
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణలో బుధవారం అక్కడక్కడ ఉరుములతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఆ తర్వాత మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.
ఇదిలావుండగా గత 24 గంటల్లో బూర్గుంపాడు, పినపాక, నల్లగొండల్లో 7 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మహబూబాబాద్, మిర్యాలగూడ, ముల్కలపల్లి, బయ్యారం, ఖమ్మం పట్టణం, గోవిందరావుపేట, హయత్నగర్లలో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డు అయింది.