డీఎస్పీకి మెసేజ్ పెట్టి...ఎలుకల మందు తాగాడు | student attempt suiside in karimnagar | Sakshi
Sakshi News home page

డీఎస్పీకి మెసేజ్ పెట్టి...ఎలుకల మందు తాగాడు

Published Wed, Feb 11 2015 4:29 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

డీఎస్పీకి మెసేజ్ పెట్టి...ఎలుకల మందు తాగాడు - Sakshi

డీఎస్పీకి మెసేజ్ పెట్టి...ఎలుకల మందు తాగాడు

గోదావరిఖని: ప్రేమ వ్యవహారంలో తనకు న్యాయం చేయలేదంటూ ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చనిపోతున్నానంటూ డీఎస్పీకి ఫోన్లో మెసేజ్ పెట్టి మరీ ఎలుకల మందు తాగాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గోదావరిఖని పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... గోదావరిఖనికి చెందిన ఎంసీఏ విద్యార్థి మేడిమెళ్ల ప్రసాద్ ఓ యువతిని గత కొంతకాలంగా  ప్రేమిస్తున్నాడు. ఆ విషయం సదరు విద్యార్థి తల్లిదండ్రులకు తెలిసింది.

దీంతో ఆమెను కాలేజీ మానిపించి ఇంట్లో నుంచి బయటకు రానీయకుండా కట్టడి చేశారు. తన ప్రియురాలను గృహ నిర్బంధం చేశారని ప్రేమికుడు ప్రసాద్ గతంలో పోలీసులను ఆశ్రయించాడు. ఈ విషయంపై పోలీసులు సరిగ్గా స్పందించలేదని, తనకు న్యాయం జరగలేదని, ఆత్మహత్య చేసుకుంటున్నానని డీఎస్పీకి ఎస్‌ఎంఎస్ చేశాడు. దాంతో పోలీసులు వెంటనే స్పందించి... ప్రసాద్ నివాసానికి చేరుకుని... అతడిని ప్రభుత్వ  ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement