relationship
-
16 ఏళ్లు రిలేషన్లో ఉండి రేప్ అంటే ఎలా?
న్యూఢిల్లీ: ఏకంగా 16 సంవత్సరాలు ఒక వ్యక్తితో సంబంధం నెరిపి ఇప్పుడు రేప్ కేసు పెడితే ఎలా? అని సుప్రీంకోర్టు ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై అభ్యంతరం వ్యక్తంచేసింది. పెళ్లిచేసుకుంటానని నమ్మించి రేప్ చేశాడని ఒక మహిళ దాఖలుచేసిన పిటిషన్ను జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టేసింది. మహిళ చేసిన ఆరోపణల్లో నిజం లేదని కోర్టు అభిప్రాయపడింది.‘‘ పెళ్లిచేసుకుంటానని చెప్పి మోసం చేసి సంబంధం పెట్టుకుంటే దానిని రేప్గా భావించలేం. మహిళ సమ్మతి లేదని నిరూపణ అయితేనే రేప్గా పరిగణిస్తాం. ఈ కేసులో సమ్మతి లేదు అని చెప్పలేం. ఎందుకంటే ఉన్నత విద్యార్హతలున్న, పరిణతి సాధించిన చదువుకున్న మహిళ.. ఒక వ్యక్తి పెళ్లిచేసుకుంటానని నమ్మిస్తే 16 ఏళ్లపాటు అతడిని అలాగే నమ్మడం అనేది అసంభవం. 16 ఏళ్లపాటు తనపై లైంగికదాడిని ఆ మహిళ భరించిందంటే నమ్మశక్యంగా లేదు. సుదీర్ఘకాలాన్ని చూస్తుంటే లైంగిక సంబంధం అనేది పరస్పర సమ్మతితో కొనసాగినట్లు స్పష్టమవుతోంది. ఇన్నేళ్ల శారీరక సంబంధం తర్వాత ఇప్పుడొచ్చి అత్యాచారం చేశాడంటూ కేసు పెట్టడం సరికాదు. 16 ఏళ్ల కాలం అనేది ‘బలవంతంగా లైంగిక దోపిడీచేశాడు. శారీరక సంబంధం కోసం వంచించాడు’ అనే వాదనలను బలం చేకూర్చడంలేదు. పెళ్లిచేసుకుంటానని అతను మాటిస్తే ఇన్నేళ్లలో ఆమెకు ఒక్కసారైనా అనుమానంరాకపోవడం విచిత్రం. అతను వేరే మహిళను పెళ్లిచేసుకున్న తర్వాతే ఈ మహిళ తొలిసారిగా పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఈ 16 సంవత్సరాల్లో వీళ్లు ఒకే చోట సహజీవనం చేశారు. ఈ కేసు పూర్తిగా ప్రేమ/సహజీవనానికి సంబంధించిన అంశం. ఇందులో అత్యాచారం అనే కోణానికి తావులేదు. మహిళ చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చే సాక్ష్యాధారాలు లేవు. ఇలాంటి సందర్భంలో ఇంకా అతనిపై నేర విచారణ కొనసాగించడం చట్టప్రకారం సబబు కాదు’’ అంటూ సుప్రీంకోర్టు ఈ కేసును కొట్టేసింది. 2006లో ఒకరోజు రాత్రి ఇంట్లో చొరబడి రేప్ చేశాడని, తర్వాత పెళ్లిచేసుకుంటానని ఇన్నేళ్లు మోసంచేశాడని సంబంధిత మహిళ 16 సంవత్సరాల తర్వాత 2022లో ఫిర్యాదుచేసింది. దీంతో అదే ఏడాది ఎఫ్ఐఆర్ నమోదుచేసి కేసు విచారణ ప్రారంభించారు. ఈ కేసులో హైకోర్టులోనూ తనకు వ్యతిరేకంగా తీర్పురావడంతో ఆ వ్యక్తి చివరకు సుప్రీంకోర్టును ఆశ్రయించగా చిట్టచివరకు అతనికి అనుకూలంగా తీర్పు వచ్చింది. మార్చి మూడో తేదీనాటి ఈ కేసు తీర్పు వివరాలు గురువారం బహిర్గతమయ్యాయి. -
ఈ సమాజం ఎటు పోతోంది? రక్త బంధానికి నెత్తుటి మరకలు
-
ఆన్లైన్ నుంచి అక్షింతల దాకా
ప్రేమను.. పెళ్లితో స్థిరపరచేది అదే! అయితే దానికి బాటలు వేసేవి మాత్రం పరస్పర నమ్మకం, గౌరవాలే! అలాంటి లవ్ స్టోరే ఇది! దాదాపు ఏడేళ్లపాటు ఒకరినొకరు చూసుకోకుండా పెళ్లితో ప్రేమను గెలిపించుకున్న ఆ జంటలోని అమ్మాయి.. రైతా, ఫిన్లండ్. అబ్బాయి .. ప్రదీప్, హైదరాబాద్. ప్రేమకథా కాలం.. 1997.. స్కూలింగ్ పూర్తి చేసుకున్న రైతా ఫారిన్ లాంగ్వేజ్ కేటగిరీలో ఇంగ్లిష్ భాషను నేర్చుకుంటోంది. ఫ్లూయెన్సీ కోసం యాహూ చాట్లో చాటింగ్ స్టార్ట్ చేసింది. ఆన్లైన్లో ఒకరోజు ప్రదీప్ పరిచయం అయ్యాడు. సంభాషణలో ఆధ్యాత్మికం, తాత్వికం, మతపరమైన అంశాల నుంచి సామాజిక, రాజకీయ, పర్యావరణ విషయాలు, ప్రపంచ పౌరుల బాధ్యతలు వంటి వాటి మీద ప్రదీప్కున్న అవగాహనకు రైతా ముచ్చటపడింది. ప్రదీప్కూ రైతా పట్ల అదే భావన. నెమ్మదిగా స్నేహం పెరిగింది. వ్యక్తిగత వివరాలను పంచుకున్నారు. ప్రదీప్కి రైతా మీద ప్రేమ మొదలైంది. అప్పటికీ ఆ ఆన్లైన్ స్నేహం వయసు నాలుగేళ్లు. అప్పట్లో వెబ్కామ్స్ లేవు.. కాబట్టి ఒరినొకరు చూసుకోలేదు. కనీసం ఫొటోలు కూడా ఎక్సే ్చంజ్ చేసుకోలేదు. ఒక రోజు ప్రదీప్ మెయిల్ పెట్టాడు ‘రకస్తాన్ సినువా (నువ్వంటే ఇష్టం).. నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని. సంభ్రమాశ్చర్యాలు రైతాకు. ఎందుకంటే ఫిన్లండ్ లో అంత త్వరగా ఎవరూ పెళ్లి ప్రపోజల్ తీసుకురారు. అలాంటిది అబ్బాయి కనీసం తనను చూడనైనా చూడకుండా పెళ్లికి ప్రపోజ్ చేశాడు అని! ఓకే చెప్పింది. ఇద్దరిళ్లల్లో విషయం చెప్పేశారు. ప్రదీప్ జాతకంలో విదేశీ పిల్లే రాసి ఉందని, అదే జరగబోతోందని అతని తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పలేదు. కానీ రైతా వాళ్లింట్లోనే ఒప్పుకోలేదు. కారణం అక్కడ మీడియా లో ఇండియా గురించి ఉన్న వ్యతిరేక ప్రచారమే! వాళ్లను ఒప్పించే ప్రయత్నంలో.. ప్రదీప్ను చూస్తే ఒప్పుకుంటారు అన్న ఆశతో‘ఫిన్లండ్ రండి’ అంది రైతా. వెంటనే వీసాకు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే వీసా‘రిజెక్టయ్యింది. దాంతో‘నేనే హైదరాబాద్ వస్తాను’ అంటూ అభయమిచ్చింది రైతా! ‘ఎయ్ (.. వద్దు)’ అన్నారు ఆమె తల్లిదండ్రులు. ‘మిక్సీ (ఎందుకు)?’ అడిగింది అమ్మాయి. ‘ఇండియా సేఫ్ కాదు’ స్పష్టం చేశారు. వాదించింది రైతా. అయినా ఒప్పుకోలేదు తల్లిదండ్రులు. ఈసారి ప్రదీప్ యూకేలో చదువును బహానా (సాకు)గా మలచుకున్నాడు. వీసా ఓకే అయింది. యూకే నుంచి తేలిగ్గానే ఫిన్లండ్కి వీసా దొరికింది. రైతా ఆనందానికి అవధుల్లేవు. పరిచయం అయిన ఏడేళ్లకు ఒకరినొకరు చూసుకోబోతున్నారు. ఆ క్షణం రానేవచ్చింది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నాక ఇంకా నచ్చారు! రైతా తల్లిదండ్రులకూ నచ్చాడు ప్రదీప్! కానీ అమ్మాయి అక్కడికి వెళ్లి ఉండగలదా? అప్పటికీ ఇండియా మీద ఇంకా సానుకూలమైన అభి్రపాయానికి రాలేదు వాళ్లు. ‘ఉంటాను’ ధైర్యం చెప్పింది. ట్రయల్ గా హైదరాబాద్ను విజిట్ చేసింది కూడా! ఇక్కడి సోషల్ లైఫ్ను ఇష్టపడింది. ప్రదీప్ తల్లిదండ్రులకూ రైతా చాలా నచ్చింది. రైతా కుటుంబం కూడా హైదరాబాద్ వచ్చి, ప్రదీప్ కుటుంబాన్ని కలిసింది. అలా ఏడేళ్ల వాళ్ల ప్రేమ ఇరు కుటుంబ సభ్యుల ఆమోదం, ఆశీర్వాదంతో ఏడడుగుల బంధమైంది. వాళ్ల పెళ్లికిప్పుడు ఇరవై ఏళ్లు. నలుగురు పిల్లలు. ప్రదీప్ కోసం రైతా శాకాహారిగా మారింది. తెలుగు నేర్చుకుంది. ప్రదీప్ జీవితంలోనే కాదు బిజినెస్లోనూ భాగస్వామైంది. ప్రదీప్ ఫీనిష్ నేర్చుకున్నాడు. తన కోసం ఆమె చేసుకున్న, చేసుకుంటున్న సర్దుబాట్లను అతను గుర్తిస్తాడు. అమె అభి్రపాయాలను గౌరవిస్తాడు. రైతా తల్లిదండ్రులు తన కూతురు చాలా అదృష్టవంతురాలని పొంగిపోతారు. ‘‘మేమొక మాట అనుకున్నాం.. పెళ్లనే గొప్ప బంధంలోకి అడుగుపెడుతున్నాం. మనమధ్య వచ్చే ఏ తగవైనా మన రిలేషన్షిప్ని మరింత స్ట్రాంగ్ చేయాలి తప్ప వీక్ చేయకూడదు అని. దాన్నే ఆచరిస్తున్నాం!’ అని చెబుతోంది రైతా. – సరస్వతి రమ -
కొత్త తరం ప్రేమలు.. జెన్జెడ్ ప్రేమలు
