డెంగీతో ఓ మహిళ మృతిచెందిన సంఘటన నిమ్స్లో శుక్రవారం చోటుచేసుకుంది.
రంగారెడ్డి’(దోమ) : డెంగీతో ఓ మహిళ మృతిచెందిన సంఘటన నిమ్స్లో శుక్రవారం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా దోమ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన బొంగు పద్మ(30) వారం రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. చికిత్సకోసం మహబూబ్నగర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది. డెంగీ లక్షణాలు గుర్తించిన అక్కడి వైద్యులు హైదరాబాద్ నిమ్స్కు తరలించాల్సిందిగా సూచించారు. నిమ్స్లో చికిత్సపొందుతూ పద్మ శుక్రవారం మృతిచెందింది.