'కృష్ణా, గోదావరి నీటిలో అధిక వాటానే మా లక్ష్యం' | our aim is main share of krishna and godavari waters, says harish rao | Sakshi
Sakshi News home page

'కృష్ణా, గోదావరి నీటిలో అధిక వాటానే మా లక్ష్యం'

Published Sat, Jun 28 2014 6:59 PM | Last Updated on Sat, Sep 2 2017 9:31 AM

'కృష్ణా, గోదావరి నీటిలో అధిక వాటానే మా లక్ష్యం'

'కృష్ణా, గోదావరి నీటిలో అధిక వాటానే మా లక్ష్యం'

హైదరాబాద్:కృష్ణా, గోదావరి నీటిలో అధికవాటా సాధించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. ఆ జలాలకు సంబంధించి అధిక వాటా సాధించిన అనంతరం ప్రాజెక్టుల నిర్మాణం చేపడతామని ఆయన తెలిపారు. శనివారం ' సాక్షి' తో మాట్లాడిన హరీష్ రావు.. ప్రస్తుతం ఇరు రాష్ట్రాల మధ్య నదీ జలాల వాటా తేలాల్సి ఉందన్నారు. నదీ జలాల వాటాపై సాధ్యమైనంత త్వరలో పరిష్కారం దొరికే అవకాశం ఉందన్నారు. ఆ తరువాతే ప్రాజెక్టులపై ఆలోచిస్తామన్నారు. హైదరాబాద్‌లో కాకుండా ప్రాజెక్టుల వద్దే సమీక్షలు నిర్వహిస్తామన్నారు. తమ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతీ హామీకి కట్టుబడే ఉందని హరీష్ రావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement