కళాశాలకు వెళ్లిన విద్యార్థిని అదృశ్యమైన సంఘటన ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
నాగోలు (హైదరాబాద్) : కళాశాలకు వెళ్లిన విద్యార్థిని అదృశ్యమైన సంఘటన ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... ఎల్బీనగర్లోని అల్తాఫ్నగర్కు చెందిన కె.నిఖిల (20) విద్యార్థిని. ఈ నెల 13న కళాశాలకు వెళ్తున్నానని ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆచూకీ కోసం స్నేహితులు, బంధువుల వద్ద వెతికినా ప్రయోజనం లేకపోవడంతో గురువారం ఎల్బీనగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.