జమానా మారినా ప్రేమకు అర్థం మారదు! కానీ ఇప్పుడు ప్రేమ కూడా ఆన్లైన్కి చేరి.. ఆ బంధం కూడా ట్రెండింగ్ అయ్యి.. సాఫ్ట్వేర్ అప్డేట్స్లాగా రోజుకో కొత్త రిలేషన్షిప్ లాంచ్ అవుతోంది! బ్రెడ్క్రంబింగ్.. అవతలి వ్యక్తి పట్ల ఇంట్రెస్ట్.. ఫీలింగ్స్ ఉన్నట్లు, ఆ రిలేషన్షిప్ కోసం ఎంతో సమయం వెచ్చిస్తున్నట్లు నటించడమే బ్రెడ్క్రంబింగ్. అటెన్షన్ కోసం, అవతలి వాళ్ల మీద నియంత్రణ కోసం ఈ డ్రామా ఆడతారు. రోచింగ్.. ఒకరికి తెలియకుండా మరొకరితో ఏకకాలంలో అనేకమందితో రిలేషన్లో ఉండటం. అయితే దీన్ని జెన్ జీ చీటింగ్గా భావించడం లేదు. సీక్రసీ అంటోందంతే!బెంచింగ్.. అవతలి వ్యక్తిని మరోవైపు కదలనివ్వకుండా.. అలాగని తమ నుంచి కమిట్మెంట్ ఇవ్వకుండా, సీరియస్నెస్ చూపించకుండా అప్పడప్పుడు ఫోన్లు, మెసేజ్లు చేస్తూ అవతలివాళ్లను కట్టిపడేయడమే బెంచింగ్.కాన్షస్ డేటింగ్.. చుట్టూ తిరిగే వాళ్లలో ఒకరిని ఎంచుకోకుండా.. నీ వ్యక్తిత్వాన్ని గౌరవించి, నిన్ను నిన్నుగా ఇష్టపడుతూ జీవితాంతం తోడుగా, నమ్మకంగా ఉండే వ్యక్తిని వెదుక్కోవడమే కాన్షస్ డేటింగ్!కఫింగ్.. చలికాలం, సెలవులు, వాలంటైన్ వీక్.. ఇలా ప్రత్యేక సమయం, సందర్భాల్లో డేటింగ్ చేయడాన్ని కఫింగ్ అంటున్నారు. ïడ్రై డేటింగ్ .. ఆల్కహాల్ ఫ్రీ డేట్ అన్నమాట. అంటే డేటింగ్కి వెళ్లినప్పుడు ఆల్కహాల్ తీసుకోరు. సింగిల్స్, రిలేషన్షిప్లో ఉన్నవాళ్లు.. అందరూ ఈ డ్రై డేట్స్కి ప్రాధాన్యమిస్తున్నారు. సింగిల్స్ అయితే తమకు కాబోయే పార్టనర్ మందు ప్రభావానికి లోనుకాకుండా సహజంగా ఎలా ప్రవర్తిస్తాడు/ ప్రవర్తిస్తుంది అని తెలుసుకోవడానికి, అదివరకే రిలేషన్షిప్ లో ఉన్నవాళ్లయితే తమ అనుభవాలు, మంచి చెడులను చర్చించుకోవడానికి ఈ డ్రై డేట్స్ని ప్రిఫర్ చేస్తున్నారు. కిటెన్ఫిషింగ్ .. వ్యక్తిగత విషయాలకు సంబంధించి అబద్ధాలాడుతూ అవతలి వాళ్లను నమ్మించడం లేదా వశపరచుకోవడం. ఉదాహరణకు వయసును తగ్గించి, జీతాన్ని పెంచి చెప్పడం, సన్నగా ఉన్నప్పటి ఫొటోలు అప్లోడ్ చేయడం, ఇంజినీరింగ్ డిప్లమా చేసి, డిగ్రీ చేశానని నమ్మించడం లాంటివన్నమాట.లవ్ బాంబింగ్.. వ్యక్తిత్వంతో కాకుండా మాటలు, కానుకలు, అటెన్షన్తో అవతలి వ్యక్తిని గుక్క తిప్పుకోనివ్వకుండా చేయడం సిట్యుయేషన్షిప్.. ఇది ఫ్రెండ్షిప్కి ఎక్కువ.. రిలేషన్షిప్కి తక్కువ! అటాచ్మెంట్ ఉంటుంది. కానీ కమిట్మెంట్ ఉండదు.నానోషిప్.. పెళ్లిళ్లు, ఫంక్షన్లు, క్లబ్లు, పబ్లలో చూపులు కలిసి.. నవ్వులు విరిసి.. ఫ్లర్టింగ్ మొదలై.. అక్కడే ముగిసి అదొక తీయటి జ్ఞాపకంలా మిగిలిపోయేది!ఇంకా..ఒక బంధంలో ఉంటూనే మరొకరితో రిలేషన్ మెయిన్టెయిన్ చేసే ‘ఓపెన్ కాస్టింగ్’, సరిహద్దులకతీతంగా చేసే డిజిటల్ డేటింగ్ ‘వండర్ లవ్’ లేదా ‘డేటింగ్ నోమాడ్’, వాట్సాప్ మెసేజెస్ తో మాత్రమే రిలేషన్షిప్లో ఉండే ‘టెక్స్టేషన్షిప్’లాంటి బంధాలు, ఫోన్కాల్స్.. మెసేజెలను మెల్లగా తగ్గిస్తూ బంధం నుంచి వైదొలిగే ‘ఫేడింగ్’, ఏ సమాచారం లేకుండా హఠాత్తుగా భాగస్వామితో కమ్యూనికేషన్ను కట్ చేసుకోవడం, వాళ్ల జీవితంలోంచి అదృశ్యమైపోయే ‘ఘోస్టింగ్’ లాంటి అప్రకటిత బ్రేకప్లు, జీవితంలోంచి వెళ్లిపోయినా.. సోషల్ మీడియాలో పార్టనర్ చేసే పోస్ట్లను వెదుకుతూ లైక్స్ కొట్టే ‘హంటింగ్’ లాంటి గూఢచర్యాలూ ఉన్నాయి. ఇవన్నీ ఈ తరం ఫాలో అవుతున్న ‘లవ్షిప్స్!’పారదర్శకంగా ఉండాలిప్రేమించే వాళ్ల స్థాయిని కాకుండా మనస్తత్వాన్ని క్షుణ్ణంగా తెలుసుకుని, అన్ని విషయాలలో పారదర్శకంగా ఉండాలి. కుటుంబాలకు, కనీసం స్నేహితులకు కూడా చెప్పుకోలేని ప్రేమ బంధాలు చాలావరకు అబద్ధాల మీదే నిర్మితమై ఉంటాయి. నిజాయితీపరులైన ప్రేమికులను కులం, మతం వంటి కట్టుబాట్ల నుంచి రక్షించడానికి వివిధ చట్టాలు ఉన్నాయి. అలాగే ప్రేమ పేరుతో మోసం చేసే వారికీ కఠినమైన శిక్షలు ఉన్నాయి. ఆకర్షణకు లోనవకుండా భాగస్వామిని క్షుణ్ణంగా అర్థం చేసుకొని కమిట్ అవడం మంచిది. – సుధేష్ణ మామిడి, హైకోర్టు న్యాయవాది -
'అన్ని చెడులకు అదే కారణం'.. రిలేషన్స్పై సమంత కామెంట్స్
టాలీవుడ్ హీరోయిన్ సమంత ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. గతేడాది సిటాడెల్ ఇండియన్ వర్షన్ హనీ బన్నీ సిరీస్తో ప్రేక్షకుల ముందుకొచ్చిన సామ్ ప్రస్తుతం ఏ ప్రాజెక్ట్లోనూ నటించండ లేదు. మరోవైపు పికిల్ బాల్ టోర్నమెంట్లో బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించింది. ఇది చూసిన నెటిజన్స్ సమంత అతనితో రిలేషన్లో ఉందంటూ కామెంట్స్ చేశారు. దీంతో నెట్టింట మరోసారి డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి.ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రిలేషన్స్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. గతంలో ఉన్న సంబంధాలపై మాట్లాడింది. ఈ సందర్బంగా జీవితంలో చాలా కష్టాలు పడ్డానని తెలిపింది సామ్. అందుకే ప్రస్తుతం రిలేషన్ గురించి ఆలోచించట్లేదని వెల్లడించింది. అంతే కాకుండా గతంలో రిలేషన్షిప్లో ఉన్న వారిపట్ల తనకేలాంటి అసూయ, కోపం ఉండవని తెలిపింది. ఎందుకంటే అసూయ అన్నీ చెడులకు కారణమని చెబుతోంది సమంత.కాగా.. గతంలో టాలీవుడ్ నాగచైతన్యను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. 2017లో వివాహం చేసుకున్న చైతూ- సామ్ 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి సమంత ఒంటరిగానే ఉంటున్నారు.నాగచైతన్య రెండో పెళ్లి..నాగచైతన్య గతేడాది రెండో పెళ్లి చేసుకున్నారు. హీరోయిన్ శోభిత ధూళిపాలను ఆయన పెళ్లాడారు. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో వీరి వివాహం గ్రాండ్గా జరిగింది. ఈ వేడుకలో సన్నిహితులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. -
పెళ్లై పాతికేళ్లు : ఆంటీ కోసం అంకుల్ డ్యాన్స్! వైరల్ వీడియో
భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు (Husband And Wife Relationship) కాలం గడిచే కొద్దీ మరింత బలపడతాయి. పిల్లలు, బాధ్యతలు, కష్టాలు కన్నీళ్లు ఎన్ని ఉన్నా వారి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. సంసార సాగరాన్ని ఈదుతున్న క్రమంలో వారి సఖ్యత మరింత దృఢపడుతుంది. పది కాలాల పాటు పదిలంగా ఉంటుంది. కాపురం చేసే కళ కాలు తొక్కేనాడే తెలుస్తుందనేది సామెత. అలా ఒకరి పట్ల ఒకరు విశ్వాసంతో, ఒకరి ఇష్టా ఇష్టాలను గౌరవించుకుంటూ పోతే ఎలాంటి విభేదాలకు, పొరపచ్చాలకు తావుండదు. ఇద్దరిమధ్య ఆరోగ్యకరమైన బంధం ఏర్పడుతుది. అది భవిష్యత్తరాలకు పునాది అవుతుంది. ఇదంతా ఎందుకంటే 25వ వార్షికోత్సవం (25th Wedding Anniversary) సందర్భంగా భార్య కోసం ఒక భర్త చేసిన రొమాంటిక్ డ్యాన్స్ ఇంటర్నెట్లో హృదయాలను గెలుచుకుంటోంది. సతీపతుల బంధం కాలానికి లొంగేదికాదు, ఏ వయసులోనైనా అది మనోహరమైనదే,స్వచ్ఛమైనదే తేల్చి చెప్పిన ఈ వీడియో నెట్టింట విశేషంగా నిలుస్తోంది.మూడు ముళ్లు, ఏడు అడుగులతో మొదలైన ఆలుమగల అనుబంధం నూరేళ్లు చల్లగా ఉండాలని దీవిస్తారు పెద్దలు. అలా పాతికేళ్ల పాటు దంపతులుగా జీవించిన ఒక జంట తమ 25వ పెళ్లి రోజు వేడుకలను నిర్వహించుకుంటోంది. చుట్టూ కుటుంబ సభ్యులు, హితులు,సన్నిహితులు, అతిథులు అంతా ఉత్సాహంగా ఉన్నారు. దంపతులు అందంగా ముస్తాబయ్యారు. అందరి సమక్షంలో మరోసారి దండలు మార్చుకున్నారు. దీంతో ఆనందంగా శుభాకాంక్షలు అందిస్తున్నారు. ఇంతలో భర్త ఉత్సాహంగా డ్యాన్స్ వేయడం మొదలు పెట్టాడు. దీంతో పక్కనే భార్య సిగ్గుల మొగ్గైంది. అటు అతిథులు కూడా గొంతు కలిపారు. అక్కడే ఉన్న యువత చప్పట్లతో వారిని ఉత్సాహ పరిచారు. మరికొందరు ఈ ఆయన డ్యాన్స్ను తమ కెమెరాలలో బంధించారు. View this post on Instagram A post shared by Sakshi Bisht | Cabin Attendant (@sakshi__bisht1) బాలీవుడ్ మూవీ కభీ ఖుషీ కభీ గమ్ సినిమాలో షారుఖ్ ఖాన్ క్లాసిక్ సాంగ్ ‘ యే లడ్కా హై’ పాటు చక్కటి అభినయం చేస్తూ భార్యపై తన ప్రేమను బహిరంగంగా వ్యక్త పరిచడం నెటిజనులను బాగా ఆకట్టుకుంది. దీంతో ఈ రొమాంటిక్ డ్యాన్స్కు సోషల్ మీడియాలో వైరల్గామారింది. సాక్షి బిస్త్ అనే యూజర్ ఐడీలో గత ఏడాది అక్టోబరులో పోస్ట్ అయిన ఈ వీడియో దాదాపు 11.1 లక్షల వ్యూస్ సంపాదించింది. భార్యభర్తల ప్రేమ అనురాగం పటిష్టంగా ఉండాలంటే ఒకరిపై మరొకరికి నమ్మకం ఉండాలి. భాగస్వాముల మధ్య విశ్వసనీయత ముఖ్యం అంటూ పలువురు ఈ జంటకు అభినందనలు తెలిపారు. -
దుమ్ము దులిపేద్దాం.. జ్ఞాపకాలు సర్దేద్దాం!!
