ముంబై: ఒకప్పటి అందాల కథానాయిక కరిష్మా కపూర్. భర్త సంజయ్ కపూర్తో తీవ్ర విభేదాల కారణంగా విడాకులు తీసుకున్న ఈ అమ్మడు ఇప్పుడు మళ్లీ ప్రేమలో పడ్డట్టు తెలుస్తోంది. ముంబైకి చెందిన ఓ కంపెనీ సీఈవో అయిన సందీప్ తోష్నివాల్తో కరిష్మా సన్నిహితంగా మెలుగుతోందట. రోజురోజుకు వీరి అనుబంధం బలపడుతున్నదని చెప్తున్నారు. త్వరలోనే రిలేషన్షిప్లో అడుగుపెట్టాలని ఈ జంట భావిస్తున్నదని కథనాలు వస్తున్నాయి.
సందీప్ కూడా భార్యతో విభేదాల కారణంగా ఒంటరిగా ఉంటున్నాడు. త్వరలోనే అతను విడిపోయిన తన భార్య ఆష్రిత నుంచి విడాకులు తీసుకోవచ్చునని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బంద్రాలోని ఓ విలాసవంతమైన అపార్ట్మెంట్ తీసుకోవాలని సందీప్ భావిస్తున్నాడు. 3 బీహెచ్కే ప్లాటు తీసుకొని దానిని తన ప్రియురాలు కరిష్మాకు కానుకగా ఇవ్వాలని ఆయన భావిస్తున్నట్టు వదంతులు బాలీవుడ్లో చక్కర్లు కొడుతున్నాయి. సందీప్ తీసుకోబోతున్న ఈ కొత్త అపార్ట్మెంట్లోకి తన పిల్లలు సమైరా, కియాన్తో కలిసి కరిష్మా వెళ్లే అవకాశముందని, ఈ జంట కలిసి సహజీవనం చేయాలనుకుంటోందని చెప్తున్నారు.
విడాకుల తర్వాత అతనికి దగ్గరవుతున్న నటి!
Published Sun, Dec 18 2016 1:04 PM | Last Updated on Mon, Sep 4 2017 11:03 PM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- పింఛన్లపై ఫిర్యాదు చేస్తే దాడి చేస్తారా?
- హను–మాన్ మాకు ఓ వరం: నిర్మాత చైతన్య
- రిజిస్ట్రేషన్ ఫీజు తగ్గిద్దామా?
- టెల్కోల ఆదాయం జూమ్..
- ఆర్టీసీ ఉద్యోగులకు ‘సహకార రుణాలు’
- మండల పరిషత్ సమావేశంలో టీడీపీ బరితెగింపు
- అల.. హడలెత్తిస్తోంది
- విద్యార్థి నేతలపై పోలీసుల అణచివేత
- బాబు అండ్ కో కేసులన్నీ సీబీఐ, ఈడీకి అప్పగించండి
- నిధులిచ్చి ఆదుకోండి
Advertisement