
సాక్షి, కామారెడ్డి : మహాకూటమి ప్రచారం సునామీలో టీఆర్ఎస్ పార్టీ కొట్టుకుపోతుందని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ విమర్శించారు. శనివారం ఆయన కామారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. డిసెంబర్ 7న ఎలక్షన్స్ ఖరారు చేసిన ఎలక్షన్ కమిషన్కు ఆయన అభినందనలు తెలియజేశారు. ఎలక్షన్స్ని తాము స్వాగతిస్తున్నామని అన్నారు. ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్దంగా ఉందని తెలిపారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment