హైదరాబాద్: 'స్వచ్ఛ తెలంగాణ - స్వచ్ఛ హైదరాబాద్' కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాలుపంచుకోవాలని తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్లో స్వచ్ఛ తెలంగాణ - స్వచ్ఛ హైదరాబాద్ లోగోను అనురాగ్ శర్మ గురువారం ఆవిష్కరించారు. అనంతరం మింట్ కాంపౌండ్ నుంచి డీజీపీ కార్యాలయం వరకు చెత్తను పోలీసులు శుభ్రం చేశారు.
స్వచ్ఛ హైదరాబాద్ పేరిట తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తన భాగ్యనగరంలో కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో గవర్నర్, సీఎం, తెలంగాణ కేబినెట్, ఉన్నతాధికారులు పెద్ద ఎత్తున పాల్గొంటున్న విషయం విదితమే.