nagole
-
రహదారిపై రక్తచరిత్ర
నాగోలు: అది కొత్తపేట– నాగోలు రహదారి.. శుక్రవారం సాయంత్రం.. వాహనాల రొద ఒకవైపు.. జన సంచారం మరో వైపు.. ఇదే సమయంలో అక్కడ వేట కొడవళ్లు విరుచుకుపడ్డాయి. సినీ ఫక్కీలో ఓ గుంపు దారుణంగా దాడికి పాల్పడింది. బాధితుల రోదనలు, రక్తపు మరకలతో ఆ ప్రాంతమంతా భయాందోళనతో గజగజ వణికిపోయింది. పాత కక్షలతో.. ఒకరిపై గురి పెట్టి వచ్చిన.. తమకు సంబంధం లేని ఇద్దరు యువకులపై వేట కొడవళ్లతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. చైతన్యపురి పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. ఎల్బీనగర్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్కు చెందిన పురుషోత్తం అనే వ్యక్తి రెండేళ్ల క్రితం హయత్నగర్లో జరిగిన పెళ్లి ఊరేగింపు ఏర్పడిన వివాదం నేపథ్యంలో తన స్నేహితుడైన తట్టిఅన్నారంనకు చెందిన బోడ్డు మహేష్ పై బీరు బాటిల్తో దాడి చేశాడు. ఈ ఘటనలో తలకు గాయాలైన మహేష్ హయత్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు కోర్టులో నడుస్తోంది. అయితే.. ఆ తర్వాత వీరిద్దరూ రాజీ కోసం మాట్లాడుకున్నారు. పురుషోత్తం వద్ద మహేష్ కొన్ని డబ్బులు కూడా తీసుకున్నాడు. శుక్రవారం కేసు విషయమై మహేష్ కోర్టుకు రావాల్సి ఉంది. కానీ తాను సూర్యాపేటలో ఉన్నానంటూ కోర్టు కానిస్టేబుల్కు చెప్పి పురుషోత్తం హత్యకు పథక రచన చేశాడు. నాగోలు వెళ్లే రోడ్డులోని అమరావతి వైన్స్ వద్ద పురుషోత్తం ఉన్నాడనే పక్కా సమాచారంతో మహేష్ తన స్నేహితులైన బెల్లి భరత్, దాసరి సురేందర్ అలియాస్ సూరి తదితరులు కారు, బైక్లపై వచ్చారు. పురుషోత్తంపై వేట కొడవలితో దాడి చేయబోగా అతను తప్పించుకున్నాడు. దీంతో పురుషోత్తం స్నేహితులైన సికింద్రాబాద్ తుకారాం గేట్కు చెందిన గడ్డమోయిన రాము, నాగోలు తట్టిఅన్నారంనకు చెందిన పాశం నాగరాజులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రాణాలను కాపాడుకునేందుకు సమీపంలోని ఓ బ్యాంకులో తలదాచుకున్న రాముపై వేట కొడవళ్లతో దాడి చేయడంతో ఆ ప్రాంతమంతా రక్తం మడుగును తలపించింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్, అడిషనల్ డీసీపీ కోటేశ్వరరావు చైతన్య పురి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరావుతో వివరాలు సేకరించారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చైతన్యపురి పోలీసులు తెలిపారు. హిట్ అండ్ రన్.. బీటెక్ విద్యార్థి దుర్మరణం -
ప్రియురాలి తండ్రిపై ప్రేమికుడి కాల్పులు
నాగోల్: ప్రేమించిన యువతిని తనకు దూరం చేశారన్న కో పంతో అమ్మాయి తండ్రిపై ఓ యువకుడు కాల్పలకు తెగబడ్డా డు. ఈ దాడిలో అమ్మాయి తండ్రి కన్ను కోల్పోయాడు. ఈ ఘటన హైదరాబాద్లోని సరూర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. సరూర్నగర్ వెంకటేశ్వర కాలనీ రోడ్డు నెంబర్ 14లోని మల్లికారాణి అపార్ట్మెంట్లో పెరిశెట్టి రేణుక ఆనంద్ (57) నివాసం ఉంటున్నారు.ఆయనకు ఇద్దరు సంతానం. చిన్న కుమార్తె పాఠశాలల్లో చదివే సమయంలో తన క్లాస్మేట్ ఆయన గోగికర్ బల్వీర్తో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి బల్వీర్ ఆమెను ప్రేమిస్తున్నానని వేధించేవాడు. ఆ యువతి దుండిగల్లోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో చేరటంతో బల్వీర్ కూడా అక్కడే చేరాడు. అక్కడ కొంతకాలం వారు కలిసిమెలిసి తిరిగారు. ఈ విషయం ఇంట్లో తెలిసిన యువతి తండ్రి ఆనంద్ తన కూతురిని ఇబ్బందులకు గురిచేయవద్దని బల్వీర్ను హెచ్చరించాడు.పగ పెంచుకొని పక్కా ప్లాన్తో కాల్పులుఆరు నెలల క్రితం బల్వీర్ తన స్నేహితుడు గోపికి ఫోన్ చేసి తన ప్రేమకు అడ్డు వస్తున్న ఆనంద్ను చంపేస్తానని బెదిరించాడు. కొద్దిరోజుల క్రితం ఆనంద్ ఇంటివద్దకే వచ్చిన బల్వీర్.. ‘నీ కూతుర్ని ప్రేమిస్తున్నాను’అని గొడవ చేసి ‘ఎన్ని రోజులున్నా నిన్ను చంపేస్తా అని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం బల్వీర్ తల్లిదండ్రులను పిలిపించిన ఆనందర్.. వారి సమక్షంలో బల్వీర్కు కౌన్సిలింగ్ ఇచ్చి పింపించారు. ఆనంద్ తన కూతురిని ఇటీవలే అమెరికాకు పంపించాడు.దీంతో పగ పెంచుకొన్న బల్వీర్ ఆనంద్ను హత్య చేయాలని పథకం వేశాడు. షూటింగ్ ప్రాక్టీస్ కోసం తెచ్చుకొన్న ఎయిర్గన్, షార్ట్ గన్తో ఆదివారం మధ్యాహ్నం ఆనంద్ ఇంటికి వచ్చి ఆయనతో గొడవ పడ్డాడు. వెంటనే ఎయిర్గన్తో లీగల్ పోలీస్, లీగల్ పోలీస్ అని గట్టిగా అరుస్తూ కాల్పులు జరిపాడు. బుల్లెట్ ఆనంద్ కుడికన్నుపై తగిలి తీవ్ర గాయమైంది.వెంటనే అక్కడ నుంచి వెళ్లిపోయిన బల్వీర్.. పక్కనే ఉన్న అంబితా శ్రీనిలయం అపార్ట్మెంట్లో ఉన్న ఆనంద్ కారును ధ్వంసం చేసి తన బైక్పై పారిపోయాడు. గాయపడిన ఆనంద్ను స్థానికులు ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖానకు తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి బల్వీర్ను అరెస్టు చేసినట్లు సరూర్నగర్ సీఐ సైదిరెడ్డి తెలిపారు. నిందితుడి నుంచి ఎయిర్గన్, షార్ట్గన్ (పిస్టల్), బైక్, సెల్ఫోన్ స్వా«దీనం చేసుకొన్నట్లు వెల్లడించారు. -
మెట్రో రెండో దశ పనులకు గ్రీన్సిగ్నల్.. కారిడార్-9లో ఎయిర్పోర్టు-ఫోర్త్ సిటీ
సాక్షి, హైదరాబాద్: మెట్రో రెండో దశ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రెండో దశ పనుల్లో భాగంగా ఐదు మార్గాల్లో పనులు జరుగనున్నాయి. మొత్తం ఐదు మార్గాల్లో మెట్రో నిర్మాణం కానుంది. ఆరు కారిడార్లలో 116.4 కిలో మీటర్ల మేర కొత్త మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు. ఇందులో భాగంగా రెండో దశ నిర్మాణానికి రూ.24,269 కోట్ల అంచనాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మెట్రో నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.7,333కోట్లు. కేంద్రం వాటాగా రూ.4,230 కోట్లుగా ఉండనుంది.హైదరాబాద్లో మెట్రో రెండో దశ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కొత్త మార్గాల పనులకు పరిపాలన అనుమతిని ప్రభుత్వం ఇచ్చింది. ఈ క్రమంలోనే రెండో దశ నిర్మాణానికి రూ.24,269 కోట్ల అంచనాలకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. కారిడార్లలో 76.4 కిలోమీటర్ల మేర మెట్రో రెండో దశ పనులు జరుగనున్నాయి. ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వ వాటాగా(30 శాతం) రూ.7,333కోట్లు. కేంద్రం వాటాగా(18 శాతం) రూ.4,230 కోట్లు కేటాయింపులు చేసింది. అలాగే, అప్పుగా రూ.11,693 కోట్లు, ప్రైవేటు సంస్థల నుంచి రూ.1,033 కోట్లు(52 శాతం నిధులు) సేకరించనున్నారు.కారిడార్లు ఇలా.. కారిడార్-4లో నాగోల్-శంషాబాద్(36.8 కి.మీ)కారిడార్-5లో రాయదుర్గం-కోకాపేట. కారిడార్-6లో ఎంజీబీఎస్-చాంద్రాయాణగుట్ట. కారిడార్-7లోమియాపూర్-పటాన్చెరు, కారిడార్-8లో ఎల్బీనగర్-హయత్నగర్. కారిడార్-9లో ఎయిర్పోర్టు-ఫోర్త్ సిటీ.(40 కిలోమీటర్లు). -
హృదయ విదారకం: కుమారుడి మృతదేహం పక్కనే మూడురోజులుగా..!
సాక్షి,నాగోలు : హైదరాబాద్లోని నాగోలులో పోలీసులను కంటతడి పెట్టించే హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. మూడు రోజుల క్రితం కుమారుడు చనిపోయినా అంధ వృద్ధ తల్లిదండ్రులు గుర్తించకపోవడం కలచి వేస్తుంది. నాగోలు పోలీసుల కథనం ప్రకారం.. నాగోలులో అంధుల కాలనీలో కలువ రమణ, శాంతికుమారి దంపతులు నివసిస్తున్నారు. వారి చిన్న కుమారుడు ప్రమోద్(32) పెయింటింగ్ పనిచేస్తుంటాడు. మూడు రోజుల క్రితం ప్రమోద్ మద్యం మత్తులో మరణించారు.అయితే కుమారుడు మరణించిన విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించ లేకపోయారు. ఓ వైపు ఆకలి.. మరోవైపు కుమారుడు చనిపోయిన విషయాన్ని గుర్తించ లేక మూడు రోజుల పాటు ఏం చేయాలో పాలుపోక అలాగే ఉండిపోయారు. మూడు రోజుల త్వరాత ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు నాగోలు పోలీసులకు సమాచారం అందించారు.స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న నాగోలు సీఐ సూర్యనాయక్, ఎస్ఐ శివనాగప్రసాద్లు మానవత్వం చాటుకున్నారు. ఇంట్లో కుళ్లిన స్థితిలో మృతదేహం ఉండగా.. మంచంపై తల్లిని, కొద్ది దూరంలో తండ్రిని గుర్తించి కన్నీటి పర్యంతమయ్యారు. ఇంట్లో ఉన్న దంపతుల్ని మాట్లాడించే ప్రయత్నం చేసినా ఆహారం తీసుకోకపోవడంతో ఇద్దరూ మాట్లాడలేకపోతున్నారు. వెంటనే వాళ్లిద్దరిని ఇంట్లో నుంచి బయటకు తీసుకువచ్చారు. దంపతులకు స్నానం చేయించారు. ఆహారం,మంచినీళ్లు అందించారు.అనంతరం, వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. -
ఫ్రీ పార్కింగ్ కోసం ధర్నా
-
నాగోలులో లిఫ్ట్ ప్రమాదం.. 8 మందికి తీవ్ర గాయాలు
హైదరాబాద్, సాక్షి: నాగోల్లోని ఓ ప్రముఖ హోటల్లో లిఫ్ట్ ప్రమాదం చోటు చేసుకుంది. కిన్నెర గ్రాండ్ హోటల్లో నాలుగో అంతస్తు నుంచి లిఫ్ట్ ఒక్కసారిగా కిందపడిపోయింది. ప్రమాద సమయంలో లిఫ్ట్లో ఎంత మంది ఉన్నారన్నది తెలియరాలేదు. అయితే ఎనిమిది మందికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. గాయపడ్డ వాళ్లను ఎల్బీ నగర్ కామినేని ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. బాధితులు హోటల్లో జరిగిన ఎంగేజ్మెంట్ పంక్షన్కి వచ్చినట్లు తెలుస్తోంది. -
నాగోల్: నడిరోడ్డుపై మద్యం సేవిస్తూ, సిగరెట్ తాగుతూ యువతి హల్చల్
సాక్షి, హైదరాబాద్: మద్యం మత్తులో యువత చేసే వీరంగం ఎక్కువైపోతుంది. పగలు రాత్రి తేడా లేకుండా బహిరంగ ప్రదేశాల్లో మితిమీరి ప్రవర్తిస్తున్నారు. రోడ్డుపైనే మద్యం సేవిస్తూ, ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. తాజాగా హైదరాబాద్లోని నాగోల్లో ఓ యువతి మద్యం మద్యం మత్తులో హల్చల్ చేసింది. నాగోల్ డివిజన్లోని ఫతుల్లాగూడ సమీపంలో శుక్రవారం ఉదయమే ఓ యువతి, యువకుడు కారులో వచ్చి నడిరోడ్డుపై మద్యం సేవిస్తూ కనిపించారు.రోడ్డుపై మద్యం సేవిస్తూ, సిగరెట్ తాగుతూ అక్కడికి వచ్చే వాకర్స్కు ఇబ్బంది కలిగించారు. బహిరంగ ప్రదేశాల్లో ఇలా చేయడం సరికాదని కొంతమంది చెప్పగా.. వారిపై జంట ఎదురుతిరిగింది. మార్నింగ్ వాకర్స్పై బూతులతో రెచ్చిపోయారు. పోలీసులకు ఫోన్ చేసేందుకు కొందరు ప్రయత్నించగా.. అడ్డుకుని దుర్భాషలాడారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకునేలోపే యువతి, యువకుడు అక్కడి నుంచి ఉడాయించారు. ఈ తతంగాన్ని కొందరు ఫోన్లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్గా మారింది.పొద్దున్నే నడిరోడ్డుపై బీర్ తాగుతూ అడిగిన వారితో గొడవ పెట్టుకున్న యువతీ యువకుడుమద్యం మత్తులో మార్నింగ్ వాకర్స్ను బూతులు తిట్టిన యువతిహైదరాబాద్ - నాగోల్లో ఈరోజు తెల్లవారుజామున ఒక యువతి, యువకుడు మద్యం సేవించి, సిగరెట్ తాగుతూ ప్రశ్నించిన మార్నింగ్ వాకర్స్పై బూతులతో… pic.twitter.com/DY6d2hI7Vq— Telugu Scribe (@TeluguScribe) May 24, 2024 -
Hyd Viral: మండదా అన్నా.. మండదా అక్కా!
నాగోలు: అక్కడ రోడ్డు గుంతలమయంగా మారింది. నిత్యం వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నా అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవం లేదు. ఇదే రూట్లో ఓ మహిళ రెండుసార్లు యాక్సిడెంట్కు గురైంది. అంతే.. ఆమెకు మండింది. బురద గుంతలో కూర్చుని వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేసింది. సమస్యకు పరిష్కారం చూపాలని ప్లకార్డులు ప్రదర్శించింది. ఇంకేం.. అటుగా పోయేవాళ్లు స్మార్ట్ఫోన్లతో అదంతా ఫొటోలు, వీడియోలు తీయడంతో ఆమె వైరల్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. హయత్నగర్ పరిధిలోని న్యూ జీవీఆర్ కాలనీకి చెందిన నిహారిక ప్రైవేట్ ఉద్యోగి. అమె ఇద్దరు పిల్లలు బండ్లగూడ పరిధిలోని ఓ పాఠశాలలో చదువుకుంటున్నారు. ప్రతి రోజూ ఆమె వారిని బైక్పై పాఠశాలకు తీసుకెళ్తుంది. నాగోలు బండ్లగూడ రేడియల్ రోడ్డు కొంతకాలంగా గుంతలమయంగా మారడంతో ద్విచక్ర వాహనదారులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. నిహారిక కూడా గతంలో ఇదే రోడ్డుపై అదుపుతప్పి కింద పడింది. దీంతో రేడియల్ రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని కోరుతూ జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మితో పాటు సంబంధిత అధికారులకు సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ ద్వారా విజ్ఞప్తి చేసింది. అయినా ఎవరూ పట్టించుకోలేదు. ఇదిలా ఉండగా గురువారం ఆమె స్యూటీపై నాగోలు వైపు వెళ్తుండగా బైక్ అదుపు తప్పి పిల్లలతో సహా కింద పడింది. స్వల్ప గాయాలు కావడంతో పిల్లలను ఇంటి వద్ద వదిలి ఘటనా స్థలానికి తిరిగి వచ్చి ఆమె రోడ్ల దుస్థితిపై ఏడాదిగా మేయర్, అధికారులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని ఆరోపిస్తూ బురదలో కూర్చుని నిరసన వ్యక్తం చేసింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు అమె నచ్చజెప్పే ప్రయత్నం చేయగా, జీహెచ్ఎంసీ అధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇవ్వాలని అప్పటి వరకు ఆందోళన విరమించేది లేదని తెలిపింది. నాగోలు కార్పొరేటర్ భర్త చింతల సురేందర్ యాదవ్, నాగోలు పోలీసులు అక్కడికి వచ్చి రోడ్ల మరమ్మతుకు నిధులు మంజారుయ్యాయని ఎన్నికల కోడ్ కారణంగా పనులు చేపట్టలేదని తెలిపారు. జీహెచ్ఎంసీ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించగా, ఎన్నికల కోడ్ ఎత్తివేయగానే మరమ్మతు పనులు చేపడతామని హామీ ఇచ్చారు. ముందుస్తుగా గుంతలను మట్టితో పూడ్చి ప్రమాదాలు జరగకుండా చూస్తామని చెప్పడంతో నిహారిక నిరసన విరమించింది. కోడ్ ముగియగానే పనులు చేపడతాం నాగోలు–ఆనంద్నగర్ రోడ్డు మరమ్మతుల కోసం రూ. 4 కోట్లు నిధులు మంజురయ్యాయి. పార్లమెంట్ ఎన్నికల కోడ్ కారణంగా పనులు చేపట్టలేదు. ఎన్నికల కోడ్ ముగియగానే పనులు చేపడతాం. :::డాక్టర్ తిప్పర్తి యాదయ్య, హయత్నగర్ సర్కిల్ డీసీ -
నాగోల్లో 2 మెట్రో స్టేషన్లు
సాక్షి, హైదరాబాద్: నాగోల్లో కొత్తగా ఎయిర్పోర్టు మెట్రో స్టేషన్ను నిర్మించనున్నారు. ఇప్పుడున్న స్టేషన్కు సమీపంలో ఎడమవైపున (ఎల్బీ నగర్ వైపు) ఉంటుంది. ఈ రెండు స్టేషన్ల మధ్య ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు విశాలమైన స్కైవాక్ను నిర్మిస్తారు. రాయదుర్గం, అమీర్పేట కారిడార్లో నాగోల్కు చేరుకున్న ప్రయాణికులు అక్కడి నుంచి ఎయిర్పోర్టుకు వెళ్లేందుకు ఈ స్కైవాక్ మార్గంలో కొత్తగా నిర్మించే నాగోల్ ఎయిర్పోర్ట్ మెట్రో స్టేషన్కు చేరుకుంటారు. అక్కడి నుంచి ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట మీదుగా ఎయిర్పోర్టు వరకు కొత్త కారిడార్ నిర్మాణం జరగనుంది. ఎయిర్పోర్టు మెట్రో రెండో దశలో భాగంగా ప్రభుత్వం ప్రతిపాదించిన నాగోల్ –శంషాబాద్ ఎయిర్పోర్టు కారిడార్ మార్గంలో హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్విఎస్ రెడ్డి పర్యటించారు. నాగోల్ నుంచి చాంద్రాయణగుట్ట జంక్షన్ వరకు 14 కిలోమీటర్ల దూరం ఆయన ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ సంస్థ అయిన సిస్టా ఇంజనీరింగ్, సాంకేతిక నిపుణుల బృందంతో కలిసి కాలినడకన వెళ్లి పరిశీలించారు. ఈ అలైన్మెంట్లో నిర్మించనున్న మెట్రోస్టేషన్లు, అలైన్మెంట్పై అధికారులకు, ఇంజనీరింగ్ నిపుణులకు దిశానిర్దేశం చేశారు. అలైన్మెంట్ ఇలా...♦ నాగోల్ స్టేషన్ తర్వాత మూసీ నది బ్రిడ్జిని ఆనుకొని పెద్ద మంచినీటి పైపులు, భూగర్భ హైటెన్షన్ విద్యుత్ కేబుళ్లు ఉన్నాయి. దీంతో ఈ మార్గంలో మెట్రో అలైన్మెంట్ను మరో 10 మీటర్లు ఎడమ వైపునకు జరపనున్నారు. మూసీ ప్రక్షాళనకు ప్రణాళికలు రూపొందించిన దృష్ట్యా మూసీ నదిపై మెట్రో బ్రిడ్జిని పొడవైన స్పాన్లతో నిర్మించనున్నారు. ♦ మూసీ దాటిన తరువాత కొత్తపేట వైపున్న రోడ్డుకు కనెక్టివిటీని ఇస్తూ చుట్టుపక్కల ఉన్న కాలనీవాసులకు సదుపాయంగా ఉండేలా మరో స్టేషన్ను నిర్మించనున్నారు. నాగోల్ ఆర్టీఓ కార్యాలయం వద్ద అల్కాపురి జంక్షన్ (లక్కీ రెస్టారెంట్)కు సమీపంలో ఈ స్టేషన్ ఉంటుంది. ఇక్కడి నుంచి ప్రయాణికులు ఔటర్రింగ్రోడ్డుకు రాకపోకలు సాగించేలా కనెక్టివిటీ ఇవ్వనున్నారు. చాంద్రాయణగుట్ట ఇంటర్చేంజ్ స్టేషన్♦ చాంద్రాయణగుట్ట వద్ద విశాలమైన ఇంటర్చేంజ్ స్టేషన్ నిర్మించనున్నారు. ఈ రూట్ లో ఫ్లైఓవర్ నిర్మాణం దృష్ట్యా చాంద్రాయణగుట్ట వరకు చేపట్టనున్న పాతబస్తీ మెట్రో విస్తరణ పనులు, కొత్త టెర్మినల్ స్టేషన్ పనులు ఇంజనీరింగ్ సవాలుగా ఉంటుందని ఎన్విఎస్ రెడ్డి చెప్పారు. రెండు కారిడార్లను అనుసంధానిస్తూ నిర్మించనున్న ఈ ఇంటర్చేంజ్ స్టేషన్లో కాంకోర్స్, ప్లాట్ఫాంల ఎత్తును సరిచేయాల్సి ఉంటుందన్నారు.ఎల్బీనగర్లో మరో స్కైవాక్.. ♦ కామినేని ఆసుపత్రి వద్ద ఒక స్టేషన్ నిర్మించనున్నారు. ఆ తర్వాత ఎల్బీనగర్ జంక్షన్లో కొత్తగా ఎల్బీనగర్ ఎయిర్పోర్టు స్టేషన్ రానుంది. ఈ మార్గంలో అండర్పాస్తోపాటు, రెండు ఫ్లైఓవర్లతో మెట్రో కారిడార్ నిర్మాణంలో ఇంజనీరింగ్ సవాళ్లు ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. ♦ ఎల్బీనగర్ జంక్షన్కు కుడి వైపున కొత్తగా నిర్మించనున్న మెట్రోస్టేషన్ నుంచి ఎడమవైపున ఉన్న మరో స్టేషన్ (మియాపూర్–ఎల్బీనగర్ కారిడార్)కు మరో విశాలమైన స్కైవాక్తో అనుసంధానం చేయనున్నారు. మియాపూర్, అమీర్పేట మీదుగా ఎల్బీ నగర్కు వచ్చే ప్రయాణికులు ఇక్కడి నుంచి స్కైవాక్ మార్గంలో ఎల్బీనగర్ కొత్త ఎయిర్పోర్టు మెట్రో స్టేషన్కు చేరుకుంటారు. ♦ బైరామల్గూడ, సాగర్రింగ్ రోడ్డు కూడలిలో ఇప్పటికే ఎత్తయిన ఫ్లైఓవర్లు ఉన్నందున ఈ రూట్లో ఎయిర్పోర్ట్ మెట్రో లైన్ ఎత్తును మరింత పెంచాల్సి ఉంటుందని ఎన్విఎస్ రెడ్డి తెలిపారు. మరోవైపు ఈ జంక్షన్లో మెట్రో స్టేషన్ ఎత్తును తగ్గించడానికి, అలైన్మెంట్ను ఫ్లై ఓవర్లకు కుడి వైపునకు మార్చాల్సి ఉంటుందన్నారు. అలాగే పక్కనే ఉన్న బహిరంగ ప్రదేశంలో మెట్రో స్టేషన్ను నిర్మించనున్నారు. ♦ మైత్రీ నగర్, కర్మన్ఘాట్, చంపాపేట జంక్షన్, ఒవైసీ హాస్పిటల్, డీఆర్డీఓ, హఫీజ్ బాబానగర్ తదితర ప్రాంతాల్లో ప్రతిపాదించిన మెట్రో స్టేషన్లను చుట్టుపక్కల ఉన్న కాలనీలకు అందుబాటులో ఉండేలా కూడళ్లకు సమీపంలో నిర్మించనున్నారు. -
హైదరాబాద్ నాగోల్ పీఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదం
-
నాగోల్ లో ఘోర రోడ్డు ప్రమాదం
-
68 ప్రమాదాలు.. వందే భారత్ రైలు వైపు వెళ్లొద్దు! గేదెలకు విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనతో పాటు వందే భారత్ రైలు ప్రారంభోత్సవంపై టీఎస్ రెడ్కో చైర్మన్ వై. సతీష్ రెడ్డి వినూత్నంగా నిరసన తెలిపారు. వందే భారత్ రైలు ప్రారంభమయ్యాక ఇప్పటివరకు దాదాపు 68 ప్రమాదాలు జరిగాయని, గేదెలు, ఆవులను ఢీకొని వందే భారత్ రైళ్లు దెబ్బతిన్నాయని సతీష్రెడ్డి అన్నారు. నాగోలులో ఆయన మాట్లాడుతూ, మోదీ సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ రైలును ప్రారంభిస్తున్నారని, దయచేసి అటువైపు వెళ్లొద్దు.. మీరు పొరపాటున తాకినా రైలు దెబ్బతినే ప్రమాదం ఉంది. అసలే ఆ రైళ్లు చాలా వీక్గా ఉంటాయి’’ అని గేదెలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఒకే వందే భారత్ స్కీంను ప్రధానమంత్రి మోదీ ఎన్నిసార్లు ప్రారంభిస్తారని ప్రశ్నించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జగన్మోహన్రెడ్డి, సతీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: పట్టెడన్నం కోసం..ప్రాణాలే పణంగా!.. గత ఏడాదిలోనే 17 మంది మృతి -
Hyderabad: భార్యతో కలిసి విహారయాత్రకు వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి
సాక్షి, హైదరాబాద్: భార్యతో కలిసి విహార యాత్రకు వెళ్లి సముద్రంలో మునిగి నగరానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగోలు డివిజన్ బండ్లగూడ అజయ్నగర్లో నివాసం ఉండే రాముని రవీందర్ చిన్న కుమారుడు వంశీకృష్ణ (27) సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. మరో పక్క గ్రూప్–1 ఫలితాల్లో మెయిన్స్ అర్హత సాధించాడు. గతేడాది జూన్ 23న కర్మన్ఘాట్కు చెందిన యువతితో వివాహమైంది. ఈ నెల 13న భార్య, ఇతర బంధువులతో కలిసి మలేసియా, ఇండోనేషియాలకు విహారయాత్రకు వెళ్లారు. మొదట మలేసియా యాత్ర పూర్తయిన తరువాత ఇండోనేషియాలోని బాలికి వెళ్లారు. ఈ నెల 22న ఆదివారం వంశీకృష్ణ బాలిలో సముద్ర గర్భంలోని అక్వేరియం సందర్శించేందుకు ఒంటరిగా వెళ్లాడు. అతను సముద్రంలోకి వెళ్లే సమయంలో అక్కడి నిర్వాహకులు సూచించిన ప్రకారం కాళ్లకు చెప్పులు, ఆక్సిజన్ సిలిండర్ ధరించి వెళ్లాడు. కానీ వంశీకృష్ణ సముద్రంలోకి దిగి గల్లంతయ్యాడు. భార్య అతని రాకకోసం చాలాసేపు ఎదురు చూసినా పైకి రాలేదు. దీంతో సముద్రంలో గల్లంతైనట్లు భావించి అక్కడి నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడి పోలీసులు సముద్రంలో గాలించి వంశీకృష్ణ మృతదేహాన్ని బయటకు తీశారు. అతను అప్పటికే మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. నగరంలో ఉన్న కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో వారు మంగళవారం ఉదయం బాలికి బయలుదేరి వెళ్లారు. అక్కడ పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని శుక్రవారం నగరానికి తీసుకొచ్చే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. సముద్రంలో గల్లంతైన వంశీకృష్ణ నీటిలోకి వెళ్లాక భయపడడంతో గుండెపోటుతో మృతి చెందాడని అక్కడ పోలీసులు ప్రాథమిక సమాచారం ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వంశీకృష్ణ (ఫైల్) -
హైదరాబాద్ మెట్రో.. కేటీఆర్ కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: నగరంలో మెట్రో సేవలకు సంబంధించి మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. బిజీ రూట్గా పేరున్న ఎల్బీ నగర్ మార్గంలో హయత్ నగర్ వరకు రూట్ను పొడగింపు ఉంటుందని ప్రకటించారు. మంగళవారం నాగోల్-ఫిర్జాదిగూడ లింక్ రోడ్డు ప్రారంభ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హయత్ నగర్ వరకు మెట్రో పొడగింపు ఉండనుందని తెలిపారు. అంతేకాదు.. నాగోల్-ఎల్బీ నగర్ మెట్రో లైన్ను అనుసంధానం చేయనున్నట్లు ప్రకటించారు. వచ్చే ఎన్నికల తర్వాత రెండో ఫేజ్ పూర్తి చేసి తీరతామని మంత్రి కేటీఆర్ హమీ ఇచ్చారు. -
నాగోల్ కాల్పుల ఘటనపై దర్యాప్తు ముమ్మరం
-
హైదరాబాద్: బంగారం చోరీ కేసులో మరో ట్విస్ట్..
సాక్షి, హైదరాబాద్: నాగోలు కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాగా, ఈ కేసులో దుండగులు ఉపయోగించిన బైక్లు దొంగతనం చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. వారు చోరీ చేసిన వాహనాలతోనే దోపిడీకి నిందితులు పాల్పడ్డారు. ఈ క్రమంలో ఫింగర్ ప్రింట్స్, సీసీ ఫుటేజీ విజువల్స్ ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు వెల్లడించారు. నిందితులు ఇతర రాష్ట్రాలకు చెందిన గ్యాంగ్గా పోలీసులు గుర్తించారు. మరోవైపు.. దుండగులందరూ 25 ఏళ్ల యువకులు కాగా, ముఖం కనిపించకుండా ఫేస్ మాస్క్లు ధరించినట్టు బాధితులు చెబుతున్నారు. అయితే, కల్యాణ్ చౌదరి (34) స్నేహపురి కాలనీ రోడ్నంబర్– 6లో మహదేవ్ జ్యువెలరీ దుకాణం నడిపిస్తూ.. ఎన్జీవోస్ కాలనీలో కుటుంబంతో ఉంటున్నారు. గురువారం రాత్రి 9.15 గంటల సమయంలో సికింద్రాబాద్ నుంచి హోల్సేల్లో బంగారం సప్లై చేసే సుఖ్దేవ్ జ్యువెలరీ దుకాణానికి వచ్చాడు. అదే సమయంలో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు పల్సర్, యాక్టివా బైక్లపై వచ్చారు. అనంతరం దుకాణంలోకి చొరబడి షాపు షటర్ను మూసివేశారు. లోనికి వచ్చిన ఆగంతుకులు కాల్పులు జరిపారు. దీంతో కల్యాణ్ చౌదరితో పాటు సుఖ్దేవ్ గాయపడ్డారు. బ్యాగ్లో 3 కిలోల బంగారం.. రూ.5లక్షలు? సికింద్రాబాద్ మోండా మార్కెట్లోని గణపతి జ్యువెల్లర్స్ నుంచి సుఖ్దేవ్ బంగారం సప్లై చేసేందుకు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి అన్ని ప్రాంతాల్లో తిరిగి చివరికి స్నేహపురి కాలనీలోని మహదేవ్ బంగారం దుకాణానికి వచ్చాడు. ఆయనతో రాజ్కుమార్ అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన కూడా కాల్పులు జరిపిన సమయంలో అక్కడే ఉన్నాడు. కాల్పులు జరిపిన దుండగులు సుమారు 3 కిలోల బంగారం, రూ.5 లక్షల నగదుతో పరారైనట్లు సమాచారం. సీసీ పుటేజ్ పరిశీలిస్తున్న పోలీసులు.. కాల్పుల ఘటన జరిగిన దుకాణంలోని సీసీ కెమెరాల పుటేజ్ను పోలీసులు పరిశీలిస్తున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం బృందం ఆధారాలు సేకరించారు. నిందితులను పట్టుకునేందుకు ఎస్ఓటీ, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పదిహేను బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టినట్లు ఎల్బీనగర్ డీసీపీ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. కాల్పులు జరిపినవారు షాపు యజమానికి తెలిసిన వారా? లేక గుర్తు తెలియని వ్యక్తులా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాచకొండ జాయింట్ సీపీ సుధీర్బాబు, క్రైం డీసీపీ శ్రీబాల ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. -
నాగోల్ కాల్పుల బాధితులను పరామర్శించిన రాచకొండ సీపీ మహేష్ భగవత్
-
నాగోల్ స్నేహపూరి కాలనీలో కాల్పులు
-
హైదరాబాద్: జ్యువెలరీ షాప్లో దోపిడీకి పక్కా స్కెచ్? కాల్పులు జరిపి భారీ చోరీ
సాక్షి, చైతన్యపురి/నాగోలు: జ్యువెలరీ దుకాణంలో చొరబడిన దుండగులు షాపు యజమాని సహా మరొకరిపై కాల్పులు జరిపి బంగారు ఆభరణాలతో ఉడాయించిన ఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ పాలి జిల్లా లోటోపి గ్రామానికి చెందిన కల్యాణ్ చౌదరి (34) పదేళ్ల క్రితం స్నేహపురి కాలనీ రోడ్నంబర్– 6లో మహదేవ్ జ్యువెలరీ దుకాణం నడిపిస్తూ.. ఎన్జీవోస్ కాలనీలో కుటుంబంతో ఉంటున్నారు. గురువారం రాత్రి 9.15 గంటల సమయంలో సికింద్రాబాద్ నుంచి హోల్సేల్లో బంగారం సప్లై చేసే సుఖ్దేవ్ జ్యువెలరీ దుకాణానికి వచ్చాడు. అదే సమయంలో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు పల్సర్, యాక్టివా బైక్లపై వచ్చారు. అనంతరం దుకాణంలోకి చొరబడి షాపు షటర్ను మూసివేశారు. లోనికి వచ్చిన ఆగంతుకులు కాల్పులు జరిపారు. దీంతో కల్యాణ్ చౌదరితో పాటు సుఖ్దేవ్ గాయపడ్డారు. కాల్పులు జరిపిన అనంతరం సుఖ్దేవ్ చేతిలోని బ్యాగ్ను దుండగులు లాక్కున్నారు. దుకాణంలో నుంచి కాల్పుల శబ్దాలు రావటంతో దుకాణం వద్దకు స్థానికులు కొందరు చేరుకున్నారు. వారిలో కొందరు షాపు షటర్ తీసి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా ఆగంతుకులు తుపాకీ చూపించి భయపెడుతూ.. వారు వచ్చిన బైక్లపై పరారయ్యారు. స్థానికులు వెంటపడినప్పటికీ ఆర్కేపురం వైపు వెళ్లారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్రెడ్డి, చైతన్యపురి ఇన్స్పెక్టర్ మధుసూధన్ క్రైం అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన ఇద్దరిని నాగోలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. దుకాణం యజమాని కల్యాణ్ చెవికి బుల్లెట్ తగలగా, సుఖ్దేవ్కు ఒకటి మెడకు, మరొకటి వీపు వెనుక భాగంలో తగిలింది. వీరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సీసీ పుటేజ్ పరిశీలిస్తున్న పోలీసులు.. కాల్పుల ఘటన జరిగిన దుకాణంలోని సీసీ కెమెరాల పుటేజ్ను పోలీసులు పరిశీలిస్తున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం బృందం ఆధారాలు సేకరించారు. నిందితులను పట్టుకునేందుకు ఎస్ఓటీ, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పదిహేను బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టినట్లు ఎల్బీనగర్ డీసీపీ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. కాల్పులు జరిపినవారు షాపు యజమానికి తెలిసిన వారా? లేక గుర్తు తెలియని వ్యక్తులా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాచకొండ జాయింట్ సీపీ సుధీర్బాబు, క్రైం డీసీపీ శ్రీబాల ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. సుఖ్దేవ్ను అనుసరించే వచ్చారా? హోల్సేల్లో బంగారం సప్లై చేసే సుఖ్దేవ్ను అనుసరించే దుండగులు వచ్చి ఉండవచ్చనే అనుమానాలు తలెత్తుతున్నాయి. సుఖ్దేవ్ వద్ద ఉన్న నగల బ్యాగ్ను మాత్రమే తీసుకుని పారిపోవటంతో ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది. పక్కా స్కెచ్ ప్రకారమే కాల్పులు జరిపి బంగారంతో ఉడాయించినట్లు అనుమానిస్తున్నారు. బ్యాగ్లో 3 కిలోల బంగారం.. రూ.5లక్షలు? సికింద్రాబాద్ మోండా మార్కెట్లోని గణపతి జ్యువెల్లర్స్ నుంచి సుఖ్దేవ్ బంగారం సప్లై చేసేందుకు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి అన్ని ప్రాంతాల్లో తిరిగి చివరికి స్నేహపురి కాలనీలోని మహదేవ్ బంగారం దుకాణానికి వచ్చాడు. ఆయనతో రాజ్కుమార్ అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన కూడా కాల్పులు జరిపిన సమయంలో అక్కడే ఉన్నాడు. కాల్పులు జరిపిన దుండగులు సుమారు 3 కిలోల బంగారం, రూ.5 లక్షల నగదుతో పరారైనట్లు సమాచారం. -
నాగోల్ లో ఫ్లైఓవర్ ప్రారంభించిన కేటీఆర్
-
నాగోల్ ఫ్లైఓవర్ను ప్రారంభించిన కేటీఆర్..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. నాగోల్ ఫ్లైఓవర్ను మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించారు. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం (ఎస్సార్డీపీ) కింద రూ. 143 కోట్లతో 990 మీటర్ల పొడవునా ఈ ఫ్లైఓవర్ను నిర్మించారు. దీంతో నాగోల్ పరిసర ప్రాంతాల ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ప్రారంభోత్సవం సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. నగరంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతున్నామన్నారు. నగర విస్తరణకు తగ్గ విధంగా మౌలిక వసతుల కల్పన కోసం ప్లాన్ చేస్తున్నామని మంత్రి తెలిపారు. లేదంటే బెంగళూరు తరహాలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఎఎస్సార్డీపీ కార్యక్రమాన్ని తీసుకుమని.. రూ. 8వేల52 కోట్లతో 47 ప్రాజెక్టులు చేపట్టినట్లు వెల్లడించారు. ఉప్పల్, ఎల్బీనగర్ ప్రాంతాల్లోనే 16 ప్రాజెక్టులు ఉన్నాయన్నారు. రెండవ దశలో 12 ప్రాజెక్టులను చేపడుతున్నట్లు తెలిపారు. మొత్తం 32 ప్రాజెక్టులు పూర్తికగా 16 ఫ్లై ఓవర్లు ఉన్నాయన్నారు. ‘హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వారికి గతంలో చాలా ట్రాఫిక్ కష్టాలు ఉండేవి. ఇప్పుడు అవి తగ్గిపోయాయి. ఎల్బీనగర్ నియోజకవర్గలో 700 కోట్లకు పైగా ఖర్చు చేసి 9 ప్రాజెక్టులు పూర్తి చేశాం. రాబోయే నాలుగైదు నెలల్లో ఈ ప్రాంతంలోని ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చేలా చూస్తాం. ఎల్బీనగర్ ప్రాంతంలో 600 కోట్లు ఖర్చు చేసి తాగునీటి సమస్య లేకుండా చేశాం. భవిష్యత్తు తరాలకు మెరుగైన వసతులు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నాం. మౌలిక వసతులతో పాటు దీర్ఘకాలంగా ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం. రాజకీయాలు ఎన్నికల అప్పుడు చేద్దాం. ఇప్పుడు అభివృద్ధి పై ఫోకస్ చేద్దాం’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. As the #NagoleFlyover is all set for inauguration by @TSMAUDOnline Minister Sri @KTRTRS today, here's a quick recap of all Road over Bridges (RoBs) & Road under Bridges (RuBs) that #Telangana Govt. has built in #Hyderabad in last 8 years.#SRDP #HappeningHyderabad@TelanganaCMO pic.twitter.com/KyIH67gybQ — Telangana Digital Media Wing (@DigitalMediaTS) October 26, 2022 తీరనున్న ట్రాఫిక్ కష్ట్రాలు రెండు వైపుల ప్రయాణించేలా ఉన్న ఫ్లైఓవర్ను జీహెచ్ఎంసీ సర్వాంగ సుందరంగా తీర్చదిద్దింది. ఒక్కోవైపు మూడు లేన్లతో ఉన్న ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో ఎల్బీనగర్ వైపు నుంచి సికింద్రాబాద్ వైపు రాకపోకలు సాగించేవారికి సాఫీ ప్రయాణం సాధ్యం కావడంతోపాటు నాగోల్ చౌరస్తా వద్ద, బండ్లగూడ జంక్షన్ వద్ద ట్రాఫిక్ సమస్యలు 75 శాతం పరిష్కారం కానున్నాయి.. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆరాంఘర్, ఎల్బీనగర్ల మీదుగా ఉప్పల్ వరకు వచ్చేవారు ఈ ఫ్లైఓవర్తో సికింద్రాబాద్ తదితర ప్రాంతాలకు సులభంగా చేరుకోవచ్చు. ఇది 16వ ఫ్లైఓవర్.. ఎస్సార్డీపీ ద్వారా పూర్తయిన పనుల్లో ఇది 16వ ఫ్లైఓవర్. ఇప్పటికే 15 ఫ్లైఓవర్లతోపాటు 5 అండర్పాస్లు, 7 ఆర్ఓబీ/ఆర్యూబీలు, దుర్గంచెరువు కేబుల్బ్రిడ్జి, పంజగుట్ట స్టీల్బ్రిడ్జి అందుబాటులోకి వచ్చాయి. ఎల్బీనగర్ పరిసరాల్లోని నాలుగు జంక్షన్లలో రూ. 448 కోట్లతో చేపట్టిన పనుల్లో ఇప్పటికే కొన్ని పూర్తయి వినియోగంలోకి వచ్చాయి. సులభ ప్రయాణం.. 2015 సర్వే మేరకు నాగోలు జంక్షన్ వద్ద రద్దీ సమయంలో గంటకు 7,535 వాహనాలు(పీసీయూ) ప్రయాణిస్తున్నాయి. 2034 నాటికి ఈ సంఖ్య 12,648కి చేరుకోనుందని జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్స్ విభాగం చీఫ్ ఇంజినీర్ ఎం.దేవానంద్ తెలిపారు. సిగ్నళ్లు లేని సాఫీ ప్రయాణం వల్ల వాహనదారులకు ఎంతో సమయం, ఇంధనం ఆదా కావడంతోపాటు వాయు, ధ్వని కాలుష్యం కూడా తగ్గుతాయని పేర్కొన్నారు. మంగళవారం ఎస్సార్డీపీ అధికారులు కె. రమేష్ బాబు, రోహిణి, జీహెచ్ఎంసీ హయత్నగర్ సర్కిల్ డీసీ మారుతీ దివాకర్, ఏఎంహెచ్ఓ శ్రీనివాస్, ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్రెడ్డి, ఎల్బీనగర్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, సీఐ వెంకటేశ్వర్లు నాగోలు ప్లైఓవర్ను పరిశీలించారు. -
నాగోలు ఫ్లై ఓవర్.. ఎల్బీనగర్– సికింద్రాబాద్ మధ్య ఇక రయ్రయ్
సాక్షి, హైదరాబాద్/నాగోలు: వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం (ఎస్సార్డీపీ) కింద చేపట్టిన పనుల్లో మరో ఫ్లై ఓవర్ నేటినుంచి అందుబాటులోకి రానుంది. మున్సిపల్ మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించనున్నారు. ఒక్కోవైపు మూడు లేన్లతో ఉన్న ఈ ఫ్లైఓవర్ వినియోగంతో ఎల్బీనగర్ వైపు నుంచి సికింద్రాబాద్ వైపు రాకపోకలు సాగించేవారికి సాఫీ ప్రయాణం సాధ్యం కావడంతోపాటు నాగోల్ చౌరస్తా వద్ద, బండ్లగూడ జంక్షన్ వద్ద ట్రాఫిక్ సమస్యలు 75 శాతం పరిష్కారం కానున్నాయని జీహెచ్ఎంసీ ఇంజినీర్లు పేర్కొన్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆరాంఘర్, ఎల్బీనగర్ల మీదుగా ఉప్పల్ వరకు వచ్చేవారు ఈ ఫ్లైఓవర్తో సికింద్రాబాద్ తదితర ప్రాంతాలకు సులభంగా చేరుకోవచ్చు. ఇది 16వ ఫ్లైఓవర్.. ఎస్సార్డీపీ ద్వారా పూర్తయిన పనుల్లో ఇది 16వ ఫ్లైఓవర్. ఇప్పటికే 15 ఫ్లైఓవర్లతోపాటు 5 అండర్పాస్లు, 7 ఆర్ఓబీ/ఆర్యూబీలు, దుర్గంచెరువు కేబుల్బ్రిడ్జి, పంజగుట్ట స్టీల్బ్రిడ్జి అందుబాటులోకి వచ్చాయి. ఎల్బీనగర్ పరిసరాల్లోని నాలుగు జంక్షన్లలో రూ. 448 కోట్లతో చేపట్టిన పనుల్లో ఇప్పటికే కొన్ని పూర్తయి వినియోగంలోకి వచ్చాయి. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని నివారించడానికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వ్యూహాత్మక రహదారి అభివృద్ధి పథకంలో భాగంగా నిర్మాణమైన నాగోల్ ఫ్లైఓవర్ ఇవ్వాళటి నుండి అందుబాటులోకి వస్తుంది. ఆరు లైన్లు ఉన్న ఈ ఫ్లైఓవర్ 990 మీటర్ల పొడవు ఉంది. @TSMAUDOnline @GHMCOnline pic.twitter.com/a4S5UsKti4 — KTR (@KTRTRS) October 26, 2022 సులభ ప్రయాణం.. 2015 సర్వే మేరకు నాగోలు జంక్షన్ వద్ద రద్దీ సమయంలో గంటకు 7,535 వాహనాలు(పీసీయూ) ప్రయాణిస్తున్నాయి. 2034 నాటికి ఈ సంఖ్య 12,648కి చేరుకోనుందని జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్స్ విభాగం చీఫ్ ఇంజినీర్ ఎం.దేవానంద్ తెలిపారు. సిగ్నళ్లు లేని సాఫీ ప్రయాణం వల్ల వాహనదారులకు ఎంతో సమయం, ఇంధనం ఆదా కావడంతోపాటు వాయు, ధ్వని కాలుష్యం కూడా తగ్గుతాయని పేర్కొన్నారు. మంగళవారం ఎస్సార్డీపీ అధికారులు కె. రమేష్ బాబు, రోహిణి, జీహెచ్ఎంసీ హయత్నగర్ సర్కిల్ డీసీ మారుతీ దివాకర్, ఏఎంహెచ్ఓ శ్రీనివాస్, ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్రెడ్డి, ఎల్బీనగర్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, సీఐ వెంకటేశ్వర్లు నాగోలు ప్లైఓవర్ను పరిశీలించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అర్ధరాత్రి ఆపన్నహస్తం.. గ్రీన్ఛానెల్తో గుండెను తరలించిన మెట్రో
సాక్షి,హైదరాబాద్: నగరవాసులకు అవసరమైన సహాయం చేయడానికి తామెప్పుడూ ముందే ఉంటామని మరోసారి ఎల్&టీ హైదరాబాద్ మెట్రో రైల్ నిరూపించింది. గతంలో ఫిబ్రవరి 2021లో ఏ విధంగా అయితే జూబ్లీహిల్స్లోని అపోలో హాస్పిటల్ నుంచి ఓ ప్రాణం కాపాడటానికి గుండెను తరలించాలని ఎల్&టీ ఎంఆర్హెచ్ఎల్ ఎస్ఓఎస్కు కాల్ వచ్చిందో అదే తరహాలో మరోసారి కాల్ వచ్చింది. ఇందులో భాగంగానే హైదరాబాద్ మెట్రో.. సెప్టెంబర్ 26న తెల్లవారుజూమున గ్రీన్ ఛానెల్ ఏర్పాటుచేయడంతో నాగోల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ మెట్రో స్టేషన్కు గుండెను రవాణా చేసింది. కాగా, గుండె తరలింపులో భాగంగా ఎల్బీనగర్లోని కామినేని హాస్పిటల్ డాక్టర్లు , ఇతర మెడికోలు.. రాత్రి ఒంటి గంట సమయంలో నాగోల్ మెట్రోస్టేషన్ వద్దకు గుండెను తీసుకువచ్చారు. అనంతరం, గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి కేవలం 25 నిమిషాల్లోనే గుండెను ప్రత్యేక రైలు జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ స్టేషన్కు చేర్చారు. తర్వాత, అంబులెన్స్ సాయంతో ఆసుపత్రికి చేర్చారు. ఈ స్పెషల్ ఆపరేషన్ కోసం లైన్-3 సెక్యూరిటీ అధికారులతో పాటుగా మెట్రో అధికారులు ఎలాంటి అవాంతరాలు లేకుండా కొనసాగేలా చేశారు. ఈ సందర్భంగా ఎల్&టీ ఎంఆర్హెచ్ఎల్ ఎండీ సీఈఓ కెవీబీ రెడ్డి మాట్లాడుతూ.. ‘ప్రయాణీకుల సేవకు హైదరాబాద్ మెట్రో రైల్ కట్టుబడి ఉంటుంది. అవసరమైన సమయంలో వారికి సేవ చేసేందుకు కట్టుబడి ఉంది. మా అవసరం ఎక్కువగా ఉన్నవారికి, అవసరమైన సమయంలో తోడుండాలనేది మా సిద్ధాంతం. ఈసారి కూడా మేము గ్రీన్ఛానెల్ ఏర్పాటుచేయడంతో పాటుగా వీలైనంత త్వరగా గుండెను తరలించి, ఓ ప్రాణం కాపాడాము. ప్రాణంతో ఉన్న అవయవాన్ని తరలించడంలో తోడ్పడిన డాక్టర్లు, హెచ్ఎంఆర్ సిబ్బందికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము’ అని అన్నారు. కాగా, ఆదివారం రాత్రి ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన క్రికెట్ మ్యాచ్ సందర్భంగా మెట్రో రైలు సేవలు అర్ధరాత్రి వరకు అందుబాటులోనే ఉన్నాయి. ఓవైపు.. క్రికెట్ అభిమానులకు తరలిస్తూనే.. అటు మెట్రో అధికారులు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేయడం విశేషం. మ్యాచ్ సందర్భంగా దాదాపు 20వేల మంది క్రికెట్ ఫ్యాన్స్ మెట్రో ప్రయాణించినట్టు సమాచారం. -
Hyderabad Metro: అర్ధరాత్రి ఆపన్నహస్తం.. గ్రీన్ఛానెల్తో గుండెను తరలించిన మెట్రో
-
ఆటో డ్రైవర్ నకిలీ పోలీస్గా మారి.. అత్యాచార, చోరీ కేసులున్నాయంటూ
సాక్షి, హైదరాబాద్: నకిలీ పోలీస్ అవతారమెత్తిన ఓ ఆటో డ్రైవర్ సీనియర్ వృద్ధులే లక్ష్యంగా బెదిరింపులకు పాల్పడుతున్నాడు. వారి నుంచి అందినకాడికి దండుకుంటున్నాడు. ఈ పాత నేరస్తుడుని ఎల్బీనగర్ పోలీస్లు అరెస్టు చేసి 16 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ. 11.000 నగదు, సెల్ పోన్ ఒక కత్తిని స్వాధీనం చేసుకుని ఆదివారం రిమాండ్కు తరలించారు. ఎల్బీనగర్ పోలీస్లు తెలిపిన మేరకు..నల్గొండ జిల్లా దేవత్పల్లి తండాకు చెందిన రమావత్ నరేష్(30) రామంతపూర్లో నివాసం ఉంటూ ఆటో నడుపుతుంటాడు. డబ్బు సరిపోక పోవడంతో నేరాల బాట పట్టాడు. జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. అయినా అతనిలో మార్పు రాలేదు. ఈ క్రమంలో గత నెల 28 చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో సీనియర్ సిటిజన్ను తన ఆటోలో ఎక్కించుకుని.. నేను చైతన్యపురి పోలీస్ అధికారి అని చెప్పి.. నువ్వు బంగారు గొలుసు దొంగిలించావని బెదిరించాడు.అలా అతని వద్ద ఉన్న బంగారు ఉంగరం, రూ. 20 వేల నగదు దోచుకొని వెళ్లాడు. గత నెల 30న ఎల్బీనగర్ లోని విజయవాడ బస్టాప్లో నిలబడిన వ్యక్తిని బెదిరించి రూ. 1500 నగదు దోచుకుని పారిపోయాడు. ఈ నెల 1న నాగోలు చౌరస్తాలో ఓ సీనియర్ సిటిజన్ (62) వ్యక్తి వద్దకు వెళ్లి ఎస్ఐగా బెదిరించి ఆటోలో ఎక్కించున్నాడు. బంగారు ఉంగరాన్ని దోచుకుని పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఎల్బీనగర్ పోలీస్లు దర్యాపు చేపట్టి శనివారం ఎల్బీనగర్ రింగ్ రోడ్డులో అనుమానాస్పద తిరుగుతుండగా రమావత్ నరేష్ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో దోపిడీలకు పాల్పడినట్లు ఓప్పుకున్నాడు. అతని వద్ద నుండి రూ.80 వేల విలువైన వస్తువులు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. చదవండి: భర్త చనిపోవడంతో మరో వ్యక్తితో సహజీవనం.. రాత్రి ఇంటికి వచ్చి.. -
హోండా నుంచి న్యూ మోడల్ కారు
సాక్షి, హైదరాబాద్: హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ కొత్త మోడల్ కారును లాంచ్ చేసింది. నాగోల్ గ్రీన్ హోండా షోరూమ్ వద్ద బుధవారం ‘ఈ–హెవ్’ మోడల్ కారును హైదరాబాద్ మెట్రోవాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు (హెచ్ఎమ్ఎస్ఎస్) ఎండీ ఎం.దానకిశోర్ లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో సీఈఓ వివేకానంద ఆర్యశ్రీ, సేల్స్ హెడ్ శ్రీధర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హోండా ‘న్యూ సిటీ ఈ–హెవ్’ దేశంలో మొదటి బలమైన హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనమని చెప్పారు. మెయిన్ స్ట్రీమ్ సెగ్మెంట్లో విప్లవాత్మక స్వీయ–ఛార్జింగ్తో అత్యంత సమర్థవంతంగా పని చేస్తోందన్నారు. గత నెల 14 నుంచి బుకింగ్ మొదలు కాగా, ఈ నెలలో అమ్మకాలను ప్రారంభించినట్లు వారు పేర్కొన్నారు. దీని పనితీరు, సామర్ధ్యం ప్రాముఖ్యంగా ఉంటుందని పేర్కొన్నారు. (చదవండి: యూట్యూబ్ క్రియేటర్లకు గూగుల్ భారీ షాక్!) -
హైదరాబాద్: మోస్ట్ వాంటెడ్ దొంగ.. ఆఖరికి ఓ చిన్న తప్పుతో..
సాక్షి, హైదరాబాద్: ‘ఎంత పెద్ద నేరస్తుడైనా ఎక్కడో ఒకచోట చిన్న పొరపాటైనా చేస్తాడు లేదా క్లూ అయినా వదులుతాడని’ పోలీసులు చెబుతుంటారు. ఆఖరికి ఇదే నిజమైంది. ఏడేళ్లుగా మూడు కమిషనరేట్ల పోలీసులను ముప్పుతిప్పులు పెడుతున్న మోస్ట్ వాంటెడ్ దొంగ.. ఆఖరికి ఓ చిన్న పొరపాటుతో పోలీసులకు దొరికిపోయాడు. జిల్లెల్లగూడలోని ఓ ఇంట్లో బంగారం, ల్యాప్టాప్, సెల్ఫోన్ను చోరీ చేసిన గజదొంగ సయ్యద్ సాహిల్... ఆ ఫోన్ను తన బావమరిదికి బహుమతిగా ఇచ్చాడు. అది చోరీ ఫోన్ అని తెలియక అతను దాన్ని వినియోగించడం మొదలు పెట్టాడు. అప్పటికే ఫోన్ చోరీ జరిగిందని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో.. దాని ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ (ఐఎంఈఐ) నంబర్ను పోలీసులు ట్రాకింగ్లో పెట్టారు. సాంకేతిక సాక్ష్యాలను సేకరించిన మీర్పేట పోలీసులు.. శనివారం బాలాపూర్ క్రాస్ రోడ్డులో రెక్కీ చేస్తున్న సాహిల్ను మాటువేసి పట్టుకున్నారు. వనస్థలిపురం మీర్పేట ఇన్స్పెక్టర్ ఎం మహేందర్ రెడ్డి, వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డిలతో కలిసి ఎల్బీనగర్ డీసీపీ సన్ప్రీత్ సింగ్ వివరాలు వెల్లడించారు. ఆరేళ్లుగా అన్నదమ్ముల ఆటలు.. చాంద్రాయణగుట్ట షాహీన్నగర్కు చెందిన సయ్యద్ మొహమ్మద్, సయ్యద్ సాహిల్లు అన్నదమ్ములు. ఆరేళ్లుగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పోలీసులకు చిక్కకుండా ముప్పుతిప్పలు పెడుతున్నారు. 2015లో గోల్కొండ పీఎస్ పరిధిలో వీరిపై తొలి కేసు నమోదయింది. అప్పట్నుంచి ఇప్పటివరకు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 33, సైబరాబాద్లో 8, రాచకొండ కమిషనరేట్లో 9 వీరిపై మొత్తం 50 కేసులున్నాయి. గతంలో వీరిని మీర్పేట, గోల్కొండ, లంగర్హౌస్, బంజారాహిల్స్, ఆసిఫ్నగర్, హుమాయున్నగర్, నార్సింగి, రాయదుర్గం, రాజేంద్రనగర్, కొత్తూరు పీఎస్ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. గతేడాది డిసెంబర్లో జైలు నుంచి విడుదలైన సయ్యద్ సాహిల్.. మళ్లీ దొంగతనాలు మొదలుపెట్టాడు. గడిచిన మూడు నెలల్లో సాహిల్ బంజారాహిల్స్లోని ఓ ఇంట్లో, మీర్పేటలో ఏడు చోరీలకు పాల్పడ్డాడు. చదవండి: జ్వరం గోలీకి ధరల సెగ! రాత్రి 7 నుంచి 11 గంటల మధ్యే చోరీలు.. చోరీ చేయడంలో సాహిల్ స్టైలే వేరు. ఉదయం పూట బైక్ మీద రెక్కీ నిర్వహించి, రాత్రి 7 నుంచి 11 గంటల మధ్య మాత్రమే దొంగతనాలు చేస్తుంటాడు. తాళం వేసి ఉన్న ఇళ్లను ఎంపిక చేసుకొని, రాత్రి వేళలో వెంట తెచ్చుకున్న స్క్రూ డ్రైవర్, ఇనుప రాడ్తో ఇంటి ప్రధాన ద్వారాన్ని తెరుస్తాడు. ఇంట్లోకి ప్రవేశించి బీరువాలోని పగులగొట్టి బంగారం, వెండి ఆభరణాలు, నగదు ఎలక్ట్రానిక్ వస్తువులతో పరారవుతాడు. చోరీ చేసిన సొత్తులో కొంత భాగం ఇంట్లో దాచిపెట్టుకోగా.. మిగిలిన దాన్ని బంగారం దుకాణాలు, పాన్ బ్రోకర్లు, మణప్పురం ఫైనాన్స్ వంటి వాటిల్లో తాకట్టు పెడతాడు. ఇలా చిక్కిపోయాడు.. బాలాపూర్ క్రాస్రోడ్స్లో శనివారం ఉదయం అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు సమాచారం అందుకున్న మీర్పేట సీఐ మహేందర్ రెడ్డి, డీఐ శేఖర్ రంగంలోకి దిగారు. సాహిల్ను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. మొహమ్మద్ పరారీలో ఉన్నాడు. నిందితుడి నుంచి 81.2 తులాల బంగారం, 2.45 తులాల వెండి ఆభరణాలతో పాటు ల్యాప్టాప్, బైక్, స్క్రూ డ్రైవర్, ఇనుప రాడ్లను స్వాధీనం చేసుకున్నారు. -
హైదరాబాద్లో కొత్త పోలీస్స్టేషన్లు.. ఎక్కడంటే!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ శరవేగంగా విస్తరిస్తోంది. దశాబ్ద క్రితం వరకూ శివారు ప్రాంతాలు అనుకున్నవన్నీ నేడు ప్రధాన నగరంలో కలిసిపోయాయి. ఔటర్ రింగ్ రోడ్డును దాటేసి.. రీజినల్ రింగ్ రోడ్ వైపు పరుగులు పెడుతోంది. దీంతో అదే స్థాయిలో శాంతి భద్రతలను కల్పించేందుకు పోలీస్ ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు. కొత్త పోలీస్ సబ్ డివిజన్లు, పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా సైబరాబాద్లో కొత్తగా నాలుగు ఠాణాలు, రాచకొండలో ఒక డివిజన్, పీఎస్ను ఏర్పాటు చేయనున్నారు. పోలీస్ స్టేషన్ల ఏర్పాటు అనేది జనాభా, నేరాల సంఖ్యను బట్టి ఉంటుంది. ఐటీ కంపెనీలతో పశ్చిమ హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట, రాయదుర్గం, నార్సింగి, నానక్రాంగూడ, పుప్పాలగూడ తదితర ప్రాంతాలు నివాస, వాణిజ్య సముదాయాలతో కిక్కిరిసిపోయాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాలలో శాంతి భద్రతలను పెంచాల్సిన అవసరం ఉందని ఓ పోలీస్ ఉన్నతాధికారి పేర్కొన్నారు. సైబరాబాద్లో నాలుగు పీఎస్లు.. సెబరాబాద్ పోలీస్ కమిషనరేట్ 3,644 చ.కి.మీ. మేర విస్తరించి ఉంది. దేశంలో లక్ష జనాభాకు 138 మంది పోలీసులు ఉండగా.. సైబరాబాద్లో 86 మంది ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ మాదాపూర్, శంషాబాద్, బాలానగర్ మూడు జోన్లు, 9 డివిజన్లలో 36 లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. మాదాపూర్ డివిజన్లోని నార్సింగి, మియాపూర్ డివిజన్లోని ఆర్సీపురం, చేవెళ్ల డివిజన్లోని శంకర్పల్లి పీఎస్ల పరిధిని కుదించి.. ఆయా ప్రాంతాలతో పాటూ కొత్తగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలను కలిపి కొత్తగా సైబరాబాద్ కమిషనరేట్లో నాలుగు పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. దీంతో నార్సింగి పీఎస్లోని గండిపేట, మెకిల్ల.. ఆర్సీపురం పీఎస్లోని కొల్లూరు, శంకర్పల్లి పీఎస్లోని జన్వాడ పేరిట కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. దీంతో ప్రధాన నగరంలోని పోలీస్ స్టేషన్లపై ఒత్తిడి తగ్గడంతో పాటూ నేరాల నియంత్రణ సులువవుతుందని తెలిపారు. 2 నుంచి 3 వేల పోలీస్ సిబ్బంది కూడా.. శివారు ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్న పోలీస్ స్టేషన్లతో పాటూ కొత్తగా రానున్న వాటిల్లో పోలీసుల నియామం చేపట్టాల్సిన అవసరం ఉంది. త్వరలోనే ఈ ప్రక్రియ కొలిక్కి రానున్నట్లు సమాచారం. సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో అదనంగా 2–3 వేల మంది సిబ్బందిని నియమించాల్సిన అవసరముందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. రాచకొండ కమిషనరేట్కు 9,403 మంది సిబ్బంది మంజూరు కాగా.. ప్రస్తుతం అన్ని ర్యాంక్లలో కలిపి 6,599 మంది సిబ్బంది ఉన్నారు. 2,804 పోస్ట్లు ఖాళీగా ఉన్నాయి. (ట్యాంక్బండ్పై అనునిత్యం రోడ్డు ప్రమాదాలు.. ఇలా ఎందుకు చేయరు?) రాచకొండలో కొత్త డివిజన్, పీఎస్.. 5,091.48 చ.కి.మీ. మేర విస్తరించి ఉన్న రాచకొండ ఏరియా వారీగా దేశంలోనే అతిపెద్ద పోలీస్ కమిషనరేట్. రాచకొండలో అత్యధిక జనాభా ఉన్న ఎల్బీనగర్ జోన్ నుంచి కొన్ని ప్రాంతాలను విడదీసి కొత్త డివిజన్, పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేయాలని పోలీస్ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఎల్బీనగర్ పీఎస్ పరిధిలో ఉన్న నాగోల్ను ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఎల్బీనగర్ జోన్లోని వనస్థలిపురం డివిజన్ను విభజించి ప్రత్యేకంగా బాలాపూర్ పోలీస్ డివిజన్ ఏర్పాటు కానుంది. వనస్థలిపురంలోని డివిజన్లోని కొన్ని ప్రాంతాలను, బాలాపూర్, పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్లతో పాటు, ఇబ్రహీంపట్నం డివిజన్లోని పలు పోలీస్ స్టేషన్లను కలుపుకొని కొత్తగా బాలాపూర్ డివిజన్ ఏర్పాటు కానుంది. (చదవండి: హైదరాబాద్ రూపురేఖలు మార్చిన ఫ్లైఓవర్లు) -
Hyderabad: వ్యభిచార గృహం గుట్టు రట్టు.. సోదరుడి ఇంట్లోనే..
సాక్షి, హైదరాబాద్(నాగోలు): ఎల్బీనగర్ పోలీసులు ఓ వ్యభిచార గృహం గుట్టును రట్టు చేశారు. గృహం నిర్వాహకురాలితో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేసి సెల్ఫోన్లు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకుని నిందితులను శనివారం రిమాండ్కు తరలించారు. ఎల్బీనగర్ పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా లక్ష్మీపురం కాలనీకి చెందిన ఎస్. వెంకటలక్ష్మి(68) బైరామల్గూడ రెడ్డి కాలనీలోని తన సోదరుడి ఇంట్లో కొంత కాలంగా వ్యభిచార గృహం నిర్వహిస్తోంది. చదవండి: (కలహాలతో విసిగిపోయి.. బిడ్డతో సహా కావేరి నదిలో దూకి..) సమాచారం అందుకున్న ఎల్బీనగర్ పోలీసులు శుక్రవారం రాత్రి ఆ ఇంటిపై దాడి చేసి విటుడు చట్టి సద్గుణరావుతో పాటు వెంకటక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. కరోనా కారణంగా కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వెంకటలక్ష్మి సులభంగా డబ్బులు సంపాదించేందుకు వ్యభిచార వృత్తిని ఎంచుకుంది. తనకు తెలిసిన సెక్స్వర్కర్లతో ఒప్పందం చేసుకుని వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తోంది. కాగా, గతంలోనూ వెంకటలక్ష్మిని పోలీసులు వ్యభిచారం కేసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. బెయిల్పై బయటకు వచ్చిన వెంకటలక్ష్మి మళ్లీ అదే వృత్తిని కొనసాగిస్తూ పట్టుబడింది. చదవండి: (స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం.. చివరికి..) -
పల్లీపట్టీలు కావాలని వచ్చి... పుస్తెలు అపహరణ!
నాగోలు: పల్లీపట్టీ కావాలని వచ్చిన ఓ దుండగుడు షాపులో ఉన్న మహిళ మెడలోని బంగారు పుస్తెలు తెంచుకొని పారిపోయాడు. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... హస్తినాపురం, అనుపమనగర్లో నివసించే పెబ్బేటి స్వప్న (35) అదే కాలనీలో జై సంతోషిమాత పింగి గిర్నీ నిర్వహిస్తోంది. గురువారం మధ్యాహ్నం గుర్తుతెలియని యువకుడు దుకాణానికి వచ్చి పల్లీపట్టి కావాలని అడిగి ఆమె మెడలోని పుస్తెలతాడు తెచ్చేందుకు యత్నించాడు. ఆమె తాడును గట్టిగా పట్టుకోవడంతో రెండు పుస్తెలు తెంచుకుని పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీస్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంట్లో తెలియకుండా పెళ్లి.. నవ వధువు అనుమానాస్పద మృతి
నాగోలు: అనుమానాస్పద స్థితిలో నవ వధువు మృతి చెందిన ఘటన ఎల్బీనగర్ ఠాణా పరిధిలో జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా, చింతపల్లి మండలం, జర్పుల తండాకు చెందిన జర్పుల మంత్రు, మారెమ్మ దంపతుల కుమార్తె అమూల్య (22), కొత్తపేటలోని ఓ కాఫీ షాపులో పని చేసేది. అక్కడ పని చేస్తున్న నాగర్కర్నూల్కు చెందిన కంతుల డేవిడ్(25)తో పరిచయమై మార్చి 24న సాయిబాబా గుడిలో పెళ్లి చేసుకుని వనస్థలిపురంలో కొన్ని రోజులు ఉండి, గత 20 రోజుల క్రితం ఎల్బీనగర్లోని శివగంగాకాలనీలో ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నారు. నాటి నుంచి అమూల్య పెళ్లి విషయం కుటుంబ సభ్యులకు తెలియకుండా జాగ్రత్త పడుతూ వచ్చింది. మూడ్రోజుల క్రితం హస్తినాపురంలో ఉండే తన అక్క ఇంటికి వెళ్లగా మెడలోని నల్లపూసలు గురించి కుటుంబ సభ్యులు అడిగినట్లు సమాచారం. అక్కడ నుంచి 17న హాస్టల్కు వెళ్తున్నానని చెప్పి తన భర్త వద్దకు వచ్చింది. అదే రోజు రాత్రి తల్లికి ఫోన్చేసి తాను కులాంతర వివాహం చేసుకున్నానని మీ వద్దనున్న తన బంగారు ఆభరణాలు, డబ్బులు ఇవ్వాలని అడిగినట్లు సమాచారం. ఉదయం బాత్రూంలో అమూల్య చున్నీతో అనుమానాస్పద స్థితిలో ఉండటంతో గమనించిన డేవిడ్ కామినేని హాస్పిటల్కు తరలించగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. అమూల్య మృతి చెందిన సంగతి తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గిరిజన సంఘాలు పెద్ద సంఖ్యలో ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. డేవిడ్ తన కుమార్తెను హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అమూల్య మృతికి డేవిడ్ కారణమంటూ అతడిని కఠినంగా శిక్షించాలని గిరిజన సంఘాల నాయకులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్సీ రాములు ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్రెడ్డి, సీఐ అశోక్రెడ్డితో మాట్లాడి వివరాలను తెలుసుకున్నాడు. పోస్ట్మార్టం రిపోర్టు వస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా రాములు నాయక్ మాట్లాడుతూ.. అమూల్య మృతికి కారణమైన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి, హోంమంత్రి, గిరిజన సంక్షేమ మంత్రి స్పందించి అమూల్య కుటుంబానికి రూ.కోటి నష్ట పరిహారం, ఇంట్లో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
పార్కింగ్ విషయంలో గొడవ.. మహిళ చీర లాగి, దుర్భాషలాడుతూ
సాక్షి,సైదాబాద్: వాహనం పార్కింగ్ విషయమై జరిగిన గొడవలో ఓ మహిళ చీర లాగి, దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డారు. సైదాబాద్ పోలీసుల కథనం ప్రకారం.. నాందేడ్కు చెందిన ఓ మహిళ, భర్తతో కలిసి పూర్ణోదయాకాలనీ రహదారిపై టీ స్టాల్ నడుపుతున్నారు. కొంతకాలం క్రితం వీరి టీ స్టాల్కు దగ్గరలోనే పూసలబస్తీకి చెందిన తన్నీరు శ్రీనివాస్ టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలో టీ స్టాల్ దంపతుల కుమారుడు తన బైక్ను టిఫిన్ సెంటర్ ముందు నిలపగా, యజమాని కుమారుడు కింద పడేశాడు. చదవండి: బ్లేడ్తో చేయి కోసుకుని, తల పగులగొట్టుకొని, కప్పు పెంకులు నమిలి.. ఎందుకిలా చేశావని ప్రశ్నించినందుకు అతడిపై టిఫిన్ సెంటర్ యజమాని, అతడి కుమారులు దాడి చేశారు. తన కుమారుడిపై దాడిని అడ్డుకొనేందుకు వచ్చిన తల్లిపై కూడా దాడి చేయగా ఆమె రోడ్డుపై పడిపోయింది. అయినా వదలకుండా ఆమె చీరలాగి కొట్టేందుకు యత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన తన్నీరు రామారావు, రమేష్, రాజులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: నదిలో పడిన బస్సు.. 32 మంది మృతి మహిళలతో అసభ్యకర డ్యాన్స్: ముగ్గురి అరెస్టు నాగోలు: ఓ రియల్ ఎస్టేట్ సంస్థ వార్షికోత్సవంలో మద్యం తాగి, డీజే ముసుగులో మహిళలతో అసభ్యకర నృత్యాలు చేయించిన ముగ్గురు నిర్వాహకులపై ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎల్బీనగర్ పోలీసుల కథనం ప్రకారం... ల్యాండ్ మార్క్ రియల్ ఎస్టేస్ సంస్థ 5 వార్షికోత్సవం సోమవారం రాత్రి నాగోలులోని ఓ గార్డెన్స్లో జరిగింది. కంపెనీ ఉద్యోగుల సమావేశం పూర్తయ్యాక మద్యం తాగి, డీజే పాటల హోరులో మహిళలతో అసభ్యకరంగా నృత్యాలు చేయించారు. స్థానికులు ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సదరు రియల్ ఎస్టేట్ సంస్థ ఆర్గనైజర్ పి.రవీందర్రెడ్డి, ఈవెంట్ ఆర్గనైజర్ వరదరాజన్, డీజే ఆపరేటర్ కడారి దిలీప్కుమార్ను అరెస్టు చేసి డీజేను స్వా«దీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు.. రియల్ ఎస్టేట్ సంస్థ నిర్వాకం
హైదరాబాద్: నాగోల్లో రికార్డు డ్యాన్సులు కలకలం సృష్టించాయి. పీఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ వార్సికోత్సవంలో అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయించింది. అమ్మాయిలు మద్యం మత్తులో చిందులు వేశారు. సమాచారం అందుకున్న ఎల్బీనగర్ పోలీసులు కంపెనీ యాజమాన్యం, ఈవెంట్ ఆర్గనైజర్లను అదుపులోకి తీసుకున్నారు. డాన్సర్లు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. చదవండి: బలవంతంగా విషం తాగించి హత్య.. కోర్టులో డీఎంకే ఎంపీ లొంగుబాటు -
నాగోల్: నిర్లక్ష్యానికి యువకుడు బలి.. ఈ పాపం ఎవరిది?
సాక్షి, ఉప్పల్: అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. ఈ పాపం తమది కాదంటే.. తమది కాదంటూ రెండు శాఖల అధికారులు ఎవరికి వారు నెట్టేసుకుంటున్నారు. శాఖల మధ్య సమన్వయం లేకపోవడం, జవాబుదారి తనం కొరవడటంతో నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద దిగిన ప్రయాణికుడు విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు విడిచాడు. ఎస్ఐ అంజయ్య తెలిపిన ప్రకారం.. నాగోల్ మోహన్నగర్ ప్రాంతానికి చెందిన దస్తీ నవనీత్(35) కూకట్పల్లిలోని మెడ్ప్లస్లో స్టోర్ సూపర్వైజర్. నిత్యం నాగోల్ మెట్రోస్టేషన్ పార్కింగ్లో తన వాహనాన్ని పార్కు చేసి కూకట్పల్లికి వెళ్తాడు. తిరుగు ప్రయాణంలో నాగోల్ మెట్రో స్టేషన్లో దిగి పార్కు చేసిన వాహనాన్ని తీసుకెళ్తుంటాడు. ఇదే క్రమంలో మంగళవారం రాత్రి చివరి ట్రైన్లో నాగోల్ స్టేషన్లో దిగాడు. పార్కు చేసిన వాహనాన్ని తీసుకునేందుకు ఫుట్పాత్ వద్ద ఉన్న గ్రిల్ పైనుంచి దాటేందుకు ప్రయత్నం చేయగా పక్కనే ఉన్న జీహెచ్ఎంసీ వీధి లైట్ల స్తంభానికి గ్రిల్కు విద్యుత్ ప్రసారం ఉండటంతో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే భూమిలో నుంచి వేసిన విద్యుత్ వైర్లు తేలడం. వర్షం కురవడంతో విద్యుత్ ప్రసారం అయినట్లు పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. సోదరుడు కిషోర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఆడి కారు యాక్సిడెంట్: ఎన్నో అనుమానాలు.. అసలు ఏం జరిగింది? చెప్పిన కూర వండలేదనే కోపంతో భార్యని.. -
ట్యూషన్లో పరిచయం, ఇన్స్ట్రాలో ఫ్రెండ్ రిక్వెస్ట్.. ఆపై!
సాక్షి,నాగోలు: యువతిని వేధిస్తున్న ఓ యువకుడిని రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సఫిల్గూడకు చెందిన ముముడి సాయిమాధవ్(19) విద్యార్థి. బాధితురాలు ట్యూషన్లో పరిచయం కావడంతో ఇన్స్ట్రాగామ్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. ఆ తర్వాత ఆమె అంగీకిరించింది. కొంత కాలం ఆమెతో మామూలుగా చాట్ చేసేవాడు. అతని విచిత్ర ప్రవర్తన కారణంగా కొంత కాలం తర్వాత అతడిని బ్లాక్ చేసింది. దీంతో నిందిడుతు ఆమెపై పగ పెంచుకున్నాడు. బాధితురాలి మొబైల్ నంబర్ను పోర్న్ వెబ్సైట్లో పెట్టి కాల్గర్ల్గా అప్లోడ్ చేశాడు. వెంటనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి అతడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పెట్టుబడి పెడితే డబుల్ రిటర్న్స్ అంటూ మోసం సాక్షి,నాగోలు: ఆన్లైన్ పెట్టుబడులు పెడితే ఎక్కవ డబ్బులు వస్తాయని నిమ్మించి మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఎల్బీనగర్లోని రాచకొండ సీపీ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ మహేష్భగవత్ వివరాలు వెల్లడించారు. నేపాల్, ఖాట్మండుకు చెందిన తారా బహదూర్ (33) న్యూఢిల్లీ వచ్చి పాండవ్నగర్, లక్ష్మీనగర్లో నివాసం ఉంటున్నాడు. న్యూఢిల్లీలో నివాసం ఉంటూ ట్రావెల్ ఏజెంట్గా పని చేస్తున్నాడు. తరువాత తన స్నేహితుల ద్వారా సైబర్ మోసాల గురించి తెలుసుకున్నాడు. నిందితుడు తారా బహదూర్, వివరాలు వెల్లడిస్తున్న రాచకొండ సీపీ మహేష్భగవత్ ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, ఇతర ఆన్లైన్ ప్లాట్ఫాంలో ఖాతాలు సృష్టించి ఇన్వెస్టిమెంట్, డబుల్ రిటరŠన్స్ అంటూ మోసాలకు పాల్పడుతున్నాడు. యూరోషియాకు చెందిన వ్యక్తిగా ఆన్లైన్లో నమ్మించేవాడు. తక్కవ పెట్టుబడిపై వారు చెప్పినట్లుగా రూ.వెయ్యి, రూ.500 తిరిగి డబుల్ రిటరŠన్స్ ఇచ్చి పలువురిని నమ్మించాడు. ఎక్కువ పెట్టుబడి పెట్టినా డబుల్ రిటర్న్స్ అంటూ నమ్మించి డబ్బులు కాజేశాడు. కొత్త మంది ఏజెంట్ల సాయంతో సిమ్కార్డులు తీసుకుని తరుచు సైబర్ నేరాలకు పాల్పడుతున్నాడు. ఆధార్, పాన్కార్డులు, రెండు సిమ్కార్డులు, కోటక్ మహీంద్ర బ్యాంక్లో ఉన్న రూ. 3 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు. కార్యక్రమంలో సైబర్ క్రైమ్ ఏసీపీ హరినాథ్, సీఐ వెంకటేష్ పాల్గొన్నారు. -
మాట వినకపోవడంతో ఫోటోలు మార్ఫింగ్ చేసి.. నెట్టింట్లో పోస్ట్
సాక్షి, నాగోలు: మహబుబ్నగర్ జిల్లాకు చెందిన పీట సంతోష్ ఆలియన్ లడ్డు(28) నిరుద్యోగి. బ్యాక్డోర్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తాని డబ్బులు తీసుకుని మోసాలకు పాల్పడుతున్నాడు. సంతోష్ ఇన్స్ట్రాగామ్లో బాధితురాలని పరిచయం చేసుకుని ఆమె ఫోన్నంబర్ సేకరించి వాట్సాప్లో చాటింగ్ చేసేవాడు. ఈ క్రమంలో ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.50వేల చెల్లించాలని ఆమెను కోరాడు. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఆమెపై పగ పెంచుకున్న సంతోష్ అసభ్యకరంగా ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేశాడు. ఆ తరువాత సోషల్ మీడియాలో ఆ ఫొటోలను ఆప్లోడ్ చేశాడు. మరో యువతిని వాట్సాప్ ద్వారా పరిచయం చేసుకుని రైల్వే విభాగంలో ఉద్యోగం ఇప్పిస్తానని ఆమె నుంచి రూ.3,03,00లక్షలు వసూలు చేశాడు. ఆ తరువాత యువతి ఫోన్కాల్స్ ఎత్తడం మానేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టి సంతో‹Ùను మంగళవారం అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి సెల్ఫోన్ను స్వా«దీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. గతంలో మహబూబ్నగర్ 2వ పట్టణ పోలీస్స్టేషన్, సుల్తాన్బజార్, వరంగల్ ఇంతెజార్ గంజ్ పీఎస్లలో అరెస్టై బెయిల్పై బయటకి వచ్చాడని పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో యువకుడి అరెస్టు -
ఆన్లైన్ పోర్న్ సినిమాలకు బానిసై.. విపరీత చేష్టలు
నాగోలు: డబ్బులు ఇవ్వకుంటే కుంటుంబ సభ్యుల ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మహబూబ్నగర్ జిల్లా, నారాయణపేట మండలం, పల్లా అర్జున్వాడాకు చెందిన తుము భారత్కుమార్(22) ప్రస్తతం బీఏ చదువుతున్నాడు. నిందితుడు ఆన్లైన్ పోర్న్ సినిమాలకు బానిసయ్యాడు. ఆన్లైన్లో కాల్బాయ్ అని చెప్పుకుంటూ తన కాంటాక్ట్ నంబర్ను లోకాంటో, స్కోక్కా వంటి వివిధ వైబ్సైట్లలో ఫోన్ నంబర్ పోస్ట్ చేశాడు. అక్కడ ఉండి స్పందనలు రాకపోవడంతో నిందితుడు ఇన్స్ట్రాగామ్లో ఓ వ్యక్తికి గూగుల్ హ్యాంగ్అవుట్స్లో చాట్ చేయమని కోరాడు. దీంతో కొన్ని రోజులు వారు చాట్ చేస్తూ బాధితుడి వ్యక్తిగత, కుటుంబ వివరాలన్నీ సేకరించాడు. ఆ తరువాత ఇన్స్టాగ్రామ్ ప్రోఫైల్ సృష్టించి అక్కడ నుంచి నిందితుడిని బ్లాక్మెయిల్ చేస్తూ కుటుంబ సభ్యుల ఫోటోలు తన దగ్గర ఉన్నాయి డబ్బులు ఇవ్వకుంటే సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులకు దిగాడు. వేధింపులు ఎక్కువ కావడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సోమవారం భారత్కుమార్ను అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి సెల్ఫోన్ స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. శ్రీలతారెడ్డిపై పీడీ యాక్ట్ హస్తినాపురం: బెదిరింపులు తప్పుడు ఫిర్యాదులు చేసి పోలీసులను సైతం వేధించి అక్రమంగా లక్షల్లో డబ్బులు వసూలు చేసిన కిలాడీ లేడీ శ్రీలతారెడ్డిపై రాచకొండ సీపీ మహేశ్భగవత్ సోమవారం పీడీ యాక్టు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వనస్థలిపురం పోలీస్స్టేషన్ పరిధిలోని నాగార్జునకాలనీకి చెందిన ఎలిమినేటి శ్రీలతారెడ్డి(34) సాధారణ ప్రజల దగ్గర చిట్టీల పేరుతో డబ్బులు వసూలు చేసేది. తిరిగి డబ్బులు అడిగితే వారిపైనే పోలీసులకు తప్పడు ఫిర్యాదు చేసేది. కులం పేరుతో మహిళను దూషించిన కేసులో వనస్థలిపురం పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత తన పంథా మార్చుకోకుండా శ్రీలతారెడ్డి పోలీసు అధికారులపై తప్పుడు ఫిర్యాదులు చేసింది. దీనిపై సీపీ సమగ్ర విచారణ చేపట్టి పీడీ యాక్టు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. చదవండి: భార్యను తిట్టాడని ఆవేశంతో.. కన్న తండ్రినే -
నాగోల్లో కారు బీభత్సం.. హోంగార్డుకు తీవ్ర గాయాలు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని నాగోల్ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం కారు బీభత్సం సృష్టించింది. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి నగరంలో కర్ఫ్యూ అమల్లో ఉన్న నేపథ్యంలో నాగోల్ చెక్పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న TS08AA0117 నంబర్ గల కారును అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో డ్రైవర్ కారు ఆపకుండా అతివేగంతో అక్కడి నుంచి దూసుకెళ్లాడు. దీంతో అక్కడ తనఖీలు చేస్తున్న పోలీసులు సెట్ ద్వారా అలర్ట్ చేయడంతో ఎల్బీనగర్లో కారును ఆపేందుకు అక్కడే విధుల్లో ఉన్న హోంగార్డ్ రమేష్ ప్రయత్నించాడు. అయితే అతి వేగంతో దూసుకొచ్చిన కారు డ్రైవర్ రమేష్ను ఢీకొట్టి క్షణాల్లో అక్కడి నుంచి ఉడాయించాడు. ఈ ఘటనలో హోంగార్డు రమేష్కు తీవ్రగాయాలు కావడంతో దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలసుకున్న రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఆస్పత్రికి వెళ్లి హోంగార్డును పరామర్శించి, ఘటనపై ఆరా తీశారు. -
కానిస్టేబుల్తో ఎఫైర్.. అసభ్యకరమైన మెసేజ్లు
సాక్షి, నాగోలు: తనను పెళ్లి చేసుకోలేదని కోపంతో నకిలి ఇన్స్ట్రాగామ్, ఫేస్బుక్ ఖాతాలను సృష్టించి బాధితుడి భార్యకు, అతని కుటుంబ సభ్యులకు అసభ్యకరమైన మెసేజ్లు పెడుతున్న ఓ మహిళను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నాగోలు ప్రాంతంలో ఉండే ఎఆర్ కానిస్టేబుల్కు బండ్లగూడలో ఉండే అల్లూరి నేహా అలియస్ బ్లెస్సీ (33)తో జిమ్కు వెళ్లే సమయంలో పరిచయం అయింది. కొంతకాలం ప్రేమించున్నారు. అప్పటికే ఎఆర్ కానిస్టేబుల్కు పెళ్లి అయి భార్య ఉంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మంచి తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఎల్బీనగర్ పోలీసులకు నేహా ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కానిస్టేబుల్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అతడి ఉద్యోగి కూడా పోయింది. బెయిల్ మీద బయటకు వచ్చిన అతనిపై, అతని కుటుంబ సభ్యులపై పగ పెంచుకున్న నేహా నకిలీ ఇన్స్ట్రాగామ్, ఫేస్బుక్ ఖాతాలను సృష్టించి, కొత్త మొబైల్ నంబర్ల ద్వారా అసభ్యకర సందేశాలను పంపడం ప్రారంభించింది. దీంతో బాధితులు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాచకొండ సైబర్ క్రైమ్ సీఐ ప్రకాష్ కేసు నమోదు చేసుకుని నేహాను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితురాలు నేహా చదవండి: ‘ఇప్పుడే వివాహం చేసుకోవడం ఇష్టం లేదు’ తిన్నది అరగడం లేదు సార్..అందుకే బయటకు వచ్చా.. -
ఇన్స్టాగ్రామ్లో లవర్ పర్సనల్ ఫోటోలు.. యువకుడి అరెస్ట్
సాక్షి, నాగోలు: నకిలీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్తో యువతిని వేధిస్తున్న వ్యక్తిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తికి చెందిన నారాయణ దాస్ మణి ప్రకాశ్(28) కొరియోగ్రాఫర్ పనిచేస్తున్నాడు. 2020లో ఒక షార్ట్ ఫిల్మ్లో యువతి నటించింది. ఆ సమయంలో ఇద్దరూ ప్రేమించుకున్నారు. షూటింగ్ సమయంలో తీసిన యువతి ఫోటోలను నిందితుడు తన మొబైల్లో సేవ్ చేసుకున్నాడు. తరువాత ఇద్దరి మధ్యా మనస్పర్థలు వచ్చాయి. దీంతో ఇన్స్టాగ్రామ్ నకిలీ అకౌంట్ ఓపెన్ చేసి ఆమె ప్రైవేటు ఫోటోలను అప్లోడ్ చేశాడు. విషయం తెలుసుకున్న యువతి రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి శుక్రవారం మణి ప్రకాశ్ అరెస్ట్చేసి అతని వద్ద నుంచి సెల్ఫోన్ స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. చదవండి: ఆన్లైన్ డేటింగ్ పేరుతో వ్యభిచారం.. కస్టమర్గా ఫోన్చేసి.. తండ్రి రాక్షసత్వం, భార్యపై కోపంతో ఇద్దరు పిల్లలను.. -
దారుణం: రూ.6.50 లక్షలు డబ్బు కట్టు.. శవాన్ని తీసుకెళ్లు
సాక్షి, హైదరాబాద్: కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ మరణించిన వ్యక్తి శవాన్ని రూ.6.5 లక్షలు కడితేనే అప్పగిస్తామన్న ఆస్పత్రి యాజమాన్యం.. మూడురోజుల పాటు మృతదేహాన్ని ఆస్పత్రి సెల్లార్లో ఉంచిన దారుణ సంఘటన మంగళవారం వెలుగుచూసింది. హైదరాబాద్ నాగోలు ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ సైనిక్పురికి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి (41) కరోనా లక్షణాలతో ఈ నెల 17వ తేదీన నాగోలు ప్రధాన రహదారిపై ఉన్న ఒక ఆస్పత్రిలో చేరాడు. చేరే సమయంలో రూ.1.40 లక్షలు, ఆ తర్వాత పరీక్షలంటూ రూ.53,800, మందుల పేరిట అదనంగా వసూలు చేశారు. ఇంతజేసినా ఫలితం దక్కలేదు. ఈ నెల 25వ తేదీన అతను మరణించినట్లు కుటుంబసభ్యులకు ఆస్పత్రి యాజమాన్యం సమాచారం ఇచ్చింది. దీంతో వారు మృతదేహాన్ని తీసుకెళ్ళేందుకు రాగా, తమకు ఇంకా రావాల్సిన రూ.6.5 లక్షలు కడితే కానీ మృతదేహం అప్పగించబోమని తేల్చిచెప్పింది. తమ వద్ద ఇప్పుడు అంత డబ్బులు లేవని, మృతదేహాన్ని ఇస్తే రెండురోజుల్లో సర్దుబాటు చేస్తామని ఆ ఉద్యోగి కుటుంబసభ్యులు చెప్పారు. అయినా ఆస్పత్రి యాజమాన్యం వినిపించుకోలేదు. డబ్బులు కడితేనే మృతదేహాన్ని ఇస్తామని స్పష్టం చేసింది. దిక్కుతోచని పరిస్థితుల్లో కుటుంబసభ్యులు ఆస్పత్రి నుంచి వెళ్లిపోగా ఆస్పత్రి సిబ్బంది మృతదేహాన్ని బాక్సులో పెట్టి హాస్పిటల్ సెల్లార్లో ఉంచారు. డబ్బుల కోసం ప్రయత్నించినా.. తెలిసిన వారి దగ్గర డబ్బుల కోసం విఫల ప్రయత్నం చేసిన కుటుంబసభ్యులు మంగళవారం ఆస్పత్రి వద్దకు చేరుకుని తాము చేసిన ప్రయత్నాలు వివరించారు. మృతదేహాన్ని ఇవ్వాల్సిందిగా అభ్యర్థించారు. ఆస్పత్రి యాజమాన్యం కనికరించకపోవడంతో బంధువులతో పాటు ఆందోళనకు దిగారు. ఎల్బీనగర్ పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకుని ఆందోళన చేస్తున్న వారికి సర్ది చెప్పారు. హాస్పిటల్ నిర్వాహకులతో మాట్లాడి మృతదేహాన్ని అతని కుటుంబసభ్యులకు అప్పచెప్పారు. దీనిపై వివరణ ఇచ్చేందుకు హాస్పిటల్ వర్గాలు నిరాకరించాయి. మానవత్వం మరిచిపోయారు మృతదేహాన్ని మూడురోజులు ఆస్పత్రి సెల్లార్లో ఉంచిన యాజమాన్యం మానవత్వం మరిచి వ్యవహరించిందని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి యజమానిని కోల్పోయిన తాము, మృతదేహాన్ని ఇవ్వకపోవడంతో మరింత మనోవేదనకు గురయ్యామని వాపోయారు. రోగులను ఆదుకోవాల్సిన హాస్పిటల్ నిర్వాహకులు కేవలం డబ్బుల కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. ఐసీయూలో పది మంది కరోనా పేషెంట్లకు ఒకే నర్స్ చికిత్స చేస్తోందని తెలిపారు. సరైన చికిత్స చేయకపోగా, రోగుల నుంచి అందిన కాడికి దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఈ ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. చదవండి: పిట్టల్లా కాల్చేసిన గ్యాంగ్స్టర్: రెండు ప్రాణాలు బలి చదవండి: మదనపల్లె హత్య: నిందితులకు బెయిల్ -
మహిళ నంబర్ను షేర్చాట్లో పెట్టి కాల్గర్ల్గా..
సాక్షి, హైదరాబాద్: తీసుకున్న డబ్బులు చెల్లించాలని అడిగినందుకు ఓ మహిళ ఫోన్ నంబర్ను షేర్ చాట్లో పెట్టి కాల్ గర్ల్గా చిత్రీకరించిన వ్యక్తిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మగ్గుల మండలం, కలకండ గ్రామానికి చెందిన నాగిల్లా యశ్వంత్ (19) తన బంధువుల వద్ద రూ.2వేల అప్పు తీసుకున్నాడు. డబ్బులు సకాలంలో తిరిగి ఇవ్వకపోవడంతో వారు యశ్వంత్ తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో వారు అతడిని మందలించడంతో బాధితురాలిపై భర్తపై పగ పెంచుకున్నాడు. వారి పరుపు తీయాలని ఉద్దేశంతో యశ్వంత్ షేర్చాట్లో బాధితురాలి ఫోన్ నంబర్ను పెట్టాడు. దీంతో బాధితురాలికి నిత్యం ఫోన్లు రావడంతో రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు సాంకేతిక ఆధారాలను సేకరించి సోమవారం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. చదవండి: బాలికపై లైంగిక దాడి.. కోర్టు షాకింగ్ తీర్పు! బంజారాహిల్స్: అర్ధరాత్రి 12 గంటలకు యువతి ఇంట్లోకి వెళ్లి.. -
యూకే నుంచి బహుమతి అంటూ... రూ.18 లక్షలు స్వాహా
సాక్షి, నాగోలు: యూకే నుంచి బహుమతి పార్శిల్ వచ్చిందని, దానిని మీకు ఇవ్వాలంటే ఢిల్లీ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు చార్జీలు చెల్లించాలని నమ్మించి రూ.18 లక్షలు కాజేసిన ఘటనలో ఇద్దరు వ్యక్తులను శనివారం రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నైజీరియాకు చెందిన హెన్రీ చుక్వుని ఒపెరా మెడికల్ వీసాపై భారత్ వచ్చి కర్టాటకకు చెందిన మహిళను వివాహం చేసుకుని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గౌతమ్ బుద్ద నగర్లో నివాసం ఉంటున్నాడు. న్యూఢిల్లీలో ఫుట్బాల్ కోచ్గా పనిచేసే వ్యక్తితో నైజీరియా జాతీయుడి పరిచయం చేసుకున్నాడు. ఆన్లైన్ మోసాలకు అలవాటు పడ్డారు హెన్రీ ఫుట్బాల్ ఆడటానికి వచ్చేవాడు. అక్కడే ఉండే మరోక నైజీరియా చెందిన చీమా ఫ్రాంక్ను ఇతర స్నేహితులకు పరిచయం చేశాడు. అందరూ కలసి ఆన్లైన్ బహుమతి మోసాలు, ఉద్యోగ మోసాలు, రుణ మోసాలు పాల్పడి డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఆన్లైన్ మోసాలు చేయడం ప్రారంభించారు. బహుమతులు పంపే నెపంతో నగరంలోని ఓ వ్యక్తికి హెన్రీ చుక్వుని ఒపెరా మెసేజ్ పెట్టాడు. యూకే నుంచి కరెన్సీలో పెద్ద మొత్తంలో బహుమతి వచ్చింది.. ఢిల్లీ విమానాశ్రమంలో ఉంది. దానిని మీకు పంపించాలంటే కస్టమ్ అధికారులకు ప్రాసెసింగ్ చార్జీలు చెల్లించాలని స్థానికంగా ఉండే నోయిడాకు చెందిన ఆటో డ్రైవర్ సూరజ్ బ్యాంకు ఖాతాల్లో రూ. 18 లక్షలు నగదు బదిలీ చేయించుకున్నారు. ఆటో డ్రైవర్కు రూ. 55 వేలు నగదు అందజేశాడు. మోసపోయినట్లు తెలుసుకున్న బాధితుడు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సాంకేతిక ఆధారాలతో హెన్రీ చుక్వుని ఒపెరా, ఆటో డ్రైవర్ సూరజ్లను అరెస్టు చేశారు. వీరి నుంచి నగదు ఇతర సామగ్రి స్వాధీనం చేసుకుని శనివారం రిమాండ్కు తరలించారు. ( చదవండి: సైబర్ నేరగాళ్ల చేతి వాటం.. రూ.1.2 లక్షలు స్వాహా ) -
చదువులో వెనకబడ్డానని.. బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, నాగోలు: చదువులో వెనకపడుతున్నానని మనస్తాపానికిలోనైన బీటెక్ విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. క్రిష్ణా జిల్లా, అనిగండ్లపాడు గ్రామానికి చెందిన దాసరి డేవిడ్ రాజు నగరానికి వలసవచ్చి ఎల్బీనగర్ సెంట్రల్ బ్యాంకు కాలనీలో ఉంటూ సెక్యురిటీ గార్డుగా పని చేస్తున్నాడు. అతని కుమారుడు దాసరి చందు (21) మంగళపల్లిలోని ఏవీఎన్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అతడికి బీటెక్ రెండో సంత్సరం సబ్జెక్టులు మిగిలిపోయాయి. ఈ విషయమై తరచూ బాధపడేవాడు. ఆదివారం కుటుంబసభ్యులు బయటికి వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న చందు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మధ్యాహ్నం చర్చి నుంచి తిరిగి వచ్చిన అతడి తల్లి కిటికీలో నుంచి చూడగా చందు సీలింగ్ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు. బలవంతంగా తలుపులు తెరిచి చందును కిందకి దించి 108కు సమాచారం అందించారు. 108 సిబ్బంది అతడిని పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి తండ్రి డేవిడ్ రాజు ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే.. -
డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడిన 121 మంది
సాక్షి, నాగోలు: రాచకొండ పోలీస్ కమిషరేట్ పరిధిలో గురువారం ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్లో 121 మంది పట్టుబడినట్లు ట్రాఫిక్ ఇన్చార్జి డీసీపీ జి.మనోహర్ తెలిపారు. మద్యం తాగి వాహనం నడిపిన వారిలో 10 మందిని జైలుకు పంపించినట్లు ఆయన చెప్పారు. రెండోసారి పట్టుబడిన ఓ ఆటో డ్రైవర్కు పెనాల్టీతో పాటు ఆరు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేశామన్నారు. మొత్తం రూ.2.32 లక్షల జరిమానా విధించినట్లు డీసీపీ మనోహర్ పేర్కొన్నారు. -
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, నాగోలు: తండ్రి పడుతున్న ఆర్థిక ఇబ్బందులు చూడలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. ఎల్బీనగర్ పోలీసుల వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా, చిట్యాల గ్రామానికి చెందిన యర్రమాద సదానంద్ టైలర్గా పనిచేసేవాడు. లాక్డౌన్ కారణంగా చిట్యాలలో పనిలేక పోవడంతో భార్య సంధ్య, కుమారుడు శివప్రసాద్ (24)కుమార్తె స్వాతిలతో కలసి సదానంద్ నగరానికి వచ్చాడు. ఎల్బీనగర్ కాకతీయనగర్ కాలనీలో అద్దె ఇంట్లో ఉంటూ స్థానికంగా ప్లంబర్గా పని చేస్తున్నాడు. అతని కుమారుడు సీతాఫల్మండిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. సదానంద్ ప్లంబర్గా పని చేస్తున్నా ఆదాయం రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. విషయం తెలుసుకున్న కుమారుడు గత కొద్ది రోజులుగా ముబావంగా ఉంటున్నా డు. ఆదివారం మధ్యాహ్నం అతడి తల్లి సంధ్య, సోదరి స్వాతి బయటకు వెళ్లిన సమయంలో శివప్రసాద్ ఇంట్లోని సీలింగ్ రాడుకు లుంగీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇరుగుపొరుగు వారి సాయంతో తలుపులు తీసి చూడగా అప్పటికే అతడు మృతి చెందాడు. ఆర్థిక సమస్యలతోనే కుమారుడు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని సదానందం ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్ట్మార్టం ఉస్మానియా హాస్పిటల్ మార్చురీకి తరలించారు. -
మెట్రో: అపోలో ఆస్పత్రికి చేరుకున్న గుండె
సాక్షి, హైదరాబాద్: గుండె మార్పిడి శస్త్ర చికిత్స కోసం తొలిసారిగా వైద్యులు హైదరాబాద్ మెట్రోరైలును వినియోగించారు. ఎల్బీనగర్ కామినేని నుంచి జూబ్లీహిల్స్ అపోలోకు గుండెను తరలించారు. కాగా నల్లగొండ జిల్లాకు చెందిన 45 ఏళ్ల రైతు నర్సిరెడ్డి బ్రెయిన్డెడ్ కావడంతో ఆయన కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు వచ్చారు. దీంతో గుండె అవసరమున్న వ్యక్తికి డాక్టర్ గోఖలే నేతృత్వంలో శస్త్రచికిత్స చేయనున్నారు. అయితే ట్రాఫిక్ సమస్య కారణంగా గుండె తరలింపు జాప్యం అయ్యే అవకాశం ఉన్నందున, నాగోల్ నుంచి 40 కిలోమీటర్ల స్పీడ్తో పీఏ సిస్టమ్ టెక్నాలజీ ద్వారా గుండె తరలించేందుకు వైద్యులు ఏర్పాట్లు చేశారు. -
కాల్ గర్ల్గా నెట్లో పేరు పెట్టి..
నాగోలు: ప్రేమను నిరాకరించడంతో ఆమెపై కోపం పెంచుకుని.. నకిలీ ఈమెయిల్ ఐడీ సృష్టించి కాల్ గర్ల్గా నెట్లో ఉంచి వేధిస్తున్న యువకుడిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్టుచేసి రిమాండ్ తరలించారు. సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన మేరకు.. కింగ్ కోఠిలో నివాసముండే సమీర్ ఇబ్రహీపట్నం దగ్గరలోని ఎంఆర్ఎం కళాశాలలో ఎంబీఎ రెండో సంవత్సరం చదువుతున్నాడు. తన క్లాస్మేట్ అయిన విద్యార్ధినితో పరిచయమైంది. ఇద్దరూ స్నేహితులుగా ఉన్నారు. రోజూ చాటింగ్చేసేవారు. ఈ క్రమంలో సమీర్ యువతితో ప్రేమిస్తున్నానని చెప్పడంతో నిరాకరించింది. ఆ తరువాత మాట్లాడటం మానేసింది. ఆమెపై కోపం పెంచుకున్న సమీర్.. తన స్మోర్ట్ ఫోన్ ద్వారా లోకాంటో డేటింగ్ వెబ్సైట్లో నకలీ జిమెయిల్ అకౌంట్ సృష్టించాడు. ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న అశ్లీల ఫొటోకు ఆమె పేరు, ఫోన్ నంబర్లను జోడించి కాల్ గర్ల్గా చూపించి ఇంటర్ నెట్లో పెట్టాడు. విషయం తెలుసుకున్న యువతి రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం మొహద్ సమీర్ను కింగ్ కోఠీలో అరెస్టు చేసి అతని వద్ద స్మార్ట్ఫోన్, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకుని రిమాండ్ తరలించారు.(చదవండి: ప్రసాద్ మరణం.. అన్నీ అనుమానాలే... ) చాయ్ డబ్బు అడిగినందుకు గుడిసెను తగులబెట్టాడు నాగోలు: చాయ్ తాగిన అనంతరం డబ్బు అడిగినందుకు.. అర్ధరాత్రి సమయంలో చాయ్ గుడెసెను పెట్రోల్ పోసి తగలబెట్టాడో వ్యక్తి. ఎల్బీనగర్ పోలీసులు తెలిపిన మేరకు.. ఎన్టీఆర్నగర్లో నివాసముండే పందిరి గండమ్మ ఎన్టీఆర్నగర్లో చింతచెట్లు దగ్గర చిన్న గుడిసె వేసుకుని చాయ్ విక్రయాలు సాగిస్తోంది. అదే ప్రాంతానికి చెందిన షబ్బీర్(40) స్థానికంగా బైక్ మెకానిక్ పనిచేస్తుంటాడు. తరుచుగా షబ్బీర్ గండమ్మ దగ్గర చాయ్ తాగుతూ డబ్బులు తరువాత ఇచ్చేవాడు. బాకీ పెరిగిపోవడంతో షబ్బీర్ను నిలదీసింది. ఇది మనసులో పెట్టుకున్న షబ్బీర్ గతనెల 25న అర్ధరాత్రి 2 గంటల సమయంలో మద్యం మత్తులో చాయ్ గుడిసెపై పెట్రోల్ పోసి తగలబెట్టి పారిపోయాడు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఎల్బీనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి సీసీకెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించి శుక్రవారం అరెస్టు చేశారు. -
ఇన్స్టాగ్రామ్లో పరిచయం.. ఇంటికి వచ్చి
సాక్షి, నాగోలు: ఇన్స్టాగ్రామ్లో అయిన పరిచయంతో ఆకలవుతుందని ఇంటికి వచ్చి బంధించి సొత్తును దొంగిలించిన అంతర్రాష్ట్ర నేరస్తులను ఎల్బీనగర్ సీసీఎస్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ.26 లక్షల విలువ చేసే సామగ్రిని స్వాదీనం చేసుకున్నారు. సోమవారం ఎల్బీనగర్లో రాచకొండ సీపీ మహేష్ భగవత్ వివరాలు వెల్లడించారు. కర్ణాటకకు చెందిన నిఖిల్, వినయ్ చౌదరి, ఉదయ్ కుమార్, బ్రహ్మ తేజలు చిన్నానాటి స్నేహితులు. నలుగురూ నేరాల బాట పట్టారు. వనస్థలిపురంలో స్వచ్చంద హెల్ప్ కిడ్స్ హ్యాపీ కిడ్స్ అనే సంస్థ నడిపే సతీష్తో ఇన్స్ట్రాగామ్ లో పరిచయం పెంచుకున్న నిఖిల్ అతని ఆర్థిక లావాదేవీల గురించి తెలుసుకున్నాడు. చదవండి: మొన్న తమ్ముడు.. నేడు అన్న సతీష్ దగ్గర డబ్బు కొట్టేయాలని ప్లాన్ చేసుకున్నారు. ఈ క్రమంలో నిందితులు బొమ్మ పిస్టల్ తీసుకొని వచ్చారు. ఈ నెల 15వ తేదీన వనస్థలిపురంలో నివాసముండే సతీష్ ఇంటికి నలుగురూ వచ్చారు. హఠాత్తుగా సతీష్పై దాడి చేసి నోరు మూసి తాడుతో చేతులు కట్టి బొమ్మ పిస్టల్తో బెదిరించి. నగదు. రూ.1.18 లక్షల నగదు, విదేశీ, కరెన్సీ, రెండు ల్యాప్టాప్లు, మూడు మొబైల్ ఫోన్లు, సిల్వర్ నెక్లెస్ దోపిడీ చేశారు. తరువాత బళ్లారికి పారిపోయారు. మళ్లీ నేరం చేసేందుకు సోమవారం శంషాబాద్కు వచ్చారు. నిందితులపై నిఘా ఉంచిన ఎల్బీనగర్ సీసీఎస్ పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.26 విలువ చేసే వస్తువులను స్వాదీనంచేసుకున్నారు. -
అటవీశాఖ అధికారి వీబీ రమణమూర్తి ఆత్మహత్య
-
మళ్లీ మెట్రో పరుగు
సాక్షి, హైదరాబాద్: ఐదు నెలల విరామం తరవాత మెట్రో రైళ్లు నగరంలో సోమ వారం మళ్లీ పరుగుపెట్టాయి. మాస్క్, శానిటైజేషన్, భౌతికదూరం నిబంధనలు పాటిస్తూ తొలిరోజు నగరవాసులు మెట్రో జర్నీ చేశారు. ఉదయం 7 నుంచి 12 గంటలు, తిరిగి సాయంత్రం 4 నుంచి 9 గంటల వరకు ఎల్బీనగర్–మియాపూర్ రూట్లో మెట్రో రైళ్లు పరుగులు పెట్టాయి. ప్రతి 8 నిమిషాలకో రైలు నడిచింది. ఒక్కో రైలులో తొలిరోజు 300 మంది మాత్రమే ప్రయాణించినట్లు మెట్రో అధికారులు తెలిపారు. ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, ఎంజీబీఎస్, నాంపల్లి, లక్డీకాపూల్, పంజగుట్ట, అమీర్పేట, ఎస్ఆర్నగర్, కూకట్పల్లి, మియాపూర్ స్టేషన్లలో సోమవారం రద్దీ అంతగా కనిపించలేదు. ప్రయాణి కులు స్టేషన్లలోకి వెళ్లే ముందే మెట్రో సిబ్బంది థర్మల్ స్క్రీనింగ్ చేశారు. శానిటైజర్ అందుబాటులో ఉంచారు. స్మార్ట్కార్డ్, క్యూఆర్ కోడ్ కూపన్ల ఆధారంగానే ప్రయాణాలు సాగాయి. బోగీల్లో కూర్చునేటప్పుడు, నిల్చునేట ప్పుడు భౌతికదూరం ఉండేలా ప్రయాణి కులు జాగ్రత్తపడ్డారు. సోమవారం రాత్రి 9 గంటల వరకు ఎల్బీనగర్–మియాపూర్ రూట్లో 120 ట్రిప్పులు తిరగగా, 19 వేల మంది ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు. నేడు నాగోల్–రాయదుర్గం రూట్లో.. మంగళవారం నాగోల్–రాయదుర్గం మార్గంలో మెట్రో రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12, సాయంత్రం 4 నుంచి 9 గంటల వరకు మెట్రో రైళ్లు అందుబాటులో ఉంటా యి. బుధవారం నుంచి జేబీఎస్–ఎంజీబీఎస్ రూటు సహా 3 మార్గాల్లోనూ మెట్రో రైలు సర్వీసులు అందు బాటులోకి వస్తాయి. ఈ నెలాఖరుకు ఎల్బీనగర్– మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్, నాగోల్–రాయ దుర్గం మార్గాల్లో రోజూ 2 లక్షల మంది ప్రయాణించే అవకాశం ఉందని మెట్రో వర్గాల అంచనా. -
హైదరాబాద్ మెట్రో.. పని వేళల్లో భారీ మార్పులు
సాక్షి, హైదరాబాద్: అన్లాక్ 4.0లో భాగంగా కేంద్రం మెట్రో రైలు సేవలకు అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నగరంలో మెట్రో రైలు సేవలను తిరిగి ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. దీని ప్రకారం మెట్రో కార్యకలాపాలు గ్రేడెడ్ పద్ధతిలో తిరిగి ప్రారంభించబడతాయి. మొదటి దశ మెట్రో సేవలు సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభమవుతాయి. దీనిలో భాగంగా కారిడార్ 1లో (మియాపూర్ నుంచి ఎల్బీ నగర్) సేవలు అందుబాటులోకి వస్తాయి. రెవెన్యూ సేవలు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగుతాయి. ఇక రెండో దశ మెట్రో సేవలు సెప్టెంబర్ 8 నుంచి అందుబాటులోకి వస్తాయి. దానిలో భాగంగా కారిడార్ 3లో (నాగోల్ నుంచి రాయదుర్గ్) మెట్రో సేవలు అందుబాటులోకి వస్తాయి. రెవెన్యూ సేవలు మొదటి దశ మాదిరిగానే ఉంటాయి. (చదవండి: మెట్రో రీ ఓపెన్.. ఫైన్ల మోత) ఇక మూడవ దశ మెట్రో సేవలు సెప్టెంబర్ 9 నుంచి అందుబాటులోకి రానున్నాయి. దీనిలో భాగంగా మూడు కారిడార్లలో(సీ1, సీ2, సీ3) మెట్రో సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇక వీటి రెవెన్యూ సేవలు కేవలం సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి రెండు గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇక ప్రతి ఐదు నిమిషాలకు ఒక రైలు అందుబాటులో ఉండనుంది. రైళ్ల సంఖ్యను పెంచడం అనేది ప్రయాణీకుల రద్దీ ఆధారంగా నిర్ణయించబడుతుంది. ఇక కంటైన్మెంట్ జోన్లలోని స్టేషన్లను ఇప్పట్లో తెరిచే అవకాశం లేదు. అలాగే గాంధీ హాస్పిటల్, భరత్ నగర్, మూసాపేట, ముషీరాబాద్, యూసఫ్గూడ స్టేషన్లు మూసివేత కొనసాగుతుంది -
‘ఆపన్న హస్తం అందించడం విశేషం’
సాక్షి, హైదరాబాద్: రాచకొండ కమీషనరేట్ ఆధ్వర్యంలో గుడ్ సమారిటన్ అవార్డు వేడుక నాగోలు శుభం కన్వెన్షన్ హాలులో వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సంక్షోభ సమయంలో పోలీసులకు సహకరించి పలువురికి సేవలు చేసిన వారికి అవార్డులను బహుకరించారు. పనులు లేక అవస్థలు పడుతున్న పేదవారికి నిత్యావసర వస్తువులను అందజేసిన చిలుకనగర్ డివిజన్ అధ్యక్షులు బన్నాల ప్రవీణ్కు రాచకొండ సీపీ మహేష్ భగవత్ గుడ్ సమారిటన్ అవార్డును అందజేశారు. సీపీ మాట్లాడుతూ.. కరోనా కష్ట కాలంలో ఆపన్న హస్తం అందించడం విశేషమని బన్నాల ప్రవీణ్ను కొనియాడారు. అవార్డు అందుకున్న ప్రవీణ్ మాట్లాడుతూ.. కరోనా కష్ట కాలంలో వికలాంగులు, ఒంటరి మహిళలతో పాటు ఇతరులకు నిత్యావసర వస్తువులను అందజేసినట్లు తెలిపారు. ఇక తాను చేసిన సేవలకు గుర్తింపు రావడం ఆనందంగా ఉందన్నారు. కోవిడ్-19 సమయంలో ఈ సేవా కర్యక్రమాలు చేయడానికి తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. -
ఎంబీబీఎస్ రాక.. బీడీఎస్ ఇష్టం లేక..
నాగోలు: ఎంబీబీఎస్ చదవాలనే కోరికున్నా.. అది రాకపోవడంతో బీడీఎస్ కోర్సులో చేరింది ఓ విద్యార్థిని. అయితే ఎంబీబీఎస్ రాలేదని ఎప్పుడూ అసంతృప్తిగానే ఉండేది. ఈ క్రమంలో మానసిక ఒత్తిడికి గురై అపార్ట్మెంట్లోని 14వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్బీనగర్ సాగర్ రింగ్ రోడ్ సమీపంలోని అలేఖ్య టవర్స్లో 14వ అంతస్తులో రఘురాం, పద్మ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి కుమార్తె కేపీఎస్ సాహితీ (25) కోఠిలోని ఉస్మానియా ప్రభుత్వ డెంటల్ కాలేజీలో బీడీఎస్ నాలుగో సంవత్సరం చదువుతోంది. గతంలో రెండుసార్లు ఎంబీబీఎస్ పరీక్షలు రాసినా సీటు రాలేదు. తల్లిదండ్రులు నచ్చజెప్పడంతో అయిష్టంగానే బీడీఎస్లో చేరింది. అప్పుడప్పుడూ ఈ కోర్సు చేయడం ఇష్టం లేదని.. ఎంబీబీఎస్ సీటు వస్తే బాగుండేదని తల్లిదండ్రులతో అంటుండేది. కాగా, ఫిబ్రవరిలో సాహితీ అన్నయ్య కృష్ణ భరద్వాజ్ అమెరికా నుంచి భార్యతో కలసి వచ్చాడు. లాక్డౌన్ కారణంగా వారు ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో సికింద్రాబాద్లోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తున్న రఘురాం ఎప్పటిలాగానే మంగళవారం విధులకు వెళ్లారు. బీడీఎస్ కోర్సు చేయడం ఇష్టం లేని సాహితీ మానసికంగా ఆందోళనకు గురై.. మధ్యాహ్నం 12 గంటల సమయంలో అపార్ట్మెంట్ 14వ అంతస్తులోని బాల్కనీలో ఉన్న గ్రిల్స్ తొలగించి పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇది గమనించిన అపార్ట్మెంట్ వాచ్మన్ ఇంట్లో ఉన్న తలిక్లి సమాచారం అందించాడు. తల్లి, ఇతర కుటుంబసభ్యులు కిందకు వచ్చి సాహితీని పరిశీలించే సరికే ఆమె రక్తపు మడుగులో మృతి చెంది ఉంది. వెంటనే కుటుంబసభ్యులు రఘురాం కు సమాచారం ఇచ్చారు. కూతురి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ‘సోమవారం సాయంత్రమే.. ఎంబీబీఎస్ చేస్తే బాగుండేది. బీడీఎస్ కోర్సు అయిష్టంగా చదవాల్సి వస్తోంది. దీనికి భవిష్యత్ అవకాశాలు కూడా సరిగా లేవని వాపోయింది. ఇంత పని చేస్తుందని ఊహించలేద’ని రఘురాం పేర్కొన్నారు. ఆత్మహత్య సమాచారం అందుకు న్న ఎల్బీనగర్ డీఐ కృష్ణమోహన్, ఎస్ఐ ఎస్.సుధాకర్ ఘటనాస్థలికి చేరుకు ని మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. తండ్రి రఘురాం ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఇక్కడి అమ్మాయి.. అక్కడి అబ్బాయి
సాక్షి, నాగోలు: తెలంగాణ అమ్మాయి.. ఇంగ్లాండ్కు చెందిన అబ్బాయి ఇద్దరూ ఇష్టపడ్డారు. పెద్దలను ఒప్పించి ఒక్కటయ్యారు. గురువారం హిందూ సంప్రదాయం ప్రకారం ఇరువురి కుటుంబాల సమక్షంలో నాగోలు పీఎంఆర్ కన్వెన్షన్లో వీరి వివాహం ఘనంగా జరిగింది. నల్గొండ జిల్లా మునుగోడు మండలం పలివెలకు చెందిన కొండవీటి విఘ్నేశ్వర్ రెడ్డి, లత భార్యాభర్తలు. వీరు కొంతకాలం క్రితం నగరానికి వచ్చి ఎల్బీ నగర్లో నివాసముంటున్నారు. వీరి కుమార్తె సింధూజ ష్యాషన్ డిజైన్ కోర్సు చేయడానకి ఎనిమిదేళ్ల కిందట ఇంగ్లాండ్కు వెళ్లింది. ఈ క్రమంలో అక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగి బెంజిమిన్ డేవిడ్ హాస్తో ఆమెకు రెండేళ్ల కిందట పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయాన్ని తల్లిదండ్రులకు తెలిపారు. ఇరువురి తల్లిదండ్రులూ అంగీకరించటంతో వీరి వివాహం జరిగింది. వివాహ వేడుకకు వరుడి తల్లిదండ్రులు జోమే హాస్, రోబెక్ట్ హాస్తో పాటు వారి బంధువులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. -
శ్రీవైష్ణవి ఆస్పత్రి ఎండీ ఆత్మహత్య
నాగోలు: భవనం ఖాళీ చేయాలని యజమానితోపాటు మరికొందరు వేధించడంతో మనస్తాపం చెందిన ఓ ఆస్పత్రి ఎండీ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. వనపర్తి జిల్లా శాఖాపూర్(వై) గ్రామానికి చెందిన అజయ్కుమార్(38).. భార్య శ్వేత, కుమారులు వర్షిత్, హర్షిత్తో కలసి బీఎన్ రెడ్డి నగర్లో ఉంటున్నాడు. సాగర్ రింగ్ రోడ్డు సరస్వతి నగర్ కాలనీలో ఉండే కరుణరెడ్డి ఓ బిల్డింగ్ నిర్మిస్తోన్న క్రమంలో అందులో ఆస్పత్రి ఏర్పాటుకు అజయ్ రూ.10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాడు. అయినా నిర్మాణం పూర్తి చేయకపోవడంతో అజయ్ మరికొంత డబ్బుతో పూర్తిచేసి శ్రీవైష్ణవి హాస్పిటల్ను ఏర్పాటు చేసుకున్నాడు. తను మేనేజింగ్ డైరెక్టర్గా ఉంటూ డాక్టర్లతో ఆస్పత్రిని నడిపిస్తున్నాడు. కొంతకాలంగా ఆస్పత్రి సరిగా నడవక అద్దె ఆలస్యం కావడంతో బిల్డింగ్ ఖాళీ చేయాలని కరుణరెడ్డి చెప్పాడు. కొంత సమయం ఇవ్వాలని కోరినా కరుణరెడ్డి నిరాకరించి కోర్టులో కేసు వేశాడు. తాడుతో ఉరి వేసుకుని..: కొద్దిరోజులు ఆస్పత్రిని మూసివేసి మూడ్రోజుల క్రితమే అజయ్ మళ్లీ ప్రారంభించాడు. బిల్డింగ్ ఖాళీ చేయాలని కరుణరెడ్డి, అతని బావమరిది కొండల్రెడ్డితోపాటు మరికొందరు అజయ్కుమార్పై ఒత్తిడి తెచ్చారు. వేధింపులు ఎక్కువ కావడంతో అజయ్కుమార్ మనస్తాపానికి గురయ్యాడు. సోమవారం రాత్రి 2 గంటల వరకు ఆస్పత్రిలో ఉన్న అజయ్కుమార్ సెల్లార్లో ఉన్న తన గదికి వెళ్లి తా డుతో ఫ్యానుకు ఉరివేసుకున్నాడు. మంగళవారం ఉదయం ఆస్పత్రిలో పనిచేసే స్వా మి వచ్చి.. అజయ్ ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించి ఎల్బీనగర్ పోలీసులకు సమాచారమిచ్చాడు. ఘటనా స్థలంలో పోలీసులు సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. తన చావుకు కరుణరెడ్డి, కొండల్రెడ్డి, తుర్కయంజాల్కు చెందిన మాజీ సర్పంచ్ కొత్తకురుమ్మ శివకుమార్, సరస్వతినగర్ కాలనీ అధ్యక్షుడు మేఘారెడ్డి, యాదగిరిరెడ్డి, శివారెడ్డితో పాటు ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ రమేష్ కారణమని అందులో ఉంది. పిల్లలను మంచిగా చూసుకోవాలని భార్యకు రాసిన మరో లేఖ లభించింది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నాగోల్ డ్రైవింగ్ ట్రాక్కు రోడ్డు ముప్పు
సాక్షి, సిటీబ్యూరో: రహదారి భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా శాస్త్రీయ పద్ధతిలో నిర్మించిన నాగోల్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ట్రాక్ మధ్యలోంచి కొత్తగా రోడ్డు నిర్మించేందుకు జీహెచ్ఎంసీ సన్నాహాలు చేపట్టింది. నాగోల్ నుంచి ట్రాక్ మార్గంలో ఆదర్శనగర్, గణేశ్నగర్, బండ్లగూడ మార్గంలో హయత్నగర్కు వెళ్లేందుకు వీలుగా ఉంటుందని నిర్మించతలపెట్టిన ఈ రోడ్డు వల్ల ట్రాక్ భవితవ్యం పై నీలినీడలు కమ్ముకున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు, దక్షిణాదిలోనే మొట్టమొదటి మోడల్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్గా గుర్తింపు పొందిన ఈ ట్రాక్ను 15 ఏళ్ల క్రితం రవాణాశాఖ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. లైసెన్సు కోసం వచ్చే అభ్యర్ధుల డ్రైవింగ్ సామర్థ్యాన్ని శాస్త్రీయమైన పద్ధతిలో అంచనా వేసేందుకు అప్పటి వరకు ఎలాంటి విధానాలు లేవు. వాహనదారులను చెట్టు చుట్టు తిప్పి, రోడ్డు మార్గంలో కొంతదూరం పరిశీలించి డ్రైవింగ్ లైసెన్సులను పొందేందుకు అర్హతను ధృవీకరించేవారు. అయితే ఇది పూర్తిగా అసమంజసమని భావించిన రవాణా శాఖ అధికారులు 2003లో మొట్టమొదటిసారి శాస్త్రీయమైన పద్ధతిలో నాగోల్ ట్రాక్ను ఏర్పాటు చేశారు. రహదారిలోని ఎత్తుపల్లాలను, వివిధ రకాల మార్గాలను ప్రతింబించేలా ఈ ట్రాక్ నిర్మాణం చేపట్టారు. సుమారు 12 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ట్రాక్ మధ్యలోంచే ప్రస్తుతం రోడ్డు వేసేందుకు అధికారులు ప్రణాళికలను సిద్ధం చేయడం గమనార్హం. ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నా.. నాగోల్ నుంచి హయత్నగర్కు దూరభారాన్ని తగ్గించేందుకు రోడ్డు నిర్మాణం చేపట్టడం ఆహ్వానించదగిన పరిణామమే. అయితే అందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నప్పటికీ నాగోల్ ట్రాక్ మధ్యలోంచే రోడ్డు వేయడం వల్ల ట్రాక్ మనుగడకు ప్రమాదం ఏర్పడింది. నాగోల్ చౌరస్తా నుంచి ట్రాక్ వరకు మూడు మార్గాల్లో కొత్త రోడ్డు నిర్మాణం, విస్తరణకు అవకాశం ఉందని, ట్రాక్ మధ్యలోంచి రోడ్డు వేయాల్సిన అవసరం లేదని స్థానికులు, డ్రైవింగ్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు పేర్కొంటున్నారు. కేవలం డ్రైవింగ్ పరీక్షలకే కాకుండా కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునేందుకు కూడా ఈ ట్రాక్ అనుకూలంగా ఉంటుంది. కేవలం రూ.50 నామమాత్రపు ఫీజుతో సాయంత్రం వేళల్లో ఈ ట్రాక్లో డ్రైవింగ్ నేర్చుకోవచ్చు. దీనివల్ల డ్రైవింగ్లో మరింత నాణ్యమైన శిక్షణ లభిస్తుంది. నైపుణ్యం పెరుగుతుంది. ఎన్నో విధాలుగా ప్రయోజనకరంగా ఉన్న డ్రైవింగ్ ట్రాక్ను కాపాడాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నో ప్రత్యేకతలు,... నాగోల్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్లో మొత్తం 11 ట్రాక్లు ఉంటాయి.1,2,3,4,5,6 ట్రాక్లను కార్లు, ఇతర తేలికపాటి వాహనాలు నడిపే అభ్యర్థుల డ్రైవింగ్ సామర్థ్య పరీక్షల కోసం వినియోగిస్తుండగా, మరో 4 ట్రాక్ను ద్విచక్ర వాహనదారుల కోసం వినియోగిస్తున్నారు. ఒక ట్రాక్ ను లారీలు, బస్సులు తదితర భారీ వాహనాలను నడిపే వారి కోసం కేటాయించారు. ఇక్కడ ‘ ఎస్’, ‘8’, ‘హెచ్’, వంటి వివిధ ఆకృతుల్లో ట్రాక్లు ఉంటాయి. ప్రతి రోజు 300 నుంచి 350 మందికి ఇక్కడ డ్రైవింగ్ టెస్ట్లను నిర్వహిస్తారు. -
కూలిపని ఉందంటూ పిలిచి.. మహిళ దారుణ హత్య
సాక్షి, నాగోలు: కూలిపని ఉందంటూ ఓ మహిళను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేసి అమె వద్ద ఉన్న బంగారం, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లిన వ్యక్తితో పాటు, అతడికి సహకరించిన నిందితుడి భార్యను హయత్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి బంగారం, వెండి ఆభరణాలు, బైక్తో పాటు, హత్యకు ఉపయోగించిన సుత్తి, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఎల్బీనగర్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ సన్ప్రిత్సింగ్ వివరాలు వెల్లడించారు.. సంగారెడ్డి జిల్లా, యారరం గ్రామానికి చెందిన చెట్ల లింగమ్మ(50) నగరానికి వలసవచ్చి సోమాజిగుడలోని ఉంటూ కూలీగా పని చేస్తూ జీవనం సాగిస్తోంది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కందూరి రమేష్, తన భార్య సుజాతతో కలిసి ఖైరతాబాద్ బీజేఆర్లో ఉంటూ నాగోలులోని మార్బుల్స్, టైల్స్ షాపుల్లో కూలి పని చేసేవాడు. అతడి భార్య సుజాత పంజగుట్టలోని ఓ ఆసుపత్రిలో స్వీపర్గా పని చేసేది. మక్తాలోని లేబర్ అడ్డాలో లింగమ్మతో రమేష్కు పరిచయం ఏర్పడటంతో గతంలో రెండు మూడు సార్లు మార్బుల్ షాపుల్లో పని నిమిత్తం నాగోలు ప్రాంతానికి తీసుకువచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగడం వివాహేతర సంబంధానికి దారి తీసింది. జల్సాలకు అలవాటు పడిన రమేష్ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. దీనికితోడు రెండు నెలలుగా ఇంటి అద్దె చెల్లించకపోవడంతో ఇంటి యజమానులు ఒత్తిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అతడి కన్ను లింగమ్మ ఒంటిపై ఉన్న నగలపై పడింది. అమెను హత్య చేసి వాటిని సొంతం చేసుకోవాలని భావించిన రమేష్ అందుకు అదును కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ నెల 11న లింగమ్మ కూలీ పని కోసం రమేష్కు ఫోన్ చేయగా నాగోల్ ప్రాంతంలో పని ఉందని, రాజ్భవన్ రోడ్డులోని రైల్వే క్రాసింగ్ వద్దకు రావాలని చెప్పడంతో ఆమె అక్కడికి చేరుకుంది. లింగమ్మ అక్కడికి రాగానే బైక్పై ఆమెను నాగోలు ప్రాంతానికి తీసుకెళ్లాడు. సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. రాత్రి ఇద్దరూ కలిసి సమీపంలోని కల్లు కాంపౌండ్లో కల్లు తాగారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో లింగమ్మను నాగోలు నుంచి కుంట్లూరు వెళ్లే మార్గంలోని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లిన రమేష్ సుత్తితో తలపై మోదడంతో ఆమె స్పృహ కోల్పోయింది. అనంతరం తన వద్ద ఉన్న కత్తితో ఆమె గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం కటింగ్ ప్లేయర్తో చెవి దిద్దులు, ముక్కు పుడక, కాళ్ల కడియాలు కట్ చేసి తీసుకుకెళ్లాడు. అనంతరం ఇంటికి వెళ్లిన రమేష్ హత్య విషయాన్ని తన భార్య సుజాతకు చెప్పాడు. ఈ నెల 12న ఇద్దరూ కలిసి లింగమ్మ వద్ద దోచుకున్న కాళ్ల కడియాలను విశాల్జైన్ అనే పాన్ బ్రోకర్ వద్ద రూ. 11 వేలకు తాకట్టు పెట్టారు. కాగా ఈ నెల 12న కుంట్లూరు గ్రామానికి చెందిన నరేష్రెడ్డి అనే వ్యక్తి మహిళ హత్యకు గురైన విషయాన్ని గుర్తించి హయత్నగర్ పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించారు. ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించిన పోలీసులు అందులో దొరికిన క్లూ ఆధారంగా బుధవారం రాజ్భవన్ రోడ్డులో రమేష్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరం అంగీకరించాడు. చోరీ సొత్తును విక్రయించడంలో అతడికి సహకరించిన సుజాతను కూడా అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. సమావేశంలో వనస్థలిపురం ఏసీపీ ఎస్.జయరామ్, హయత్నగర్ సీఐ సతీష్, డీఐ సి.హెచ్ శ్రీనివాస్, ఎస్ఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
నాగోలు: అనుమానాస్పద స్థితిలో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎల్బీ నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఖమ్మం పట్టణానికి చెందిన శ్రీని వాస్రావు కుమారుడు నాగసాయి రామ్ (21) మీర్పేట టీకేఆర్ కాలేజీలో ఇంజనీరింగ్ సెకం డియర్ చదువుతున్నాడు. అతడు కళాశాల దగ్గరలోనే ఓ హాస్టల్లో ఉండేవాడు. గురువారం సాగర్రోడ్డులోని అలేఖ్య రెసిడెన్సీ హోటల్లో రూమ్ అద్దెకు తీసుకున్నాడు. శుక్రవారం సిబ్బం ది రూమ్ సర్వీస్ కోసం అతని గది తలుపు తట్టి పిలిచినా స్పందన రాలేదు. దీంతో కిటికీ నుంచి చూస్తే అతడు ఫ్యాన్కు బెడ్షీట్తో ఉరేసుకుని కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకుని గదిని తెరిచి పరిశీలించారు. మృతుడి వద్ద లభ్యమైన నంబర్ ద్వారా అతడి తండ్రికి సమాచారం ఇచ్చారు. మానసిక స్థితి సరిగా లేకపోవడంతో నాగసాయి ఓ సైకియాట్రిస్టును కలిసినట్లు పోలీసులు చెప్పారు. అతడు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకోవడంతోనే హాస్ట్టల్ నుంచి బెడ్షీట్ తెచ్చుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు. అతడి ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమూ కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. -
విజయారెడ్డికి కన్నీటి వీడ్కోలు
దిల్సుఖ్నగర్/నాగోలు/మన్సూరాబాద్: తహసీల్దార్ విజయారెడ్డి అంతిమయాత్ర శోకసంద్రమైంది. మంగళవారం ఆర్కేపురం వాసవి కాలనీ లక్ష్మీ అపార్ట్మెంట్ నుంచి నాగోల్లోని శ్మశాన వాటిక వరకు ఐదు గంటలపాటు సాగిన అంతిమయాత్రలో దారి పొడవునా కన్నీటి నిరసనలు కనబడ్డాయి. పోలీసుల బందోబస్తు మధ్య అంతిమయాత్రలో భారీ సంఖ్యలో బంధువులు, రెవెన్యూ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు హాజరై విజయారెడ్డికి నివాళులర్పించారు. విజయారెడ్డి కుమారుడు భువనసాయి, కుమార్తె చైత్ర ఉన్నా చిన్నవాళ్లు కావడంతో భర్త సుభా‹Ùరెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ దగ్గరుండి అంత్యక్రియలు ముగిసే వరకు పర్యవేక్షించారు. విజయారెడ్డి అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నాగోలు శ్మశాన వాటికలో నిర్వహించారు. రాస్తారోకో... స్వల్ప ఉద్రిక్తత... అల్కాపురి చౌరస్తాలో రెవెన్యూ ఉద్యోగులు మధ్యాహ్నం 1.30 నుంచి 2.00 గంటల వరకు రాస్తారోకో నిర్వహించారు. విజయారెడ్డి మృతదేహంతో ఒక్కసారిగా రెవెన్యూ ఉద్యోగులు రోడ్డు మీదకు వచ్చి రాస్తారోకో నిర్వహించడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. కమిషనర్ మహేశ్ భగవత్, జాయింట్ సీపీ సురేందర్బాబు, ఇతర పోలీస్ అధికారులు రెవెన్యూ ఉద్యోగులకు నచ్చజెప్పడంతో ధర్నా విరమించారు. విజయారెడ్డికి గౌరవ వందనంగా తుపాకులను గాలిలోకి కాలుస్తున్న చేస్తున్న పోలీసులు ఉదయం ఏడు గంటల నుంచే... రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి రెవెన్యూ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు వివిధ రాజకీయ పారీ్టల నేతలు మంగళవారం ఉదయం 7 గంటలకే విజయారెడ్డి నివాసానికి చేరుకొని అమె మృతదేహానికి నివాళులర్పించారు. ఎంపీ రేవంత్రెడ్డి, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, మంచిరెడ్డి కిషన్రెడ్డి, దేవిరెడ్డి సు«దీర్రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, తీగల కృష్ణారెడ్డి ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. విజయారెడ్డి అంతిమ యాత్రలో భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, జిట్టా బాలకృష్ణారెడ్డి పాల్గొన్నారు. రెవెన్యూ ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అంతిమ యాత్రలో పాల్గొన్నారు. సీబీఐతో విచారణ జరిపించాలి: రేవంత్ విజయారెడ్డి సజీవదహనం కేసును సీబీఐతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. మేజి్రస్టేట్ అధికారాలున్న అధికారిపై దాడి చేయడం దారుణమని, రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే రోజులు వచ్చాయని మండిపడ్డారు. రూ.కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలి... విజయారెడ్డి కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వంగ రవీందర్రెడ్డి డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని, ఉద్యోగులకు భద్రత కలి్పంచాలని కోరారు. విజయారెడ్డి హత్య వెనుక రాజకీయ కుట్ర ఉందని, దీన్ని తేల్చాల్సిన అవసరముందని అన్నారు. అండగా ఉంటాం: మేడ్చల్ కలెక్టర్ ఎంవీ రెడ్డి విజయారెడ్డి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. ఇది ఉన్మాదంతో ఒక వ్యక్తి చేసిన పని. ఇలాంటి ఘటన ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు. భవిష్యత్లో జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు ఉన్నచోట్ల ప్రత్యేక చర్యలు చేపడతాం. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి: లచ్చిరెడ్డి విజయారెడ్డి హత్యపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తెలంగాణ తహసీల్దార్ల వ్యవస్థాపక అధ్యక్షుడు లచ్చిరెడ్డి డిమాండ్ చేశారు. 3 రోజులు అన్ని మండల రెవెన్యూ కార్యాలయాల వద్ద నిరాహార దీక్షలు కొనసాగుతాయన్నారు. త్వరలోనే పూర్తి కార్యాచరణ విడుదల చేస్తామని అన్నారు. విజయారెడ్డి కుటుంబానికి అండగా ఉందాం : రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డి అమానుష హత్యను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఖండించారు. మృతురాలి కుటుంబానికి ఆయన తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. కాగా అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డి ఘటన నేపథ్యంలో రెవెన్యూ అధికారులు, సిబ్బందికి భద్రత కలి్పంచేలా వెంటనే చర్యలు చేపట్టాలని సోమేశ్కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం జిల్లాల కలెక్టర్లకు సందేశం పంపారు. కాగా,తహసీల్దారు సజీవ దహనంపై తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం (టీఎస్ఐఏఎస్) ఒక ప్రకటనలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రభుత్వం విజయారెడ్డి కుటుంబానికి మద్దతుగా నిలవాలని కోరింది. ప్రజాసేవలో అధికారులు ధైర్యంగా పనిచేయాలంటే నిందితులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విన్నవించింది. అఖిలపక్షం నిర్వహించాలి: చాడ సాక్షి, హైదరాబాద్: తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహనం ఘటన నేపథ్యంలోనైనా వెంటనే రెవెన్యూ నిపుణులు, అఖిలపక్ష పార్టీలతో భేటీ ఏర్పాటు చేసి రెవెన్యూ చట్టాలు, భూరికార్డుల్లో మార్పులకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో జాప్యం జరిగే కొద్దీ ఉద్యోగులు, ప్రజల మధ్య అంతరాలు పెరిగి ఘర్షణ వాతావరణం ఏర్పడుతుందని, ఇది సమాజానికి మంచిదికాదని మంగళవారం సీఎం కేసీఆర్కు రాసిన లేఖలో పేర్కొన్నారు. నేడు నల్లబ్యాడ్జీలతో నిరసనలు సాక్షి, హైదరాబాద్: తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం ఘటనను ఖండిస్తూ, రెవెన్యూ ఉద్యోగులకు సంఘీభావంగా బుధవారం నల్లబ్యాడ్జీలతో నిరసన తెలపనున్నట్టు అటవీశాఖలోని ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. మంగళవారం అరణ్యభవన్లో జరిగిన సమావేశంలో స్టేట్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్, జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్, మినిస్టీరియల్ స్టాఫ్, డ్రైవర్లు, క్లాస్–4 ఉద్యోగుల సంఘాలు తహసీల్దార్ విజయారెడ్డి మృతికి సంతాపం తెలిపాయి. విధుల బహిష్కరణ సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్యకు నిరసనగా మంగళవారం రెవెన్యూ, ఇతర ఉద్యోగ సంఘాలు విధులు బహిష్కరించాయి. విధి నిర్వహణలో అసువులుబాసిన ఆమె అంత్యక్రియల్లో పాల్గొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు హైదరాబాద్కు తరలివచ్చారు. ఒక్కడి పనేనా? సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తహసీల్దార్పై పథకం ప్రకారం పెట్రోల్ పోసి సజీవదహనం చేసిన నిందితుడు కూర సురేశ్ వెనుక ఇంకెవరైనా ఉన్నారా? హత్యకు కుట్రను అతను ఎవరితోనైనా పంచుకున్నాడా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సురేశ్ మొబైల్ కాల్డేటాను విశ్లేషిస్తున్నారు. హత్యకు ముందు సురేశ్ తన పెదనాన్న దుర్గయ్యతోపాటు పలువురు బంధువులు, స్నేహితులతో మాట్లాడినట్లు గుర్తించారు. మరోవైపు ఈ వ్యవహారంలో సురేశ్ పెదనాన్న దుర్గయ్య పాత్రపైనా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సురేశ్కు ఎలాంటి మానసిక రుగ్మతల్లేవని గ్రామస్తులంతా చెబుతుంటే దుర్గయ్య, కుటుంబ సభ్యులు మాత్రం అతనికి మతిస్థిమితం లేదని, రియల్టర్ అని, వివాదంతో సంబంధమే లేదని పొంతనలేని సమాధానాలు చెప్పడం వెనుక దురుద్దేశం ఏమైనా ఉందా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. సురేశ్ కుటుంబానికి 1998లోనే ఆర్.ఓ.ఆర్ కింద పాసు పుస్తకాలు మంజూరయ్యాయని స్థానికులు చెబుతుండటంతో ఈ వ్యవహారంతో సురేశ్కు సంబంధం లేదని కుటుంబ సభ్యులు చెప్పడంపై సందేహపడుతున్నారు. సురేశ్ వెనక బంధువులు ఎవరైనా ఉన్నారా? అనే విషయంపై కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. -
విజయారెడ్డికి కన్నీటి వీడ్కోలు..
-
పూర్తయిన తహశీల్దార్ విజయారెడ్డి అంత్యక్రియలు
-
విజయారెడ్డికి కన్నీటి వీడ్కోలు..
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ చెరుకూరి విజయారెడ్డి అంత్యక్రియలు నాగోల్ శ్మశాన వాటికలో పూర్తయాయి. విజయారెడ్డి అంతిమయాత్రలో రెవెన్యూశాఖ ఉద్యోగులు, స్థానికులు, ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. వివిధ పార్టీల నాయకులు, ప్రజలు పెద్దసంఖ్యలో ఆమె భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం నాగోల్ శ్మశాన వాటికలో విజయారెడ్డి భౌతికకాయానికి భర్త సుభాష్రెడ్డి దహన సంస్కారాలు నిర్వహించి.. అంత్యక్రియలు పూర్తి చేశారు. అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ కార్యాలయంలోనే విజయారెడ్దిని కూర సురేశ్ అనే రైతు పెట్రోల్ పోసి.. పట్టపగలే అమానుషంగా సజీవం దహనం చేసిన సంగతి తెలిసిందే. పట్టాదారు పాసుపుస్త కాల్లో తమకు బదులుగా కౌలుదార్ల పేర్లను చేర్చారన్న కోపంతో ఆ వ్యక్తి ఈ దుర్మార్గానికి ఒడిగడ్డాడు. తమ కుటుంబాలకు దక్కాల్సిన భూమిని తమకు దక్కకుండా చేస్తున్నారని కక్షగట్టి ఘాతుకానికి పాల్పడ్డాడు. పక్కా పథకంతో కార్యాలయంలోని తహసీల్దార్ గదిలోకి పెట్రోల్ డబ్బాతో చొరబడ్డ కూర సురేశ్... రెప్పపాటులోనే విజయారెడ్డి ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించేశాడు. అంతే.. అందరూ చూస్తుండగానే తహసీల్దార్ విజయారెడ్డి మంటల్లో చిక్కుకొని సజీవదహనమయ్యారు. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన కారు డ్రైవర్ గురునాథ్, అటెండర్ చంద్రయ్య తీవ్రంగా గాయపడ్డారు. కంచన్బాగ్లోని డీఆర్డీఎల్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీరిలో గురునాథ్ మంగళవారం ప్రాణాలు విడిచాడు. విజయారెడ్డికి భర్త సుభాష్తోపాటు ఇద్దరు చిన్నపిల్లలు.. అమ్మాయి(10), అబ్బాయి(5) ఉన్నారు. తల్లి మరణంతో పిల్లలు కన్నీరుమున్నీరవుతున్నారు. -
పిల్లల్ని కాపాడుకోవడానికి తల్లి కుక్క అవేదన
-
ఉప్పల్లో మెట్రో పిల్లర్ను ఢీ కొట్టిన బైక్
సాక్షి, హైదరాబాద్ : ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగోల్ మెట్రో స్టేషన్ సమీపంలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. మితిమీరిన వేగంతో దూసుకోచ్చిన బైక్ మెట్రో పిల్లర్ను బలంగా ఢీ కొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతున్ని మన్సూరాబాద్కు చెందిన సంజయ్(20)గా గుర్తించారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన జగదీశ్ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం జగదీశ్ పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఉప్పల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
హంతకులను పట్టించిన మద్యం సీసా మూత
సాక్షి, నాగోలు: మద్యానికి బానిసైన భర్త తరచూ వేధింస్తుండడంతో పాటు తన తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతుండడాన్ని సహించలేని ఓ మహిళ తన బంధువులతో కలసి భర్తను హత్య చేసింది. ఈ సంఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎల్బీనగర్ సీపీ క్యాంప్ కార్యాలయంలో శనివారం రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ వివరాలు వెల్లడించారు. శామీర్పేట పోలీస్టేషన్ పరిధిలో అద్రాస్పల్లి గ్రామానికి చెందిన బోణి శ్రీనివాస్కు 14 ఏళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన స్వప్నతో వివాహమైంది. వారికి ఇద్దరు సంతానం. కూలిపని చేసే శ్రీనివాస్ మద్యానికి బానిసై తరచూ భార్యను వేధిస్తున్నాడు. అత్తమామలను సైతం ఇబ్బంది పెడుతున్నాడు. దీంతో శ్రీనివాస్ను అడ్డు తొలగించుకోవాలని పథకం పన్నారు. స్వప్న తన మేనమామ తీగళ్ల యాదగిరిని సంప్రదించగా అందుకు అంగీకరించిన అతడు స్వప్న కుటుంబ సభ్యుల నుంచి కొంత నగదు మొత్తం అడ్వాన్స్గా తీసుకున్నాడు. యాదగిరి అతడి స్నేహితుడు రమేష్, స్వప్న, ఆమె తల్లి లక్ష్మి, తండ్రి మల్లేశం కలిసి హత్యకు పథకం పన్నారు. గతనెల 29న యాదగిరి, రమేష్ శ్రీనివాస్కు మద్యం తాగించి ధర్మవరం ప్రాంతంలోని రవలకోలు గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ మద్యం మత్తులో ఉన్న శ్రీనివాస్ను హత్య చేసి మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. శ్రీనివాస్ కనిపించకపోవడంతో ఇతడి తల్లి శామీర్పేట్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసింది. అడవిలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతుడు శామీర్పేట పరిధిలో అదృశ్యమైన శ్రీనివాస్గా గుర్తించి దర్యాప్తు చేపట్టారు. పట్టించిన మద్యంసీసా మూత.. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు సంఘటనా స్థలంలో ఓ మద్యం సీసా మూత లభించింది. దానిపై ఉన్న బార్కోడ్ ఆధారంగా పూడూరు ఎక్స్రోడ్లో జైదుర్గ వైన్స్లో మద్యం కొనుగోలు చేసినట్లు గుర్తించారు. వైన్స్ షాప్ సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా యాదగిరి, రమేష్, మృతుడు శ్రీనివాస్ను బైక్పై తీసుకెళుతుండడాన్ని గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. హత్య తో సంబంధం ఉన్న శ్రీనివాస్ భార్య స్వప్న, అత్తమామలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
ఈస్ట్ జోన్లో ఈజీ జర్నీ
సాక్షి, సిటీబ్యూరో: ఎల్బీనగర్ పరిసరాల్లో ప్రయాణించేవారికి ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన కామినేని ఫ్లై ఓవర్(ఎడమవైపు), చింతల్కుంట అండర్పాస్లతోపాటు మరికొన్ని ఫ్లై ఓవర్లు, అండర్పాస్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఎల్బీనగర్ జంక్షన్ వద్ద దిల్సుఖ్నగర్ వైపు నుంచి హయత్నగర్ వైపు వెళ్లే ఫ్లై ఓవర్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఈ నెల్లోనే దీన్ని ప్రారంభించే అవకాశం ఉంది. ఇదే జంక్షన్ వద్ద కామినేని వైపు నుంచి బైరామల్ గూడవైపు వెళ్లేవారికి సదుపాయంగా నిర్మాణం చేపట్టిన అండర్పాస్ పనులు పురోగతిలో ఉన్నాయి. మరో ఆర్నెళ్లలో ఈ పనులు పూర్తికానున్నాయి. దీంతోపాటు నాగోల్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ చిక్కుల పరిష్కారానికి తాజాగా చేపట్టిన ఫ్లై ఓవర్ పనులతో ఈస్ట్జోన్లో ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని భావిస్తున్నారు. ఏటా రూ.10 వేల కోట్ల వంతున ఐదేళ్లలో రూ.50 వేల కోట్లతో నగరాభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన నేపథ్యంలో, అందుకనుగుణంగా ఎస్సార్డీపీ ప్రాజెక్టు పనుల్నికూడా పెంచనున్నట్లు మేయర్ రామ్మోహన్ ఇటీవల ప్రకటించడంతో జీహెచ్ఎంసీ అధికారులు ఈ పనుల వేగం పెంచారు. ఇప్పటికే ప్రారంభించిన పనులతోపాటు కొత్త పనులపైనా ప్రతిపాదనలకు సిద్ధమవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి వరకు మందకొడిగా సాగిన ఎస్సార్డీపీ పనులపై ప్రస్తుతం దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ – ఎల్బీనగర్ అటు నుంచి ఇటు, ఇటునుంచి అటు వెళ్లేవారికి నాగోల్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ చిక్కులు తగ్గించేందుకు,సిగ్నల్ ఫ్రీగా వెళ్లేందుకు నాగోల్ వద్ద ఫ్లై ఓవర్ పనులకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. ఈ ఫ్లై ఓవర్ పొడవు 980 మీటర్లు, వెడల్పు 24 మీటర్లు. ఇన్నర్రింగ్రోడ్లో ప్రయాణం చేసేవారికి ఎంతో సదుపాయంగా ఉండే ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే కొత్తపేట నుంచి బండ్లగూడ వైపు వెళ్లే వారికి, మన్సూరాబాద్తో సహ ఎల్బీనగర్ పరిసరాల్లోని వివిధ ప్రాంతాల్లోకి వెళ్లేవారికి ట్రాఫిక్ ఇక్కట్లు తగ్గుతాయని భావించి జీహెచ్ఎంసీ ఈ ఫ్లై ఓవర్ పనులకు శ్రీకారం చుట్టింది. సికింద్రాబాద్, ఉప్పల్ల వైపు నుంచి కామినేని, ఎల్బీనగర్ల వైపు వెళ్లేవారికి మూసీ బ్రిడ్జి దాటాక దాదాపు 200 మీటర్ల తర్వాత ప్రారంభమయ్యే ఈ ఫ్లై ఓవర్ అలకాపురికి దాదాపు 500 మీటర్ల ముందుగా ముగుస్తుంది. దీంతో నాగోల్ జంక్షన్ మీదుగా పరిసరాల్లోని వివిధ ప్రాంతాలకు వెళ్లేవారికి ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతాయి. ఈ ఫ్లై ఓవర్ అంచనా వ్యయం రూ.65.71 కోట్లు. ఇటీవలే ఈ ఫ్లై ఓవర్ పనులకు శ్రీకారం చుట్టారు. ఒకే వరుస స్తంభాలపై ఆరులేన్లుగా నిర్మించనున్న ఈ ఫ్లై ఓవర్ను కామినేని తరహాలో ప్రీకాస్ట్ పద్ధతిలో నిర్మించనున్నారు. హయత్నగర్ ఫ్లై ఓవర్ స్థానే .. ఎస్సార్డీపీ రెండో ప్యాకేజీలో భాగంగా ఎల్బీనగర్ చుట్టుపక్కల సిగ్నల్ఫ్రీ పనుల్లో భాగంగా పలు జంక్షన్లలో పలు ఫ్లై ఓవర్లు, అండర్పాస్లున్నాయి. కామినేని నుంచి హయత్నగర్ వరకు కూడా ఒక ఫ్లై ఓవర్ నిర్మించాల్సి ఉండగా, మెట్రోరైలు రెండో దశలో ఎదురయ్యే ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకొని ఆ ఫ్లై ఓవర్ ప్రతిపాదనను విరమించుకున్నారు. ప్యాకేజీలో భాగంగా దాని స్థానే నాగోల్ జంక్షన్ వద్ద కొత్తగా ఫ్లై ఓవర్ నిర్మించాలని భావించారు. అందుకు ప్రభుత్వం అనుమతించడం, ప్యాకేజీ పనులు దక్కించుకున్న కాంట్రాక్ట్ ఏజెన్సీ సుముఖత వ్యక్తం చేయడంతో పనులు ప్రారంభించారు. దాదాపు ఏడాది కాలంలో ఈ ఫ్లై ఓవర్ పూర్తవుతుందని పనులు పర్యవేక్షిస్తున్న ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పీవీ కృష్ణారావు తెలిపారు. ఎల్బీనగర్ ఫ్లై ఓవర్ ఫినిషింగ్ పనులు మాత్రం మిగిలి ఉన్నాయిన రిపబ్లిక్డేనాటికి ఈ పనులు పూర్తి కాగలవన్నారు. ఎల్బీనగర్ ఫ్లై ఓవర్.. ఫ్లై ఓవర్ పొడవు : 780 మీటర్లు వెడల్పు : 9 మీటర్లు అంచనా వ్యయం : రూ. 42.75 కోట్లు ఇది అందుబాటులోకి వస్తే 90 శాతం ట్రాఫిక్ సమస్య పరిష్కారమవుతుంది. మెట్రోరైలు రాకకుముందు రద్దీ సమయంలో వెళ్లే వాహనాలు: 14,153 మెట్రో రైలు వచ్చాక రద్దీసమయంలో వాహనాలు:8,916 2034 నాటికి జంక్షన్లో రద్దీసమయంలో గంటకు వెళ్లే వాహనాలు: 21,990 రూ. 448 కోట్లతో.. ప్రభుత్వం దాదాపు రూ. 25వేల కోట్లతో చేపట్టిన ఎస్సార్డీపీ పనుల్లో ప్యాకేజీ–2లో కామినేని, ఎల్బీనగర్, బైరామల్గూడ జంక్షన్ల వద్ద నిర్మించ ప్రతిపాదించిన ఫ్లై ఓవర్లు, అండర్పాస్ల అంచనా వ్యయం మొత్తం రూ. 448 కోట్లు. వీటిల్లో చింతల్కుండ అండర్పాస్, కామినేని ఎడమవైపు ఫ్లై ఓవర్ వినియోగంలోకి రావడం తెలిసిందే. ఈనెలలో ప్రారంభానికి అవకాశమున్న ఎల్బీనగర్ ఫ్లై ఓవర్తోపాటు కూకట్పల్లి రాజీవ్గాంధీ జంక్షన్ దగ్గరి ఫ్లై ఓవర్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. -
నమ్మిన వారే అమ్మేశారు..!
నాగోలు: ఓ బాలికకు మాయ మాటలు చెప్పి వ్యభిచార కూపంలోకి దింపిన ఆమె దూరపు బంధువు, అతడి భార్యతో పాటు మరో ఆరుగురు సభ్యుల వ్యభిచార ముఠాను చైతన్య పురి పోలీసులు అరెస్టు చేసి బాధితురాలికి విముక్తి కలిగించారు. శుక్రవారం ఎల్బీనగర్ డీసీపీ డీసీపీ సన్ప్రీత్ సింగ్ వివరాలు వెల్లడించారు. ఎల్బీనగర్కు చెందిన యార్లగడ్డ చంటి, అతడి భార్య పద్మతో కలిసి ఎన్టీఆర్నగర్లో ఉంటున్నాడు. అమెజాన్ కంపెనీలో కారు డ్రైవర్గా పనిచేస్తున్న అతను తన దూరపు బంధువైన అదే ప్రాంతానికి చెందిన బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. అనంతరం తన భార్య పద్మతో కలిసి 2 నెల 9న ఆమెను మహబూబ్నగర్ జిల్లా, జడ్చర్లకు తీసుకెళ్లి వ్యభిచారం నిర్వహించే ముఠాకు అప్పజెప్పాడు. బాలిక కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన ఆమె నాయనమ్మ చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు సదరు బాలిక జడ్చర్లలో ఉన్నట్లు గుర్తించారు. చంటి, పద్మలపై అనుమానంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్ధేశంతో బాలికను జడ్చర్లలోని వ్యభిచార ముఠాకు అప్పగించినట్లు తెలిపారు. దీంతో పోలీసులు వ్యభిచార ముఠా నిర్వాహకులు ఫరీదాబేగం, కృష్ణవేణి, స్వరూప, పద్మ, మంజూల, రాధలను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. చంటిపై అత్యాచారంతో పాటు పలుకేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. మైనర్ బాలిక కేసును త్వరితగతిన చేధించిన చైతన్యపురి పోలీసులను డీసీపీ అభినం దించారు. సమావేశంలో ఎల్బీనగర్ ఏసీపీ పృథ్వీథర్రావు, చైతన్యపురి సీఐ సుదర్శన్, ఎస్ఐ సాయిప్రకాశ్ పాల్గొన్నారు. నిందితులను అరెస్ట్ చేసి బాలికకు విముక్తి కలిగించిన రాచకొండ పోలీసులకు బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతారావు శుక్రవారం అభినందనలు తెలిపారు. -
విద్యార్థిని డస్టర్తో కొట్టిన టీచర్
నాగోలు: ఉపాధ్యాయురాలు విద్యార్థిని డస్టర్తో కొట్టడంతో తల పగిలి తీవ్ర గాయాలైన సంఘటన ఎల్బీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. వివరాలు... ఎల్బీనగర్ గుంటి జంగయ్యనగర్ కాలనీకి చెందిన నరేష్ జీహెచ్ఎంసీలో పని చేస్తున్నాడు. ఇతని కుమారుడు నిఖిల్(6) కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. పాఠశాలలో నిఖిల్ అల్లరి చేయడంతో తెలుగు ఉపాధ్యాయురాలు సుజాత డస్టర్తో కొట్టింది. దీంతో నిఖిల్ తల పగిలి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఉపాధ్యాయులు ఆ విద్యార్థికి ప్రథమ చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు ఎల్బీనగర్ పోలీసులకు, సరూర్నగర్ ఎంఈఓకు ఫిర్యాదు చేశారు. ఉపాధ్యాయురాలిని అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
త్యాగరాయనగర్లో బ్రహ్మోత్సవాలు
సాక్షి, హైదరాబాద్: పచ్చటి పందిళ్లు, రంగుల రంగుల తోరణాలతో నాగోలు బండ్లగూడ త్యాగరాయ నగర్లోని శ్రీపద్మావతి, గోదాదేవి సమేత వెంకటేశ్వర ఆలయం ముస్తాబైంది. దేవస్థానంలో 21వ బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. నేటి నుంచి 10వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. 8న స్వామి కల్యాణం కన్నులపండువగా నిర్వహించనున్నారు. అదే రోజు చెన్నైకి చెందిన దాసాన సంగీత కళాక్షేత్రం ఆధ్వర్యంలో సంగీత కచేరీ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా ప్రఖ్యాత వాయిద్య కళాకారులను ఘనంగా సన్మానించనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు కెవి రమణాచారి, నాగోల్ డివిజన్ కార్పొరేటర్ చెరుకు సంగీత ప్రశాంత్ గౌడ్తో పాటు పలువురు ప్రముఖులు గౌరవ అతిథులుగా హాజరుకానున్నారు. బ్రహ్మోత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలిరావాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. -
పేటీఎం అప్డేట్ పేరుతో మోసం
సాక్షి, నాగోలు : వ్యాపారస్తులను లక్ష్యంగా చేసుకుని కేవైసీ వెరిఫికేషన్ అంటూ పేటీఎంలలో పాస్వర్డ్లను మార్చి డబ్బులు కాజేస్తున్న పేటీఎం మాజీ ఉద్యోగిని రాచకొండసైబర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జనగాం జిల్లాకు చెందిన ఒకడోతు అనిల్కుమార్ ఉప్పల్లో ఉంటున్నాడు. గతంలో గచ్చిబౌలిలోని పేటీఎం కార్యాలయంలో ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసిన ఇతను పేటీఎం కేవైసీ వ్యాలెట్పై వినియోగదారులకు అవగాహన కల్పిస్తూ పాస్వర్డ్లను మార్చి తనకు అనుకూలంగా నెంబర్లు పెట్టేవాడు. పేటీఎంపై పూర్తి అవగాహన పెంచుకున్న అనిల్కుమార్ వినియోగదారుల నుంచి డబ్బు లు కాజేయాలని పథకం పన్నాడు. ఈ క్రమంలో మీర్పేట టీకేఆర్ కాలనీలో కిరాణా దుకా ణం నిర్వహిస్తున్న వినోద్కుమార్కు ఫోన్ చేసి పేటీఎంలో మీకు క్యాష్బ్యాక్ వస్తుందని, అందుకు కేవైసీ అప్డేట్ చేయాలని అతని మొబైల్ తీసుకుని పేటీఎం పాస్వర్డ్ మార్చేసి తన పాస్వర్డ్ పెట్టుకున్నాడు. అనంతరం రూ.5వేలు తన ఖాతాలోకి బదిలీ చేసుకున్నా డు. ఇదే తరహాలో పలువురిని మోసం చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన రాచకొండ సైబర్ క్రైం పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
నాగోల్ ఆర్టీఏ స్పెషల్.. వాహనాలకు మురుగు టెస్ట్
డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టీఏ కార్యాలయానికి వెళితే ఏం చేస్తారు..? ముందు వంకరటింకర ట్రాక్పై టెస్ట్లు పెడతారు. ఎగుడుదిగుడు రోడ్డుపైనా డ్రైవింగ్ నైపుణ్యం పరీక్షిస్తారు. కానీ నాగోల్ ఆర్టీఏ కార్యాలయంలో వీటికి అదనంగా ‘ముగురు టెస్ట్’ కూడా పెడతారు. మోకాల్లోతు నీటిలో వాహనాలను పరుగులు పెట్టించేవారికే లైసెన్స్ ఇస్తారన్నమాట..! లైసెన్స్ లేదనో.. ఇన్సూరెన్ చేయించలేదనో.. లేక సరైన వాహన పత్రాలు లేవనో నాగోల్ ఆర్టీఏ అధికారులు పట్టుకెళ్లిన వాహనాలకుకూడా మురుగు టెస్ట్లు చేస్తున్నారు. కావాలంటే ఒక్కసారి నాగోల్ ఆర్టీఏకు వెళ్లి చూడండి.. పట్టుబడిన మీ వాహనాల పరిస్థితిని తెలుసుకోంది. ఎందుకంటే వివిధ కేసుల్లో సీజ్ చేసి నాగోల్ ఆర్టీఏ ప్రాంగణంలో ఉంచిన ఆటోలు, బైకులు, కార్లు నాలుగు రోజులుగా మురుగు నీటిలో నానుతున్నాయి. సాక్షి, సిటీబ్యూరో: ప్రతి రోజు వందలాది మందికి డ్రైవింగ్ పరీక్షలు పెట్టి లైసెన్సులు జారీ చేసే నాగోల్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ సైతం నీటిలో మునిగిపోయింది. ట్రాక్లు, వాహనాల స్క్రాబ్యార్డు, కొత్తవాహనాలకు రిజిస్ట్రేషన్ చేసే కార్యాలయంతో సహా పలు కేంద్రాలు నాలుగు రోజులుగా నీటోలోనే మునిగి ఉన్నాయి. దీంతో పలు ట్రాక్లలో డ్రైవింగ్ పరీక్షలు నిలిపివేశారు. మోటారు వాహన నిబంధనల మేరకు స్వాధీనం చేసుకున్న సుమారు 500 వాహనాల్లో చాలా వరకు నీట మునిగాయి. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ప్రైవేట్ బస్సులు, లారీలు, డీసీఎంలు, తదితర ఖరీదైన వాహనాలు సైతం ఇందులో ఉన్నాయి. మరోవైపు ట్రాక్ అంతా దుర్వాసన వ్యాపించింది. నాలా ఉప్పొంగిన ప్రతిసారీ ఇంతే.. హైదరాబాద్లోనే అతి పెద్ద పరీక్షా కేంద్రమైన నాగోల్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్కు చుట్టుపక్కల ఉన్న కాలనీల నుంచి భారీగా మురుగునీరు వచ్చి చేరుతున్నప్పటికీ ఇటు జీహెచ్ఎంసీ అధికారులు కానీ, అటు రవాణాశాఖ ఉన్నతాధికారులు గానీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. పైగా ఈ సమ స్యపై ఆర్టీఏ నుంచి ఫిర్యాదు అందని కారణంగా జీహెచ్ఎంసీ పట్టించుకోలేదు. మురుగునీటిని తొలగించడం తమ విధి కాదన్నట్లుగా రవాణా అధికారులు భావించడం వల్ల 12 ఎకరాల విస్తీర్ణంలో 6 డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్లతో ఎంతో ప్రతిష్టాత్మకంగా కట్టించిన నాగోల్ ట్రా క్లో సగానికిపైగా నీటిలో మునిగిపోయింది. ఏటా ఇదే దుస్థితి... శాస్త్రీయమైన పద్ధతిలో, రహదారి భద్రతా నిబంధనలకు అనుగుణంగా డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించి వాహనదారులకు లైసెన్సులు జారీచేసేందుకు 2005లో నాగోల్ ట్రాక్ను నిర్మించారు. రాష్ట్రంలో ఈ తరహా ట్రాక్ పరీక్షలు మొదట ఇక్కడే మొదలయ్యాయి. రహదారులపై ఉండే మిట్టపల్లాలు, మలుపులు తదితర డ్రైవింగ్ టెస్ట్లకు అనుగుణంగా ఇక్కడ ట్రాక్లు నిర్మించారు. ఇలాంటి అతి పెద్ద ట్రాక్లో చాలాకాలంగా మురుగు నీరు చేరుతూనే ఉంది. అటు ఎల్బీనగర్ నుంచి ఇటు ట్రాక్కు దిగువన ఉన్న ఆదర్శనగర్ వరకు కనీసం 10 కాలనీల మురుగునీరు అంతా ఒకే నాలా నుంచి ప్రవహిస్తుంది. ఈ నాలా ఉప్పొంగిన ప్రతిసారీ ట్రాక్ మునిగిపోతుంది. ‘ఎలాంటి భారీ వర్షాలు లేవు. వరదలు లేవు. కానీ మురుగునీరు మాత్రం ట్రాక్ను ముంచేస్తుంది’.. అని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు ఇదే పరిస్థితి ఎదురవుతున్నప్పటికీ శాశ్వత పరిష్కార చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. నిలిచిపోయిన సేవలు.. ప్రస్తుతం నాగోల్ ట్రాక్లో ‘హెచ్’ ఆకృతిలో ఉన్న 2 ట్రాక్లు, మరో ద్విచక్ర వాహన ట్రాక్ మురుగుతో నిండిపోయాయి. దీంతో వాహనదారుల డ్రైవింగ్ పరీక్షలు స్తంభించాయి. మొత్తం 6 ట్రాక్లలో మూడింటిలో మురుగు చేరడంతో మిగతా ముడూ ట్రాక్లలోనే పరిమితంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు మలక్పేట్ ఆర్టీఏ కార్యాలయానికి చెందిన రిజిస్ట్రేషన్ పనులకు కూడా తీవ్ర ఆటంకం ఏర్పడింది. ప్రతి రోజు మలక్పేట్కు చెందిన సుమారు 200 కొత్త వాహనాలకు నాగోల్లో రిజిస్ట్రేషన్ చేస్తారు. అలాగే పాతవాటికి ఫిట్నెస్ ధృవీకరిస్తారు. ప్రస్తుతం ఆర్సీ కార్యాలయం, వాహనాలకు పరీక్షలు నిర్వహించే షెడ్డు నీట మునగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నాలుగు రోజులుగా నాగోల్ ట్రాక్ నీటిలో మునిగి ఉన్న విషయం ఆర్టీఏ ఉన్నతాధికారులకు తెలిసినా పట్టనట్టు వ్యవహరించడం వినియోగదారులకు అందజేసే పౌరసేవల్లోని డొల్లతనాన్ని ప్రతిబింబిస్తోంది. -
బిర్యానీ ఇవ్వలేదని హోటల్ యజమానిపై దాడి
-
బిర్యానీ ఇవ్వలేదని.. యజమానిపై దాడి
హైదరాబాద్ : బిర్యానీ ఇవ్వలేదని నాగోల్ లోని లక్కీ హోటల్ పై బుధవారం అర్ధరాత్రి కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. బిర్యానీ ఇవ్వలేదనే కోపంతో హోటల్ యజమానిపై దాడి చేసి ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. నాగోల్ కార్పొరేటర్ అనుచరులమంటూ దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు. హోటల్ యజమానికి తీవ్రగాయాలవ్వడంతో ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదుతో 10మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
నాగోల్ నుంచి మియాపూర్ వరకూ ఒకే రైలు!
సాక్షి, హైదరాబాద్ : మెట్రో రైల్కు విపరీత స్పందన వచ్చిందని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. మెట్రో రైలులో మొదటి రోజు లక్ష మంది ప్రయాణించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఇందులో సరదాగా ప్రయాణించాలనుకున్న వారు ఇరవై శాతం వరకు ఉంటారని ఎన్వీఎస్ అన్నారు. హైదరాబాద్ ప్రజలు క్రమశిక్షణ గలవారని మరోసారి నిరూపించుకున్నారని కితాబునిచ్చారు. ట్రైన్ ఎక్కేప్పుడు దిగేప్పుడు హడావుడి పడవద్దని ప్రయాణికులను కోరారు. ట్రైన్ లో వృద్దులకు, మహిళలకు చోటు ఇవ్వడానికి ప్రయత్నించాలని కోరారు. ఇంకా కొన్ని సాంకేతిక పనులు అసంపూర్తిగా ఉన్నాయని చెప్పారు. మియాపూర్ నుంచి అమీర్పేటకు మొదటిరోజు ఎనిమిది నిమిషాలకు ఒక రైలు, అలాగే అమీర్పేట నుంచి నాగోల్ వరకూ 15 నిమిషాలకు ఒకసారి రైళ్లు నడుస్తాయన్నారు. భవిష్యత్తులో నాగోల్ నుంచి మియాపూర్ వరకూ ఒకే రైలు మధ్యలో అమీర్ పేట్ ఇంటర్ ఛేంజ్ పాయింట్ కంపల్సరీ కాదు హైదరాబాదు ప్రజలు పూర్తి భద్రత తో మెట్రో ప్రయాణాలు చేయవచ్చు త్వరలో మెట్రో పాసులను కూడా అందుబాటులోకి తెస్తాం పార్కింగ్ పనులు పూర్తి అవడానికి నెల సమయం పడుతుంది ఇంకా పార్కింగ్ ధరలు నిర్ణయించలేదు సెంట్రల్ మెట్రో యాక్ట్ కింద గవర్నమెంటు ఆఫ్ ఇండియా టికెట్ ధరలను నిర్ణయింస్తుంది 2018 జూన్ వరకి 66 కిమీల మూడు కిమీల కారిడార్ పూర్తి చేస్తాం మూడు కారిడార్లు 2018 జూన్ వరకి పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాం -
ఫౌంటేయిన్లో పడి ఇద్దరు చిన్నారుల మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని నాగోల్లో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తూ వాటర్ ఫౌంటేయిన్లో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. వివరాలు..కృష్ణా జిల్లా నందిగామ మండలం మునగచెర్ల గ్రామానికి చెందిన గంటా శివాజి, బంధువుల పెళ్లి నిమిత్తం తన కుటుంబసభ్యులతో కలసి నాగోల్లోని శుభం కన్వెన్షన్ హాల్కు బుధవారం రాత్రి వచ్చారు. శివాజీ కుమారుడు జితేంద్ర కుమార్(4), సోదరుడి కుమార్తె మనస్విని(5) ఇద్దరూ ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ వాటర్ ఫౌంటేయిన్లో పడి మృతి చెందారు. జితేంద్ర తండ్రి శివాజి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నాగోలులో విషాదం
హైదరాబాద్: ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగోలులోని శుభం కన్వెన్షన్ హాల్లో దారుణం చోటు చేసుకుంది. బుధవారం రాత్రి కన్వెన్షన్ హాల్లో ఓ ఫంక్షన్ జరుగుతున్న సమయంలో హాల్ బయట ఆడుకుంటూ నీటి సంపులో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. కృష్ణా జిల్లా నందిగామకు చెందిన మనశ్రీ, జితేందర్లు గుర్తించారు. తల్లిదండ్రులతో కలిసి ఫంక్షన్కు హాజరైన చిన్నారులు ఆడుకోవడానికి సంపు దగ్గరకు వెళ్లి అందులో పడిపోయారు. గమనించిన సెక్యురిటీ సిబ్బంది వెంటనే దగ్గర్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చిన్నారులు మృతిచెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. ఈ ఘటనపై ఎల్బీ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
గంజాయి మత్తులో ఇంజినీరింగ్ విద్యార్థులు
హైదరాబాద్: నాగోల్ మమతా నగర్ కాలనీలోని గంజాయి తాగుతూ ఇంజినీరింగ్ విద్యార్థులు పట్టుబడ్డారు. ఎన్వీరావు అపార్ట్మెంట్ పై దాడులు చేసిన పోలీసులు గంజాయి తాగుతూ పేకాడుతున్న ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని విచారణకు తరలించారు. -
సినిమాకు వెళ్లొచ్చేలోగా..
నాగోలు: సినిమాకు వెళ్లి వచ్చేసరికి ఇంట్లో దొంగలు పడి బంగారు, నగదు ఎత్తుకెళ్లిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నాగోలు డివిజన్ సాయిరాంనగర్ కాలనీకి చెందిన ముత్యంకుమార్ ఆదివారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి సెకండ్ షో సినిమాకు వెళ్లారు. తిరిగి వచ్చి చూసే సరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నట్లు గమనించారు. బీరువాలో ఉన్న 15 తులాల బంగారు ఆభరణాలు, రూ.20 వేల నగదు, వెండి సామాగ్రిని దొంగలు ఎత్తుకెళ్లినట్లు యజమాని గుర్తించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చేసేది చోరీలు.. కారులో షికార్లు
నాగోలు: దొంగసొత్తును తాకట్టు పెట్టి... కార్లలో తిరుగుతూ జల్సాలు చేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను ఎల్బీనగర్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 200 గ్రాముల బంగారు ఆభరణాలతోపాటు స్కోడా కారును స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ తప్సీర్ ఇక్బాల్ తెలిపిన వివరాల ప్రకారం ... సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరికి చెందిన చెరుకు నగేష్ అలియాస్ కార్తిక్(30) 2011 నుంచి తెలుగురాష్టాల్లో 21 చోరీ కేసుల్లో నిందితుడు. విశాఖపట్టణం మునగపాక మండలం చెరుకుకొండ గ్రామానికి చెందిన ఎల్లపు నాగేశ్వరావు అలియాస్ నాగా(29) మణికొండలో నివాసముంటున్నాడు. ఇతను కూడ అనేక చోరీల కేసులో నిందితుడు. జైలుకు కూడా వెళ్లాడు. జైళ్లలో ఉన్నప్పుడే నగేష్, నాగేశ్వరావులకు పరిచయం ఏర్పడింది. 2016 మే నెలలో జైలు నుంచి ఇద్దరూ విడుదల అయ్యారు. ఈ క్రమంలో ఇద్దరూ కలసి రాచకొండ పోలీస్ కమిషర్రేట్ పరిధిలో 13 దొంగతనాలు, సైబరాబాద్ పరిధిలో రెండు, రాజమండ్రిలో ఆంధ్రాబ్యాంకు చోరీ, చెన్నైలో 2 చోరీలకు పాల్పడ్డారు. దొంగిలించిన బంగారాన్ని విశాఖపట్టణం ముత్తూట్, మణప్పురం పైనాన్స్లలో తాకట్టు పెట్టారు. వచ్చిన డబ్బులు రూ.5 లక్షలతో స్కోడా కారును కొనుగోలు చేసి జల్సాలకు అలవాటుపడ్డారు. అనుమానాస్పదంగా ఎల్బీనగర్లో కారులో తిరుగుతుండగా పోలీసులు పట్టుకున్నారు. విచారించగా చేసిన నేరాలను ఒప్పుకున్నారు. వీరి నుంచి 200 గ్రాముల బంగారం, స్కోడా కారును స్వాధీనం చేసుకున్నారు. వీరిని గురువారం రిమాండ్కు తరలించారు.