అంజలీ.. ఈరోజు ఎలాగూ కాలేజీ సెలవు కదా ఇల్లు సర్దేద్దాం నువ్వూ నాన్నా రెడీగా ఉండండి.. వంటింట్లోంచి కేకేసింది లావణ్య.. అమ్మా ఈరోజు వద్దమ్మా .. ఇంకోరోజు చేద్దాం.. తప్పించుకోబోయింది కూతురు.. లేదు.. లేదు.. పండగ వచ్చేస్తోంది.. ఎక్కడి వస్తువులు అక్కడే ఉన్నాయి.. అన్నీ రూములు.. సెల్ఫ్ లు.. పుస్తకాలు.. బట్టలు.. బుక్స్ ర్యాకులు అన్నీ తీసి పక్కన పెట్టండి.. అన్నీ దుమ్ము దులిపి అన్నీ మళ్ళా లోపల పెట్టాలి.. అర్థమైందా.. ఆర్డర్ వేసింది లావణ్య. సరే.. చేస్తే నాకేమిస్తావ్ అంది అంజలి.. నీకు బిర్యానీ చేసి.. సాయంత్రం బొబ్బట్లు చేస్తాను అని ఆఫర్ ఇచ్చింది.. మరి నాకూ అన్నాడు రాజేష్ కొంటెగా.. సిగ్గుండాలి మనిషికి అని మురిపెంతో కలిపిన చిరాకుతో వంటింట్లోకి వెళ్ళింది లావణ్య.బుక్స్ సర్దుతూ నాన్నా ఇదేంటి ఇలా మాసిపోయింది అంటూ ఓ కోతిబొమ్మను చూపించింది.. ఓ.. అదా.. ఇన్నేళ్లకు మళ్ళీ దొరికిందా అంటూ దాన్ని ముద్దుగా చేతిలోకి తీసుకున్న లావణ్య.. ఓహ్.. అదా.. నువ్వు నాలుగేళ్లు ఉన్నపుడు డాల్ఫిన్ హోటల్లో ఓ పుట్టినరోజుకు వెళ్ళాం గుర్తుందా అప్పుడు అక్కడ డెకరేషన్ కోసం పెట్టిన బొమ్మ కావాలని ఏడ్చావు.. ఎంత ఊరుకోబెట్టినా ఏడుపు ఆపలేదు.. చిరాకొచ్చి నాన్న నీకు టెంకిమీద రెండు పీకాడు గుర్తుందా.. అంది లావణ్య.. ఓహ్.. నాన్న నన్ను కొట్టారా.. అంటూ ఇప్పుడు ఏడుపు మొహం పెట్టింది అంజలి.. ఆ.. అలా కొట్టి మళ్ళీ నిన్ను ఎత్తుకుని జగదాంబ జంక్షన్లో చినుకులు పడుతున్నా వెతికి మరీ ఈ బొమ్మ కొన్నాం.. అదన్నమాట దీని కథ.. అని లావణ్య చెప్పగా.. ఓహ్.. అంటూ నాన్న తనను కొట్టారన్న కోపం స్థానే.. నాన్నను నేనంటే ఎంత ముద్దో అని ప్రేమగా నాన్నవైపు చూసింది అంజలి. నాన్నా చిన్న చిన్న గ్రీటింగ్స్ .. ఆకులు.. ఎండిపోయిన పూలు.. రంగుకాగితాలు దొరికాయ్.. అంది అంజలి.. అవునమ్మా చిన్నప్పుడు నువ్వు నా బర్త్ డేకు. న్యూ ఇయర్ కు కూడా నువ్వే సొంతగా గ్రీటింగ్ చేసి ఇచ్చేదానివి.. అవన్నీ ఇలా దాచిపెట్టాను.. ఇప్పుడు పెద్దయ్యాక ఇవ్వడం మానేసావులే.. అన్నాడు రాజేష్ నిష్టూరంగా. చిన్ననాటి తన క్రియేటివిటీకి మురిసిపోయిన అంజలి.. అయ్యో అదేంలేదునాన్న నువ్వు ఎప్పటికీ నాకు హీరోవి.. నీకు నేనే పెద్ద గ్రీటింగ్ కార్డు.. అంటూ కవర్ చేసేసింది.నాన్నా ఇవేంటి ఐస్ క్రీమ్ కప్పులు.. జడక్లిప్పులు.. అన్నీ ఒక్కో రంగులో ఒక్కో గాజు.. ఇవన్నీ ఒక్కో కవర్లో ఉన్నాయి.. బయటపడేయాలా అంది అంజలి.. వంటగదిలోంచి పరుగున వచ్చిన లావణ్య.. వెంటనే ఆ కవర్ అందుకుని తీసుకుంది.. ఎందుకమ్మా ఆ చెత్తంతా బయటేసేద్దాం అంది అంజలి.. అది చెత్త కాదమ్మా.. ప్రేమ జ్ఞాపకాలు చెప్పబోయాడు రాజేష్.. చాలు.. మీ దిక్కుమాలిన లవ్వు.. దానికో జ్ఞాపకం.. పిల్ల ఉందన్న జ్ఞానం కూడా లేదు.. కసురుకుంటూ.. జ్ఞాపకాలను తలచుకుంటూ కవర్ తీసుకుని ప్రేమగా వేరేచోట పెట్టింది.ర్యాక్ లోని కవర్ నుంచి ఓ పాత చీర తీసి సెల్ఫ్ మొత్తం తుడిచేయబోతుంటే రాజేష్ .. అంజూ ఆ చీర జాగ్రత్తగా ఉంచమ్మా అన్నాడు.. ఏంది దీనికి కూడా ఫ్లాష్ బ్యాక్ ఉందా అంది అంజలి.. ఉంది నాన్న.. నేను అమ్మను తొలిసారి చూసింది ఈ చీరలోనే.. ఆ తరువాతనే నేను అమ్మను ప్రపోజ్ చేయడం.. పెళ్లి చూపులు చూడడం ... నువ్వు మాకు దక్కడ అంటూ పరవశంతో చెబుతున్నాడు.. ఐతే నాన్న నేను ఈ చీర ఉంచుకుంటా.. అమ్మనువ్వు ఇద్దరూ నాతో ఉన్నట్లే ఉంటుంది కదా అంది అంజలి.. పాప ప్రేమను చూసి భార్యాభర్తలు ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు.. సరే సర్దింది చాలు.. బిర్యానీ అయిపొయింది.. రండి అంది లావణ్య. చూసారా ఇల్లు సర్దితే అటు సమన్లు పేర్చుకోవచ్చు.. ఇటు పాత జ్ఞాపకాలనూ పొడుపుకోవచ్చు అంది లావణ్య.. అవునవును అంటూ తండ్రీకూతుళ్ళు ఇద్దరూ తల్లిని అల్లుకుపోయారు.-సిమ్మాదిరప్పన్న. -
సందేహాలను నివృత్తి చేసే.. దుల్హా–దుల్హన్
గతంలో పెళ్లి జరగాలంటే వధూవరులను పెద్ద నాన్నలు, బాబాయ్లు, మామలు, పెద్దమ్మలు, మేనత్తలు అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూసి అబ్బాయి లేదా అమ్మాయి నచి్చతే వారి గుణగణాలు తెలుసుకొని కుటుంబ పరిస్థితి తెలుసుకొని పెళ్లి జరిపించేవారు. వివాహం జరిగిన తర్వాత భర్తతో ఎలా మసలుకోవాలి?, అత్తగారింట్లో ఎలా ఉండాలి? ఇలాంటివన్నీ అమ్మమ్మలు, తాతలు, నానమ్మలు కొత్తగా పెళ్లయిన వారికి చెప్పేవారు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు కరువై యాంత్రిక జీవనం కొత్తగా పెళ్లయిన వారినే కాకుండా పెళ్లికి ముందు కూడా వధూవరులను, పెళ్లి తర్వాత భార్యా, భర్తలను మనస్పర్థలకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టోలిచౌకిలో నివసించే ఇలియాస్ షంషి అనే వ్యక్తి ‘దుల్హా–దుల్హన్’ కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చాడు. దీని గురించిన మరిన్ని విశేషాలు..! టోలిచౌకి బాల్రెడ్డినగర్ కాలనీలో ఏర్పాటు చేసిన దుల్హా–దుల్హన్ ఫ్యామిలీ ఇన్స్టిట్యూట్కు మంచి స్పందన లభిస్తోంది. ఈ ఇన్స్టిట్యూట్లో కొత్తగా పెళ్లి చేసుకోబోయేవారు ఎలా ఉండాలి అనే దానిపై 15 అంశాల్లో నిర్వాహకుడు ఇలియాస్ షంషి శిక్షణ ఇస్తున్నారు. హైదరాబాద్లోనే కాకుండా బెంగళూరు, చెన్నై, గుజరాత్, ఢిల్లీ, కోల్కతాతో పాటు దుబాయ్, కెనడా, అమెరికాలో కూడా షంషి ప్రారంభించిన ఆన్లైన్ క్లాస్లకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. పెళ్లంటే ఏంటి?, పెళ్లిలో మంత్రాల అర్థం ఏంటి? వాటిని ఎలా అర్థం చేసుకోవాలి?, పెళ్లి ఎందుకు?, బాధ్యతలు, భర్తతో మనస్పర్థలు వస్తే వాటిని ఎలా పరిష్కరించుకోవాలి?, భార్య అంటే ఎలా ఉండాలి?, భర్త చేయాల్సినవి, చేయకూడనివి ఏంటి?, మీరు మంచి భర్తగా ఎలా ఉండొచ్చు తదితర అంశాలపై షంషి శిక్షణ ఇస్తున్నారు. సందేహాలను నివృత్తి చేస్తూ.. హోమ్ మేనేజ్మెంట్, భర్త మనసును ఎలా గెలుచుకోవాలి, భార్య మనసును ఎలా గెలుచుకోవాలి ఇలాంటివన్నీ ఈ ట్రైనింగ్లో భాగమయ్యాయి. పెళ్ళికి ముందు వధూవరులు వస్తే వారు అడిగే ప్రశ్నలకు సందేహాలను నివృత్తి చేస్తూనే పెళ్లి తర్వాత మంచి భర్తగా, లేదా మంచి భార్యగా ఎలా ఉండాలి అన్న అంశాలపై ఈ శిక్షణ కొనసాగుతున్నది.మంచి స్పందన మేం ఈ సంస్థను ఏర్పాటు చేసినప్పుడు స్పందన అంతంత మాత్రంగానే ఉండేది. రోజులు గడుస్తున్న కొద్దీ మా సంస్థకు రెస్పాన్స్ పెరుగుతోంది. అమెరికా, దుబాయ్, కెనడా తదితర ప్రాంతాల నుంచి కూడా మేం నిర్వహించే ఆన్లైన్ క్లాస్లకు అభ్యర్థులు హాజరవుతున్నారు. పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత భార్యా, భర్తల బంధం ఎంత బలంగా ఉండాలో ఈ శిక్షణ ద్వారా సూచిస్తున్నాం. ఇప్పటి వరకూ వేలాది మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. మూడు నెలల పాటు ఈ ఆన్లైన్ శిక్షణ ఉంటుంది. అంతే కాదు బెస్ట్ మదర్ అనిపించుకోవడం ఎలా అన్నదానిపై కూడా మా శిక్షణ కొనసాగుతున్నది. ఇటీవల పెళ్లికి ముందే చిన్న చిన్న విషయాల్లో వధూవరులకు మనస్పర్థలు వచ్చి పెళ్లిళ్లు ఆగిపోతున్న ఘటనలూ చూస్తున్నాం. దుల్హన్ కోర్సులో ఈ విషయాలన్నింటికీ సమాధానాలు లభిస్తున్నాయి. యువతీ, యువకులకు వేర్వేరుగా ఈ క్లాసులు ఉంటాయి. ముఖ్యంగా భార్య, భర్తల బంధం బలంగా ఉండాలంటే ఎలా ఉండాలో చూపిస్తున్నాం. – ఇలియాస్, షంషీ, ట్రైనర్ ఫ్యామిలీ ఇన్స్టిట్యూట్ 2019లో ఏర్పాటు.. ప్రతిరోజూ పాతిక మంది వరకూ ఆన్లైన్ క్లాసులకు హాజరయ్యే ఈ ఫ్యామిలీ ఇన్స్టిట్యూట్ 2019లో ఏర్పాటైంది. ఇప్పటి వరకూ వేల సంఖ్యలో యువతీ, యువకులకు శిక్షణతో పాటు తగిన సూచనలు జారీ చేశారు షంషి. భార్యా, భర్తల మధ్య ఏదైనా గొడవ వస్తే వాటిని పరిష్కరించే దిశలోనే ఆయన అడుగులు వేస్తున్నారు. ఎవరికైనా ఇలాంటి సలహాలు, సంప్రదింపులు కావాలంటే తమ ఇన్స్టిట్యూట్లో జాయిన్ కావొచ్చు అని కూడా పేర్కొంటునారు. పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత మేం చెప్పబోయే అంశాలు ఏమిటి అన్న దానిపై వివరిస్తూ స్పష్టంగా వెబ్సైట్లో పొందుపరిచారు. -
విడిపోవడం ఆత్మహత్యకు ప్రేరేపించడం కాదు
న్యూఢిల్లీ: ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న బంధం విచ్ఛిన్నమై వారిలో ఒకరు ఆత్మహత్యకు పాల్పడితే.. ఆ బంధం విడిపోవడమే ఆ ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు పరిగణించలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఇద్దరి మధ్య సంబంధం తెగిపోవడం అనేది నేరం కాదని, అందుకు శిక్ష విధించలేమని స్పష్టంచేసింది. సెక్షన్ ప్రకారం 306 ప్రకారం ఉద్దేశపూర్వకంగా ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు నిర్ధారణ అయితేనే శిక్ష విధించగలమని వెల్లడించింది. ఒక వ్యక్తికి ఐదేళ్ల జైలుశిక్ష విధిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. కర్ణాటకకు చెందిన కమ్రుద్దీన్ దస్తగిర్ సనాదీ, మరో మహిళ ఎనిమిదేళ్లపాటు సహజీవనం చేశారు. 2007 ఆగస్టులో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కమ్రుద్దీన్ అరెస్టయ్యాడు. అతడిౖపై ఐపీసీ సెక్షన్ 417(మోసం), సెక్షన్ 306(ఆత్మహత్యకు పురికొల్పడం), సెక్షన్ 376(అత్యాచారం) కింద కేసు నమోదు చేశారు. కమ్రుద్దీన్ నిర్దోషి అని గుర్తిస్తూ కింది కోర్టు తీర్పు ఇచ్చింది. సవాల్ చేస్తూ పోలీసులు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కమ్రుద్దీన్ను దోషిగా తేల్చింది. ఐదేళ్లపాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. రూ.25 వేల జరిమానా సైతం విధించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ అతడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఇది బంధం విడిపోయిన కేసు తప్ప నేరం కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. -
లవ్ లో ఉన్న మాట నిజమే.. ఓపనైపోయిన రౌడీస్టార్.. విజయ్
-
అతని కోసం చాలా విషయాల్లో రాజీపడ్డాను : అనన్యా పాండే!
‘మనం ఇష్టపడే వారి కోసం ఎంత మారినా పర్వాలేదనిపిస్తుంది’ అంటున్నారు హీరోయిన్ అనన్యా పాండే. విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘లైగర్’ సినిమాతో తెలుగుకి పరిచయమయ్యారీ నార్త్ బ్యూటీ. 2022 ఆగస్టు 25న ఈ చిత్రం విడుదలైంది. ‘లైగర్’ తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదామె. అయితే హిందీలో మాత్రం వరుసగా సినిమాలు చేస్తున్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో రిలేషన్షిప్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘గతంలో నేను రిలేషన్షిప్లో ఉన్నాను. ఎదుటి వ్యక్తి కోసం నేనెంతగానో మారాను. చాలా విషయాల్లో రాజీపడ్డాను. రిలేషన్షిప్ ప్రారంభమైనప్పుడు ఎదుటి వ్యక్తి మెప్పు పొందడం, వారి దృష్టిని ఆకర్షించడం కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది. మనం ఎంత మారినా ఫర్వాలేదనిపిస్తుంది. అయితే మనం మారుతున్నామనే విషయం ఆరంభంలో మనకు అర్థం కాదు. ఇది సహజంగానే ఉన్నట్లు అనిపిస్తుంది. ప్రేమలో ఉన్నప్పుడు లోపాలు తెలియవు. ఏదీ మనకు సమస్యగా అనిపించదు. ఆ బంధం నుంచి మనం బయటకు వచ్చినప్పుడే అన్నీ అర్థం అవుతాయి. రిలేషన్షిప్లో నేను నిజాయతీగా ఉంటాను. ఎదుటి వ్యక్తి నుంచీ అంతే నిజాయతీ లభిస్తే బాగుంటుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య నమ్మకం ఉంటేనే ఏ బంధమైనా బలపడుతుంది. నాకు కాబోయే వ్యక్తి సింప్లిసిటీగా, నన్ను అర్థం చేసుకునేవాడై ఉండాలి’’ అని తెలిపారు అనన్యా పాండే. ఇదిలా ఉంటే నటుడు ఆదిత్యరాయ్ కపూర్తో అనన్య ప్రేమలో ఉన్నట్లు గతంలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఇటీవల వీరిద్దరూ విడిపోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రిలేషన్ షిప్ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్లో వైరల్గా మారాయి. కాగా ప్రస్తుతం ‘శంకరా’ అనే సినిమాలో నటి స్తున్నారు అనన్యా పాండే. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నారు. -
ఇంట్లో ఇల్లాలు.. పీజీలో ప్రియురాలు
మైసూరు: వివాహమై భార్యతో కాపురం చేస్తున్నా మరొక మహిళతో ప్రేమాయణం నడిపి గర్భవతిని చేయడమే కాకుండా రూ.9 లక్షలను తీసుకుని మోసగించిన ఘటన మైసూరులోని వీవీ మొహల్లాలో వెలుగుచూసింది. మోసపోయిన మహిళ జయలక్ష్మిపురం పోలీసు స్టేషన్లో బెంగళూరు నివాసి భరత్గౌడ, అతని తల్లిదండ్రులు సురే‹Ù, అంకితలపై ఫిర్యాదు చేసింది. వయసులో పెద్దయినా.. వివరాలు..బాధితురాలు భాగ్యలక్ష్మి (32) గోకులంలో ప్రైవేటు హాస్టల్ (పీజీ) నడుపుతున్నారు. 2022లో భరత్గౌడ (29)తో ఇన్స్టా లో పరిచయం ఏర్పడింది. తనకన్నా ఆమె పెద్దదైనప్పటికీ, ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని వెంటపడ్డాడు. అప్పటికే అతనికి పెళ్లయింది. కానీ విడాకులు ఇచ్చానని బాధితురాలికి నమ్మబలికాడు. మోసగానికి అతని తల్లిదండ్రులు కూడా వంతపాడుతూ బాధిత మహిళను వలలోకి లాగారు. నమ్మిన మహిళ పెళ్లికి ఒప్పుకుంది. స్నేహితులు, బంధువులు, తల్లిదండ్రుల సమక్షంలో 2023లో ఫంక్షన్ హాల్లో పెళ్లి జరిగింది. ఆ సమయంలో వ్యాపారం కోసమంటూ రూ.10 లక్షలు, 100 గ్రాముల బంగారు ఆభరణాలను భరత్గౌడ వరకట్నంగా తీసుకున్నాడు. ఆ తర్వాత రూ.8 లక్షలు ఇచ్చి కార్ వాషింగ్ సెంటర్ని పెట్టించింది. అంతేగాకుండా ఆమె క్రెడిట్ కార్డు నుంచి భరత్గౌడ రూ.1.25 లక్షలను డ్రా చేసుకున్నాడు. మొదటి భార్యకు తెలిసి ఇలా ఉండగా మొదటి భార్య మోనిక ఈ విషయాన్ని తెలుసుకుని భాగ్యలక్ష్మికి భరత్గౌడ మోసగాడు, జాగ్రత్తగా ఉండాలని మెసేజ్ చేసింది. దీనిపై భాగ్యలక్ష్మి నిలదీయగా, ఆమె మాటలు నమ్మవద్దని చెప్పాడు. మొదటి భార్యతో కాపురం చేస్తూనే నాటకమాడి తనను మోసగించినట్లు అర్థమైంది. దీంతో నిలదీయగా చంపుతానని ఆమెను బెదిరించాడు. ఈ నేపథ్యంలో అతని మోసాల గురించి భాగ్యలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
ఏఆర్ రెహమాన్, ధనుష్ సహా రీసెంట్గా విడాకులు తీసుకున్న స్టార్స్ (ఫొటోలు)
-
‘పెళ్లాం చెబితే వినాలి'.. ఇది పుష్పగాడి మాటే కాదు..
‘శ్రీవల్లి నా పెళ్లాం. పెళ్లాం మాట మొగుడు వింటే ఎట్టా ఉంటుందో పెపంచకానికి చూపిస్తా’ అని తాజాగా విడుదలైన ‘పుష్ప2’ ట్రైలర్లో హీరో అంటాడు. సానుకూల వివాహ అనుబంధంలో భార్య మాటకు విలువ ఇవ్వడం కుటుంబానికి మంచిది అంటారు నిపుణులు. ‘భార్య మాట వినే భర్త’ను లొంగుబాటుగా చెప్పే పితృస్వామ్య పరంపర ఉన్నా దాని వల్ల లాభం కంటే నష్టాలే ఎక్కువ అంటున్నారు.కుటుంబ జీవనంలో కీలక నిర్ణయాలే కాదు మంచీ చెడూల్లో భార్య సలహా వినదగ్గది. కొన్ని పరిశీలనలు. ఒక వివాహబంధం విజయవంతం కావాలంటే ముందు వినడం నేర్చుకోవాలి’ అంటున్నారు ప్రవర్తనా నిపుణులు. ‘భార్యాభర్తలు మొదట ఎదుటి వారు ఏం చెప్తున్నారనేది ఓపిగ్గా వింటే చాలు ఆ బంధం సగం సఫలమైనట్టే’ అని వారు అంటున్నారు. మన సమాజంలో భార్య మాట వినే భర్త గురించి పరిహాసం ఆడటం ఉంది. ‘భార్యా విధేయుడు’ అంటూ గేలి చేసేవారు కూడా ఉంటారు. సమాజం ఇంత ముందడుగు వేసినా ‘భార్య మాట వినడంలో తప్పు ఏముంది’ అని ఆలోచించే పరిస్థితి లేదు. అమెరికాలో కొత్తగా పెళ్లయిన దాదాపు 130 జంటలను పరిశీలించిన ఒక జాన్ గోట్మ్యాన్ అనే సైకాలజిస్ట్ ‘భార్య చెప్పేది సానుకూలంగా వినే భర్త ఉన్న జంటలు సంతోషంగా గడపడం’ గమనించాడు. ‘అలాగని ఈ జంటల్లో భర్త మాట భార్య వినకపోవడం అంటూ లేదు. వారు ఎలాగూ వింటారు’ అంటాడు గోట్ మ్యాన్. భారతీయ సమాజంలో భర్తకు ఎదురు నిలవడం అందరు భార్యలు చేయరు. అయితే జోక్గానో, గొణుగుతున్నట్టుగానో, అనునయంగానో చెప్పే భార్యలు ఉంటారు. ‘అలాంటి భార్యలు చెప్పింది విని ముందుకు సాగే భర్త ఉన్న జంటలు కూడా ఇంచుమించు గొడవలు లేకుండా ఉంటున్నాయి’ అంటాడు గోట్మ్యాన్. భార్యాభర్తల్లో ‘అతను చెప్పేది ఏముందిలే’ అని భార్య అనుకున్నా ‘ఆమెకేం తెలుసు ఆమె ముఖం’ అని భర్త అనుకున్నా ఆ వివాహబంధం ప్రమాదంలో పడుతుంది. ఏ వివాహ బంధమైనా ఒకరి దృష్టికోణం నుంచి నడవదు. కాపురంలో తల్లి తరపు వాళ్లు, తండ్రి తరుపు వారు ఉంటారు. స్నేహితులు ఉంటారు. ఇద్దరి వేరు వేరు కెరీర్లు ఉంటాయి. అంటే ఒక సమస్యకు కచ్చితంగా కనీసం రెండు దృష్టికోణాలుంటాయి. భర్తలు కేవలం తమ దృష్టికోణమే సరైనది అనుకోకూడదు. ‘స్త్రీలు జాగ్రత్తగా అన్నీ గమనించి భర్తకు సూచనలు చేస్తారు. ఆ సూచనలను భర్త ఆమెతో చర్చించాలి. నా మాటే నెగ్గాలి అని తప్పు నిర్ణయం తీసుకోవడం వల్ల నష్టం ఇద్దరికీ వస్తుంది’ అంటాడు గోట్మ్యాన్.భర్త తన స్పందన, అప్పులు, ఇచ్చిన హామీలు, కొన్న/కొనబోయే ఆస్తులు, పిల్లల కోసం పొదుపు, ఆరోగ్య విషయాలు... ఇవన్నీ భార్యకు తెలియచేస్తూ ఆమె సలహాను వినాల్సి ఉంటుంది. అలాగే భర్త ఇంట్లో లేనప్పుడు పిల్లల ప్రవర్తన, వారి కదలికలు, బంధువుల రాకపోకలు వచ్చే డిమాండ్లు ఇవన్నీ భార్య తప్పకుండా భర్తకు చేరవేయాలి. ముఖ్యంగా పిల్లలను కరెక్ట్ చేయాల్సిన అంశాలు భార్య లేవనెత్తినప్పుడు భర్త నిర్లక్ష్యం చేయరాదు.అవి సమస్యలు తెస్తాయి. అందుకే గతంలో స్త్రీల మాట చెల్లుబాటయ్యే సందేశం ఇస్తూ ‘పెళ్లాం చెబితే వినాలి’ లాంటి సినిమాలు వచ్చాయి. ఇన్నేళ్ల తర్వాత ‘ఫైర్’లాంటి పుష్ప కూడా ‘పెళ్లాం మాట వినాలి’ అంటున్నాడు. భార్య సరైన సలహా ఇస్తే దానిని ఎందుకు వినకూడదు చెప్పండి? (చదవండి: హృతిక్ రోషన్ సోదరి సునైనా వెయిట్ లాస్ స్టోరీ: ఏకంగా 50 కిలోలు..!) -
‘ఇంతకీ నువ్వు కట్టుకుంది నన్నా? మీ అక్కనా?’
బాలీవుడ్లో కరీనా కపూర్ ఖాన్కి గాసిప్ క్వీన్ అనే పేరుంది. అక్క కరిశ్మా కపూర్తో ఫోన్లో గంటలు గంటలు కబుర్లు చెబుతూ ఉంటుందట. అందులో సగం గాసిప్సే ఉంటాయని ఆ ఇద్దరి సన్నిహితుల కామెంట్! అదటుంచితే.. ఈ అక్కాచెల్లెళ్ల ఎడతెగని ఫోన్ సంభాషణలతో కరీనా కపూర్ ఖాన్ హజ్బెండ్, నటుడు.. సైఫ్ అలీ ఖాన్ తెగ ఉడుక్కుంటాడట. ‘ఇంతకీ నువ్వు కట్టుకుంది నన్నా? మీ అక్కనా?’ అంటూ ఆ ఉడుకుమోత్తనాన్ని చూపిస్తాడట కూడా! -
పేరెంట్స్ కన్నా, ఫ్రెండ్స్ మాటలే ముఖ్యం
‘మావాడు మేం చెప్పేది అస్సలు వినడండీ. ఎప్పుడూ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ అంటుంటాడు. వాళ్లందరూ ఒక గ్యాంగయ్యారు. బైక్తో రిస్కీ ఫీట్స్ చేస్తుంటారు. ఎప్పుడేం తెచ్చుకుంటారోనని గుండె అదురుతుంటుంది..’‘మా పాప మేమేం చెప్పినా పట్టించుకోదండీ. ఫ్రెండ్స్ చెప్తే మాత్రం వెంటనే చేసేస్తుంది. తనకు నచ్చేలా ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు.’‘మా అబ్బాయి ఒకరోజు చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తాడు, మరుసటి రోజే డల్గా కనిపిస్తాడు. ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటాడు.’కౌన్సెలింగ్కు వచ్చే చాలామంది పేరెంట్స్ తమ టీనేజ్ పిల్లల గురించి చెప్పే మాటలవి. చిన్నప్పటి నుంచీ అమ్మ కూచిలా లేదా నాన్న బిడ్డలా ఉన్న పిల్లలు, అప్పటివరకు తమ అభిప్రాయలను గౌరవించి, తాము చెప్పే సూచనలు పాటించే పిల్లలు ఒక్కసారిగా మారేసరికి పేరెంట్స్ తట్టుకోలేరు. వారెక్కడ చేజారిపోతారోనని బాధపడుతుంటారు, ఆందోళన చెందుతుంటారు. కానీ, ఆ వయసుకు అది సహజం. టీనేజ్కు వచ్చేసరికి వారి ప్రపంచం కుటుంబాన్ని దాటి విస్తృతమవుతుంది. ఈ దశలో స్నేహితులు, ఆన్లైన్ కమ్యూనిటీల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పేరెంట్స్ కంటే ఫ్రెండ్స్ మాటలకే ఎక్కువ విలువిస్తారు. స్నేహితుల ఆమోదం, గుర్తింపు పొందడానికి ప్రయత్నిస్తారు. ఈ మార్పును అర్థం చేసుకోవడం ద్వారా తల్లిదండ్రులు.. సున్నితమైన ఈ దశలో పిల్లలకు సరైన మద్దతు అందించగలుగుతారు. పీర్ ప్రెజర్.. స్నేహితుల ఆమోదం పొందాలనే ఒత్తిడి అందరిపైనా ఉంటుంది. కానీ టీనేజ్లో ఎక్కువగా ఉంటుంది. టీనేజర్లు ఒక గ్యాంగ్లో చేరేందుకు ప్రయత్నిస్తారు. ఆ వయసులో అది అత్యవసరమనిపిస్తుంది. ఆ స్నేహితుల ఒత్తిడికి లోనైనప్పుడు తప్పులు చేసే అవకాశాలు పెరుగుతాయి. కొందరు టీనేజర్లు మితిమీరి ప్రవర్తించవచ్చు. మద్యం సేవించడం, ప్రమాదకరమైన ఫీట్స్ చేయడం, విచిత్రమైన వేషధారణలోనూ కనిపించవచ్చు. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి, తల్లిదండ్రులు సంయమనంతో ఉండటం ముఖ్యం. పీర్ ప్రెజర్ గురించి పెద్దలతో స్వేచ్ఛగా మాట్లాడగలిగే వాతావరణాన్ని కల్పించాలి. పిల్లలతో చర్చించి, వారి నిర్ణయాలపై గల ప్రభావాన్ని అర్థంచేయించేందుకు ప్రయత్నించాలి. స్నేహితులకు ‘నో’ చెప్పగలిగే ధైర్యాన్ని నేర్పాలి. సోషల్ మీడియా ప్రభావం.. స్నేహితుల ఒత్తిడి కేవలం పాఠశాల సమయంతో ఆగిపోదు. ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ వంటి సోషల్ మీడియా ద్వారా 24/7 కొనసాగుతుంది. ఇవి తమ వ్యక్తీకరణకు ఎంత ఉపయోగపడతాయో, అంతే నెగటివ్ ప్రభావాన్నీ చూపించే సామర్థ్యం గలవి. సోషల్ మీడియాలో ఇతరులను చూస్తూ, పోల్చుకోవడం వల్ల కొందరు టీనేజర్లు ఆత్మన్యూనతకు లోనవుతుంటారు. పోస్టులకు లైకులు, కామెంట్ల ద్వారా వెంటనే గౌరవాన్ని పొందాలనుకునే తీరు కూడా వారిని కుంగిపోయేలా చేయవచ్చు. సోషల్ మీడియా ద్వారా వచ్చే ఈ ఒత్తిడిని తల్లిదండ్రులు గ్రహించి, వారితో మాట్లాడాలి. వారు చూస్తున్న కంటెంట్ గురించి చర్చించాలి. అది నిజ జీవితాన్ని ప్రతిబింబించదని వారికి అర్థమయ్యేలా వివరించాలి. నిర్ణయాలు, ఆత్మగౌరవంస్నేహితులు, సోషల్ మీడియా ఒత్తిడికి లోనైనప్పుడు టీనేజర్లు ఏ మాత్రం ఆలోచించకుండా ఎమోషన్తో నిర్ణయాలు తీసుకుంటారు. లో సెల్ఫ్ ఎస్టీమ్తో ఉంటే వారు మరింతగా స్నేహితుల ఒత్తిడికి లోనవుతారు. పిల్లల్లో ఆత్మగౌరవాన్ని పెంపొందించడం అత్యంత కీలకం. తల్లిదండ్రులు ఆ బాధ్యతను తీసుకోవాలి. పిల్లలు తమ ప్రతిభను గుర్తించేలా చేయాలి, వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచాలి. ప్రతిరోజూ వారి అభిరుచులు, కష్టాలను గుర్తిస్తూ విజయం దిశగా వారిని ప్రోత్సహించాలి. తల్లిదండ్రులు చేయాల్సింది..యవ్వనంలో, స్నేహితుల ఒత్తిడి సహజమే. కానీ, మీరు సున్నితంగా, ప్రేమతో పిల్లలకు మార్గనిర్దేశం చేస్తే, వారు సంయమనం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. అందుకు మీరు చేయాల్సింది.. పిల్లలకు మీరెప్పుడూ అందుబాటులో ఉంటారని చెప్పాలి. వారు తమ సమస్యలు మీతో పంచుకునేలా నమ్మకాన్ని కలిగించాలి.ఆత్మవిశ్వాసంతో ప్రవర్తించడం, స్నేహితుల ఒత్తిడిని ఎదుర్కొనే నైపుణ్యాలను నేర్పాలి.సోషల్ మీడియా కంటెంట్ గురించి ఓపికగా చర్చించాలి.వారి కృషి, కష్టాలు, ప్రత్యేకతలను గుర్తించి ప్రశంసించాలి.వారు తీసుకునే నిర్ణయాల ఫలితాలను అర్థంచేసుకోవడంలో వారికి సహాయం చేయాలి. -
భార్యాభర్తల సంబంధాలు ఎలా ఉండాలి?
అల్లాహ్ స్త్రీలపై పురుషులకు కొంత ఆధిక్యత ప్రసాదించడం వల్ల, పురుషులు తమ సంపదను స్త్రీల కోసం ఖర్చు పెడుతున్నందువల్ల పురుషులు స్త్రీలపై వ్యవహార కర్తలవుతారు. కనుక సుగుణవతులైన స్త్రీలు తమ భర్తకు విధేయత చూపుతూ వారి కనుసన్నలలో నడుచుకుంటారు. పురుషులు (ఇంటిపట్టున) లేనప్పుడు దేవుని రక్షణలో వారి హక్కులు కాపాడుతుంటారు. మీ మాటలకు ఎదురు చెప్పి తిరగబడతారని భయం ఉన్న స్త్రీలకు (నయానా భయానా) నచ్చజెప్పండి. (అలా దారికి రాకపోతే) వారిని మీ పడకల నుండి వేరు చేయండి. ఆ తరువాత వారు మీకు విధేయులయిపోతే ఇక వారిని అనవసరంగా వేధించడానికి సాకులు వెతకకండి. పైన అందరికంటే అధికుడు, అత్యున్నతుడైన అల్లాహ్ ఉన్నాడని గుర్తుంచుకోండి.భార్యాభర్తల మధ్య సంబంధాలు చెడిపోతాయని భయం ఉంటే భర్త బంధువుల నుండి ఒక మధ్యవర్తిని భార్య బంధువుల నుండి ఒక మధ్యవర్తిని పెట్టుకోండి. వారిద్దరు కలిసి పరిస్థితిని చక్కదిద్దదలచుకుంటే అల్లాహ్ దంపతుల మధ్య సానుకూలత కలిగిస్తాడు. అల్లాహ్ సర్వజ్ఞాని. సమస్తమూ ఎరిగినవాడు. (దివ్య ఖుర్ఆన్: 4:34–35)వివరణ: భార్య విననప్పుడు నచ్చజెప్పడం, పడకగదికి దూరంగా ఉండటం, విధేయత కనబరిస్తే ఆమెను మనసారా స్వీకరించడం ఎంత దానశీలి అయినా, ఎన్నిసార్లు దైవపూజలు చేసే వారయినా, భార్యని కొట్టే వారిని ప్రవక్త అభిమానించేవారు కాదు. 35 ఆయత్ (వాక్యం)లో అల్లాహ్ ఎంతోమంచి పరిష్కారం చూపాడు. భార్యాభర్తల మధ్య పొసగనపుడు అటువైపు నుండి ఒక మధ్యవర్తి ఇటువైపు నుండి ఒకరు మధ్యవర్తిత్వం వహించి వారిద్దరి మధ్య సమాధానం కుదిరిస్తే ఆ దంపతులు కూడా సమాధాన పడితే ఇద్దరి మధ్య అల్లాహ్ సానుకూలత కలిగిస్తాడు. మనిషికి దేవుడు మంచి చెడుల విచక్షణ జ్ఞానం, స్వేచ్ఛ, స్వాతంత్రాలు ఇచ్చాడు. కాబట్టి వాటిని ఆయన అడ్డుకోకుండా స్వయంగా మనిషి సంకల్పించుకుంటే అల్లాహ్ దానిని పరిపూర్ణం చేస్తాడు. ఏ విషయంలోనూ ఎవరికీ బలవంతం పెట్టాడు. మనిషి విచక్షణను బట్టి అల్లాహ్ ఆ మనిషితో వ్యవహరిస్తాడు. కాబట్టి మనుషులమైన మనం మంచిని ఆలోచిస్తూ మంచినే కాంక్షిస్తూ మంచి చేస్తుంటే దేవుడు కూడా సహకరిస్తాడు. అంతా మంచే జరుగుతుంది. అల్లాహ్ మనందరికీ మంచి చేసే భాగ్యాన్ని కలుగజేయుగాక ఆమీన్ (తథాస్తు)ఆధారం: అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్ భావామృతం– మొహమ్మద్ అబ్దుల్ రషీద్ -
ఆకాశంలో సగానికి అన్యాయమా!
