అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి | telugu student died in usa | Sakshi
Sakshi News home page

అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి

Dec 6 2017 6:59 PM | Updated on Apr 4 2019 3:25 PM

telugu student died in usa - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ తెలుగు విద్యార్థి మృతి చెందాడు. మృతుడు కుత్భుల్లాపూర్‌ సర్కిల్‌ సూరారం ప్రాంతానికి చెందిన జాకబ్‌ కుమారుడు నాగ తులసిరామ్‌(26)గా గుర్తించారు. తమ కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు తల్లిదండ్రులు తెలిపారు. బుధవారం ఉదయం ఏడున్నర గంటల సమయంలో చనిపోయినట్లు ఫోన్‌ వచ్చిందని వివరించారు. నాగ తులసిరామ్‌ రెండు సంవత్సరాల క్రితం ఎంఎస్‌ చదివేందుకు యూఎస్‌ఏలోని బ్రిడ్జిపోర్ట్‌ యూనివర్సిటీలో చేరాడు.

వాటర్‌బరీలో నివాసం ఉండే వాడని  చెప్పారు.  తన కుమారుడి ఆచూకీ కోసం తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని జాకబ్‌ కన్నీటిపర్యంతమయ్యారు. ఈ విషయంపై ఎమ్మెల్యే వివేకానంద్‌ను కలిసి పూర్తి వివరాలు తెలియజేయగా ఆయన మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement