'రైతు కుటుంబాలకూ షర్మిల పరామర్శ' | ys sharmila visits suicide farmers families in telangana | Sakshi
Sakshi News home page

'రైతు కుటుంబాలకూ షర్మిల పరామర్శ'

Dec 1 2014 5:43 PM | Updated on Oct 8 2018 5:04 PM

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల 5 రోజుల పాటు మహబూబ్‌నగర్ జిల్లాలో పరామర్శ యాత్ర చేపట్టనున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎడ్మ కిష్టారెడ్డి తెలిపారు.

మహబూబ్నగర్: వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల 5 రోజుల పాటు మహబూబ్‌నగర్ జిల్లాలో పరామర్శ యాత్ర చేపట్టనున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎడ్మ కిష్టారెడ్డి తెలిపారు. ఈ నెల 8 నుంచి 12 వరకు 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర సాగుతుందని చెప్పారు.

పరామర్శ యాత్ర పోస్టర్ ను మహబూబ్నగర్ లో సోమవారం కిష్టారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... 921 కిలోమీటర్ల మేర షర్మిల యాత్ర చేయనున్నారని తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను కూడా షర్మిల పరామర్శిస్తారని చెప్పారు. కల్వకుర్తి నుంచి పరామర్శ యాత్ర ప్రారంభం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement