నష్టపోయిన రైతులను ఆదుకోండి: బాబు | Providing subsidized seeds to farmers in karif | Sakshi

నష్టపోయిన రైతులను ఆదుకోండి: బాబు

May 12 2014 1:58 AM | Updated on Aug 21 2018 11:41 AM

నష్టపోయిన రైతులను ఆదుకోండి: బాబు - Sakshi

నష్టపోయిన రైతులను ఆదుకోండి: బాబు

రాష్ట్రంలో మూడు రోజులుగా కురిసిన అకాల వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మూడు రోజులుగా కురిసిన అకాల వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన గవర్నర్ నరసింహన్‌కు లేఖ రాశారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని రంగంలోకి దింపి పంట నష్టానికి సంబంధించిన నివేదికలను యుద్ధప్రాతిపదికన తయారు చేయించాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే ఖరీఫ్‌లో రైతులకు సబ్సిడీపై విత్తనాలను అందజేయాలని.. వర్షాల కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం అందించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement