ఉప్పల్ నుంచి రామాంతపూర్ వైపు బైక్ మీద వెళ్తున్న యువకుడిని ఓ లారీ ఢీకొంది.
హైదరాబాద్ సిటీ: ఉప్పల్ నుంచి రామాంతపూర్ వైపు బైక్ మీద వెళ్తున్న యువకుడిని ఓ లారీ ఢీకొంది. ఈ ఘటనలో నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన సమీర్(22) అనేయువకుడు అక్కడిక్కడే మృతిచెందాడు. కొన్ని రోజుల్లో విదేశాలకు వెళ్లాల్సి ఉండగా ఇంతలోనే ఈ ఘోరం జరిగిందని బంధువలు శోకసంద్రం అయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.