మైనర్ బాలిక పై ఓ ఉపసర్పంచ్ అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు.
సాలిగౌరారం : మైనర్ బాలిక పై ఓ ఉపసర్పంచ్ అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. సంఘటన వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా సాలిగౌరారం మండలంలోని బైరబోయినబండ గ్రామ ఉపసర్పంచ్ పులిగళ్ల చింతయ్య(40), అదే గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలిక పై గురువారం అర్థరాత్రి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాలిక కేకలు వేయడంతో ఆ ఉపసర్పంచ్ పరారయ్యాడు. దీనిపై శుక్రవారం ఉదయం బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.