హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా శామీర్పేటలోని ఓ రిసార్ట్పై పోలీసులు శుక్రవారం దాడి చేశారు. ఈ సందర్భంగా రూ.24 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. మెదక్ ఉప ఎన్నికల్లో ఈ డబ్బును పంచేందుకు దాచినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై సమాచారం అందటంతో పోలీసులు రిసార్ట్ పై దాడి చేసి నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు ఓ రాజకీయ నేతకు సంబంధించిందిగా పోలీసులు భావిస్తున్నారు.
శామీర్పేట్ రిసార్ట్లో పోలీసుల తనిఖీలు
Published Fri, Sep 12 2014 11:35 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement