సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ చంద్రన్న వర్గానికి చెందిన సాయుధ నక్సల్స్ ఓ రైతును కొట్టి చంపిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం నర్సంపేటలో బుధవారం జరిగింది.
ఆ సమయంలో 20 మంది సాయుధులు వచ్చి భాస్కర్రావును పట్టుకున్నారు. సమీపంలోని జామాయిల్ తోటలోకి భాస్కర్రావును ఈడ్చు కుంటూ తీసుకెళ్లి ఛాతీపై తీవ్రంగా కొట్టారు. అడ్డుకోబోయిన ఇద్దరు గ్రామస్తులను సైతం చితకబాదారు. ఛాతీ భాగంలో దెబ్బలు తగిలి భాస్కర్రావు మృతిచెందాడు.