యువతి అదృశ్యం | woman missing | Sakshi
Sakshi News home page

యువతి అదృశ్యం

May 11 2015 8:30 PM | Updated on Mar 28 2018 11:08 AM

బ్యూటీపార్లర్‌కు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిన ఓ యువతి అదృశ్యమైంది.

రంగారెడ్డి: బ్యూటీపార్లర్‌కు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిన ఓ యువతి అదృశ్యమైంది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని వెంకటాపూర్‌లో చోటుచేసుకుంది. ఎస్సై రవీంద్రనాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటాపూర్‌ గ్రామానికి చెందిన డివిటి యాదయ్య కూతురు శ్రీలత(18) ఈనెల 7వ తేదీన బ్యూటీపార్లర్‌కు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుండి బయలుదేరివెళ్లి తిరిగి ఇంటికి చేరుకోలేదు. కుటుంబీకులు ఆమె కోసం బంధువులు, స్నేహితుల వద్ద వెదికినా ఫలితం లేకుండా పోయింది. దీంతో సోమవారం మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement