JEE Main exam
-
జేఈఈ మెయిన్ తప్పులతడక
సాక్షి, ఎడ్యుకేషన్: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడిచే ఇతర విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష జేఈఈ – మెయిన్. కొద్ది రోజుల క్రితం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తొలి దశ జేఈఈ మెయిన్(JEE Main 2025 exam)ను నిర్వహించింది.ఈ క్రమంలో ప్రశ్నల్లో లోపాలు, అనువాద దోషాలు, సిలబస్ పరిధిలో లేని ప్రశ్నలు అడగడం, తుది ఆన్సర్ కీలో తొలగిస్తున్న ప్రశ్నల సంఖ్య పెరగడంపై విద్యార్థులు, అధ్యాపకులు విమర్శలు చేస్తున్నారు. జేఈఈ–మెయిన్ – 2025 జనవరి సెషన్ ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో జేఈఈ మెయిన్లో లోపాలపై పరీక్ష నిర్వహణ సంస్థ ఎన్టీఏపై విమర్శలు మరింత తీవ్రమయ్యాయి. పన్నెండు ప్రశ్నల తొలగింపుజేఈఈ – మెయిన్ విషయంలో ఎన్టీఏ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఈ ఏడాది.. పలు షిష్ట్లలో నిర్వహించిన పరీక్షల్లో తొలగించిన ప్రశ్నల సంఖ్యే ఇందుకు నిదర్శనమని సబ్జెక్ట్ నిపుణులు అంటున్నారు. ఈ ఏడాది మొత్తం పది షిఫ్ట్లలో జేఈఈ మెయిన్ నిర్వహించగా.. ఏకంగా 12 ప్రశ్నలను తొలగించారు. ఇందులో అత్యధికంగా ఫిజిక్స్ నుంచి 8 ప్రశ్నలు ఉంటే.. మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీల నుంచి రెండు చొప్పున నాలుగు ప్రశ్నలు ఉన్నాయి.దీనికి సాంకేతిక లోపం, మానవ తప్పిదం కారణమని ఎన్టీఏ పేర్కొంది. జాతీయ స్థాయిలో జేఈఈ–మెయిన్తోపాటు నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్)–యూజీ, కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ (సీమ్యాట్), తదితర పరీక్షలను నిర్వహిస్తున్న ఎన్టీఏ వాటిని సమర్థంగా నిర్వహించడంలో విఫలమవుతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రశ్నలు రూపొందించే ఎగ్జామినర్స్ విషయంలోనూ, అదే విధంగా వాటిని పకడ్బందీగా పరిశీలించే విషయంలోనూ ఎన్టీఏ అప్రమత్తంగా ఉండట్లేదనే ఆరోపణలు వస్తున్నాయి.గత కొన్నేళ్లుగా తప్పులే..జేఈఈ – మెయిన్ పరీక్ష తీరును పరిగణనలోకి తీసుకుంటే.. గత కొన్నేళ్లుగా ఏటా ప్రశ్నల్లో తప్పుల సంఖ్య పెరుగుతోంది. 2024 సెషన్–1లో ఆరు ప్రశ్నలు; సెషన్–2లో నాలుగు ప్రశ్నలు తొలగించగా.. 2023లో సెషన్–1లో నాలుగు ప్రశ్నలు, 2022 సెషన్–1లో నాలుగు, సెషన్–2లో ఆరు ప్రశ్నలు తొలగించారు. ఇలా తొలగించిన ప్రశ్నల విషయంలో అభ్యర్థులకు పూర్తి మార్కులు (4 మార్కులు) కేటాయిస్తామని ఎన్టీఏ పేర్కొంది. అయితే ఇలాంటి తప్పుల కారణంగా విద్యార్థులు పరీక్ష హాల్లో సమయం వృథా చేసుకోవాల్సి వస్తోందని, లోపాలు లేని ప్రశ్నలు ఇచ్చే విధంగా ముందుగానే ఎన్టీఏ పటిష్ట చర్యలు తీసుకోవాలని సబ్జెక్ట్ నిపుణులు పేర్కొంటున్నారు. సిలబస్ పరిధిలో లేని ప్రశ్నలు..జేఈఈ – మెయిన్ విషయంలో ఎన్టీఏ నిర్లక్ష్యానికి నిదర్శనంగా.. సిలబస్లోని ప్రశ్నలు రావడాన్ని ఉదహరిస్తున్నారు. 2025 జనవరి సెషన్ పరీక్షలనే పరిగణనలోకి తీసుకుంటే మొత్తం పది షిఫ్ట్లలో నిర్వహించిన పరీక్షల్లో.. ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అండ్ లిక్విడ్స్ చాప్టర్కు సంబంధించి న్యూటన్ లా ఆఫ్ కూలింగ్ నుంచి 22 ప్రశ్నలు, అదే విధంగా కార్నెట్ లా నుంచి కూడా ఒక ప్రశ్న అడిగారని అంటున్నారు.అయితే గత ఏడాది నుంచి న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ను, అంతకుముందు ఏడాది కార్నెట్ లాను సిలబస్లో తొలగించారని సబ్జెక్ట్ నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఇలా సిలబస్లో లేని ప్రశ్నలు అడగడం కారణంగా విద్యార్థులు అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేకపోతున్నారని, ఇది ఫలితంపై ప్రభావం చూపుతుందని పేర్కొంటున్నారు.రాధాకృష్ణన్ కమిటీ స్పష్టంగా..జాతీయ స్థాయిలో వివిధ ప్రవేశ పరీక్షల్లో పారదర్శకత కోసం పలు సిఫార్సులు చేసిన ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణన్ నేతృత్వంలోని కమిటీ సైతం.. జేఈఈలో ఎలాంటి తప్పులు లేకుండా చూడాల్సిన బాధ్యత ఎన్టీఏపై ఉందని తేల్చిచెప్పింది. అన్ని ప్రశ్నలకు కచ్చితమైన సమాధానాలు ఉండేలా ప్రశ్నపత్రం రూపొందించాలని స్పష్టం చేసింది. కానీ.. దీనికి భిన్నంగా ఎన్టీఏ వ్యవహరిస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.నీట్–యూజీపై ఆందోళన..జేఈఈ– మెయిన్లో తప్పుల నేపథ్యంలో.. మే 4న నిర్వహించనున్న నీట్–యూజీ నిర్వహణ విషయంలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఈ పరీక్షకు కూడా దాదాపు పది లక్షల మంది హాజరవుతారు. దీంతో ప్రశ్నల్లో తప్పులు, అనువాద దోషాలతో నీట్ – యూజీ అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని.. ఈ పరిస్థితి ఉత్పన్నం కాకుండా ఎన్టీఏ ఇప్పటి నుంచే పకడ్బందీగా ప్రశ్న పత్రాల రూపకల్పనలో చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.జేఈఈ మెయిన్ జనవరి సెషన్లో తొలగించిన ప్రశ్నల కోడ్ నంబర్లు..⇒ ఫిజిక్స్: 656445270, 7364751025, 656445566, 6564451161, 656445870, 7364751250, 564451847, 6564451917⇒ కెమిస్ట్రీ: 656445728, 6564451784⇒ మ్యాథమెటిక్స్: 6564451142, 6564451898డేటాను నిరంతరం సమీక్షించాలి..కంప్యూటర్ ఆధారిత పరీక్షల్లో.. ముందుగానే నిర్దిష్ట అల్గారిథమ్స్ రూపొందించి ప్రశ్నలు అడిగే వి«ధానాన్ని ప్రోగ్రామింగ్ చేస్తున్నారు. అంటే.. ఏదైనా ఒక చాప్టర్ నుంచి నాలుగు ప్రశ్నలు ఇవ్వాలనుకుంటే ఆ మేరకు ముందుగానే సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ చేస్తారు. ఇలాంటి సందర్భాల్లో మొదటగానే ఒక ప్రశ్న తప్పుగా ఉంటే అదే పునరావృతం అవుతుంది. దీనికి పరిష్కారంగా ఎప్పటికప్పుడు కొశ్చన్స్ డేటా బ్యాంక్ను సమీక్షిస్తుండాలి. పెన్ పేపర్ విధానంలో స్పష్టంగా రాసే వీలున్న స్క్వేర్ రూట్స్, ఇతర సైంటిఫిక్ సింబల్స్ కంప్యూటర్లో సరిగా ప్రతిబింబించవు. ఇది కూడా ప్రశ్నల్లో తప్పులకు కారణం అవుతోంది. మొత్తంగా 12 ప్రశ్నలను తొలగించడం అనేది అసాధారణ పరిణామమే. – ఆర్. వి. శ్రీధర్, జేఈఈ–మెయిన్ ఫిజిక్స్ సబ్జెక్ట్ నిపుణులు -
నేటి నుంచి జేఈఈ మెయిన్ పరీక్షలు
-
నేటి నుంచి జేఈఈ మెయిన్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ–మెయిన్ పరీక్షలు మొదటి దఫా బుధవారం ప్రారంభం అవుతున్నాయి. దేశవ్యాప్తంగా సుమారు 12 లక్షల మంది విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయడానికి దరఖాస్తు చేసుకున్నారు. అందులో తెలుగు రాష్ట్రాల నుంచి సుమారుగా రెండు లక్షల మంది హాజరుకానున్నారు. తెలంగాణలో 10 పట్టణాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు.. అన్నిచోట్లా ఏర్పాట్లు పూర్తి చేశారు. బీఈ, బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈనెల 22, 23, 24 తేదీలతోపాటు 28, 29 తేదీల్లో రోజూ రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించనున్నారు. బీఆర్క్, బీప్లానింగ్ పరీక్షను ఈ నెల 30న నిర్వహిస్తారు. అభ్యర్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) స్పష్టం చేసింది. మొదటి సెషన్ పరీక్ష ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తారు. పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ విధానంలో పరీక్ష ఉంటుంది. విద్యార్థులు ఎలాంటి ఎల్రక్టానిక్ గాడ్జెట్స్ తీసుకొని రావడానికి వీల్లేదని ఎన్టీఏ చెప్పింది. -
దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్ పరీక్షలు ప్రారంభం
-
నిమిషం ఆలస్యమైనా నో ఛాన్స్
-
నేటి నుంచి జేఈఈ మెయిన్ సెకండ్ సెషన్ పరీక్షలు
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీ, తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్ సెకండ్ సెషన్ పరీక్షలు గురువారం (నేడు) ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 9.4 లక్షల మంది హాజరయ్యే అవకాశముంది. ఏపీ నుంచి 1.5 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. దేశంలోని 330 పట్టణాలు, విదేశాల్లోని 15 పట్టణాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఏపీలోని 25 పట్టణాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. ఇవి కంప్యూటర్ ఆధారిత పరీక్షలు. ఈ పరీక్షలు గురువారంతో పాటు 8, 10, 11, 12, 13, 15 తేదీల్లో జరుగుతాయి. ఇంతకు ముందు షెడ్యూల్లో 6 వ తేదీ నుంచి 12వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నప్పటికీ, అభ్యర్థుల సంఖ్య పెరగడంతో 13, 15 తేదీల్లో కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పరీక్ష నిర్వహిస్తోంది. రోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు బ్యాచ్లుగా పరీక్ష జరుగుతుంది. జేఈఈ మెయిన్ తొలి సెషన్కు 8.2 లక్షల మంది హాజరు కాగా, ఈసారి ఈ సంఖ్య పెరుగుతోంది, అభ్యర్ధులు పరీక్ష కేంద్రానికి అడ్మిట్ కార్డు కాపీలతో పాటు చెల్లుబాటు అయ్యే ఫొటో గుర్తింపు కార్డును కూడా తీసుకురావాలని ఎన్టీఏ సూచించింది. -
జేఈఈ మెయిన్ సెకండ్ సెషన్కు 9.4లక్షల మంది
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీ తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి సంబంధించిన జేఈఈ మెయిన్ సెకండ్ సెషన్ అడ్మిట్కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సోమవారం రాత్రి విడుదల చేసింది. www.nta.ac.in లేదా https://jeemain.nta.nic.in/వెబ్సైట్ల నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎన్టీఏ సూచించింది. ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 9.4 లక్షల మంది హాజరయ్యే అవకాశముందని పేర్కొంది. దేశంలో 330 పట్టణాలు, విదేశాల్లోని 15 పట్టణాల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో 25 పట్టణాల్లో ఈ పరీక్షలకు ఎన్టీఏ ఏర్పాట్లు చేసింది. ఈ నెల 6వ తేదీనుంచి 15వ తేదీవరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఇంతకుముందు ఈ పరీక్షల షెడ్యూల్లో 6వ తేదీనుంచి 12వ తేదీవరకు నిర్వహిస్తామని పేర్కొన్నా.. అభ్యర్థుల సంఖ్య పెరగడంతో 13, 15 తేదీల్లో కూడా పరీక్ష నిర్వహించనున్నట్లు అడ్మిట్కార్డుల్లో పొందుపరిచింది. ప్రస్తుతం తొలిరోజు పరీక్ష రాసేవారి అడ్మిట్కార్డులను ఎన్టీఏ విడుదల చేసింది. తదుపరి రోజులకు సంబంధించి పరీక్షరాసే వారి అడ్మిట్కార్డులను వరుసగా ముందు రోజుల్లో ఇవే వెబ్సైట్లలో ఉంచనుంది. పుట్టిన తేదీ, అప్లికేషన్ నంబరు నమోదు చేయడం ద్వారా అభ్యర్థులు అడ్మిట్కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చునని ఎన్టీఏ తెలిపింది. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి అడ్మిట్కార్డు కాపీలతో పాటు చెల్లుబాటయ్యే ఫొటో గుర్తింపుకార్డు కూడా తీసుకురావాలని సూచించింది. తొలి సెషన్ కన్నా ఎక్కువమంది అభ్యర్థులు జనవరిలో నిర్వహించిన మొదటి సెషన్ పరీక్షకన్నా రెండో సెషన్కు ఎక్కువమంది హాజరుకానున్నారని ఎన్టీఏ అడ్మిట్కార్డుల నోట్లో తెలిపింది. తొలి సెషన్లో 8.6 లక్షల మంది హాజరుకాగా ఈసారి 9.4 లక్షల మంది పరీక్ష రాయనున్నట్లు పేర్కొంది. జనవరి సెషన్ సమయంలో ఇంటర్ పరీక్షల సన్నద్ధతతో పాటు ప్రాక్టికల్ పరీక్షలు కూడా ఉండడంతో ఈ పరీక్ష రాసిన విద్యార్థుల సంఖ్య తక్కువే. అప్పుడు పరీక్ష రాయని వారితోపాటు రాసినవారు కూడా రెండో సెషన్లో పరీక్ష రాయనున్నారు. ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షలు ముగియడంతో విద్యార్థులకు జేఈఈ పరీక్షకు వెసులుబాటు కలిగింది. తొలిసెషన్ పరీక్షకు 8,60,064 మంది పేపర్–1కు, 46,465 మంది పేపర్–2కు రిజిస్టరయ్యారు. వీరిలో పేపర్–1కి 8,23,967 (95.80 శాతం) మంది, పేపర్–2కి 95 శాతానికిపైగా హాజరయ్యారు. 2.5 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్డ్కు ఎంపిక జేఈఈ మెయిన్స్ రెండు విడతల పరీక్షలకు సంబందించిన తుది ర్యాంకులతో ఫలితాలు ఈనెలాఖరునాటికి విడుదల కానున్నాయి. రెండు సెషన్లలో సాధించిన మార్కుల్లో ఎక్కువ మార్కులను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు ప్రకటిస్తారు. ఏప్రిల్ 30 నుంచి జేఈఈ అడ్వాన్స్డ్కు దరఖాస్తు ప్రక్రియ మొదలు కానున్నందున అంతకు ముందే ఈ ఫలితాలు వెలువడనున్నాయి. జేఈఈ మెయిన్లో అర్హత సాధించిన తొలి 2.5 లక్షల మందికి అడ్వాన్స్డ్లో దరఖాస్తుకు అవకాశమిస్తారు. కటాఫ్ 87 నుంచి 90 మార్కుల వరకు జేఈఈ మెయిన్ నుంచి అడ్వాన్స్డ్కు అర్హత సాధించడానికి కటాఫ్ మార్కులు జనరల్ కేటగిరీలో 87 నుంచి 90 వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి కటాఫ్ మార్కులు పెరుగుతాయని భావిస్తున్నారు. గతేడాది జనరల్ కటాఫ్ మార్కులు 88. గత అయిదేళ్ల కటాఫ్ మార్కులను పరిగణనలోకి తీసుకుంటే ఈ సారి కటాఫ్ ఇంచుమించు 90 వరకు ఉంటుందని తెలుస్తోంది. ఏపీలో 25 సెంటర్లు ఇవే.. అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, నరసరావుపేట, ప్రొద్దుటూరు, సూరంపాలెం, అమరావతి, గూడూరు, మచిలీపట్నం, నంద్యాల, తాడేపల్లిగూడెం. -
JEE Mains 2023 Result: జేఈఈ మెయిన్ తొలిసెషన్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశానికి సంబంధించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ తొలివిడత పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదల చేశారు. ఎన్టీఏ వెబ్సైట్లో ఫలితాలను ఉంచారు. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వ తేదీవరకు జరిగిన ఈ పరీక్షలకు 9 లక్షల మందికిపైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వారిలో పేపర్–1 (బీఈ, బీటెక్) పరీక్షకు 8.6 లక్షల మంది, పేపర్–2 (బీఆర్క్, బీప్లానింగ్) పరీక్షకు 46 వేల మంది హాజరయ్యారని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. దాదాపు 95.8 శాతం మంది పరీక్షకు హాజరవడం ఇదే తొలిసారని చెబుతున్నారు. జేఈఈ మెయిన్ సెకండ్ సెషన్ పరీక్షలకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నందున తొలిసెషన్ పరీక్ష ఫలితాలు విడుదల చేశారు. జేఈఈ తొలిసెషన్ పరీక్షల ప్రాథమిక కీని ఎన్టీఏ ఫిబ్రవరి 1వ తేదీనే విడుదల చేయగా, ఫిబ్రవరి 2 నుంచి 4వ తేదీవరకు అభ్యర్థుల అభ్యంతరాలను స్వీకరించింది. ఏప్రిల్ 6 నుంచి జేఈఈ మెయిన్ రెండో సెషన్ పరీక్షలు ఎన్టీఏ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 6 నుంచి 12వ తేదీ వరకు జేఈఈ మెయిన్ రెండోవిడత పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మంగళవారం ప్రారంభం కానుంది. మార్చి 7వ తేదీవరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. సెకండ్ సెషన్కు సంబంధించిన అప్లికేషన్ ఫారం " https:// jeemain. nta. nic. in' వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందని ఎన్టీఏ తెలిపింది. జేఈఈ మెయిన్ ఏప్రిల్ సెషన్ పరీక్షల సిటీ స్లిప్లను మార్చి 3వ వారంలో విడుదల చేయనున్నారు. మార్చి చివరి వారంలో రెండోసెషన్ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను ఎన్టీఏ విడుదల చేయనుంది. -
జేఈఈ మెయిన్ తొలివిడత సాధ్యమేనా?
సాక్షి,అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)లు వంటి జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్–2023 జనవరి సెషన్ పరీక్షల షెడ్యూల్ను మార్చాలని అభ్యర్థుల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే కొందరు బాంబే హైకోర్టులో పరీక్ష వాయిదాను కోరుతూ పిటిషన్ కూడా దాఖలు చేశారు. మరోవైపు అభ్యర్థులు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్)కు సైతం ఫిర్యాదు చేశారు. దీంతో అభ్యర్థులు లేవనెత్తుతున్న అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న ఎన్సీపీసీఆర్ పరీక్షల షెడ్యూల్ మార్పు అంశాన్ని పరిశీలించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)కి లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ఈ పరిణామాలన్నీ జేఈఈ మెయిన్–2023 జనవరి సెషన్ పరీక్షల నిర్వహణపై తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. అభ్యర్థుల అభ్యంతరాలు ఇవే.. జేఈఈ మెయిన్–2023ని రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు ఎన్టీఏ డిసెంబర్ 15న నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. తొలి సెషన్ పరీక్షలు జనవరి 24 నుంచి 31 వరకు, రెండో సెషన్ను ఏప్రిల్ 6 నుంచి 12 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో జనవరి సెషన్ పరీక్షలకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను కూడా ప్రారంభించింది. అయితే జనవరిలో సీబీఎస్ఈ సహా పలు రాష్ట్రాల్లో ఇంటర్మీడియెట్ బోర్డుల ప్రీ ఫైనల్ పరీక్షలు, ప్రాక్టికల్ పరీక్షలు ఉన్నాయి. దీనివల్ల జేఈఈ మెయిన్ పరీక్షలకు హాజరయ్యే అవకాశాన్ని తాము కోల్పోవలసి వస్తుందని అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 2021, 2022లో జేఈఈ మెయిన్లో విజయం సాధించినా అవకాశం అందుకోలేక డ్రాపర్లుగా మిగిలిపోయిన అభ్యర్థులు కూడా పరీక్ష సన్నద్ధతకు తమకు సమయం లేకుండా పోతోందని అంటున్నారు. దీనివల్ల తాము మళ్లీ నష్టపోతామని పేర్కొంటున్నారు. ఇవే కాకుండా జేఈఈ మెయిన్కు ఎన్టీఏ పేర్కొన్న అర్హతల్లోనూ కొన్ని సడలింపులు ఇవ్వాలని కొందరు తొలి నుంచి కోరుతున్నారు. ఈ అర్హతలపైన కూడా న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఇంటర్లో 75 శాతం ఉత్తీర్ణత నిబంధనపైనా.. ఇంకోవైపు జేఈఈ అభ్యర్థులు ఇంటర్మీడియెట్లో 75 శాతం మార్కులు సాధించి ఉండాలన్న నిబంధనను ఎన్టీఏ గత మూడేళ్లుగా రద్దు చేసింది. కోవిడ్ కారణంగా తరగతులు, పరీక్షలు జరగకపోవడంతో ఈ మేరకు వెసులుబాటు ఇచ్చింది. అయితే కోవిడ్ తగ్గుముఖం పట్టడం, కళాశాలలు రెగ్యులర్గా నడుస్తుండటంతో ఈసారి మళ్లీ 75 శాతం మార్కుల నిబంధనను పునరుద్ధరించింది. జేఈఈ మెయిన్లో మంచి స్కోరు సాధించిన అభ్యర్థులు ఎన్ఐటీలు, ఐఐఐటీలు తదితర సంస్థల్లో ప్రవేశాలు పొందాలంటే ఇంటర్లో 75 శాతం (ఎస్సీ, ఎస్టీలకు 65 శాతం) మార్కులు సాధించాల్సి ఉంటుంది. దీంతో తాము జేఈఈ మెయిన్లో మంచి స్కోరు సాధించినా.. ఇంటర్లో 75 శాతం మార్కులు సాధించి ఉండాలన్న నిబంధన తమ అవకాశాలకు గండి కొడుతుందని అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు. కాబట్టి ఈ నిబంధనను ఈసారి కూడా మినహాయించాలని కోరుతున్నారు. ఈ అంశాలన్నిటిపైనా ఎన్టీఏ ఇంకా ఎలాంటి నిర్ణయం వెలువరించలేదు. -
మార్చి 15 నుంచి ఇంటర్ పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్–2023 పబ్లిక్ పరీక్షలు మార్చి 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 4వ తేదీ వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు సోమవారం షెడ్యూల్ను విడుదల చేశారు. మార్చి 15 నుంచి ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు, మార్చి 16 నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతాయి. నైతికత, మానవ విలువలు పరీక్షను ఫిబ్రవరి 22వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు, పర్యావరణ విద్య పరీక్షను ఫిబ్రవరి 24న ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు నిర్వహిస్తారు. ప్రాక్టికల్ పరీక్షలు ఏప్రిల్ 15 నుంచి ప్రారంభమవుతాయి. వీటిని ఏప్రిల్ 15 నుంచి 25 వరకు, ఏప్రిల్ 30, మే 10వ తేదీలలో రోజుకు రెండు సెషన్లలో నిర్వహిస్తారు. ఆదివారాలతో కలుపుకొని ఆయా రోజుల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయి. జనరల్, వొకేషనల్ గ్రూపుల విద్యార్థులందరికీ ఇదే షెడ్యూల్లో ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. ప్రాక్టికల్స్కు జంబ్లింగ్ విధానం: ప్రాక్టికల్ పరీక్షలను ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టులలో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. దీనిలో జంబ్లింగ్ విధానాన్ని అనుసరిస్తారు. జేఈఈ మెయిన్ పరీక్షల కారణంగా ఏప్రిల్లో ప్రాక్టికల్స్ ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలు సాధారణంగా జనవరి ఆఖరు లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి నెలాఖరులోపు పూర్తి చేసేవారు. ఈ ఏడాది జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ పరీక్షలను దృష్టిలో పెట్టుకుని ఇంటర్ ప్రాక్టికల్స్ను ఏప్రిల్ రెండో వారంలో నిర్వహించాలని నిర్ణయించారు. జేఈఈ మెయిన్ తొలి సెషన్ పరీక్షలు జనవరి 24 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ షెడ్యూల్ ప్రకటించింది. ఫిబ్రవరి 1, 2, 3 తేదీలను రిజర్వుగా కేటాయించింది. రెండో సెషన్ పరీక్షలు ఏప్రిల్ 6 నుంచి 12 వరకు నిర్వహించడంతోపాటు 13, 15 తేదీలను రిజర్వులో ఉంచింది. జేఈఈ మెయిన్ పరీక్షల తేదీలను దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా ఇంటర్మీడియెట్బోర్డు ఈసారి ప్రాక్టికల్, ఇతర పరీక్షల షెడ్యూల్ను రూపొందించింది. -
JEE Main Exam: జేఈఈ మెయిన్.. ఇక రెండుసార్లే
సాక్షి, అమరావతి: ఐఐటీ తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి సంబంధించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు మాత్రమే నిర్వహించనుంది. గతంలో కరోనా సమయంలో నాలుగుసార్లు నిర్వహించిన ఎన్టీఏను ఏటా అలాగే అవకాశం కల్పించాలని విద్యార్థుల నుంచి డిమాండ్ ఉన్నా కేవలం రెండుసార్లు మాత్రమే ఈ పరీక్షను చేపట్టాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో.. 2023–24 విద్యాసంవత్సరానికి సంబంధించి వచ్చే ఏడాది నిర్వహించాల్సిన జేఈఈ మెయిన్ పరీక్ష షెడ్యూళ్లను వచ్చే వారం విడుదల చేయనుంది. బోర్డుల పరీక్షలతో సమస్య రాకుండా ఉండేందుకు ఆయా రాష్ట్రాలతో కూడా ఎన్టీఏ సంప్రదిస్తోంది. బోర్డు పరీక్షలు, జేఈఈ పరీక్షలు ఒకే తేదీల్లో కాకుండా వేర్వేరుగా కొంత వ్యవధిలో నిర్వహించేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. కరోనా వేళలో నాలుగుసార్లు నిర్వహణ గతంలో జేఈఈ మెయిన్ను ఏడాదికి ఒకసారి మాత్రమే నిర్వహిస్తుండగా 2019 నుంచి రెండుసార్లకు పెంచారు. ఒకే దఫా కారణంగా విద్యార్థులు ఒక విద్యా సంవత్సరాన్ని నష్టపోతున్నారని భావించి ఏడాదికి రెండుసార్లు జనవరి, ఏప్రిల్ నెలల్లో నిర్వహిస్తున్నారు. అయితే, కరోనా సమయంలో పరీక్షలకు తీవ్ర ఆటంకం ఏర్పడడంతో 2021లో మెయిన్ను నాలుగు దఫాలుగా నిర్వహించారు. విద్యార్థులు ఈ నాలుగు దఫాల్లో దేనిలోనైనా పాల్గొని జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందేలా అవకాశమిచ్చారు. 2022లో కూడా రెండుసార్లే నిర్వహించినా అవి చాలా ఆలస్యం కావడం, బోర్డు పరీక్షల సమయంలో వాటిని నిర్వహించేలా ముందు షెడ్యూళ్లు ఇవ్వడంతో గందరగోళం ఏర్పడింది. పైగా.. కరోనా అనంతరం రెగ్యులర్ తరగతులు ఆ ఏడాది చాలా ఆలస్యంగా ప్రారంభమైనందున తాము మరోసారి పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించాలని విద్యార్థులు కోరారు. అయితే, జనవరి, ఏప్రిల్ మాసాల్లో నిర్వహించాల్సిన ఆ పరీక్షలు జూన్, జూలైకు వాయిదా పడడం, ఫలితాల విడుదల కూడా చాలా జాప్యం కావడంతో ఈ ఏడాది అడ్మిషన్ల ప్రక్రియ కూడా ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో.. విద్యాసంవత్సరం నష్టపోకుండా కొనసాగాలంటే ఇకపై జనవరి, ఏప్రిల్ మాసాల్లో ఏడాదికి రెండుసార్లు మాత్రమే నిర్వహించి అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ముందుకెళ్లేలా ప్రవేశ పరీక్షలను నిర్ణీత సమయంలో పూర్తిచేయాలని ఎన్టీఏ భావిస్తోంది. అందుకనుగుణంగా ఇంటర్మీడియెట్ బోర్డులు, సీబీఎస్ఈ పరీక్షల షెడ్యూళ్లకు ఇబ్బంది రాకుండా చూసేందుకు ఎన్టీఏ కసరత్తు చేస్తోందని వివిధ కోచింగ్ సంస్థల అధ్యాపకులు చెబుతున్నారు. ఏటా 10 లక్షలకు పైగా అభ్యర్థులు.. మరోవైపు.. జేఈఈ పరీక్షలకు ఏటా పది లక్షల మందికి పైగా అభ్యర్థులు రిజిస్టర్ అవుతున్నారు. ఈ పరీక్షల్లో అర్హత మార్కులు సాధించి మెరిట్లో ఉన్న టాప్ 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్డ్కు ఎంపిక చేస్తున్నారు. గత ఐదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే 2019లో అత్యధికంగా 12.37 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు రిజిస్టరయ్యారు. చదవండి: సీఎం జగన్ చరిత్రాత్మక నిర్ణయం.. వారికి తీపి కబురు.. -
మెయిన్స్ షెడ్యూల్పై మళ్లీ సందిగ్థం
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీ తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి సంబంధించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్–2023 నిర్వహణపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంతో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. జేఈఈ–2023కి సంబంధించి షెడ్యూల్ అంటూ సామాజిక మాధ్యమాల్లో పలు తేదీలు ప్రచారం అవుతుండడంతో వారు గందరగోళానికి గురవుతున్నారు. వాస్తవానికి జేఈఈ మెయిన్స్ను గతంలో ఒక్కసారే నిర్వహించేవారు. ఒకపక్క బోర్డు పరీక్షలకు తయారవ్వడం, మరోపక్క మెయిన్స్ పరీక్షలు రాయాల్సిన పరిస్థితుల్లో పలువురు విద్యార్థులు తొట్రుపాటుతో తక్కువ మార్కులతో అవకాశాలు కోల్పోతున్నారు. దీనివల్ల ఐఐటీ వంటి జాతీయ విద్యాసంస్థల్లో చదవాలనుకునే విద్యార్థులు మరో ఏడాదిపాటు ఆగాల్సి వచ్చేది. ఈ కారణాలతో ఏడాదికి రెండుసార్లు నిర్వహించేలా మార్పు చేశారు. జనవరి, మార్చి ఆఖరు లేదా ఏప్రిల్లో నిర్వహించేవారు. జనవరి సెషన్కు సంబంధించి నవంబర్కు ముందే ఎన్టీఏ షెడ్యూల్ విడుదల చేసేది. కానీ, ఈసారి నవంబర్ మూడో వారంలోకి ప్రవేశిస్తున్నా ఇప్పటివరకు ఎన్టీఏ నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. మరోవైపు.. జేఈఈ పరీక్షలు ఏప్రిల్ నుంచి ప్రారంభమవుతాయని ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ బోర్డు సహా పలు రాష్ట్రాల బోర్డులు, సీబీఎస్ఈ పరీక్షలు కూడా ఇంచుమించు అదే సమయంలో జరుగుతుంటాయని, దీనివల్ల తాము ఇబ్బందికి గురవుతామని విద్యార్థులు విన్నవిస్తున్నారు. జేఈఈ పరీక్షలకు సంబంధించి ఎన్టీఏ ఒక స్పష్టతనిస్తే ప్రణాళిక ప్రకారం సిద్ధంకావడానికి వీలుంటుందంటున్నారు. గత ఏడాది తీవ్ర గందరగోళం.. కరోనాతో రెండేళ్ల పాటు జేఈఈ పరీక్షల్లో అనిశ్చిత పరిస్థితి ఏర్పడినా 2022లో కోవిడ్ తగ్గుముఖం పట్టినందున అన్నీ సకాలంలో జరుగుతాయని విద్యార్థులు భావించారు. కానీ, జేఈఈ నిర్వహణ సంస్థ అయిన ఎన్టీఏ పలుమార్లు షెడ్యూళ్లు మార్పుచేసి విద్యార్థులను, బోర్డులను తీవ్ర గందరగోళానికి గురిచేసింది. జేఈఈ మెయిన్స్–2022 షెడ్యూల్ను 2021 నవంబర్, డిసెంబర్ నాటికే విడుదల చేయాలి. జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలను చేపట్టాలి. కానీ, ఎన్టీఏ ఐదు రాష్ట్రాల ఎన్నికల సాకుతో 2022 మార్చి వరకు షెడ్యూల్, నోటిఫికేషన్పై ఎలాంటి ప్రకటనా చేయలేదు. చివరకు మార్చి 1న నోటిఫికేషన్ ప్రకటించి అదే రోజు నుంచి దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది. అలాగే, తొలి సెషన్ పరీక్షల తేదీల విషయంలో ఆయా రాష్ట్రాల బోర్డు పబ్లిక్ పరీక్షలను పరిగణనలోకి తీసుకోకుండా ఏప్రిల్ 16–21 వరకు, మే 24–29 వరకు రెండో సెషన్ పరీక్షలు జరుగుతాయని తేదీలను ప్రకటించింది. ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు సహ అనేక రాష్ట్రాల ఇంటర్మీడియెట్, ప్లస్ 2 తరగతుల పరీక్షలు అవే తేదీల్లో నిర్వహించేలా అంతకుముందే ప్రకటించినా వాటిని పట్టించుకోలేదు. జేఈఈ పరీక్షలను అవే తేదీల్లో ఎన్టీఏ షెడ్యూల్ ఇవ్వడంతో ఆయా రాష్ట్రాలు తమ బోర్డుల పరీక్షా తేదీలను ఆ ఏడాది ఏప్రిల్ 22 తరువాత ఉండేలా మార్పులుచేసుకున్నాయి. కానీ, ఎన్టీఏ మళ్లీ జేఈఈ షెడ్యూల్ను మార్పుచేసింది. దీంతో ఆయా ఇంటర్ బోర్డులు మళ్లీ మార్పు చేసుకున్నాయి. ఆ తర్వాత ఎన్టీఏ మూడోసారి మళ్లీ షెడ్యూల్ను మార్పుచేసింది. 2022 జూన్, జులైలో పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించి ఆయా రాష్ట్రాల బోర్డులను సమస్యల్లోకి నెట్టింది. ఇలా జేఈఈ మెయిన్–2022 పరీక్షల నిర్వహణలో తీవ్ర జాప్యం చేయడంతో ఫలితాల విడుదలపైనా దాని ప్రభావం పడింది. మెయిన్స్ తుది ఫలితాలను ఆగస్టు 5 లేదా 6కల్లా ఎన్టీఏ విడుదల చేయాల్సి ఉంది. వీటిలో ఉత్తీర్ణులైన టాప్ 2.5 లక్షల మందిని అడ్వాన్సుకు అనుమతిస్తారు. కానీ, చివరి నిమిషం వరకు మెయిన్స్ ఫలితాలపై గందరగోళానికి గురిచేసింది. ఈసారి అలాంటి గందరగోళానికి లేకుండా పరీక్షలపై స్పష్టతనివ్వాలని విద్యార్థులు కోరుతున్నారు. -
ఆంగ్ల మాధ్యమంపైనే ఆసక్తి.. జేఈఈలో 99 శాతానికి పైగా వారే!
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యావకాశాలను ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నా క్షేత్రస్థాయిలో ఆంగ్ల మాధ్యమం వైపే విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. తమ ప్రాంతీయ భాషల్లో పరీక్షలు రాసేందుకు ముందుకు రావడం లేదు. ప్రాంతీయ భాషల్లో పరీక్షలు రాసే వారు అతి తక్కువ మంది కాగా.. వారిలోనూ మెరిట్ ర్యాంకుల్లో నిలిచేలా స్కోర్ సాధించిన వారు శూన్యం. ఐఐటీ, ఎన్ఐటీ తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్లో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. డిమాండ్ల నేపథ్యంలో.. ఉన్నత విద్యావకాశాలను ముఖ్యంగా ఇంజనీరింగ్ తదితర కోర్సులను ఆయా ప్రాంతీయ భాషల్లోనూ విద్యార్థులకు అందుబాటులో ఉండేలా కేంద్ర ప్రభుత్వం 2020–21 నుంచి చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. నూతన జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గతేడాది నుంచి జేఈఈ మెయిన్ను ఆంగ్లంతో పాటు 12 ప్రాంతీయ భాషల్లో నిర్వహింపజేస్తోంది. హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ భాషల్లోనూ జేఈఈ మెయిన్ రాసేందుకు విద్యార్థులకు అవకాశమిచ్చింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాటుకు ముందు జేఈఈ నిర్వహణ బాధ్యతలు చూసిన సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ).. 2014 వరకు ఆంగ్లం, హిందీ, గుజరాతీ, మరాఠీ, ఉర్దూ మాధ్యమాల్లో జేఈఈని నిర్వహించేది. 2016 తర్వాత ఆంగ్లం, హిందీ, గుజరాతీల్లో జేఈఈని కొనసాగిస్తూ మరాఠీ, ఉర్దూలను తొలగించారు. తమ రాష్ట్రం నుంచి అత్యధిక సంఖ్యలో జేఈఈ పరీక్షలకు విద్యార్థులు హాజరవుతున్నందున బెంగాలీ భాషా మాధ్యమంలో ఈ పరీక్షలను నిర్వహించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిమాండ్ చేయడంతో.. ప్రాంతీయ భాషా మాధ్యమాల్లో జేఈఈ మెయిన్ నిర్వహణకు బీజం పడింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి కూడా అత్యధిక సంఖ్యలో విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తుండటం, తమిళనాడు నుంచి కూడా అంతకు ముందు నుంచే ఆ భాషా మాధ్యమంలో పరీక్ష నిర్వహించాలన్న డిమాండ్ ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సూచనలతో ఎన్టీఏ.. జేఈఈలో ఆంగ్లం, హిందీ, గుజరాతీలతో పాటుగా కొత్తగా మరో 10 ప్రాంతీయ భాషా మాధ్యమాలను ప్రవేశపెట్టింది. ఇదీ చదవండి: Gadapa Gadapaku Mana Prabhutvam: గడప గడపకు మన ప్రభుత్వం.. సీఎం జగన్ కీలక ఆదేశాలు -
JEE Mains 2022 Answer Key: జేఈఈ ప్రాథమిక కీ తారుమారు
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీ తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్–2022 తొలిసెషన్ పరీక్షల ప్రాథమిక కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) శనివారం రాత్రి విడుదల చేసింది. సెషన్ల వారీగా ప్రశ్నపత్రాలకు సంబంధించిన సమాధానాల కీలను తన వెబ్సైట్లో పొందుపరచింది. వీటితో తమ సమాధానాలను పరిశీలించుకున్న విద్యార్థులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. కొన్ని సెషన్లకు సంబంధించిన ప్రాథమిక కీలు తారుమారు కావడమే ఇందుకు కారణం. జేఈఈ మెయిన్స్ తొలిసెషన్ పరీక్షలు జూన్ 23 నుంచి 29 వరకు జరిగిన సంగతి తెలిసిందే. వీటికి దేశవ్యాప్తంగా 9లక్షల మంది వరకు హాజరయ్యారు. ఇక ఈ ప్రాథమిక కీలలో జూన్ 29న జరిగిన రెండు సెషన్లకు సంబంధించిన ప్రశ్నల సమాధానాలు తారుమారయ్యాయి. మేథమెటిక్స్, ఫిజిక్స్ ప్రశ్నల కీ సరిగ్గా ఉండగా కెమిస్ట్రీ సమాధానాలు తారుమారయ్యాయి. ఉదయం పరీక్షకు సంబంధించిన కీని మధ్యాహ్నం సెషన్ ప్రశ్నలకు, మధ్యాహ్నం ప్రశ్నల కీని ఉదయం సెషన్ ప్రశ్నలకు ఎన్టీఏ ప్రకటించడంవల్లే వారు గందరగోళానికి గురయ్యారు. ఈ రెండు సెషన్లలో పరీక్షలు రాసిన వేలాది మంది అభ్యర్థుల మార్కులు ఒక్కసారిగా తగ్గిపోయాయి. మ్యాథ్స్, ఫిజిక్స్లలో అనుకున్న విధంగా మార్కులు వచ్చినా కెమిస్ట్రీలో పూర్తిగా మైనస్ మార్కులుండటంతో వారు కంగుతిన్నారు. తాము రాసిన అనేక ప్రశ్నల సమాధానాలు తప్పుగా ఉన్నట్లు కనిపించడంతో నిరాశలో మునిగిపోయారు. పైగా ప్రతి తప్పుడు సమాధానానికి మూడోవంతు మార్కులు మైనస్ అయ్యే నిబంధన ఉండడంతో వారికి వచ్చిన మార్కులు మైనస్లో పడ్డాయి. తాము సరైన సమాధానాలు రాసినా ఇలాఎలా అయ్యిందో అర్థంకాక విద్యార్థులు తమ అధ్యాపకులకు పరిస్థితిని చెప్పుకున్నారు. పలు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు కూడా తమ విద్యార్థుల పరిస్థితి చూసి అవాక్కయ్యారు. దీంతో ఆయా సంస్థలు విద్యార్థుల వారీగా వారి లాగిన్ నుంచి ఎన్టీయేకు అభ్యంతరాలు తెలియచేశాయి. చివరకు ఆదివారం సాయంత్రానికి కీలను సరిచేస్తూ ఎన్టీఏ కొత్త కీలను వెబ్సైట్లో పొందుపరిచింది. దీంతో అభ్యర్థులు ఊపిరిపీల్చుకున్నారు. తొలిసెషన్ తుది కీని ఈనెల 5న విడుదలచేసే అవకాశముంది. గత ఏడాది మాదిరిగానే కటాఫ్ మరోవైపు.. జేఈఈ మెయిన్స్తొలిసెషన్ పరీక్షల్లోని ప్రశ్నల తీరును పరిశీలించిన నిపుణులు ఈ ఏడాది కూడా కటాఫ్ మార్కులు 2021లో మాదిరిగానే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈనెలలో రెండో సెషన్ పరీక్షలు పూర్తయిన అనంతరం కటాఫ్ మార్కులు, ర్యాంకులను ఎన్టీఏ ప్రకటించనుంది. ఇక తొలిసెషన్ తీరును పరిశీలించిన ఆయా కోచింగ్ సెంటర్ల నిపుణులు.. ఎన్సీఈఆర్టీ పుస్తకాలను అనుసరించి తర్ఫీదు పొందిన వారికి అధిక మార్కులు వచ్చే అవకాశముంటుందని చెబుతున్నారు. ఈసారి ప్రశ్నలు, వాటి సమాధానాల తీరు విద్యార్థులను తీవ్ర గందరగోళపరిచే విధంగా ఉన్నాయని వివరించారు. చాలా ప్రశ్నలకు ఇచ్చిన నాలుగు సమాధానాలు ఇంచుమించు ఒకేమాదిరిగా ఉండడంతో ఆయా సబ్జెక్టుల్లో బేసిక్స్ను బాగా అవగాహన చేసుకుని ఎక్కువ ప్రాక్టీసు చేసిన వారు సులభంగా సమాధానాలను గుర్తించగలిగారని వారు తెలిపారు. కానీ, ఇంటర్మీడియెట్ పరీక్షలను, ఎంసెట్ పరీక్షలను దృష్టిలో పెట్టుకుని తర్ఫీదు పొందిన వారికి మాత్రం మెయిన్స్ పరీక్షలు చాలా కష్టమనిపించాయని ప్రముఖ విద్యాసంస్థ అకడమిక్ హెడ్ మురళీరావు పేర్కొన్నారు. -
జేఈఈ మెయిన్ కటాఫ్పై కరోనా ఎఫెక్ట్
సాక్షి, అమరావతి: గత రెండేళ్లుగా కరోనా కారణంగా తలెత్తిన దుష్ప్రభావాలు ఈ ఏడాది జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ (జేఈఈ) మెయిన్ ఫలితాలపై పడతాయని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 2021–22 విద్యాసంవత్సరానికి విద్యాసంస్థలు ఆలస్యంగా తెరుచుకోవడం, రెండేళ్ల నుంచి సరిగా తరగతులు లేకపోవడం వంటి కారణాలతో విద్యార్థులు పబ్లిక్ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించలేకపోయారు. ఇదే పరిస్థితి జేఈఈ మెయిన్ వంటి ఇతర పోటీ పరీక్షలపైనా ఉంటుందని అంచనా వేస్తున్నారు. గత రెండేళ్ల జేఈఈ మెయిన్ కటాఫ్లతో పోల్చుకుంటే ఈసారి కటాఫ్ తగ్గడం లేదా వాటితో సమానంగా ఉండే అవకాశముంటుందని చెబుతున్నారు. పైగా ఇంటర్మీడియెట్లో సిలబస్ను కుదించి విద్యార్థులకు బోధించారు. జేఈఈకి మాత్రం గతంలోని సిలబస్నే యధావిధిగా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియెట్లో కుదించిన చాప్టర్ల నుంచి జేఈఈ మెయిన్లో ప్రశ్నలు అడిగితే చాలా మంది సమాధానాలు ఇచ్చే పరిస్థితి ఉండదని అంటున్నారు. ముఖ్యంగా కోచింగ్ సదుపాయాలు లేని గ్రామీణ విద్యార్థులు ఈసారి నష్టపోయే పరిస్థితి ఉంటుందని పేర్కొంటున్నారు. 2021లో జనరల్ కటాఫ్ పర్సంటైల్ 87.89 జేఈఈ మెయిన్–2021లో 11,44,248 మంది దరఖాస్తు చేయగా 9,39,008 మంది పరీక్షకు హాజరయ్యారు. అప్పట్లో నాలుగు సెషన్లలో ఈ పరీక్షలు జరిగాయి. కటాఫ్ స్కోరులు జనరల్ 87.89, ఈడబ్ల్యూఎస్ 66.22, ఓబీసీ నాన్ క్రిమీలేయర్ 68.023, ఎస్సీ 46.88, ఎస్టీ 34.67, దివ్యాంగుల కోటాలో 0.00963గా నమోదయ్యాయి. 2019, 2020 జేఈఈ మెయిన్ కటాఫ్లతో పోల్చుకుంటే 2021 కటాఫ్ స్కోరులో తగ్గుదల కనిపించింది. 2019లో జనరల్ కటాఫ్ 89.75 ఉండగా 2020లో 90.37గా ఉంది. ఈ నేపథ్యంలో కరోనా అనంతరం జరుగుతున్న ఈ పరీక్షల్లో కటాఫ్ 2021 కంటే తగ్గడం, లేదా సమానంగా ఉండే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2016కి ముందు కటాఫ్ స్కోర్లు 100పైనే.. జేఈఈ మెయిన్ గణాంకాలను పరిశీలిస్తే.. 2016 కంటే ముందు మెయిన్లో జనరల్ కటాఫ్ స్కోర్ 100కు మించి ఉండడం గమనార్హం. ఆ తర్వాత సంవత్సరాల్లో ఇది క్రమేపీ తగ్గుతూ వచ్చింది. 2018లో అత్యల్పంగా జనరల్ కటాఫ్ పర్సంటైల్ 74గా ఉంది. జేఈఈకి ఎంతమంది హాజరైనా వారు బాగా రాయడంపైనే కటాఫ్ స్కోర్ ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. జేఈఈ మెయిన్లో నిర్దేశిత కటాఫ్ స్కోర్లు సాధించిన టాప్ 2.50 లక్షల మంది విద్యార్థులను జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు అనుమతిస్తారు. ఈ రెండున్నర లక్షల మందిని ఆయా రిజర్వేషన్ల కేటగిరీల వారీగా ఎంపిక చేస్తారు. ఇందులో ఎస్సీ 15 శాతం, ఎస్టీ 7.5 శాతం, ఓబీసీ నాన్ క్రిమీలేయర్ 27 శాతం ఉంటారు. తక్కినవారంతా జనరల్ కేటగిరీలోకి వస్తారు. ఈ కేటగిరీల్లో దివ్యాంగులు (పీడబ్ల్యూడీ) 5 శాతం మంది ఉంటారు. అలాగే సూపర్ న్యూమరరీ కోటా కింద జనరల్ ఈడబ్ల్యూఎస్ కోటాలో 10 శాతం మందిని అదనంగా తీసుకుంటారు. ఇలా మొత్తంగా 2.50 లక్షల మందిని ఆయా కేటగిరీల్లో ఎంపిక చేసి జేఈఈ అడ్వాన్స్డ్కు ఎంపిక చేస్తారు. త్వరలో అడ్మిట్ కార్డులు జేఈఈ మెయిన్ను ఈసారి రెండు విడతల్లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తొలి విడత పరీక్షలను ఈ నెల 20 నుంచి 29 వరకు ఆన్లైన్లో నిర్వహిస్తారు. మలి విడత పరీక్షలు జూలై 21 నుంచి 30 వర కు జరుగుతాయి. తొలి విడత పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను ఒకటి, రెండురోజుల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేయనుంది. ఇప్పటికే అభ్యర్థులకు కేటాయించిన పరీక్ష కేంద్రాల వివరాలను ఎన్టీఏ జేఈఈ మెయిన్ అధికారిక వెబ్సైట్లో పొందు పరిచింది. అభ్యర్థులు వారి దరఖాస్తు నంబర్, పుట్టిన తేదీ, నెల, సంవత్సరం వివరాలు నమోదు చేసి పరీక్ష కేంద్రం వివరాలు పొందొచ్చని స్పష్టం చేసింది. -
విద్యార్థులకు ‘మెయిన్’ కష్టాలు
సాక్షి, అమరావతి: జేఈఈ మెయిన్ పరీక్షల వాయిదాతో రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతోంది. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలను ఆగస్టులో పూర్తిచేసి సెప్టెంబర్ మొదటి వారంలో తరగతులను ప్రారంభించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి తొలుత భావించింది. ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్య సంఘం బుధవారం నిర్వహించిన సమావేశంలో మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి కూడా ఇదే విషయాన్ని సైతం వెల్లడించారు. జేఈఈ అడ్మిషన్లు ఆటంకం కాకుండా ఉంటే ఆగస్టులో ఇంజనీరింగ్ ప్రవేశాలు పూర్తిచేసి తరగతులు చేపడతామని ఆయనన్నారు. ఇందుకు అనుగుణంగా ఉన్నత విద్యామండలి ఏపీఈఏపీసెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షలను జూలైలో నిర్వహించేలా షెడ్యూళ్లను విడుదల చేసింది. నిజానికి.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గతంలో విడుదల చేసిన షెడ్యూళ్ల ప్రకారం జేఈఈ మెయిన్ రెండు సెషన్లు మే నెలాఖరుకు పూర్తవుతాయని, తదనంతరం రాష్ట్రంలోని సెట్లన్నీ పూర్తయి సకాలంలో అడ్మిషన్లు పూర్తవుతాయని అధికారులు అంచనావేశారు. కానీ, జేఈఈ మెయిన్స్ రెండు విడతల పరీక్షల తేదీలను రెండు నెలలపాటు వాయిదా వేస్తూ ఎన్టీఏ బుధవారం రాత్రి నిర్ణయం తీసుకుంది. మెయిన్ తొలిసెషన్ జూన్ 20 నుంచి 29 వరకు.. రెండో సెషన్ పరీక్షలు జూలై 21 నుంచి 30 వరకు జరిగేలా షెడ్యూల్ విడుదల చేసింది. దీనివల్ల జూలై 3న జరగాల్సిన జేఈఈ అడ్వాన్సు కూడా వాయిదాపడనుంది. దీంతో ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహించి ఫలితాలు విడుదల అనంతరం ఆరు విడతల్లో ఐఐటీ, ఎన్ఐటీల్లోకి జరిగే అడ్మిషన్లను పూర్తిచేయడానికి నెలరోజులకు పైగా సమయం పడుతుందని భావిస్తున్నారు. ఇవన్నీ పూర్తయిన అనంతరం రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు చేపట్టాలంటే అక్టోబర్ వరకు ఆగక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. ఎన్టీఏ తీరుతో ఈసారీ నష్టమే జేఈఈ పరీక్షల నిర్వహణలో ఎన్టీఏ తీరు కారణంగా ఈ విద్యా సంవత్సరంలో కూడా విద్యార్థులు నష్టపోవలసి వస్తోందని అధ్యాపకులు, తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. ఒకపక్క జాతీయస్థాయి అడ్మిషన్లు లేటు కావడంతో పాటు రాష్ట్ర ఇంజనీరింగ్ తదితర కోర్సుల్లో ప్రవేశాలు కూడా ముందుకు సాగని పరిస్థితి ఏర్పడుతోంది. వాస్తవానికి రాష్ట్రంలో ఇంజనీరింగ్ ప్రవేశాలు ఆలస్యం కావడంవల్ల దాదాపు 20వేల మంది విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లోని విద్యాసంస్థల్లో చేరిపోతున్నారని వివిధ కాలేజీల యాజమాన్యాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి. త్వరగా అడ్మిషన్లు చేపడితే వారంతా రాష్ట్ర కాలేజీల్లోనే చేరుతారని వారు తొలినుంచి కోరుతున్నారు. కానీ, జేఈఈ అడ్మిషన్ల ఆలస్యంతో గత ఏడాది రాష్ట్ర ఇంజనీరింగ్ ప్రవేశాలనూ ఆలస్యంగా చేపట్టారు. ఇక జేఈఈలో ర్యాంకులు పొందిన రాష్ట్ర విద్యార్థులు రాష్ట్ర ప్రవేశ పరీక్షల్లోనూ మెరిట్ ర్యాంకుల్లో నిలుస్తున్నారు. జేఈఈ అడ్మిషన్ల కన్నా ముందే ఇక్కడ ఇంజనీరింగ్ ప్రవేశాలు నిర్వహిస్తే రాష్ట్ర కాలేజీల్లో సీట్లు పొందే ఆ విద్యార్థులు ఆ తరువాత జేఈఈ అడ్మిషన్లలో అవకాశం వస్తే ఇక్కడి సీట్లను వదిలి వెళ్లిపోతున్నారు. ఇలా ఏటా 15వేల మంది వరకు జేఈఈ సీట్లలో చేరుతున్నారు. దీనివల్ల రాష్ట్రంలోని కాలేజీల్లో సీట్లు ఖాళీ అవుతున్నాయి. మెరిట్లో ఉన్న ఇతర విద్యార్థులకూ నష్టం వాటిల్లుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే జేఈఈ అడ్మిషన్ల తరువాత రాష్ట్ర ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు చేపడుతూ వస్తున్నారు. జేఈఈ అడ్మిషన్లు ఆలస్యం అవుతున్నందున అప్పటివరకు రాష్ట్రంలోని కాలేజీల్లో చేరుదామని చూసే విద్యార్థులు కౌన్సెలింగ్ జాప్యం అయితే ఇతర రాష్ట్రాల్లోని కాలేజీల్లోకి వెళ్లిపోతున్నారు. -
జేఈఈ మెయిన్ మరోసారి వాయిదా
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ను ఎన్టీఏ వాయిదా వేసింది. ఈమేరకు బుధవారం రాత్రి పబ్లిక్ నోటిఫికేషన్ జారీచేసింది. దేశవ్యాప్తంగా విద్యార్థుల నుంచి వస్తోన్న విన్నపాలను పరిశీలించిన ఎన్టీఏ జేఈఈ 2 విడతల పరీక్షలను వాయిదా వేసింది. తొలి విడత పరీక్షలను జూన్లో, రెండో విడత జులైలో నిర్వహించనుంది. ఇంతకు ముందు ఫస్ట్, సెకండ్ సెషన్లను 6 రోజుల చొప్పున నిర్వహించాలని నిర్ణయించగా సవరించిన షెడ్యూల్లో పదేసి రోజులకు పెంచారు. తొలివిడత పరీక్షల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. బుధవారం నుంచి దరఖాస్తుల్లో సవరణలకు అవకాశం ఇచ్చారు. రెండో విడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుంది. ఇంతకుముందు పేర్కొన్న ప్రకారం రెండో విడత దరఖాస్తు ప్రక్రియ 8వ తేదీ నుంచి ప్రారంభం కావలసి ఉంది. అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకొనే తేదీని కూడా తరువాత వెల్లడిస్తామని ఎన్టీఏ తెలిపింది. సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ)తో పాటు పలు రాష్ట్రాల ఇంటర్ బోర్డులు, హయ్యర్ సెకండరీ బోర్డుల పరీక్షలు ఏప్రిల్, మే నెలల్లో జరుగుతున్నాయి. అదే సమయంలో జేఈఈ మెయిన్ కూడా జరుగుతుండడంతో విద్యార్థులు గందరగోళంలో పడ్డారు. 2 పరీక్షలూ కీలకమైనవి కావడంతో దేనిపై దృష్టి పెట్టాలో తెలియక ఒత్తిడికి లోనవుతున్నారు. జేఈఈ షెడ్యూల్ దృష్ట్యా బోర్డు పరీక్షలు ఇప్పటికే 2 సార్లు మారాయి. ఇంటర్ పరీక్షలు నెల పాటు ఆలస్యమయ్యాయి. ఏపీలో ఏప్రిల్ 8 నుంచి 28 వ తేదీవరకు ఇంటర్ పరీక్షలు జరగాల్సి ఉండగా జేఈఈ తొలి షెడ్యూల్ ఏప్రిల్ 16 నుంచి 21 వరకు ప్రకటించడంతో బోర్డు పరీక్షల తేదీలను మార్చారు. ఏప్రిల్ 22 నుంచి మే 12 వరకు నిర్వహించాలని నిర్ణయించారు. జేఈఈ తేదీలను మళ్లీ ఏప్రిల్ 21 నుంచి మే 4వరకు మార్చడంతో ఇంటర్ పరీక్షల తేదీలను కూడా మార్చి మే 6 నుంచి మే 24 వరకు పెట్టారు. ఇప్పుడు జేఈఈ పరీక్షలు వాయిదా పడటంతో విద్యార్థులు ఊపిరిపీల్చుకుంటున్నారు. అడ్వాన్స్డ్ పైనా ప్రభావం జేఈఈ మెయిన్ వాయిదా ప్రభావం జేఈఈ అడ్వాన్స్డ్పైనా పడుతోంది. జూలై 3 న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహించాలని ముంబై ఐఐటీ ఇంతకు ముందే షెడ్యూల్ ప్రకటించింది. ఇప్పుడు జేఈఈ మెయిన్ పరీక్షలు జూలై 21 నుంచి 30వ తేదీవరకు జరుగనున్నాయి. ఆ పరీక్షల ఫలితాలు వెల్లడైతేనే అడ్వాన్స్డ్ నిర్వహించేందుకు వీలుంటుంది. ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబరు మొదటి వారంలో అడ్వాన్స్డ్ పరీక్ష జరుగుతుందని భావిస్తున్నారు. -
రెండు విడతలుగా జేఈఈ మెయిన్
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్ – 2022 షెడ్యూల్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మంగళవారం విడుదల చేసింది. రెండు విడతలుగా నిర్వహించే ఈ పరీక్షలు ఏప్రిల్లో 16, 17, 18, 19, 20, 21 తేదీల్లో జరుగుతాయి. రెండో విడత పరీక్షలు మే 24, 25, 26, 27, 28, 29 తేదీల్లో జరుగుతాయి. కంప్యూటర్ ఆధారితంగా పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షల దరఖాస్తు ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభమైంది. మార్చి 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పేపర్–1, పేపర్–2 లుగా మెయిన్స్ ఉంటుంది. ప్రతి రోజూ ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష ఉంటుంది. బీఈ బీటెక్ కోర్సులకు పేపర్–1, బీఆర్క్, బీప్లానింగ్ కోర్సులలో ప్రవేశానికి పేపర్–2 పరీక్ష పెట్టనున్నారు. బీఆర్క్కు పేపర్–2ఏను, బీ ప్లానింగ్కు పేపర్–2బీ నిర్వహిస్తారు. పేపర్–2ఏ లోని పార్టు 3లో డ్రాయింగ్ టెస్టును పెన్ను, పేపర్తో ఆఫ్లైన్ మోడ్లో రాయాలి. పరీక్షలను ఇంగ్లీషు, హిందీ, తెలుగు, గుజరాతీ, అస్సామీ, బెంగాలీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, ఉర్దూ భాషల్లో నిర్వహిస్తారు. ఒకేసారి ఇంటర్మీడియట్, జేఈఈ పరీక్షలు ఒక పక్క ఇంటర్మీడియెట్ పరీక్షలు, మరోపక్క జేఈఈ పరీక్షలు ఒకేసారి జరుగనుండడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు ఏప్రిల్ 8 నుంచి 28 వరకు జరుగనున్నాయి. తొలి విడత జేఈఈ పరీక్షలు కూడా అవే తేదీల్లో జరగనున్నాయి. దీంతో రెండిటికీ సన్నద్ధం కావడం కష్టంగా మారనుంది. ఒకే సమయంలో జేఈఈ, బోర్డు పరీక్షలు రాయాల్సి రావడం వల్ల విపరీతమైన ఒత్తిడికి గురవుతామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేక మంది తొలివిడత చాన్సును వదులుకోవలసి వస్తుందని చెబుతున్నారు. మేలో జరిగే రెండో విడత జేఈఈ మెయిన్స్కు మాత్రమే హాజరు కాగలుగుతామని అంటున్నారు. గతంలో జేఈఈ చాన్సులు నాలుగు ఉండడంతో బోర్డు, జేఈఈ పరీక్షలకు కొంత వ్యవధి తీసుకొని రాసే అవకాశం ఉండేది. ఈసారి చాన్సులను రెండుకు కుదించడంతో పాటు పరీక్షలను ఏప్రిల్, మేలలో పెడుతుండడంతో సమస్య ఏర్పడుతోంది. ఇవే కాకుండా జేఈఈకి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ, పీజుల చెల్లింపు, ధ్రువపత్రాల సమర్పణ వంటి పనులు పూర్తిచేయాలి. ఈ ప్రక్రియ, బోర్డు పరీక్షలకు సిద్ధం కావడం, జేఈఈ పరీక్షలకు సన్నద్ధం కావడం అన్నీ ఒకే సమయంలో చేయాల్సి ఉంటుందని, ఇది పరీక్షలలో విద్యార్థుల సామర్థ్యాలపై దుష్ప్రభావాన్ని చూపుతుందని అధ్యాపకులు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కాలేజీలు ఆలస్యంగా తెరవడంతో బోధనకూ ఆటంకం 2021–22 విద్యా సంవత్సరంలో కాలేజీలను తెరవడం ఆలస్యమయింది. జూన్లో కాలేజీలు ఆరంభం కావలసి ఉండగా కరోనా కారణంగా అక్టోబర్లో తెరిచారు. ఆ తరువాత కూడా బోధన, అభ్యసన ప్రక్రియలు సరిగా సాగలేదు. గత రెండు మూడు నెలలుగా మాత్రమే బోధనకు అవకాశం ఏర్పడింది. కాలేజీలు ఆలస్యంగా ప్రారంభం కావడంతో ఇంటర్మీడియట్ బోర్డు సిలబస్ను 30 శాతం మేర తగ్గించింది. కానీ జేఈఈ సిలబస్లో మాత్రం ఎలాంటి మార్పూ ఉండదని ఎన్టీఏ ప్రకటించింది. అసలే సమయం లేక ఇంటర్ పరీక్షలు రాసేందుకు నానా అవస్థలు పడుతుంటే జేఈఈ మెయిన్స్ పూర్తి సిలబస్తో జరగడం వల్ల విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
నేటి నుంచి జేఈఈ 4వ విడత
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీ తదితర జాతీయ విద్యాసంస్థలలో ప్రవేశానికి సంబంధించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ–మెయిన్) 2021 4వ సెషన్ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. మే లో జరగాల్సిన ఈ పరీక్షలు కోవిడ్ కారణంగా వాయిదా పడ్డాయి. కంప్యూటరాధారితంగా జరిగే ఈ పరీక్షలు సెప్టెంబర్ 2 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు 7 లక్షల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు. తొలిరోజు పేపర్–2 అయిన బీ.ఆర్క్, బీ.ప్లానింగ్ పరీక్షలు జరగనున్నాయి. బీటెక్ కోర్సులకు సంబంధించిన ప్రవేశ పరీక్షలు ఆ తరువాత వరుసగా నాలుగు రోజుల పాటు ఆగస్టు 27, 31, సెప్టెంబర్ 1, 2 తేదీల్లో ఉదయం, సాయంత్రం రెండు బ్యాచ్లుగా జరుగుతాయి. జేఈఈ మెయిన్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఈ సంవత్సరం నుంచి నాలుగు సెషన్లలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. నాలుగో సెషన్ పూర్తి అయిన తరువాత సెప్టెంబర్ మూడో వారంలో తుది విడత ఫలితాలను అభ్యర్థుల ర్యాంకులతో సహా ఎన్టీఏ ప్రకటించనుంది. -
కొనసాగుతున్న జేఈఈ మెయిన్ పరీక్ష మొదటి సెషన్
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ మూడో విడత పరీక్షలు ఆదివారం మొదలయ్యాయి. జూలై 25 ఉదయం 9 గంటలకు ప్రారంభమైన మొదటి సెషన్ 12 వరకు ఉంటుంది. రెండో సెషన్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. ఇక మొదటి, రెండో సెషన్ అభ్యర్థులు గంటలోపు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు తెలిపారు. అడ్మిట్ కార్డుతోపాటు ఫొటో ఐడెంటీటీ కార్డును తప్పనిరిగా తమతో పాటు తెచ్చుకోవాలని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలో ప్రతి ఒక్కరూ కరోనా ప్రొటోకాల్ నిబంధనలను పాటించేలా చర్యలు చేపట్టారు. సిబ్బందితో పాటు అభ్యర్థులు విధిగా మాస్కులు ధరించాల్సి ఉంటుంది. సిబ్బందికి గ్లౌజ్లను ఏర్పాటు చేస్తున్నారు. పరీక్ష కేంద్రాలను శానిటైజ్ చేయిస్తున్నారు. కాగా, పరీక్షలకు హాజరయ్యే వారు తమతోపాటు పారదర్శక బాటిల్లో శానిటైజర్ తెచ్చుకోవడానికి అనుమతిస్తున్నారు. సెల్ఫోన్లు, డిజిటల్ వాచీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరు. కాగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్) తదితర విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ (జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్) మెయిన్ మూడో విడత (జూలై సెషన్) పరీక్షలు ఈ నెల(జూలై) 27 వరకు కొనసాగనున్నాయి. -
జేఈఈ మెయిన్ పరీక్షలు వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: ఈ నెల 27, 28, 30 తేదీల్లో నిర్వహించాల్సిన జేఈఈ మెయిన్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వాయిదా వేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈసారి నాలుగు విడతల్లో జేఈఈ మెయిన్ను నిర్వహించేందుకు ఎన్టీఏ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు మొదటి విడత, మార్చి 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రెండో విడత పరీ క్షలను నిర్వహించింది. ఈ పరీక్షలకు ఫిబ్రవరిలో 6,20,978 మంది, మార్చిలో 5,56,248 మంది హాజరయ్యారు. ఇక ఈనెల 27, 28, 30 తేదీల్లో మూడో విడత, మే నెలలో నాలుగో విడత పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా ఈనెల పరీక్షలను వాయిదా వేస్తు న్నట్లు వెల్లడించింది. మళ్లీ పరీక్షలను ఎప్పుడు నిర్వహించాలనేది తరువాత నిర్ణయిస్తామని, పరీక్షకు 15 రోజుల ముందుగా తెలియజేస్తా మని వెల్లడించింది. వివరాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని పేర్కొంది. -
జేఈఈ మెయిన్ ప్రాథమిక కీ విడుదల
సాక్షి, అమరావతి: జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ 2021 మార్చి సెషన్ ప్రాథమిక ‘కీ’ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) శనివారం రాత్రి విడుదల చేసింది. మార్చి 16 నుంచి 18వ తేదీ వరకు ఈ పరీక్షలను కంప్యూటర్ ఆధారితంగా (సీబీటీ) నిర్వహించారు. ఈ పరీక్షలకు సంబంధించి ప్రశ్నపత్రం, ప్రాథమిక ‘కీ’, అభ్యర్థుల రికార్డెడ్ రెస్పాన్స్ షీట్లను జేఈఈ మెయిన్ వెబ్సైట్లో పొందుపరిచినట్లు ఎన్టీఏ ఒక ప్రకటనలో వివరించింది. ప్రాథమిక ‘కీ’పై అభ్యర్థులు 22వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట వరకు అభ్యంతరాలను సమర్పించవచ్చు. అయితే అభ్యర్థులు ఛాలెంజ్ చేసే ప్రతి ప్రశ్నకు రూ.200 చొప్పున రుసుము చెల్లించాలి. ఇది నాన్ రిఫండబుల్ రుసుము. అభ్యర్థులు తమ రుసుమును డెబిట్, క్రెడిట్, నెట్ బ్యాంకింగ్, పేటీఎంల ద్వారా 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలలోపు చెల్లించాల్సి ఉంటుంది. -
నేటి నుంచి జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్) తదితర విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ (జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్) మెయిన్ రెండో విడత (మార్చి సెషన్) పరీక్షలు నేటి (మంగళవారం) నుంచి రాష్ట్రవ్యాప్తంగా 20 కేంద్రాల్లో ప్రారంభం కానున్నాయి. ఈ నెల 18 వరకు మూడ్రోజుల పాటు రోజుకు రెండు సెషన్లలో వీటిని నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు 5 లక్షల మంది వరకు విద్యార్థులు రిజిస్టర్ అయ్యారు. అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో మార్చి సెషన్ పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మూడ్రోజులకు కుదించింది. పరీక్షల నిర్వహణలో ప్రతి ఒక్కరూ కరోనా ప్రొటోకాల్ నిబంధనలను పాటించేలా చర్యలు చేపట్టింది. సిబ్బందితో పాటు అభ్యర్థులు విధిగా మాస్కులు ధరించాలి. సిబ్బందికి గ్లౌజ్లను ఏర్పాటుచేస్తున్నారు. పరీక్ష కేంద్రాలను శానిటైజ్ చేయిస్తున్నారు. కాగా, పరీక్షలకు హాజరయ్యే వారు తమతోపాటు పారదర్శక బాటిల్లో శానిటైజర్ తెచ్చుకోవడానికి అనుమతిస్తున్నారు. సెల్ఫోన్లు, డిజిటల్ వాచీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరు. మొదటి సెషన్ ఉ.9 నుంచి 12 వరకు.. రెండో సెషన్ మ.3 నుంచి సా.6 వరకు జరుగుతుంది. మొదటి సెషన్ అభ్యర్థులు ఉ.7.30 నుంచి 8.30 గంటలలోపు.. రెండో సెషన్ అభ్యర్థులు మ.1.30 నుంచి 2.30 గంటలలోపు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. అడ్మిట్ కార్డుతోపాటు ఫొటో ఐడెంటీటీ కార్డును తప్పనిరిగా తమతో పాటు తెచ్చుకోవాలి. -
జేఈఈ: తెలంగాణ విద్యార్థులే టాప్!
సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్ ఫలితాల్లో రాష్ట్ర విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 100 పర్సంటైల్ను 24 మంది విద్యార్థులు సాధించగా, అందులో 8 మంది రాష్ట్రంలో చదువుకున్న విద్యార్థులే ఉండటం విశేషం. అడ్వాన్స్డ్కు 2.5 లక్షల మందికి పైగా..: ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు జేఈఈ మెయిన్లో టాప్ స్కోర్ సాధించిన 2.5 లక్షల మంది కంటే ఎక్కువ మందినే పరిగణనలోకి తీసుకునేలా జేఈఈ అడ్వాన్స్డ్ నిర్వహణ సంస్థ అయిన ఢిల్లీ ఐఐటీ చర్యలు చేపట్టింది. మరోవైపు శనివారం (12వ తేదీ) మధ్యాహ్నం నుంచి జేఈఈ అడ్వాన్స్డ్కు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించనుంది. ఈనెల 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్, 18వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో ఫీజు చెల్లింపునకు అవకాశం కల్పించింది. ఈనెల 21న ఉదయం 10 గంటల నుంచి హాల్టికెట్ల డౌన్లోడ్కు అవకాశం కల్పించనుంది. 27వ తేదీన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను నిర్వహించనుంది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పేపర్–1, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి పేపర్–2 పరీక్ష ఉంటుంది. వాటి ఫలితాలను అక్టోబర్ 5న ప్రకటించనున్నారు. కేటగిరీల వారీగా అడ్వాన్స్డ్కు అర్హులు వీరే: ఓపెన్ కేటగిరీలో 1,01,250, జనరల్ ఈడబ్ల్యూఎస్లో 25 వేలు, ఓబీసీ నాన్ క్రిమీలేయర్ 67,500, ఎస్సీ 37,500, ఎస్టీ 18,750. 100 పర్సంటైల్ సాధించిన రాష్ట్ర విద్యార్థులు హాల్టికెట్ నంబర్ విద్యార్థి పేరు 200310386279 చాగరి కౌశల్కుమార్రెడ్డి 200310437355 చుక్కా తనూజ 200310566235 దీటి యశష్చంద్ర 200310574091 మొర్రడ్డిగారి లిఖిత్రెడ్డి 200310585775 రాచపల్లె శశాంక్ అనిరుధ్ 200310594754 రోంగల అరుణ్ సిద్ధార్థ 200310504229 శివకృష్ణ సాగి 200310226303 వాడపల్లి అర్వింద్ నరసింహ ఏపీ విద్యార్థులు.. 200310065452 లాండ జితేంద్ర 200310404791 తాడవర్తి విష్ణు శ్రీసాయి శంకర్ 200310145653 వైఎస్ఎస్ నర్సింహ నాయుడు కటాఫ్ మార్కులివే.. జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హులుగా పరిగణనలోకి తీసుకునే టాప్ 2.5 లక్షల మంది విద్యార్థుల ఎంపికకు జనరల్ కేటగిరీలో 90.37 ఎన్టీఏ స్కోర్ను కటాఫ్ మార్కులుగా నిర్ణయించింది. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కేటగిరీలో 70.24 స్కోర్ను, ఓబీసీ నాన్ క్రీమీలేయర్లో 72.88 స్కోర్ను, ఎస్సీలలో 50.17 స్కోర్ను, ఎస్టీలలో 39.06 స్కోర్ను, వికలాంగులలో 0.06 స్కోర్ను కటాఫ్ మార్కులుగా పరిగణనలోకి తీసుకుంది. ఆ స్కోర్, అంతకంటే ఎక్కువ స్కోర్ వచ్చినవారే అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హులు. -
జేఈఈ మెయిన్ పరీక్షలు ప్రారంభం
-
జూన్లో జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్!
సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా ఇంటర్మీడియెట్ పరీక్షలు రాసిన పది లక్షల మందికి పైగా విద్యార్థులు ఎదురుచూస్తున్న జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలను జూన్లో నిర్వహించే అంశంపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్ఆర్డీ) దృష్టి సారించింది. పరీక్షలను వాయిదా వేసిన ఎంహెచ్ఆర్డీ తాజా షెడ్యూల్పై కసరత్తు చేస్తోంది. మే 3 వరకు లాక్డౌన్ ఉన్నందున, తర్వాత పరిస్థితులను బట్టి నిర్ణ యం ప్రకటిస్తామని ఆయా సంస్థలు ముందుగా ప్రకటించాయి. మే నెలాఖరు నాటికల్లా పరిస్థితి అదుపులోకి వస్తుందని ఎంహెచ్ఆర్డీ భావిస్తోంది. జూన్లో జేఈఈ మెయిన్ను నిర్వహించేందుకు కసరత్తు ప్రారంభించింది. రెండింటిపైనా కసరత్తు... దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ విద్యా సంస్థలైన ఎన్ఐటీ, ఐఐటీ, ట్రిపుల్ఐటీ, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే జాతీయ స్థాయి విద్యా సంస్థలైన జీఎఫ్టీఐల్లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్ను ప్రతి ఏటా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ విద్యా ఏడాదిలో ప్రవేశాల కోసం గత జనవరిలో మెుదటి విడత జేఈఈ మెయిన్ను నిర్వహించింది. ఏప్రిల్ 5 నుంచి 11 వరకు నిర్వహించాల్సిన జేఈఈ మెయిన్ను కేంద్రం ఆదేశాల మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వాయిదా వేసింది. మే 17న నిర్వహించాల్సిన జేఈఈ అడ్వాన్స్డ్ను కూడా వాయిదా వేస్తూ ఐఐటీ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా పరీక్షల నిర్వహణపై కసరత్తు ప్రారంభించింది. జేఈఈ మెయిన్ నిర్వహిస్తేగానీ అడ్వాన్స్డ్ నిర్వహించే పరిస్థితి లేదు. జేఈఈ మెయిన్లో అర్హత సాధించిన టాప్ 2.5 లక్షల మందిని ఎంపిక చేసి అడ్వాన్స్డ్కు అర్హులుగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే జేఈఈ మెయిన్ను జూన్ మెుదట్లోనే నిర్వహించి 10 –15 రోజుల్లో ఫలితాలు ఇవ్వాలన్న ఆలోచనల్లో ఉంది. తద్వారా అడ్వాన్స్డ్ పరీక్షను జూన్ నెలాఖరుకు నిర్వహించినా జూలైలో ఫలితాలను ఇచ్చి ఉమ్మడి ప్రవేశాల కౌన్సెలింగ్ను ప్రారంభించాలని భావిస్తోంది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం జూన్ 8కల్లా జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలను ప్రకటించి, 17వ తేదీ నుంచి ఎన్ఐటీ, ఐఐటీ, ట్రిపుల్ఐటీ, జీఎఫ్టీఐల్లో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశాల కౌన్సెలింగ్ను (జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ – జోసా) ప్రారంభించాల్సి ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో జూలై మెుదటి వారంకల్లా జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలను ప్రకటించి, రెండో వారంలో జోసా ప్రవేశాల కౌన్సెలింగ్ను ప్రారంభించేలా కసరత్తు చేస్తోంది. ఒకవేళ కరోనా కనుక త్వరితంగా అదుపులోకి వస్తే జేఈఈ మెయిన్ను మాత్రం మే నెలాఖరులో నిర్వహించే అవకాశాలను కూడా పరిశీలిస్తోంది. -
సాక్షి మాక్ టెస్టులు
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది విద్యార్థుల లక్ష్యం ఇంజనీరింగ్ లేదా మెడిసిన్.. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు ప్రముఖ ఇంజనీరింగ్/మెడికల్ కాలేజీలో ప్రవేశం లభించాలని కోరుకుంటారు. అందుకు కోచింగ్ ఫీజుల కోసం ఎంతైనా ఖర్చు చేయడానికి వెనకాడటం లేదు. విద్యార్థులు సైతం తమ లక్ష్యం, తల్లిదండ్రుల ఆశయం నెరవేరేలా రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. దేశంలోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలైన ఐఐటీలు, నిట్లలో ప్రవేశానికి మార్గం వేసే జేఈఈ మెయిన్, తెలుగు రాష్ట్రాల స్థాయిలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ కాలేజీల్లో అడ్మిషన్ కల్పించే ఎంసెట్, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కళాశాలల్లో ప్రవేశానికి వీలు కల్పించే నీట్ పరీక్షలు త్వరలో జరుగనున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ పొందేలా చేయూత అందించేందుకు సాక్షి ముందుకు వచ్చింది. నిపుణుల ఆధ్వర్యంలో జేఈఈ మెయిన్, ఎంసెట్, నీట్ పరీక్షలకు మాక్ టెస్టులు నిర్వహించనుంది. పరీక్షకు కొద్దిరోజుల ముందు వాస్తవ పరీక్షలాంటి వాతావరణంలో జరిగే సాక్షి మాక్ టెస్టులు రాయడం ద్వారా.. విద్యార్థులు తమ ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేసుకొని, ప్రిపరేషన్ను మరింత మెరుగుపర్చుకోవచ్చు. అంతేకాకుండా సాక్షి మాక్ టెస్టుల్లో ఉత్తమ ప్రతిభను చూపడం ద్వారా టాప్ టెన్ ర్యాంకర్లు ఆకర్షణీయ బహుమతులూ గెలుచుకోవచ్చు. పరీక్షలకు సంబంధించి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఏ పరీక్ష ఎప్పుడంటే.. - సాక్షి జేఈఈ మెయిన్ పరీక్ష 25–3–2020న ఆన్లైన్లో ఉదయం 09:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు జరుగుతుంది. రిజిస్ట్రేషన్లకు చివరి తేది: 15–3–2020. - సాక్షి మాక్ ఎంసెట్ (ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్) పరీక్ష 12–4–2020, 13–4–2020న ఆన్లైన్లో జరుగుతుంది. మొదటి సెషన్ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు ఉంటుంది. రిజిస్ట్రేషన్లకు చివరి తేదీ: 5–4–2020 - సాక్షి మాక్ నీట్ పరీక్ష 22–4–2020∙ఆఫ్లైన్లో ఉదయం 9.30 నుంచి 12.30 వరకు జరుగుతుంది. రిజిస్ట్రేషన్లకు చివరి తేదీ: 15–4–2020. - ఒక్కోపరీక్షకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.150. http://www.arenoane.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. విజయవంతంగా దరఖాస్తులు పూర్తిచేసిన అభ్యర్థుల ఈ మెయిల్కు హాల్టికెట్ పంపుతారు. వివరాలకు సంప్రదించాల్సిన నంబర్లు - తెలంగాణ జిల్లాలు: 9505514424, 9666013544 - గ్రేటర్ హైదరాబాద్: 9912035299, 9912671222. - చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపూర్, నెల్లూరు: 9666697219 - విజయవాడ, గుంటూరు, ప్రకాశం,పశ్చిమగోదావరి: 9912671555 - తూర్పుగోదావరి, వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం: 9666283534 -
9వ తేదీ వరకే జేఈఈ మెయిన్
సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్ ఆన్లైన్ పరీక్షలను ఈ నెల 6 నుంచి 9 వరకు నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఈ నెల 6 నుంచి 11 వరకు పరీక్షలను నిర్వహించాల్సి ఉంది. విద్యార్థులు సంఖ్య తక్కువగా ఉండటంతో పరీక్షలు నిర్వహించే రోజులను తగ్గించింది. 9వ తేదీ వరకే పరీక్షలను పూర్తి చేస్తామని తెలిపింది. దేశవ్యాప్తంగా రోజూ రెండు షిఫ్ట్లుగా నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షలకు హాజరయ్యేందుకు 10.72 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో బీఈ/బీటెక్ కోసం 9.34 లక్షల మంది.. బీఆర్క్/బీప్లానింగ్ కోసం 1.38 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం దరఖా స్తుల్లో 2.90 లక్షల మంది బాలికలున్నారు. గతేడాది కంటే బాలికల సంఖ్య ఈసారి పెరిగింది. గతేడాది నిర్వహించిన జేఈఈ మెయిన్కు 2,74,753 మంది దరఖాస్తు చేసుకోగా, ఈసారి అదనంగా 15,247 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి వచ్చిన మొత్తం దరఖాస్తుల్లో ఈడబ్ల్యూఎస్ కోటా కింద 81,413 మంది దరఖాస్తు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా 233 కేంద్రాల ఏర్పాటు.. ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షలు రాసేందుకు తెలంగాణ నుంచి దాదాపు 75 వేల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. దేశవ్యాప్తంగా ఈ పరీక్షల నిర్వహణకు 233 కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో హైదరాబా ద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, నల్లగొండ, వరంగల్ జిల్లా కేంద్రా ల్లో కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2 గంటల ముందు నుంచే.. సోమవారం ఉదయం ప్రారంభమయ్యే పరీక్షలకు విద్యార్థులను 2 గంటల ముందు నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతించనున్నట్లు ఎన్టీఏ తెలిపింది. మధ్యాహ్నం పరీక్షలకు హాజరయ్యే విద్యార్థు లను గంటన్నర ముందు నుంచే అనుమతిస్తామంది. మొదటి షిఫ్ట్ పరీక్ష ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, రెండో షిఫ్ట్ పరీక్ష మధ్యాహ్నం 2:30 నుం చి సాయంత్రం 5:30 వరకు ఉంటుందని తెలిపింది. విద్యార్థులు పరీక్ష ప్రారంభ సమయం కంటే అరగంట ముందే పరీక్ష హాళ్లలో ఉండాలని పేర్కొంది. విద్యార్థుల హాల్టికెట్లలో పేర్కొన్న గుర్తింపు కార్డుల్లో ఏదేని ఒక ఒరిజినల్ ఐడీ కార్డును, హాల్టికెట్ను వెంట తెచ్చుకోవాలని సూచించింది. పెన్ను/పెన్సిల్, పేపరు లాంటివి తీసుకురావద్దని, వాటిని పరీక్ష హాల్లోనే ఇస్తామని వివరించింది. ఎలాంటి ఎలక్ట్రా నిక్, జామెట్రీ పరికరాలు తేవద్దని స్పష్టం చేసింది. మొదటిరోజు పరీక్షలను బీఆర్క్/బీ ప్లానింగ్లలో ప్రవేశాల కోసం (పేపర్–2) నిర్వహిస్తారని తెలిపింది. 7, 8, 9 తేదీల్లో బీఈ/బీటెక్లలో ప్రవేశాల కోసం (పేపర్–1) పరీక్షలుంటాయని ఎన్టీఏ వివరించింది. -
కాగితం ముక్క కూడా అనుమతించం!
సాక్షి, హైదరాబాద్: ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాల కోసం ఈనెల 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జేఈఈ మెయిన్ పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇటీవల మార్పు చేసిన ప్రశ్నపత్రాలతో మొదటిసారిగా ఈ పరీక్షలను నిర్వహించబోతోంది. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పర్సు, పెన్ను, పెన్సిళ్లే కాదు.. కనీసం కాగితం ముక్క కూడా వెంట తీసుకురావద్దని ఎన్టీఏ స్పష్టం చేసింది. ఎలక్ట్రానిక్ పరికరాలు, జామెట్రీ పరికరాలు, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలేవీ వెంట తీసుకురావద్దని వెల్లడించింది.విద్యార్థులకు కావాల్సిన పెన్ను/పెన్సిల్, రఫ్ పేపరు పరీక్ష కేంద్రాల్లోనే అందజేస్తారు. విద్యార్థులు నిర్ణీత సమయంకంటే ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, రిపోర్టింగ్ సమయం తరువాత గేట్ మూసివేశాక ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది ఉండదని వెల్లడించింది. ఈ పరీక్షలకు రాష్ట్రం నుంచి దాదాపు 75 వేల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వారికోసం తెలంగాణలోని హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, నల్లగొండ, వరంగల్ జిల్లా కేంద్రాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. విద్యార్థుల హాల్టికెట్లలో పేర్కొన్న గుర్తింపు కార్డుల్లో (ఆధార్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్టు, ఫొటో కలిగిన ఇంటర్ పరీక్షల హాల్ టికెట్ తదితర) ఏదేని ఒక ఒరిజినల్ ఐడీ కార్డును, హాల్టికెట్ను తెచ్చుకోవాలి. అరగంట ముందే చేరుకోవాలి సోమవారం నుంచి 11వ తేదీ వరకు కంప్యూటర్ ఆధారితంగా పరీక్ష నిర్వహించనుంది. ప్రతి రోజూ ఉదయం, మధ్యాహ్నం 2 షిఫ్ట్లుగా పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తోంది. మొదటి షిఫ్ట్ పరీక్ష ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, రెండో షిఫ్ట్ పరీక్ష మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయం త్రం 5:30 గంటల వరకు ఉంటుం ది. మొదటి షిఫ్ట్ పరీక్షకు ఉదయం 7:30 గంటల నుంచి 9 గంటలలోపు, రెండో షిఫ్ట్ పరీక్షకు మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గం టలలోపే పరీక్ష హాల్లోకి అనుమతిస్తా రు.ఈ పరీక్షల ఫలితాలను ఈనెల 31వ తేదీలోగా వెల్లడించనుంది. 75 ప్రశ్నలు.. 300 మార్కులు ఇప్పటివరకు జేఈఈ మెయిన్లో 360 మార్కులకు 90 ప్రశ్నలు ఇచ్చేది. అవన్నీ ఆబ్జెక్టివ్ ప్రశ్నలే. వాటికి నెగటివ్ మార్కుల విధానం ఉంది. ఇప్పుడు మాత్రం 75 ప్రశ్నలతో 300 మార్కులకు పరీక్ష నిర్వహించబోతోంది. గణితంలో 25, ఫిజిక్స్లో 25, కెమిస్ట్రీలో 25 ప్రశ్నలు ఉంటాయి. ఆ మూడు సబ్జెక్టుల్లో 20 చొప్పున ప్రశ్నలకు ఆబ్జెక్టివ్ విధానంలో, 5 చొప్పున ప్రశ్నలను న్యూమరికల్ వ్యాల్యూ జవాబు వచ్చే ప్రశ్నలు ఇవ్వనుంది. న్యూమరికల్ వ్యాల్యూ ప్రశ్నలకు మాత్రం నెగటివ్ మార్కుల విధానం ఉండదు. అయితే ఈసారి విద్యార్థుల స్కోరింగ్లో న్యూమరికల్ వ్యాల్యూ ప్రశ్నలు కీలకం కానున్నాయి. -
ఇంగ్లిష్, హిందీల్లోనే జేఈఈ మెయిన్స్
సాక్షి, హైదరాబాద్: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్ పరీక్షను ఇంగ్లిష్, హిందీ భాషల్లోనే నిర్వహిస్తున్నామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) స్పష్టం చేసింది. జేఈఈ మెయిన్స్ ద్వారా ఆయా రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు చేపట్టేందుకు అంగీకరించిన, తమ ప్రాంతీయ భాషలో పరీక్షను నిర్వహించాలని కోరిన రాష్ట్రాల భాషల్లో మాత్రమే (ఇంగ్లిష్, హిందీతోపాటు) జేఈఈ మెయిన్స్ నిర్వహి స్తున్నామని తెలి పింది. 2013లో జేఈఈ మెయిన్స్ ప్రారంభమయ్యాక గుజరాతీలో పరీక్ష నిర్వహిం చాలని గుజ రాత్ కోరిందని తెలిపింది. 2014లో మహారాష్ట్ర కూడా మరాఠీతోపాటు ఉర్దూలో పరీక్ష నిర్వహించాలని కోరిందని పేర్కొంది. దాంతో గుజరాతీ, మరాఠీ, ఉర్దూ భాషల్లోనూ జేఈఈ మెయిన్స్ ప్రశ్న పత్రం ఇస్తున్నామని వెల్లడించింది. మిగతా రాష్ట్రాలు తమ ప్రాంతీయ భాషల్లో ప్రశ్న పత్రం ఇవ్వాలని తమను అడగలేదని ఎన్టీఏ స్పష్టం చేసింది. జేఈఈ మెయిన్స్ ప్రశ్నపత్రం ఏ భాషలో ఇచ్చినా మూల్యాంకనంలో మాత్రం ఇంగ్లిష్ ప్రశ్నపత్రాన్నే ప్రామాణికంగా తీసుకుంటామని వెల్లడించింది. -
జేఈఈ మెయిన్ మారింది!
సాక్షి, హైదరాబాద్: ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షల్లో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సంస్కరణలు తీసు కొచ్చింది. నిఫుణుల కమిటీ సిఫారసుల మేరకు స్కీం అండ్ సిలబస్లో భారీ మార్పులు చేసింది. పరీక్షల్లో ఇచ్చే ప్రశ్నల సంఖ్యతోపాటు ప్రశ్నల విధానాన్ని కూడా మార్చేసింది. ఈ మేరకు మార్పు చేసిన జేఈఈ మెయిన్ పరీక్ష కొత్త విధానాన్ని ఇన్ఫర్మేషన్ బులెటిన్లో అందుబా టులో ఉంచింది. ఆబ్జెక్టివ్ విధానమే కాకుండా డిస్క్రిప్టివ్ విధానాన్ని కూడా తీసుకురావాలని భావించిన ఎంహెచ్ఆర్డీ.. ఈ మేరకు గతంలోనే నిఫుణల కమిటీని ఏర్పాటు చేసింది. అయితే డిస్క్రిప్టివ్ విధానం కాకుండా సంఖ్యా సమాధాన (న్యూమరికల్ వాల్యూ) సంబంధిత ప్రశ్నలను జేఈఈ మెయిన్ పరీక్షల్లోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు జేఈఈ అడ్వాన్స్డ్లో ఈ విధానం ఉండగా, ఇపుడు మెయిన్లోనూ ప్రవేశపెట్టింది. 75 ప్రశ్నలు.. 300 మార్కులు.. జేఈఈ మెయిన్లో ఇప్పటివరకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి 30 చొప్పున మొత్తం 90 ఆబ్జెక్టివ్ ప్రశ్నలుండేవి. ప్రతి ప్రశ్నకు 4 మార్కుల చొప్పున 360 మార్కుల కు ప్రశ్నపత్రం ఉండేది. నెగిటివ్ మార్కుల విధానం ఉండేది. ఒక తప్పు సమాధానానికి ఒక మార్కు కోత వేసేవారు. కొత్త విధానంలో ప్రతి ప్రశ్నకు 4 మార్కులే ఇవ్వనున్నప్పటికీ, ప్రశ్నల సంఖ్యను 75కి కుదిం చారు. ప్రతి సబ్జెక్టు నుంచి గతంలో 30 ప్రశ్నలు ఉండగా..వాటిని 25కి తగ్గించారు. ఆ 25 ప్రశ్నల్లోనూ ఆబ్జెక్టివ్ విధానంలో 20 ప్రశ్నలు.. సంఖ్యా సమాధాన పద్ధతిలో మరో 5 ప్రశ్నలు ఇచ్చేలా రూపకల్పన చేశారు. మొత్తమ్మీద 60 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు, 15 న్యూమరికల్ వాల్యూ ప్రశ్నలు ఉంటాయి. వీటిలో ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు మాత్రం నెగిటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు కోత వేస్తారు. న్యూమరికల్ వాల్యూ కింద ఇచ్చే 15 ప్రశ్నలకు మాత్రం నెగిటివ్ విధానం ఉండదు. బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ , బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ ప్రవేశ పరీక్షల్లోనూ న్యూమరికల్ వ్యాల్యూ ప్రశ్నలు ఇచ్చేలా ఎంహెచ్ఆర్డీ మార్పులు చేసింది. బీఆర్క్లో ప్రవేశాలకు 77 ప్రశ్నలతో 400 మార్కులకు, బీప్లానింగ్లో ప్రవేశాలకు 100 ప్రశ్నలతో 400 మార్కులకు పరీక్ష నిర్వహించనుంది. బాలికలకు సగం ఫీజే.. జనరల్, జనరల్– ఈడ బ్ల్యూఎస్, ఓబీసీ నాన్ క్రీమీలే య ర్ బాలురకు ఫీజును రూ.650గా బాలికలకు రూ.325గా నిర్ణయిం చారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లకు రూ.325గా ఫీజు ఖరారు చేశారు. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్/డెబిట్ కార్డు, యూపీఐ, పేటీఎం ద్వారా చెల్లించ వచ్చు. ఇవీ పరీక్ష కేంద్రాలు.. తెలంగాణలో: హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్లగొండ, వరంగల్. ఆంధ్రప్రదేశ్లో: అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూల్, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖ, విజయనగరం, నరసరావుపేట, ప్రొద్దుటూరు, సూరంపాలెం. అరగంట ముందు రావాల్సిందే.. జేఈఈ మెయిన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభ మైంది. ఈనెల 30లోగా ఆన్లైన్లో (jeemain. nta.nic.in) దరఖాస్తు చేసుకునేలా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాట్లు చేసింది. అక్టోబర్ 1వరకు ఫీజు చెల్లించ వచ్చు. దరఖాస్తుల్లో పొరపాట్లు సరిదిద్దుకునేందుకు అక్టో బర్ 11 నుంచి 17 వరకు అవకాశం ఉంటుంది. డిసెంబర్ 6 నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొదటి విడత పరీక్షలను 2020 జనవరి 6 నుంచి 11వ తేదీ మధ్య ఆన్లైన్లో నిర్వహించనుంది. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు 2 విడతలుగా పరీక్షలు ఉంటాయి. మొదటి షిప్ట్ పరీక్షకు ఉదయం 7:30 గంటల నుంచి 9 గంటలలోపు, రెండో షిఫ్ట్ పరీక్షకు మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 2 గంటలలోపే విద్యార్థులను పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. న్యూమరికల్ ప్రశ్నలే కీలకం మొదటి 20 ప్రశ్నలతో ఇబ్బంది లేదు. న్యూమరికల్ వాల్యూ విధానంలో అడిగే ఐదు ప్రశ్నలతోనే ఇబ్బంది. అడ్వాన్స్డ్కు ప్రిపేర్ అయ్యే వారికి మాత్రం సులభమే. ఇందులో నెగిటివ్ మార్కులు లేకపోవడం కొంత ఊరట. విద్యార్థి పర్ఫెక్షన్ను పరీక్షిం చేలా ఈ ప్రశ్నలుంటాయి. ప్రతి సబ్జెక్టులో 5 చొప్పున 15 ప్రశ్న లకు 60 మార్కులు కాబట్టి అవి చాలా కీలకం. మెయిన్ పాత పేపర్లతోపాటు గత అడ్వాన్స్డ్ పరీక్షలో ఇచ్చిన న్యూమరికల్ వ్యాల్యూ ప్రశ్నలు చూసుకుని ప్రిపేర్ అయితే సరిపోతుంది. – ఉమాశంకర్, ఐఐటీ నిపుణుడు -
ఏప్రిల్ 8, 9, 10, 12 తేదీల్లో జేఈఈ మెయిన్స్
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయి ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో బీఈ/బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి జేఈఈ మెయిన్స్–2019 పరీక్షలను వచ్చే నెల 8, 9, 10, 12 తేదీల్లో నిర్వహించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయించింది. బీఆర్క్/బీప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 7న ప్రవేశ పరీక్షను నిర్వహించేలా చర్యలు చేపట్టింది. లోక్సభ ఎన్నికలు వచ్చే నెల 11, 18, 23, 29 తేదీల్లో, మే 6, 12, 19 తేదీల్లో నిర్వహించనున్న నేపథ్యంలో తాజా షెడ్యూలును ఖరారు చేసింది. వాస్తవానికి ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 6 నుంచి 20వ తేదీ మధ్య పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. అయితే ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాజా షెడ్యూలును ఖరారు చేసింది. -
జేఈఈ అడ్వాన్స్డ్ కటాఫ్ 87.71
సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్ స్కోర్ను మార్కుల రూపంలో కాకుండా పర్సంటైల్ విధానంలో ఇచ్చినప్పటికీ జేఈఈ అడ్వాన్స్డ్కు ఎంపికయ్యే వారి సంఖ్యను లెక్కించుకోవడం సులభమేనని నిపుణులు చెబుతున్నారు. ఈసారి జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హులుగా పరిగణనలోకి తీసుకునే వారి కటాఫ్ ఓపెన్ కేటగిరీలో 87.71 ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నెల 8 నుంచి 12 వరకు జరిగిన జేఈఈ మెయిన్ స్కోర్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ నెల 19న ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అందులో పర్సంటైల్ ఇవ్వడంతో కొందరు విద్యార్థులు అడ్వాన్స్డ్ కటాఫ్ ఎంత ఉండవచ్చన్న అనుమానాల్లో పడ్డారు. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరమే లేదని, పర్సంటైల్ విధానం ప్రకారం అడ్వాన్స్డ్కు కటాఫ్ లెక్కించుకోవచ్చని జేఈఈ నిపుణులు చెబుతున్నారు. జనవరిలో జరిగిన పరీక్షలకు హాజరైన విద్యార్థుల సంఖ్య మేరకు ఓపెన్ కేటగిరీలో కటాఫ్ 87.71 ఉండే అవకాశం ఉందని తెలిపారు. అయితే ఏప్రిల్లో రెండోదఫా జేఈఈ మెయిన్ పరీక్ష ఉన్నందున దానికి హాజరయ్యే విద్యార్థుల సంఖ్య బట్టి కటాఫ్ లో మార్పులు ఉంటాయి. అప్పుడే కటాఫ్ పర్సంటైల్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించనుంది. ఓపెన్ కేటగిరీ కటాఫ్ లెక్కింపు ఇలా.. సాధారణంగా అన్ని కేటగిరీల్లో కలిపి 2.24 లక్షల మంది విద్యార్థులను జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హులుగా పరిగణనలోకి తీసుకుంటారు. గతంలో సమాన మార్కులు వచ్చిన విద్యార్థులను అడ్వాన్స్డ్కు పరిగణనలోకి తీసుకోవడంతో మరో 7 వేలు పెరిగి 2.31 లక్షలకు చేరుకుంది. ఈసారి మాత్రం టాప్ 2.24 లక్షల మందినే జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. దీని ప్రకారం 50.5 శాతం విద్యార్థులను ఓపెన్ కేటగిరీలో తీసుకోవాలి. దీంతో ఓపెన్ కేటగిరీలో ఎంపిక చేసే విద్యార్థుల సంఖ్య 1,13,120 అవుతుంది. అందులో దివ్యాంగులను 5 శాతం మినహాయిస్తే 1,07,464 మందిని ఓపెన్ కేటగిరీలో అడ్వాన్స్డ్కు ఎంపిక చేస్తారు. జనవరిలో జరిగిన జేఈఈ పరీక్షకు మొత్తం 8,74,469 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో అడ్వాన్స్డ్కు ఓపెన్ కేటగిరీలో పరిగణనలోకి తీసుకునే విద్యార్థుల శాతం 12.2890577 అవుతుంది. జనవరి పరీక్షలో టాప్ పర్సంటైల్ 100.0000000. అందులో నుంచి ఓపెన్ కేటగిరీ విద్యార్థుల పర్సంటేజీని తీసేస్తే 87.7109423 పర్సంటైల్ వస్తుందని, ఓపెన్ కేటగిరీలో కటాఫ్గా ఉండే పర్సంటైల్ అదే అయ్యే అవకాశం ఉందని జేఈఈ నిపుణులు సురేష్కుమార్ వివరించారు. ఇది పూర్తిగా జనవరి పరీక్షకు హాజరైన విద్యార్థుల సంఖ్య మేరకేనని పేర్కొన్నారు. వాస్తవానికి జనవరిలో జరిగే జేఈఈ మెయిన్కు హాజరయ్యేందుకు దరఖాస్తు చేసుకున్న వారిలో 54,729 మంది విద్యార్థులు పరీక్ష రాయలేదు. అంటే వారంతా ఏప్రిల్లో జరిగే పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. దీంతో ప్రస్తుతం రాసిన వారు, పరీక్ష రాయని వారు కలుపుకుని విద్యార్థుల సంఖ్య 9,29,198కి చేరే అవకాశం ఉంది. ఈ విద్యార్థుల సంఖ్య ప్రకారం చూస్తే ఓపెన్ కేటగిరీ విద్యార్థుల సంఖ్య (దివ్యాంగులు కాకుండా) 1,07,464 మంది. దీన్ని పరీక్షకు హాజరైన మొత్తం విద్యార్థుల సంఖ్యతో చూస్తే 11.56524228 శాతం. టాప్ పర్సంటైల్ 100 అయినందున అందులో నుంచి 11.56524228ని తీసివేస్తే 88.4347577 వస్తుంది. అదే ఓపెన్ కేటగిరీ కటాఫ్ అవుతుంది. ఏప్రిల్లో పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్యను బట్టి ఇది మారనుంది. ఐఐటీల్లో సీట్లు పెరిగితే మాత్రం అడ్వాన్స్డ్కు పరిగణనలోకి తీసుకునే విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు కటాఫ్ కూడా భారీగా తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. పర్సంటైల్ ఆధారంగా ర్యాంకు విద్యార్థులకు వచ్చిన పర్సంటైల్ ఆధారంగా ర్యాంకు లెక్కించుకోవడం సులభమేనని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు 93.9274506 పర్సంటైల్ విద్యార్థిని తీసుకుంటే.. టాప్ 100 పర్సంటైల్ నుంచి ఈ విద్యార్థి పర్సంటైల్ తీసివేస్తే అతనికి వచ్చేది 6.0725494. అంటే ప్రతి 100 మంది విద్యార్థుల్లో అతని ర్యాంకు 6.0725494 అన్నమాట. ఆ లెక్కన పరీక్షకు హాజరైన మొత్తం 8,74,469 మంది విద్యార్థుల్లో చూస్తే అతనికి వచ్చే ర్యాంకు 53102.562012686. అయితే జనవరిలో జరిగిన జేఈఈ పరీక్షను 8 దఫాలుగా నిర్వహించినందున అతని ర్యాంకులో 8 స్థానాలు అటూ ఇటుగా మారే అవకాశం ఉంటుంది. మరోవైపు 100 పర్సంటైల్ వచ్చి న విద్యార్థులు అందరికీ ఒకే ర్యాంకు ఇవ్వరు. వారికి ర్యాంకులను కేటాయించే సమయంలో విద్యార్థి మొత్తం మార్కులను చూస్తారు. పలువురు విద్యార్థులకు సమాన మార్కులు ఉంటే.. వరుసగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో వరుసగా చూసి ఎక్కువ మార్కులు వచ్చిన వారికి ముందు ర్యాంకులను కేటాయిస్తారు. ఆ మార్కులు సమానంగా ఉంటే ఎక్కువ వయసు వారికి ముందు ర్యాంకును కేటాయించి, మిగతా వారికి వరుసగా కిందకు ర్యాంకులను కేటాయిస్తారు. అయితే ఈ ర్యాంకులను విద్యార్థులకు ఇప్పుడే ఇవ్వరు. ఏప్రిల్లో జరిగే పరీక్ష తర్వాతే 2 దఫాల్లో జేఈఈ మెయిన్కు హాజరైన విద్యార్థులను, వారికి వచ్చిన పర్సంటైల్ను తీసుకొని ర్యాంకులను కేటాయిస్తారు. వాటి ఆధారంగానే ఐఐటీల్లో ప్రవేశాలు చేపడతారు. -
ప్రారంభమైన జేఈఈ మెయిన్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, ఐఐటీ, ఇతర జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్ పరీక్షలు మంగళవారం ప్రారంభం అయ్యాయి. రాష్ట్రంలోని ఏడు ప్రధాన పట్టణాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఈ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటిరోజు ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్ పేపరు–2 పరీక్షకు విద్యార్థులు హాజరయ్యారు. దేశ వ్యాప్తంగా ఈ పరీక్షకు 1.82 లక్షల మంది హాజరు కాగా, తెలంగాణ నుంచి దాదాపు 20 వేల మంది విద్యార్థులు హాజరైనట్లు అంచనా. మరోవైపు బీటెక్లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్ పేపరు–1 పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, నల్లగొండ, వరంగల్ పట్టణాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగనున్నాయి. వీటికి దేశవ్యాప్తంగా 9.65 లక్షల మంది హాజరుకానుండగా, తెలంగాణ నుంచి దాదాపు 70 వేల మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు అంచనా. కాలేజీలు తగ్గినా సీట్ల పెరుగుదల గత ఐదేళ్లలో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, బి.ఫార్మసీ, ఫార్మ్–డి, ఎంసీఏ, ఎంబీఏ, బీఈడీ, న్యాయవిద్య, ఎంటెక్, ఎం.ఫార్మసీ, బీపీఈడీ తదితర కోర్సులు నిర్వహించే కాలేజీలు వందల సంఖ్యలో తగ్గినా ఆయా కోర్సుల్లో సీట్లు మాత్రం భారీగా పెరిగాయి. 2014–15 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 3,688 కాలేజీల్లోని వివిధ కోర్సుల్లో 5,23,291 సీట్లు ఉన్నాయి. 2018–19 విద్యా సంవత్సరం వచ్చేసరికి కాలేజీల సంఖ్య 2,901కి తగ్గిపోయింది. అయితే సీట్ల సంఖ్య మాత్రం 6,52,178కి పెరిగింది. అంటే ఐదేళ్లలో 787 కాలేజీలు తగ్గినా 1,28,887 సీట్లు పెరిగాయి. ఇందులో అత్యధికంగా డిగ్రీలో సీట్లు పెరిగాయి. ఇతర కోర్సుల్లోనూ సీట్లు, కాలేజీలు తగ్గిపోయాయి. డిగ్రీ కాలేజీల సంఖ్య గత ఐదేళ్లలో తగ్గినా సీట్ల సంఖ్య 2 లక్షలు పెరి గింది. అయినా ప్రవేశాలు మాత్రం ఆశించిన మేర పెరగలేదు. ఎంటెక్, ఎం.ఫార్మసీలో మాత్రం కాలేజీలు, సీట్ల సంఖ్య భారీగా తగ్గింది. -
నేటి నుంచి జేఈఈ మెయిన్ పరీక్షలు
సాక్షి హైదరాబాద్: ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, ఐఐటీ, ఇతర ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక విద్యాసంస్థ (జీఎఫ్టీఐ) ల్లో ప్రవేశాల కోసం ఈ నెల 8న జేఈఈ మెయిన్ ప్రవేశ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 12 వరకు పరీక్షలు నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఏర్పాట్లు చేసింది. నాలుగు రోజులపాటు జరిగే ఈ పరీక్షలను ఆన్లైన్లో ప్రతిరోజూ రెండు షిఫ్ట్లుగా నిర్వహించనుంది. ఉదయం 9:30 గంటలకు ప్రారంభమయ్యే పరీక్షకు ఉదయం 7:30 గంటల నుంచీ, మధ్యాహ్నం 2:30కి ప్రారంభమయ్యే పరీక్షలకు మధ్యాహ్నం 12:30 నుంచీ విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. విద్యార్థులు గంట ముందుగా పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లాల్సిందే. ఆలస్యమైతే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. దేశవ్యాప్తంగా 273 పట్టణాల్లో నిర్వహించే ఈ పరీక్షకు 9.65 లక్షల మంది హాజరుకానుండగా అందులో తెలంగాణ నుంచి దాదాపు 70 వేల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. రాష్ట్రంలోని హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, నల్లగొండ, వరంగల్ పట్టణాల్లో పరీక్ష కేంద్రాలను ఎన్టీఏ ఏర్పాటు చేసింది. ఈ పరీక్షల ఫలితాలను ఈ నెల 31న వెల్లడించనుంది. -
రేపటి నుంచి జేఈఈ మెయిన్
సాక్షి, హైదరాబాద్: ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, ఐఐటీ, ఇతర ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక విద్యాసంస్థ (జీఎఫ్టీఐ)ల్లో ప్రవేశాల కోసం ఈ నెల 8 నుంచి 12 వరకు జేఈఈ మెయిన్ ప్రవేశపరీక్ష నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఏర్పాట్లు చేసింది. నాలుగు రోజులపాటు జరిగే ఈ పరీక్షలను ఆన్లైన్లో ప్రతిరోజూ రెండు షిఫ్ట్లుగా నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా 263 పట్టణాల్లో నిర్వహించే ఈ పరీక్షకు 9.65 లక్షల మంది హాజరుకానుండగా అందులో తెలంగాణ నుంచి దాదాపు 70 వేల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. రాష్ట్రంలోని హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, నల్లగొండ, వరంగల్ పట్టణాల్లో పరీక్ష కేంద్రాలను ఎన్టీఏ ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు ఏటా ఒకసారి చొప్పున జేఈఈ మెయిన్ను సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిర్వహించగా 2019–20 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం ఎన్టీఏ ఏటా రెండుసార్లు పరీక్ష నిర్వహించేలా షెడ్యూల్ జారీ చేసింది. ఇందులో భాగంగా ఈ నెలలో మొదటి విడత పరీక్షను నిర్వహిస్తోంది. రెండో విడత పరీక్షను ఏప్రిల్లో నిర్వహించేలా చర్యలు చేపట్టింది. ఈ నెల 31న ఫలితాలు... కేటాయించిన కేంద్రంలోనే పరీక్ష రాయాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ పరీక్ష కేంద్రం మార్పు ఉండదని ఎన్టీఏ స్పష్టం చేసింది. విద్యార్థులు తప్పుడు సమాచారం ఇచ్చినా, ఒక షిఫ్ట్కు బదులు రెండు షిఫ్ట్లలో లేదా వేర్వేరు రోజుల్లో రెండుస్లారు పరీక్ష పరీక్ష రాసినా వారి దరఖాస్తులను తిరస్కరిస్తామని, వారి ఫలితాలను పరిగణనలోకి తీసుకోబోమని తేల్చిచెప్పింది. విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లాల్సిందేనని, ఆ తర్వాత వచ్చే విద్యార్థులను అనుమతించబోమని పేర్కొంది. పరీక్ష ఫలితాలను ఈ నెల 31న వెల్లడించనున్నట్లు తెలిపింది. -
డయాబెటిక్ విద్యార్థులు పండ్లు తెచ్చుకోవచ్చు
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, ఐఐటీ, జీఎఫ్టీఐలలో ప్రవేశాల కోసం ఈ నెల 8 నుంచి 12 వరకు నిర్వహించనున్న జేఈఈ మెయిన్ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు పాటించాల్సిన ముఖ్యమైన నిబంధనలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. పరీక్ష హాల్లోకి విద్యార్థులు నిర్ణీత సమయంలో చేరుకోవాలని సూచించింది. వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న హాల్టికెట్లో పేర్నొన్న నిబంధనలు అన్నింటినీ విద్యార్థులు పాటించాలని పేర్కొంది. ఆన్లైన్ పరీక్షలు ఉన్న ఆయా తేదీల్లో ప్రతి రోజూ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మొదటి షిఫ్ట్ పరీక్ష, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు రెండో షిఫ్ట్ పరీక్షలను నిర్వహించనున్నట్లు పేర్కొంది. విద్యార్థులను రెండు గం టల ముందు నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని, విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లాల్సిందేనని స్పష్టం చేసింది. విద్యార్థులు ఉదయం పరీక్షకు 8:30 లోపు, మధ్యాహ్నం పరీక్షకు 1:30 లోపు పరీక్ష కేంద్రంలోకి వెళ్లాలని, ఆ తరువాత అనుమతించేది లేదని వెల్లడించింది. ఉదయం పరీక్షకు 8:45 నుంచి 9 గంటల వరకు, మధ్యాహ్నం పరీక్షకు 1:45 నుంచి 2 గంటల వరకు మాత్రమే విద్యా ర్థులను పరీక్ష హాలులోకి అనుమతిస్తారంది హాల్టికెట్, ఫొటో, ఐడీ ప్రూఫ్.. విద్యార్థులు హాల్టికెట్తోపాటు పాస్పోర్టు సైజు ఫొటో, ఐడీ ప్రూఫ్ వెంట తెచ్చుకోవాలని ఎన్టీఏ పేర్కొంది. పరీక్ష హాల్లోనే విద్యార్థులకు పెన్సిల్, పెన్ను, రఫ్ వర్క్ పేపరు అందిస్తారని, వాటిని తీసుకురావాల్సిన అవసరం లేదని వెల్లడించింది. ముఖ్యంగా డయాబెటిక్ విద్యార్థులు షుగర్ ట్యాబ్లెట్లు, అరటి పండ్లు, యాపిల్, ఆరెంజ్, ట్రాన్స్ ఫరెంట్ వాటర్ బాటిల్ వెంట తెచ్చుకోవచ్చని వివరించింది. -
నేటి నుంచి జేఈఈ మెయిన్ హాల్టికెట్లు
సాక్షి, హైదరాబాద్: ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, ఐఐటీ, ఇతర జీఎఫ్టీఐలలో ప్రవేశాల కోసం జనవరి 6 నుంచి 20 వరకు నిర్వహించే జేఈఈ మెయిన్ ప్రవేశపరీక్షకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దీనిలో భాగంగా విద్యార్థులు హాల్టికెట్లను డౌన్లోడ్ చేసునేందుకు (jeemain.nic.in) చర్యలు చేపట్టింది. హాల్టికెట్ల డౌన్లోడ్కు సంబంధించిన లింక్ను ఈ నెల 17 (సోమవారం) నుంచి అందుబాటులోకి తీసుకురానుంది. ఈ పరీక్షలను ఆన్లైన్లో ప్రతి రోజు రెండు షిఫ్ట్లుగా నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది. దేశవ్యాప్తంగా 264 పట్టణాల్లో నిర్వహించే ఈ పరీక్షకు 9.65 లక్షల మంది హాజరుకానుండగా, అందులో తెలంగాణ నుంచి దాదాపు 70 వేల మంది హాజరుకానున్నారు. తెలంగాణ విద్యార్థుల కోసం హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, నల్లగొండ, రంగారెడ్డి, వరంగల్ పట్టణాల్లో ఎన్టీఏ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు ఏటా ఒకసారి మాత్రమే జేఈఈ మెయిన్ను సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిర్వహించగా, 2019–20 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం ఎన్టీఏ ఏటా రెండుసార్లు నిర్వహించేలా షెడ్యూలు జారీ చేసింది. దీనిలో భాగంగా మొదటి విడత పరీక్షను జనవరిలో, రెండో విడత పరీక్షను ఏప్రిల్లో నిర్వహించేలా చర్యలు చేపట్టింది. గంట ముందుగానే కేంద్రంలోకి.. మొదటి విడత పరీక్షను జనవరి 6 నుంచి 20 వరకు నిర్వహించనుంది. ఆయా తేదీల్లో ప్రతి రోజూ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మొదటి షిఫ్ట్ పరీక్ష ఉంటుంది. మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు రెండో షిఫ్ట్ పరీక్ష ఉంటుంది. విద్యార్థులను రెండు గంటల ముందు నుంచే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లాల్సిందేనని ఎన్టీఏ తెలిపింది. ఉదయం పరీక్షకు 8:30 లోపు, మధ్యాహ్నం పరీక్షకు 1:30 లోపు పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లాల్సిందేనని పేర్కొంది. ఆ తరువాత విద్యార్థులను అనుమతించేది లేదని స్పష్టం చేసింది. ఉదయం పరీక్షకు 8:45 నుంచి 9 గంటల వరకు, మధ్యాహ్నం పరీక్షకు 1:45 నుంచి 2 గంటల వరకు మాత్రమే విద్యార్థులను పరీక్ష హాలు/ గదిలోకి అనుమతిస్తామని పేర్కొంది. విద్యార్థులకు కేటాయించిన కేంద్రంలోనే పరీక్ష రాయాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ పరీక్ష కేంద్రం మార్పు ఉండదని ఎన్టీఏ స్పష్టం చేసింది. విద్యార్థులు తప్పుడు సమాచారం ఇచ్చినా, ఒక షిఫ్ట్కు బదులు రెండు షిఫ్ట్లలో లేదా వేర్వేరు రోజుల్లో రెండుసార్లు పరీక్ష రాస్తే వారి దరఖాస్తులను తిరస్కరిస్తామని, వారి ఫలితాలను పరిగణనలోకి తీసుకోబోమని పేర్కొంది. -
మోడల్ పేపర్ నుంచి 10 ప్రశ్నలు
సాక్షి, హైదరాబాద్: ఓ కార్పొరేట్ విద్యాసంస్థ 2016లో రూపొందించిన మోడల్ ప్రశ్నపత్రం నుంచి ఆదివారం జరిగిన జేఈఈ మెయిన్–2018 ప్రశ్నపత్రంలో ఏకంగా 10 ప్రశ్నలు వచ్చాయి. జేఈఈ మెయిన్ చరిత్రలోనే ఇలా జరగడం మొదటిసారి. అయితే ఇదీ యాదృచ్ఛికమా? లేదా కావాలనే ఇచ్చినవా? అన్నది తెలియడం లేదు. ఈ నెల 8న దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ ఎగ్జామ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రశ్నపత్రంలో సదరు కార్పొరేట్ విద్యాసంస్థ రూపొందించిన మోడల్ పేపర్ నుంచి యథాతథంగా ప్రశ్నలు రావడం విద్యార్థుల్లో ఆందోళనకు దారి తీస్తోంది. ఆ విద్యాసంస్థ 2016 అక్టోబర్ 7న ఈ మోడల్ పేపర్ను రూపొందించి శిక్షణ కోసం విద్యార్థులకు ఇచ్చింది. ఈ మోడల్ పేపర్లో ఫిజిక్స్ విభాగంలో 30 ప్రశ్నలు ఉండగా.. అందులో నుంచి ఆదివారం జరిగిన జేఈఈ మెయిన్ పరీక్షలో 10 ప్రశ్నలు యథాతథంగా రావడం గమనార్హం. ఈ విషయాన్ని ఓ ప్రైవేటు వెబ్సైట్ (http://cisthetaglobal.com/is&jee&2018&physics&paper&copied&from&model&paper&of&a&famous&coaching/) తమ సైట్లో పొందుపరచడంతో తల్లిదండ్రుల్లోనూ ఆందోళన మొదలైంది. వాస్తవానికి జేఈఈ మెయిన్ పరీక్షను 90 ప్రశ్నలతో 360 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కేటగిరీలు ఒక్కోటి 30 ప్రశ్నల చొప్పున ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు ఉంటాయి. నెగటివ్ మార్కుల విధానం ఉంది. ఒక ప్రశ్నకు తప్పుడు సమాధానం గుర్తిస్తే పావు మార్కు కట్ చేస్తారు. అంటే పావు మార్కుతోనూ ర్యాంకులు గల్లంతు అయ్యే పరిస్థితి ఉంటుంది. అలాంటిది ఓ కార్పొరేట్ విద్యా సంస్థ రూపొందించిన ప్రశ్నపత్రంలోని 40 మార్కులకు సంబంధించిన 10 ప్రశ్నలు రావడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఫిజిక్స్కే పరిమితమా? కార్పొరేట్ విద్యా సంస్థ రూపొందించిన ప్రశ్నలు జేఈఈలో ఫిజిక్స్ వరకే పరిమితం అయ్యాయా? మ్యాథ్స్, కెమిస్ట్రీలోనూ వచ్చాయా? అన్న అనుమానాలను తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు. ఇతర సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నల్లో కూడా ఆ విద్యా సంస్థ రూపొందించిన మోడల్ పేపర్ నుంచి ప్రశ్నలు వస్తే పరిస్థితి దారుణంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జేఈఈ మెయిన్ ఫిజిక్స్ ప్రశ్నపత్రంలో ప్రశ్నలను అడిగిన సరళి రెండింటిలో ఒకేలా ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. సాధారణంగా ప్రశ్నపత్రం రూపకల్పన సమయంలో గతంలో ఇచ్చిన ప్రశ్నలనే మళ్లీ ఇవ్వాల్సి వస్తే.. కనీసం ప్రశ్నలడిగే విధానం మారుస్తుంటారని సబ్జెక్టు నిపుణులు పేర్కొంటున్నారు. అయితే కార్పొరేట్ విద్యాసంస్థ మోడల్ పేపర్లోని ప్రశ్నలు, ఆదివారం జరిగిన జేఈఈలో వచ్చిన ప్రశ్నలు ఒకేలా ఉన్నాయి. కార్పొరేట్ విద్యా సంస్థ ఫిజిక్స్ కేటగిరీలో ఇచ్చిన ప్రశ్నల క్రమం.. ఆదివారం నాటి సీ కోడ్ ప్రశ్నపత్రంలో వచ్చిన ప్రశ్నల క్రమం.. -
98 మార్కులకు కటాఫ్!
సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్ పరీక్ష కటాఫ్ ఈసారి పెరిగే అవకాశం ఉంది. గతేడాదితో పోల్చితే ఈసారి కొంత సులభంగానే ప్రశ్నపత్రం వచ్చినట్లు విద్యార్థులు పేర్కొన్నారు. అయితే ఈసారి సుదీర్ఘ జవాబులు ఉన్న ప్రశ్నలు, కాలిక్యులేటెడ్ ప్రశ్నలు రావడంతో వాటిని రాసేందుకు తంటాలు పడాల్సి వచ్చిందని తెలిపారు. వాటి కారణంగా అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయలేని పరిస్థితి నెలకొందని చెప్పారు. గతే డాది కంటే సులభతర ప్రశ్నలు ఎక్కువగా ఉన్నందున ఈసారి జేఈఈ మెయిన్ కటాఫ్ పెరగనుందని సబ్జెక్టు నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు ఫిజిక్స్లో వచ్చిన ప్రశ్నలు కొంత తికమక పెట్టేలా ఉండటంతో విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు. హైదరాబాద్, వరంగల్, ఖమ్మంలో ఏర్పాటు చేసిన 115 పరీక్ష కేంద్రాల్లో ఆదివారం జేఈఈ మెయిన్ పరీక్షలు జరిగాయి. 74,580 మంది దరఖాస్తు చేసుకోగా.. దాదాపు 95 శాతం మంది పరీక్షకు హాజరైనట్లు మూడు ప్రాంతాల్లోని కోఆర్డినేషన్ కేంద్రాల ప్రతినిధులు వెల్లడించారు. ఇక జేఈఈ మెయిన్ ఆన్లైన్ పరీక్షలను ఈ నెల 15, 16 తేదీల్లో సీబీఎస్ఈ నిర్వహించనుంది. ఈనెల 24న జవాబుల ‘కీ’లను ప్రకటించి, 27 వరకు అభ్యంతరాలను స్వీకరించనుంది. 30న మెయిన్ ఫలితాలను ప్రకటించి, 31న ఆలిం డియా ర్యాంకులను వెల్లడించనుంది. ఫిజిక్స్లో 4, మ్యాథ్స్లో 3, కెమిస్ట్రీలో 3.. ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, ప్రభుత్వ ఆర్థిక సహకారం తో కొనసాగే జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో ప్రవేశాలకు, ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్కు విద్యార్థులను ఎంపిక చేసేందుకు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) జేఈఈ మెయిన్ పరీక్షను ఆఫ్లైన్లో నిర్వహించింది. ఇందులో 90 ప్రశ్నలకు పరీక్ష నిర్వహించింది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లో 30 చొప్పున ప్రశ్నలు ఉండగా, ఒక్కో ప్రశ్నను 3 మార్కులకు నిర్వహించింది. ఫిజిక్స్లో 4 ప్రశ్నలు, మ్యాథ్స్, కెమిస్ట్రీలో మూడు చొప్పున కఠినతరమైన ప్రశ్నలు వచ్చినట్లు సబ్జెక్టు నిపుణులు రామకృష్ణ, ఎంఎన్రావు వెల్లడించారు. మ్యాథ్స్, ఫిజిక్స్లో సుదీర్ఘ సమాధానాలు ఉన్న ప్రశ్నలు, కాలిక్యులేటెడ్ ప్రశ్నలు మరో 10కి పైగా ఉండటంతో విద్యార్థులు వాటిని చేసేందుకు ఎక్కువ సమయం వెచ్చించాల్సి వచ్చింది. దీంతో ప్రతిభావంతులైన విద్యా ర్థులు కాకుండా కొంత బాగా చదవగలిగే వారు వాటికి ఎక్కువ సమ యం తీసుకున్నారు. దీంతో అన్నింటికి సమాధానాలు రాయలేకపోయారు. ఇక సాధారణ విద్యార్థులైతే ఎక్కువ ఇబ్బంది పడాల్సి వచ్చింది. కాగా, ప్రశ్నల సరళి కారణంగా ఈసారి కటాఫ్ మార్కులు పెరగన్నాయి. గతేడాదితో పోల్చితే ఈసారి కటాఫ్ మార్కులు 15కు పైగా పెరిగే అవకాశ ముంది. గతేడాది జనరల్ కేటగిరీలో కటాఫ్ మార్కు లు 81 ఉండగా, ఈసారి 98పైనే ఉండనున్నాయి. గతేడాది కాకుండా అంతకుముందు సంవత్సరాల్లో కటాఫ్ మార్కులు ఎక్కువగా ఉండగా, గతేడాది తగ్గాయి. ఈసారి మళ్లీ కటాఫ్ మార్కులు పెరిగే అవకాశం ఉన్నట్లు సబ్జెక్టు నిపుణులు పేర్కొంటున్నారు. -
నేడే జేఈఈ మెయిన్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎక్జామినేషన్ (జేఈఈ) మెయిన్ రాత పరీక్ష ఆదివారం జరగనుంది. బీఈ/బీటెక్లో ప్రవేశాల కోసం ఉదయం 9:30 గంటల నుంచి పేపరు–1, బీఆర్క్/బీప్లానింగ్లో ప్రవేశాల కోసం మధ్యాహ్నం 2 గంటల నుంచి పేపరు–2 పరీక్షలు జరుగనున్నాయి. ఈ పరీక్షలకు దేశ వ్యాప్తంగా దాదాపు 13 లక్షల మంది విద్యార్థులు హాజరు కానుండగా, తెలంగాణ నుంచి 74,580 మంది హాజరుకానున్నారు. రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్, ఖమ్మంలో 115 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. -
రేపే జేఈఈ మెయిన్
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ రాత పరీక్షలను ఆదివారం (8వ తేదీన) నిర్వహించేందుకు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఏరాట్లు పూర్తి చేసింది. బీఈ/బీటెక్లో ప్రవేశాల కోసం పేపర్–1 పరీక్ష ఉదయం 9:30 గంటల నుంచి.. బీఆర్క్/బీప్లానింగ్లో ప్రవేశాల కోసం పేపర్–2 పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి జరుగుతాయి. ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 13 లక్షల మంది విద్యార్థులు హాజరుకానుండగా.. తెలంగాణ నుంచి 74,580 మంది పరీక్ష రాయనున్నారు. వీరికోసం రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్, ఖమ్మంలలో 115 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక ఈ నెల 15, 16వ తేదీల్లో ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించనుండగా.. వాటికి రాష్ట్రం నుంచి మరో 15 వేల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. రాతపరీక్ష జరిగే మూడు నగరాలతోపాటు కరీంనగర్, మహబూబ్నగర్, నల్లగొండల్లో ఆన్లైన్ పరీక్షలు జరుగుతాయి. అత్యధికంగా హైదరాబాద్ నుంచే.. ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, ఇతర ప్రభుత్వ ఆర్థిక సహాయం పొందే జాతీయ స్థాయి ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో (జీఎఫ్టీఐ) ప్రవేశాలకు, ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హులను ఎంపిక చేసేందుకు సీబీఎస్ఈ జేఈఈ మెయిన్ పరీక్షను నిర్వహిస్తోంది. దీనికి ఏటా రాష్ట్రం నుంచి 70 వేలకు పైగా విద్యార్థులు హాజరవుతుండగా.. హైదరాబాద్ నుంచే అత్యధికంగా పరీక్ష రాస్తున్నారు. ఈసారి కూడా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన 88 పరీక్షా కేంద్రాల్లో 58,500 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఖమ్మంలోని 10 కేంద్రాల్లో 5,280 మంది, వరంగల్లోని 17 కేంద్రాల్లో 10,800 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. పెన్నులూ పరీక్షా హాల్లోనే ఇస్తారు.. జేఈఈ మెయిన్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు వెంట తెచ్చుకోవద్దని సీబీఎస్ఈ స్పష్టం చేసింది. పరీక్ష రాసేందుకు అవసరమైన బాల్ పాయింట్ పెన్నులను కూడా పరీక్ష హాల్లోనే అందజేస్తామని తెలిపింది. విద్యార్థులు హాల్టికెట్తోపాటు ఏదైనా ఒరిజినల్ గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలని సూచించింది. ఉదయం 9:30కు జరిగే పరీక్షకు ఉదయం 7 గంటల నుంచే.. మధ్యాహ్నం 2కు ప్రారంభమయ్యే పరీక్షకు 12:45 గంటల నుంచే పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని పేర్కొంది. పరీక్ష ప్రారంభ సమయం తరువాత నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని స్పష్టం చేసింది. -
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
- రేపే జేఈఈ మెయిన్ పరీక్ష - 8, 9 తేదీల్లో ఆన్లైన్ పరీక్షలు సాక్షి, హైదరాబాద్: ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, ఇతర కేంద్ర ఆర్థిక సహకారంతో కొనసాగే జాతీయ స్థాయి ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 2న జేఈఈ మెయిన్ రాత పరీక్ష నిర్వహించేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చర్యలు చేపట్టింది. దాదాపు 13 లక్షల మంది ఈ పరీక్షకు హాజరు కానుండగా, తెలంగాణ నుంచి 69,467 మంది, ఏపీ నుంచి 80 వేల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. బీఈ/బీటెక్లో ప్రవేశాల కు నిర్వహించే పేపర్–1 పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి 12.30 వరకు ఉంటుంది. ఉదయం 7 గంటల నుంచే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి స్తారు. 9.30 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. బీఆర్క్, బీ ప్లానింగ్లో ప్రవేశాల కోసం పేపర్–2 పరీక్ష మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచే కేంద్రంలోకి అనుమతిస్తారు. హైదరాబాద్, ఖమ్మం,వరంగల్లలో కేంద్రాలు..: జేఈఈ పరీక్షలు నిర్వహించేందుకు తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణలో హైదరాబాద్, ఖమ్మం, వరంగల్లో, ఏపీలోని గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఆన్లైన్ పరీక్షలు ఏప్రిల్ 8, 9 తేదీల్లో ఆఫ్లైన్ పరీక్షకు నిర్ణయించిన సమయాల్లోనే ఉంటాయి. ఆన్లైన్ పరీక్షలకు మరో 25 వేల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఈ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 27న విడుదల చేయనున్నట్లు సీబీఎస్ఈ ప్రకటించింది. పరీక్షలో మొత్తం 90 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సరైన సమాధానినికి 4 మార్కుల చొప్పున 360 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో తప్పు సమాధానానికి ఒక్క మార్కు తగ్గుతుంది. ఈ విషయంలో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇవీ ప్రధాన నిబంధనలు.. ► పేపర్–1 పరీక్షకు ఉదయం 7 గంటల నుంచే పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులను అనుమతిస్తారు. ► ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలి. విద్యార్థుల తనిఖీ ఉంటుంది. ► పరీక్ష హాలులోకి మాత్రం ఉదయం 9 గంటలకు అనుమతిస్తారు. ► 9.20 గంటలకు ప్రశ్నపత్రం ఓఎంఆర్ బుక్లెట్ను ఇస్తారు. దాన్ని 9.25 గంటలకు తెరవాలి. 9.30 గంటలకు పరీక్ష ప్రారంభం అవుతుంది. ► 9.30 తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. ► హాల్టికెట్, గుర్తింపుకార్డు తప్ప మరేవీ అనుమతించరు. ► కాలిక్యులేటర్లు, అవి ఉండే గడియారాలు, సెల్ఫోన్లను అనుమతించరు. ► పరీక్ష బ్లూ/బ్లాక్ పెన్తోనే రాయాలి. పెన్సిల్ను అనుమతించరు. -
జేఈఈ మెయిన్లో మెరిసిన తెలుగు తేజాలు
♦ ఫలితాలు విడుదల చేసిన సీబీఎస్ఈ ♦ జాతీయ స్థాయిలో రాష్ట్ర విద్యార్థులకు అగ్రస్థానం ♦ టాప్ మార్కులు సాధించిందీ తెలుగు విద్యార్థే సాక్షి, హైదరాబాద్: ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్ పరీక్షలో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. జాతీయ స్థాయిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విద్యార్థులకు అగ్రస్థానం లభించింది. మొత్తంగా 360 మార్కులకుగాను తెలుగు విద్యార్థి తాళ్లూరి సాయితేజ (హాల్టికెట్ నంబర్ 20438099)కు అత్యధికంగా 345 మార్కులు రావడం విశేషం. రెండో అత్యధికమైన 340 మార్కులను కొండా విఘ్నేశ్రెడ్డి సాధించాడు. ఈ ఇద్దరు చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థులే. 300 అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన వారిలో 43 మంది తమ విద్యార్థులని శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థలు ప్రకటించగా... వారిలో 34 మంది చైతన్య టెక్నోస్కూల్లో చదువుకున్నవారే. ఈనెల 3న రాతపూర్వకంగా.. 9, 10 తేదీల్లో ఆన్లైన్లో నిర్వహించిన జేఈఈ మెయిన్ పరీక్షకు దేశవ్యాప్తంగా 12.07 లక్షల మంది విద్యార్థులు హాజరుకాగా.. అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి దాదాపు 1.30 లక్షల మంది ఉన్నారు. ఇందులో తెలంగాణ నుంచి 59,731 మంది పరీక్ష రాశారు. జేఈఈ మెయిన్ ఫలితాలు వెల్లడి కావడంతో ఈనెల 29న ఉదయం 10 గంటల నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టేందుకు గౌహతి ఐఐటీ చర్యలు చేపట్టింది. మే 22న నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు హాజరుకావాలనుకునే విద్యార్థులు మే 4వ తేదీ వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఫీజు చెల్లించాలని ప్రకటించింది. జేఈఈ మెయిన్ కటాఫ్ మార్కుల ఆధారంగా జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు ఓపెన్ కేటగిరీలో 1,01,000 మంది, ఓబీసీ నాన్ క్రీమీలేయర్లో 54 వేల మంది, ఎస్సీల్లో 30 వేల మంది, ఎస్టీల్లో 15 వేల మందిని ఎంపిక చేస్తారు. ఈ మొత్తం రెండు లక్షల మందిలో తెలంగాణ, ఏపీల నుంచి దాదాపు 25 వేల మంది ఉండనున్నట్లు అంచనా. ఇది గతేడాది సుమారు 18వేలు మాత్రమే. తగ్గిన కటాఫ్ ఈసారి జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హత సాధించిన విద్యార్థుల కటాఫ్ మార్కులను సీబీఎస్ఈ ప్రకటించింది. గతేడాది టాప్ 1.5 లక్షల మంది జనరల్ కేటగిరీ అభ్యర్థులను ఎంపిక చేసి, 105 మార్కులను కటాఫ్గా ప్రకటించగా... ఈసారి టాప్ 2 లక్షల మందిని పరిగణనలోకి తీసుకోవడంతో కటాఫ్ జనరల్ కేటగిరీలో 100కు తగ్గింది. ఇక ఓబీసీ-నాన్ క్రీమీలేయర్లో 70 మార్కులుగా, ఎస్సీల్లో 52 మార్కులుగా, ఎస్టీల్లో 48 మార్కులుగా కటాఫ్ను ప్రకటించింది. అడ్వాన్స్డ్కు దరఖాస్తు చేసుకోండి విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా సీబీఎస్ఈ ఫలితాలను ప్రకటించింది. ప్రతి విద్యార్థికి ఇచ్చిన మార్కుల జాబితాలోనే కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులను వెల్లడించింది. అందులోనే జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించిన విద్యార్థులు ఆన్లైన్లో (http://jeeadv.nic.in) రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది. మే 22న జరిగే అడ్వాన్స్డ్ పరీక్ష మార్కుల ఆధారంగా ఐఐటీల్లో ప్రవేశాలను చేపడతారు. ఇక ఎన్ఐటీల్లో ప్రవేశాల కోసం జేఈఈ స్కోర్కు 60 శాతం వెయిటేజీ, ఇంటర్ మార్కులకు 40 శాతం వెయిటేజీ ఇచ్చి, నార్మలైజ్ చేసి తుది ర్యాంకును ఖరారు చేస్తారు. ఈ ర్యాంకులను జూన్ 30న, లేదా అంతకంటే ముందుగానే ప్రకటిస్తామని సీబీఎస్ఈ వెల్లడించింది. ఇక విద్యార్థులు తమ అర్హత పరీక్ష అయిన 12వ తరగతి వివరాల్లో ఏవైనా పొరపాట్లుంటే http://www.jeemain.nic.in వెబ్సైట్లో సవరించుకోవాలని సూచించింది. నాన్న గుర్తించిన ప్రతిభ.. మొదట్లో సాధారణ స్కూల్లో చదువు. అయినా ఆ పిల్లాడు చదువులో ఘనాపాటి. అన్ని తరగతుల్లోనూ నూటికి నూరు మార్కులు. ఐదో తరగతిలో బిడ్డ టాలెంట్ను గుర్తించిన తండ్రి మంచి స్కూల్లో చేర్పించాలని తపించాడు. ఈ క్రమంలో పేరొందిన స్కూల్లో చేర్పించడానికి ప్రవేశపరీక్ష రాయించాడు. అందులో రాష్ట్రం నుంచి నంబర్ వన్ ర్యాంకు ఆ అబ్బాయి వశమైంది. ఎస్సెస్సీ, ఇంటర్, తాజాగా జేఈఈ మెయిన్స్.. ఇలా ర్యాంకులన్నీ అతని ముంగిట మోకరిల్లాయి. ఆ అబ్బాయే జేఈఈ మెయిన్స్లో ఆలిండియా స్థాయిలో 345 మార్కులతో మొదటి స్థానంలో నిలిచిన తాళ్లూరి సాయితేజ. తండ్రి ఆనాడు సాయితేజ ప్రతిభను గుర్తించకపోయి ఉంటే.. ఇప్పుడు అతనికి ఆలిండియా స్థాయి ర్యాంకులు వచ్చేవికావేమో. తండ్రి చలపతిరావు, జయలక్ష్మిది గుంటూరు జిల్లాలోని తెనాలి వద్ద ఉన్న కూచిపూడి. తేజ పుట్టకముందే వారి కుటుంబం హైదరాబాద్లో స్థిరపడింది. కూకట్పల్లిలోని వసంత్నగర్లో వీరు నివాసం ఉంటున్నారు. చలపతిరావు ఆల్విన్ వాచ్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేసి పదవీవిరమణ పొందారు. జయలక్ష్మి గృహిణి. ప్రస్తుతం చలపతిరావు సివిల్ కాంట్రాక్టర్గా పనిచేస్తున్నారు. నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్(ఎన్టీఎస్ఈ)లో ఉత్తమ ప్రతిభ కనబర్చి స్కాలర్షిప్ పొందాడు సాయితేజ. కిషోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన(కేవీపీవై) స్కాలర్షిప్కి కూడా ఎంపికయ్యాడు. అలాగే ఫిజిక్స్ ఒలింపియాడ్లోనూ సత్తా చాటాడు. డాక్టర్ ఏఎస్ రావు ఒలింపియాడ్లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ‘నా కుమారుడు ఐఏఎస్గా స్థిరపడాలని అనుకున్నా. అందుకే ఐఐటీ వైపు తేజ దృష్టి మళ్లింది. ఏనాటికైనా తేజను ఐఏఎస్గా చూస్తా’ అని అతని తండ్రి చలపతిరావు చెప్పారు. నంబర్ వన్గా ఉంటానని అనుకోలేదు.. ‘‘నాన్న పడుతున్న కష్టం.. విద్యా వ్యవస్థపై ఆయనకున్న అవగాహన.. నేను అత్యుత్తమ మార్కులు సాధించడానికి దోహదపడ్డాయి. నారాయణ శ్రీచైతన్య విద్యాసంస్థల సహకారం ఎంతో ఉంది. మెయిన్స్ పరీక్ష క్లిష్టంగా అనిపించింది. బెస్ట్ స్కోర్ చేస్తానని అంచనా వేశా. అత్యుత్తమ మార్కులు వస్తాయని మాత్రం అనుకోలేదు. చివరకు ఆలిండియా స్థాయిలో బెస్ట్ స్కోర్ చేయడం చాలా సంతృప్తినిచ్చింది. అడ్వాన్స్డ్లోనూ టాప్ 10లో నిలుస్తానని నమ్మకం ఉంది. ఐఐటీ ముంబైలో కంప్యూటర్ సైన్స్లో ఇంజనీరింగ్ చేస్తా. ఆ తర్వాత ఎంబీఏ చేయాలనేది నా లక్ష్యం’’. - సాయితేజ, టాప్ స్కోరర్ (345/360) సైంటిస్ట్గా స్థిరపడతా.. ‘‘తల్లిదండ్రుల ప్రోత్సాహం, అధ్యాపకుల దిశానిర్దేశంతో ఉత్తమ మార్కులు సాధించగలిగాను. పూర్తిగా సమయాన్ని చదువులకే కేటాయించే వాడిని కాదు. రోజుకు గంట ఆటలకు సమయమిచ్చా. దీంతో కాస్త ఒత్తిడి తగ్గడంతోపాటు నూతనోత్తేజం వచ్చేది. మెయిన్స్ పరీక్ష కఠినంగా అనిపించింది. కానీ పూర్థిస్థాయిలో శిక్షణ పొందడంతో.. కష్టమేమీ అనిపించలేదు. ఇస్రోలో సైంటిస్ట్గా స్థిరపడాలని లక్ష్యంగా పెట్టుకున్నా’’. - కొండా విఘ్నేష్ రెడ్డి, 340/360 సొంత కంపెనీ పెడతా.. ‘‘తల్లిదండ్రులు, కెమిస్ట్రీ అధ్యాపకురాలు సుభాషిణి సహకారంతోనే జేఈఈ మేయిన్స్లో 330 మార్కులు సాధించాను. దేశంలోనే బాలికల విభాగంలో మొదటి ర్యాంకు, ఓవరాల్గా 3వ ర్యాంక్ రావడం సంతోషంగా ఉంది. శ్రీచైతన్య టెక్నో స్కూల్లో 6వ తరగతిలో చేరాను. ఉపాధ్యాయుల సహకారంతో పదో తరగతిలో 10 పాయింట్స్ సాధించాను. ఇంటర్లో 987 మార్కులొచ్చాయి. ముంబై ఐఐటీలో ఇంజనీరింగ్, ఆ తర్వాత ఐఐఎం అహ్మదాబాద్లో చేరాలని నా ఆకాంక్ష. భవిష్యత్తులో సొంత కంపెనీ పెట్టాలన్నది నా జీవితాశయం’’. - ఆర్. గాయత్రి (మాదాపూర్) బాలికల్లో మొదటి ర్యాంకు -
నేడు, రేపు జేఈఈ మెయిన్ పరీక్ష
సాక్షి, హైదరాబాద్: ఎన్ఐటీ, ఐఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్ ఆన్లైన్ పరీక్షను ఈ నెల 9,10 తేదీల్లో నిర్వహించేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) ఏర్పాట్లు చేసింది. ఈ పరీక్షకు తెలంగాణ నుంచి 5,988 మంది, ఏపీ నుంచి 14,760 మంది హాజరుకానున్నారు. -
జేఈఈ పరీక్ష ప్రశాంతం
♦ 9, 10 తేదీల్లో ఆన్లైన్ పరీక్ష.. 27న ఫలితాలు ♦ అడ్వాన్స్డ్ కు అనుమతించే విద్యార్థుల సంఖ్యపై గందరగోళం ♦ టాప్ 2 లక్షల మంది విద్యార్థులని ప్రకటించిన గౌహతి ఐఐటీ ♦1.5 లక్షలే అని పేర్కొన్న సీబీఎస్ఈ ♦ ఎన్ఐటీల్లో ప్రవేశాలకు జూన్ 30న ర్యాంకుల ప్రకటన సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన జేఈఈ మెయిన్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 12.07 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ నుంచి 59,731 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఆఫ్లైన్ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసిన వారిలో 98 శాతం మంది విద్యార్థులు ఆదివారంనాటి ఎగ్జామ్కు హాజరైనట్టు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) వర్గాలు వెల్లడించాయి. ఇక ఆన్లైన్ పరీక్ష ఈ నెల 9, 10 తేదీల్లో నిర్వహిస్తారు. గతంతో పోల్చుకుంటే ఈసారి పరీక్షలో ప్రశ్నల సరళి కాస్త సులభంగా ఉన్నట్లు నిపుణులు పేర్కొన్నారు. అయితే ఎప్పట్లాగే ఫిజిక్స్లో కొన్ని ప్రశ్నలు కఠినంగా ఇచ్చినట్లు వెల్లడించారు. అడ్వాన్స్డ్కు ఎందరు? ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అనుమతించే విద్యార్థుల సంఖ్య విషయంలో గందరగోళం నెలకొంది. మే 22న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను నిర్వహించనున్న గౌహతి ఐఐటీ.. జేఈఈ మెయిన్లో అర్హత సాధించిన టాప్ 2 లక్షల మందిని అడ్వాన్స్డ్ రాసేందుకు అనుమతిస్తామని తెలిపింది. జేఈఈ మెయిన్ నిర్వహించిన సీబీఎస్ఈ మాత్రం తన బులెటిన్లో టాప్ 1.50 లక్షల మందినే అడ్వాన్స్డ్కు పరిగణనలోకి తీసుకుంటారని పేర్కొంది. అడ్వాన్స్డ్ నిర్వహించే ఐఐటీ గౌహతి... ఇన్ఫర్మేషన్ బులెటిన్లో 2 లక్షల మందిని పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించినందున ఆ సంఖ్యే ఫైనల్ అవుతుందని నిఫుణులు వెల్లడించారు. 27న జేఈఈ మెయిన్ ఫలితాలు... ఈ నెల 27న జేఈఈ మెయిన్ స్కోర్ను సీబీఎస్ఈ ప్రకటించనుంది. విద్యార్థులు ఈ నెల 29 నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ఐఐటీ గౌహతి చర్యలు చేపట్టింది. అడ్వాన్స్డ్లో భాగంగా మే 22న ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరుగనుంది. ఫలితాలను జూన్ 12న వెల్లడించి, జూన్ 20 నుంచి సీట్ల కేటాయింపును ప్రకటిస్తారు. మరోవైపు ఎన్ఐటీల్లో ప్రవేశాల కోసం జూన్ 30న లేదా అంతకంటే ముందే జేఈఈ మెయిన్ ఆలిండియా ర్యాంకులను సీబీఎస్ఈ ప్రకటించనుంది. ఈ ర్యాంకుల ఖరారులో జేఈఈ మెయిన్ స్కోర్కు 60 శాతం, ఇంటర్మీడియట్ మార్కులకు 40 శాతం వెయిటేజీ ఇస్తారు. వాటి ఆధారంగా ఎన్ఐటీల్లో ప్రవేశాలు చేపడతారు. జేఈఈలో ఫిజిక్స్ కఠినం జేఈఈ మెయిన్ పరీక్షలో ఈసారి ఫిజిక్స్ పేపర్ కొంత కఠినంగా ఉందని విద్యార్థులు పేర్కొంటున్నారు. అయితే గతంతో పోలిస్తే ఈసారి పరీక్ష మాత్రం సులభంగానే ఉందని జేఈఈ నిపుణులు చెబుతున్నారు. గతేడాదితో పోలిస్తే గణితం తేలి గ్గానే ఉంది. చాప్టర్లు-వెయిటేజీకి సంబంధించి దాదాపు విద్యార్థుల అంచనాల ప్రకారమే ప్రశ్నలు వచ్చాయి. 16 ప్రశ్నలు డెరైక్ట్గా రాగా, 10 ప్రశ్నలు మధ్యస్తంగా ఉన్నాయి. 4 ప్రశ్నలు మాత్రం క్యాలిక్యులేషన్ నిడివి పరంగా పెద్దగా ఉన్నాయి. గతేడాదితో పోల్చితే ఈసారి కటాఫ్ పెరిగే అవకాశముందని నిపుణలు అంచనా. పాఠ్యపుస్తకాల పరిధిలోనే ప్రశ్నలు.. గతేడాదితో పోలిస్తే కెమిస్ట్రీ ప్రశ్నలు కఠినంగా వచ్చాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఈ రకం ప్రశ్నలు ఎక్కువగా ఉన్నా, ఇంటర్మీడియెట్ పాఠ్యపుస్తకాల పరిధిలోనే ప్రశ్నలు వచ్చాయి. 80-85 మార్కులు తెచ్చుకుంటే గట్టెక్కొచ్చని నిపుణులు చెబుతున్నారు. గత మూడేళ్ల నుంచి క్రమేణా ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీకి వెయిటేజీ పెరుగుతూ వస్తోంది. దీంతో ఈ విభాగం ర్యాంకింగ్లో కీలకపాత్ర పోషిస్తోంది. ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి 8, ఆర్గానిక్ నుంచి 10, ఇన్ఆర్గానిక్ నుంచి 12 ప్రశ్నలు వచ్చాయి. కాగా, గణితం, రసాయనశాస్త్రంతో పోలిస్తే ఫిజిక్స్ కాస్త కఠినంగానే ఉంది. కానీ గతేడాది ఫిజిక్స్ ప్రశ్నలతో పోలిస్తే ఈసారి కాస్త తేలిగ్గానే ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. పది ప్రశ్నలు ఎంసెట్ స్థాయిలోనే వచ్చాయి. సగటు విద్యార్థి 70 మార్కుల వరకు స్కోర్ చేసే వీలుంది. మెరిట్ విద్యార్థి 100కు పైగా స్కోర్ చేయగలిగేలా ప్రశ్నపత్రం ఉన్నట్లు వెల్లడించారు. అయితే ఇందులో రెండు ప్రశ్నలు గందరగోళంగా ఉన్నందున చాలా మంది విద్యార్థుల రాయలేదు. ఒకటి కంటే ఎక్కువ సరైన సమాధానాలు ఉన్నవి మరో రెండు ప్రశ్నలు ఇచ్చారు. ఏపీలోనూ ప్రశాంతంగా జేఈఈ మెయిన్స్ సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిర్వహించినజాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ) మెయిన్స్-2016 పరీక్ష ఆదివారం ఆంధ్రప్రదేశ్లో ప్రశాంతంగా ముగిసింది. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. అభ్యర్థులను రెండు గంటల ముందుగానే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. ఈసారి అభ్యర్థుల మార్కుల స్కోరింగ్ బాగా పెరుగుతుందని, ఫలితంగా గతేడాది జేఈఈ అడ్వాన్సుకు 105గా ఉన్న కటాఫ్ మార్కులు కూడా పెరగనున్నాయని చెబుతున్నారు. -
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
హైదరాబాద్: ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలకు జేఈఈ మెయిన్ పరీక్షను ఈ నెల 3న నిర్వహించేందుకు సెంట్రల్ బోర్ట్ ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆదివారం ఉదయం 9:30 గంటలకు ప్రారంభమయ్యే పేపర్-1 (బీఈ/బీటెక్) పరీక్షకు, మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే పేపర్-2 (బీ ఆర్క్/ బీ ప్లానింగ్) పరీక్షకు విద్యార్థులు నిమిషం లేటైనా అనుమతించేది లేదని సీబీఎస్ఈ వెల్లడించింది. పరీక్షలను వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ కేంద్రాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని, 59,731 మంది విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపింది. పేపర్-1 పరీక్షకు విద్యార్థులను ఉదయం 7 గంటల నుంచి, పేపర్-2 పరీక్షకు మధ్యాహ్నం 1:00 గంట నుంచి హాల్లోకి అనుమతిస్తామని వెల్లడించింది. విద్యార్థులకు అవసరమైన పెన్నులు, పెన్సిళ్లు పరీక్షా హాల్లోనే అందజేస్తారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. -
జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల
* ఒకరోజు ముందుగానే విడుదల చేసిన సీబీఎస్ఈ * అత్యధికంగా 355 మార్కుల వరకు సాధించిన రాష్ట్ర విద్యార్థులు! సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఎన్ఐటీ వంటి జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ పరీక్ష ఫలితాలను శుక్రవారం రాత్రి 11 గంటల తరువాత సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) విడుదల చేసింది. ఈనెల 3వ తేదీన ఈ పరీక్ష ఫలితాలను విడుదల చేస్తామని పేర్కొన్న సీబీఎస్ఈ.. ఒక రోజు ముందుగానే విడుదల చేసింది. రాష్ట్రం నుంచి పరీక్షకు హాజరైన విద్యార్థుల్లో కొందరు 360 గరిష్ట మార్కులకు గాను అత్యధికంగా 355 మార్కుల వరకు సాధించినట్లు శుక్రవారం అర్ధరాత్రి వరకు అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది. రాష్ట్రంలోని హైదరాబాద్, గుంటూరు, ఖమ్మం, తిరుపతి, వరంగల్ కేంద్రాల్లో ఏప్రిల్ 6న ఆఫ్లైన్లో ఈ పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు 1,22,863 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 1,07,046 మంది విద్యార్థులు హాజరయ్యారు. అలాగే ఏప్రిల్ 9, 11, 12, 19 తేదీల్లో ఆన్లైన్లో రాష్ట్రంలోని అనంతపురం, బాపట్ల, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గూడూరు, గుంటూరు, హైదరాబాద్, కడప, కాకినాడ, కరీంనగర్, ఖమ్మం, కర్నూలు, మహబూబ్నగర్, నల్లగొండ, నరసరావుపేట, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, వరంగల్ పట్టణాల్లో పరీక్షలను నిర్వహించారు. జేఈఈ మెయిన్లో విద్యార్థులు సాధించిన మార్కులను 60 శాతంగా పరిగణనలోకి తీసుకొని వివిధ రాష్ట్రాల ఇంటర్మీడియట్ బోర్డులు నిర్వహించే ఇంటర్మీడియట్ మార్కుల్లో 40 పర్సంటైల్ను పరిగణనలోకి తీసుకొని తుది ర్యాంకులను సీబీఎస్ఈ విడుదల చేయనుంది. ఈ జాతీయ స్థాయి ర్యాంకులను జూలై 7న ప్రకటిస్తామని సంస్థ గతంలోనే ప్రకటించింది. వాటి ఆధారంగా జేఈఈ అడ్వాన్స్డ్కు విద్యార్థులను ఎంపిక చేయనుంది.