'మెడికల్ సీట్లు విచ్చలవిడిగా అమ్ముకుంటున్నారు' | Ponguleti Sudhakar Reddy takes on trs govt | Sakshi
Sakshi News home page

'మెడికల్ సీట్లు విచ్చలవిడిగా అమ్ముకుంటున్నారు'

Published Tue, May 26 2015 2:14 PM | Last Updated on Tue, Oct 9 2018 6:57 PM

'మెడికల్ సీట్లు విచ్చలవిడిగా అమ్ముకుంటున్నారు' - Sakshi

'మెడికల్ సీట్లు విచ్చలవిడిగా అమ్ముకుంటున్నారు'

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ కాలేజీ సీట్లను విచ్చలవిడిగా అమ్ముకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్లో పొంగులేటి సుధాకర్రెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.... ఈ వ్యవహారంపై టీఆర్ఎస్ సర్కార్ చోద్యం చూస్తోందని విమర్శించారు. మెడికల్ బి కేటగిరి సీట్లకు ప్రత్యేక ప్రవేశ పరీక్ష ఉందని సదరు శాఖ మంత్రికి తెలియకపోవడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు.

సీట్ల అమ్మకంపై తెరవెనుక ఏదో బాగోతం జరుగుతుందన్నారు. టీఆర్ఎస్ పెద్దలు ఈ వ్యవహారంలో కుమ్మక్కాయారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఎంబీబీఎస్ అడ్మిషన్లపై నియంత్రణ ఉండాలని... ప్రభుత్వమే ప్రవేశ పరీక్ష నిర్వహించాలని పొంగులేటి సుధాకర్రెడ్డి కేసీఆర్ సర్కార్ను డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement