకొని, యూనివర్సిటీ కళాశాలకు వెళ్లింది. తీరా హాల్టికెట్ చూసే సరికి పొరపాటును గుర్తించింది. తిరిగి తనకు కేటాయించిన పరీక్ష కేంద్రానికి రాబోయే సరికి అప్పటికే ఆలస్యం కావడంతో అనుమతించలేదు. – హాల్టికెట్ల డౌన్లోడింగ్, అటెస్టేషన్ కోసం పలువురు విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. – తల్లిదండ్రులు దగ్గరుండి పిల్లలకు దైర్యంనూరి పోసి పరీక్ష హాల్కు పంపించారు. పరీక్ష పూర్తయ్యే వరకు అక్కడే ఉండి తిరిగి వారిని తోడ్కొని వెళ్లారు. -
ఎంసెట్ సహ అన్ని సెట్లూ అన్లైన్లోనే
-
పాలిసెట్కు 97.35 శాతం హాజరు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా గురువారం నిర్వహించిన పాలిసెట్-2016 పరీక్షకు 97.35 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు సాంకేతిక విద్య, శిక్షణ మండలి (ఎస్బీటీఈటీ) చైర్మన్ డాక్టర్ ఎంవీ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 1,27,972 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 1,24,584 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని 220 కాలేజీల్లో 28 బ్రాంచీల్లో 53,870 సీట్ల భర్తీకి పరీక్ష నిర్వహించినట్లు వెల్లడించారు. ఫలితాలను 2 వారాల్లో ప్రకటిస్తామని, ప్రవేశాలను మే మూడో వారంలో చేపడతామని తెలిపారు. తరగతులు జూన్ 9 నుంచి ప్రారంభిస్తామన్నారు. -
హైదరాబాద్ సోమాజిగూడలో ఫ్యాషన్షో
-
ఒంగోలులో కన్నులపండుగగా సాగిన యాగం
-
కళ్లకు కట్టినట్టుగా చూపించారు!!
-
'ఆల్ పార్టీ మీట్ ఎప్పుడో నిర్వహించాల్సింది'
-
సీమాంధ్ర భగ్గుమన్నది-గౌతమ్ రెడ్డి