దేశం మొత్తాన్ని కుదిపేసిన ‘నిర్భయ’ ఉదంతం తర్వాత నాటి కేంద్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ వైవాహిక బంధంలో జరిగే అత్యాచారం (మారిటల్ రేప్) గురించి ప్రస్తావించి దాన్ని నేరంగా గుర్తించాలని సిఫార్సు చేసినప్పుడు ‘మర్యాదస్తులు’ నొచ్చుకున్నారు. ఆ చర్య వివాహ బంధాన్ని విచ్ఛిన్నం చేయదా... వారి పిల్లల భవిష్యత్తును అగమ్యగోచరంగా మార్చదా అని చాలామంది ప్రశ్నించారు. ఈ అంశంపై అంతకు చాన్నాళ్ల ముందే వివిధ స్థాయిల్లో చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా ఆ విషయమై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ముందు దాఖలు చేసిన అఫిడవిట్ మళ్లీ దాన్ని ఎజెండాలో తెచ్చింది. దాంపత్య జీవితంలో ఉండే లైంగిక సంబంధం పరస్పర అన్యోన్యత ఆధారంగా ఏర్పడుతుందనీ, దాన్ని కేవలం ‘సమ్మతి’ అనే పదంలో కుదించటం అసాధ్యమనీ అఫిడవిట్ అంటున్నది. గతంలోని భారత శిక్షాస్మృతి (ఐపీసీ) అయినా, దాని స్థానంలో అమల్లోకొచ్చిన భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్) అయినా దాంపత్య జీవితంలో జరిగే అత్యాచారానికి మినహాయింపునిచ్చాయి. అత్యాచారానికి ఎలాంటి శిక్ష విధించాలో ఐపీసీ సెక్షన్ 375 నిర్దేశిస్తూ ఈ నేరానికి పాల్పడే భర్తకు మినహాయింపునిచ్చింది. బీఎన్ఎస్ఎస్లో ఈ సెక్షన్ 63గా మారింది. మినహాయింపు కూడా యధాతథంగా కొనసాగింది. భార్య వయస్సు 18 యేళ్లు దాటిన పక్షంలో భర్త జరిపే అత్యాచారానికి మినహాయింపు ఉంటుందని చట్టం చెబుతోంది. ఈ మినహాయింపును రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటిస్తే మొత్తం వివాహ వ్యవస్థపైనే అది తీవ్ర ప్రభావం చూపగలదని కేంద్ర ప్రభుత్వ అఫిడవిట్ హెచ్చరిస్తోంది. చట్టంలో ఉన్న మినహాయింపు అత్యాచారం చేయటానికి భర్తకిచ్చే లైసెన్సు కాదంటూనే ఆ అంశాన్ని చట్టంవైపుగా కాక సామాజిక కోణం నుంచి చూడాలని అభిప్రాయపడింది. సంబంధిత పక్షాలన్నిటితో, రాష్ట్రాలతో చర్చించాక చట్టసభ తీసుకోవాల్సిన నిర్ణయం గనుక న్యాయస్థానం జోక్యం చేసుకోరాదని తెలిపింది. భార్య సమ్మతికి రక్షణ కల్పించేందుకు ఇప్పుడున్న చట్టాల్లో ఏర్పాట్లున్నాయనీ, గృహ హింస చట్టంవంటివి రక్షణగా నిలుస్తాయనీ చెప్పింది. నేరం ఒకటే అయినప్పుడు దాన్ని వేర్వేరు చోట్ల వేర్వేరు రకాలుగా ఎలా పరిగణిస్తారు? హత్య జరిగితే అది చోటుచేసుకున్న ప్రాంతాన్ని బట్టి దాన్ని హత్యాయత్నంగా అనుకోగలమా? పరిచితుడో, అపరిచితుడో మహిళపై అత్యాచారం చేస్తే దానికి శిక్ష ఉన్నప్పుడు... భర్త అదే పనిచేసినప్పుడు మినహాయింపు ఇవ్వటం ఏ రకంగా న్యాయం? 2022లో ఢిల్లీ హైకోర్టులో మారిటల్ రేప్పై పిటిషన్ దాఖలైనప్పుడు ఇద్దరు సభ్యుల ధర్మాసనంలో ఒకరు మారిటల్ రేప్ను నేరంగా పరిగణించాలని అభిప్రాయపడితే, అది సరికాదని మరో న్యాయమూర్తి తీర్పునిచ్చారు. అనంతరం కర్ణాటక, గుజరాత్ హైకోర్టులు రెండూ మారిటల్ రేప్ను నేరంగా గుర్తించాల్సిందేనని తీర్పులు వెలువరించాయి. మన పౌరులైనా, విదేశీ పౌరులైనా చట్టం ముందు అందరూ సమానులనీ, అందరికీ సమానమైన రక్షణ లభిస్తుందనీ రాజ్యాంగంలోని 14వ అధికరణ చెబుతోంది. భర్త చేసే అత్యాచారం నేరంగా పరిగణించకూడదని మినహాయింపునివ్వటం వివాహ బంధంలోని మహిళకు ఈ అధికరణ వర్తించబోదని చెప్పటం కాదా? కానీ కేంద్రం అలా అనుకోవటం లేదు. ఇది పెళ్లయితే స్త్రీ తన హక్కును కోల్పోతుందని పరోక్షంగా చెప్పటం కాదా? మన దేశంలో వివాహ వ్యవస్థను ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారన్న అఫిడవిట్ అభిప్రాయంతో విభేదించనవసరం లేదు. అలాగే వివాహ వ్యవస్థకుండే బహుముఖ పార్శా్వల్లో భార్యాభర్తల లైంగిక సంబంధం ఒకటి మాత్రమేనని చేసిన వాదననూ తప్పుబట్టనవసరం లేదు. కానీ సామాజిక విశ్వాసాలకూ, రాజ్యాంగ విలువలకూ మధ్య వైరుద్ధ్యం ఏర్పడినప్పుడు ఒక గణతంత్ర రాజ్యం రాజ్యాంగ విలువలకు మాత్రమే ప్రాధా న్యమివ్వాలి. దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి. దాదాపు అన్ని సమాజాల్లోనూ భిన్న ఆధిపత్య ధోరణులు అల్లుకుపోయి వుంటాయి. పితృస్వామిక సమాజాల్లో స్త్రీలపై ఆధిపత్యం సాధించటానికి పురుషుడి చేతిలో అత్యాచారం ఒక ఆయుధం. దీన్ని చాలా ముందుగా గుర్తించబట్టే సోవియెట్ యూనియన్ 1926లో మారిటల్ రేప్ను నేరంగా పరిగణిస్తూ చట్టం తీసుకొచ్చింది. ఆ తర్వాత 1950లో జెకోస్లోవేకియా, 1969లో పోలెండ్ ఈ మాదిరి చట్టాలు చేశాయి. ఇవన్నీ అప్పటికి సోషలిస్టు రాజ్యాలు. ప్రస్తుతం దాదాపు 150 దేశాలు మారిటల్ రేప్ను నేరంగా పరిగణిస్తున్నాయి. భార్య లైంగిక స్వయంప్రతిపత్తిని భర్త అయినా సరే దెబ్బతీయరాదనీ, అది నేరపూరిత చర్య అవుతుందనీ ఈ చట్టాలు భావిస్తున్నాయి. సకల ప్రజాస్వామ్య దేశాలకూ భారత్ తల్లిలాంటిదని చెప్పుకుంటున్న మనం మాత్రం మారిటల్ రేప్ విషయంలో ఇంకా తడబాటు ప్రదర్శించటం సబబేనా?దాంపత్య జీవనంలో భర్తలు సాగించే హింసను మన దగ్గర మహిళలు మౌనంగా భరిస్తున్నారు. భరించ శక్యం కాని స్థితి ఏర్పడినప్పుడు మాత్రమే బయటికొస్తున్నారు. భర్త లైంగిక నేరానికి పాల్పడుతున్నాడని వారిలో అతి కొద్దిమంది మాత్రమే వెల్లడిస్తున్నారు. స్నేహ అనే స్వచ్ఛంద సంస్థ డేటా ప్రకారం ముంబైలోని ధారవిలో ఈ సంస్థ ముందు 3,878 ఫిర్యాదులు దాఖలుకాగా అందులో 52.11 శాతం లైంగిక హింసకు సంబంధించినవే. 19.33 శాతంమంది తమ భర్త తమపై పదే పదే అత్యాచారానికి పాల్పడుతున్నాడని తెలిపారని ఆ సంస్థ అంటున్నది. భార్య అభీష్టాన్ని బేఖాతరు చేయటం నేరమన్న స్పృహ పురుషుడిలో కలగాలంటే మారిటల్ రేప్ను నేరంగా పరిగణించటం ఒక్కటే మార్గం. ఇందుకు భిన్నంగా ఆలోచించటం జనాభాలో సగానికి అన్యాయం చేయటమే. -
నటితో ప్రేమ.. బ్రేకప్ చెప్పేసి రోమితో పెళ్లి! కపిల్ దేవ్ సీక్రెట్ లవ్స్టోరీ! (ఫొటోలు)
-
అన్ని స్నేహాలూ గొప్పవి కావు
సారిక 28 ఏళ్ల మార్కెటింగ్ ప్రొఫెషనల్. లీల తన చిన్ననాటి స్నేహితురాలు. కలిసి చదువుకున్నారు. లీలపై సారికకు మంచి అభిప్రాయం ఉంది. కానీ ఇటీవలి కాలంలో లీలతో మాట్లాడిన ప్రతిసారీ సారిక తీవ్ర ఎమోషనల్ స్ట్రెస్ ను అనుభవిస్తోంది. ఆ విషయం లీలతో చెప్పలేక, తన స్నేహాన్ని వదల్లేక, తనలో తానే బాధపడుతోంది.సారిక తన ఆఫీసులో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినప్పుడు లీల ఆమెపై అసూయను వ్యక్తం చేసింది. ‘‘నువ్వెలా సక్సెసవుతున్నావో నాకు తెలియదా ఏంటి’’ అంటూ అనుచితమైన వ్యాఖ్యలు చేసింది. ఎప్పుడూ తన సమస్యల గురించే మాట్లాడుతూ ఉంటుంది. వాటిని పరిష్కరించుకునేందుకు సారికను ఉపయోగించుకుంటోంది. ఎప్పుడైనా పని ఒత్తిడిలో ఉంటి పట్టించుకోకపోతే ‘‘కాస్త సక్సెస్ రాగానే నీకు కళ్లు నెత్తికెక్కాయే. నన్నసలు పట్టించుకోవడం లేదు, నా మాటే వినడం లేదు’’ అంటూ సూటిపోటి మాటలు మాట్లాడుతోంది. తాను ఎంత చేసినా లీల అలా మాట్లాడుతుండటంతో సారిక బాధపడుతోంది. లీలతో స్నేహం కొనసాగించాలా, వదిలేసుకోవాలో అర్థం కావడంలేదు.ఈ నేపథ్యంలో ‘కనెక్షన్ కార్నర్’ కాలమ్ తన దృష్టికి వచ్చింది. అన్ని ఆర్టికల్స్ చదివాక, తన సమస్యకు ఇక్కడ పరిష్కారం దొరుకుతుందని అపాయింట్మెంట్ తీసుకుని ఆఫీసుకు వచ్చి, తన సమస్య మొత్తం వివరించింది.‘‘నేనెంత పాజిటివ్ గా ఉండాలని ప్రయత్నించినా నావల్ల కావడంలేదు సర్. లీలతో ఫ్రెండ్షిప్ టాక్సిక్ గా మారింది. నేను నిజంగానే తనతో సరిగా ఉండటంలేదేమోనని గిల్టీ ఫీలింగ్ వస్తోంది. నా మెంటల్ హెల్త్ దెబ్బతింటోంది’’ అని ఆవేదన వ్యక్తం చేసింది.సారిక కష్టాలివీ... ⇒ లీలను కలిసిన ప్రతిసారీ తన సమస్యల చిట్టా విప్పుతుంది. వాటిని వినీవినీ సారిక మానసికంగా అలసిపోతుంది.⇒ సారిక సలహాలు పాటించకపోగా అవసరానికి తనకు సహాయపడటంలేదంటూ లీల పదే పదే మాట్లాడటం వల్ల సారిక అపరాధభావానికి లోనవుతోంది. అందువల్ల ఆమె ఆత్మవిశ్వాసం దెబ్బతింటోంది. ⇒ సారిక తన ఆఫీసు విషయాలు లేదా తన సక్సెస్ గురించి చెప్పినప్పుడు ఏమాత్రం పట్టించుకోకపోగా, అది ఎవరైనా సాధిస్తారంటూ తక్కువ చేసి మాట్లాడుతోంది. ⇒ సారిక సక్సెస్ పట్ల లీల ఆనందపడకపోగా అసూయను వ్యక్తం చేస్తోంది. అది సారికను నిరుత్సాహపరుస్తోంది. మొత్తంగా చెప్పాలంటే లీల టాక్సిక్ ఫ్రెండ్షిప్ వల్ల సారిక మానసికంగా బాధపడుతోంది. అందుకే లీలతో స్నేహాన్ని కొనసాగించాలా, వద్దా అనే ఆలోచనలో పడింది.టాక్సిక్ స్నేహాలను వదిలించుకోవాలి... ఒక వ్యక్తి సంతోషంగా జీవించడంలో స్నేహాలది ప్రధాన పాత్ర. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ కొన్ని స్నేహాలు విషపూరితంగా ఉంటాయి. వాటివల్ల లాభం లేకపోగా తీవ్రమైన నష్టం జరుగుతుంది. అలాంటి స్నేహాలను వీలైనంత దూరంగా ఉండటం లేదా త్వరగా వదిలించుకోవడం మంచిది. కొనసాగించక తప్పనిసరి పరిస్థితులుంటే ఆ మేరకు మనసును సిద్ధం చేసుకోవాలి. సారిక సమస్యను అర్థం చేసుకున్నాక ఆమెకు కౌన్సెలింగ్ ప్రారంభించాను. ⇒ ఏరోజుకారోజు తన ఫీలింగ్స్ ను డైరీలో రాయడం ద్వారా తన స్నేహాల్లో ఏవి సంతోషాన్నిస్తున్నాయో, ఏవి బాధపెడుతున్నాయో సారిక తెలుసుకుంది. ⇒ లీల కాల్ చేసిన ప్రతిసారీ పనులు పక్కన పెట్టి మరీ వెళ్లాల్సిన అవసరం లేదని సారిక తెలుసుకుంది. వారానికి ఒకసారి, 15 నిమిషాలు మాత్రమే కలవాలని నిర్ణయించుకుంది. ⇒ తన గిల్టీ ఫీలింగ్ ను అధిగమించేందుకు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునేందుకు నిర్దేశించిన ఎక్సర్సైజ్ లను ప్రాక్టీస్ చేసింది. ⇒ మెడిటేషన్ ద్వారా తన మానసిక స్థితిని అదుపులో ఉంచుకొనడం ప్రారంభించింది. ⇒ రోజూ వ్యాయామం, యోగా చేయడం ద్వారా ఆందోళనకు పగ్గాలు వేయగలిగింది. ⇒ తనను సమర్థించే, ప్రోత్సహించే స్నేహితుల సంఖ్యను పెంచుకుంది. ⇒ లీల మాటల్లోని నెగెటివిటీని అధిగమించడం నేర్చుకుంది. ⇒ రోజూ పాజిటివ్ అఫర్మేషన్లు ప్రాక్టీస్ చేయడం ద్వారా భావోద్వేగాలపై అదుపు సాధించగలిగింది. అలా సారిక కేవలం నాలుగు సెషన్లలోనే తన సమస్యను అధిగమించింది. లీలతో స్నేహం తెంపేసుకోకుండానే, ఆమె మాటల్లోని నెగెటివిటీని పక్కన పెట్టేయడం నేర్చుకుంది. ఫలితంగా మానసికంగా ప్రశాంతంగా ఉండి, తన కెరీర్ పై మరింత దృష్టి సారించి, మరింత సక్సెస్ సాధించగలిగింది. మీకూ అలాంటి స్నేహాలుంటే వీలైనంత వరకూ తగ్గించుకోండి. అది మీ మానసిక ఆరోగ్యానికి ముఖ్యం.సైకాలజిస్ట్ విశేష్+91 8019 000066www.psyvisesh.com -
Allahabad High Court: సమ్మతి ఉన్నా, భయపెడితే అత్యాచారమే
ప్రయాగ్రాజ్: సమ్మతితో లైంగిక సంబంధం పెట్టుకున్నాసరే ఆ సంబంధం భయంతో కొనసాగితే అత్యాచారంగానే పరిగణించాలని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి లైంగిక సంబంధం పెట్టుకున్నాడని ఒక మహిళ వేసిన కేసు విచారణ సందర్భగా ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో విచారణ ఆపాలంటూ తమను ఆశ్రయించిన రాఘవ్ కుమార్ అనే వ్యక్తికి వ్యతిరేకంగా కోర్టు తీర్పు వెలువరించింది. బాధితురాలు సివిల్ సరీ్వసెస్ పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో రాఘవ్ పరిచయమయ్యాడు. ఆమెను అపస్మారక స్థితిలోకి వెళ్లేలా చేసి శారీరక సంబంధం పెట్టుకున్నాడు. తర్వాత పెళ్లిచేసుకుంటానని నమ్మించి బలవంతంగా ఆ బంధాన్ని కొనసాగించాడంటూ బాధితురాలు ఆగ్రా జిల్లా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు ఆగ్రా జిల్లా కోర్టులో పెండింగ్లో ఉంది. దీన్ని సవాలు చేస్తూ రాఘవ్ వేసిన పిటిషన్ను జస్టిస్ అనీస్ కుమార్ గుప్తా సారథ్యంలోని అలహాబాద్ హైకోర్టు బెంచ్ కొట్టేసింది. -
ఛీ.. ఇంట్లో రోజూ గొడవలే
ఏ బంధంలోనైనా విభేదాలు సహజం. రెండు వేర్వేరు కుటుంబాల్లో, నేపథ్యాల్లో పెరిగిన ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకున్నప్పుడు కూడా వారి మధ్య విభేదాలు సహజం. అయితే వాటిని ఎలా, ఎంత త్వరగా పరిష్కరించుకున్నానేదే వారి బంధంలోని సంతోషాన్ని నిర్ణయిస్తుంది. విభేదాలను పరిష్కరించుకోకుండా చిన్న చిన్న వాదనలను కూడా పెద్ద పెద్ద గొడవలుగా మార్చుకుంటే కుటుంబ జీవితాన్ని నరకంగా మారుతుంది. అలాంటి ఒక జంట గురించి ఈరోజు మాట్లాడుకుందాం.రవి (32) ప్రియ (30)లకు ఐదేళ్ల కిందట పెళ్లయింది. రవి ఐటీ కన్సల్టెంట్, ప్రియ హెచ్ ఆర్ మేనేజర్. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం, ప్రేమ. తమ బిడ్డ కీర్తన అంటే ప్రాణం. ఇంటి పనులతో సహా బాధ్యతలను సమానంగా పంచుకుంటారు. వారాంతాల్లో సినిమాలు, షికార్లు. అప్పుడప్పుడూ విహారయాత్రలు. సుఖంగా సంతోషంగా జరుగుతున్న కాపురం.కానీ గత కొద్ది నెలలుగా మారి మధ్య తరచూ గొడవలవుతున్నాయి. గత నెల జరిగిన గొడవ ఇద్దరూ కొట్టుకునేవరకూ వెళ్లింది. ఆ తర్వాత తమ ప్రవర్తనకు ఇద్దరూ సిగ్గుపడ్డారు. ఎలాంటి విభేదాలున్నా చర్చించుకుని పరిష్కరించుకోవాలే తప్ప గొడవ పడకూడదని నిర్ణయించుకున్నారు. కానీ మళ్లీ పెద్ద గొడవలయ్యాయి. ఇక తమ వల్ల కాదనుకుని కౌన్సెలింగ్ కు వచ్చారు. ఇద్దరితో విడివిడిగా, కలివిడిగా మాట్లాడాను.చిన్న చిన్న అసమ్మతులు, ఇంటి పనులు, బిడ్డ సంరక్షణ లేదా ఆర్థిక విషయాలు అతి త్వరగా తీవ్రమైన గొడవలుగా మారుతున్నాయని చెప్పారు. ఆ తర్వాత పశ్చాత్తాపం వ్యక్తం చేసినా, మళ్లీ గొడవలు ఆపలేకపోతున్నామన్నారు. దీంతో ఎమోషనల్ గా దూరమవుతున్నామని, ఇంటిమసీ కోల్పోతున్నామని చెప్పారు. ఇలా జరగడం చాలా బాధగా ఉందన్నారు.ఆఫీసులో ప్రాజెక్ట్ వర్క్ వల్ల ఒత్తిడి పెరిగిందని, మళ్లీ ఇంటికి వచ్చి పనిచేయాలంటే కష్టంగా ఉందని రవి చెప్పాడు. తనకు కూడా ఆఫీసులో చాలా వర్క్ ఉంటోందని, ఇంటికి వచ్చాక పాపతో సరిపోతుందని, మళ్లీ ఇంటి పని చేయాలంటే తన వల్ల కావట్లేదని ప్రియ చెప్పింది. అయినప్పటికీ తాను చేస్తున్నా ఎలాంటి గుర్తింపు లేకపోగా, కూరలో ఉప్పు ఎక్కువైనా గొడవ పడుతున్నాడని చెప్పింది.ఇలాంటి విషయాలన్నీ కలిసి కుటుంబం కోసం ఎవరు ఎక్కువ కష్టపడుతున్నారనే వాదనలుగా మారాయి. అవి వ్యక్తిగత దూషణలుగా మారాయి. పెళ్లికి ముందు జరిగిన విషయాలనుంచి, పెళ్లి రోజు జరిగిన గొడవల వరకూ తవ్విపోసుకున్నారు. ఒకరి తల్లిదండ్రులను మరొకరు విమర్శించారు. వాదనల తర్వాత రవి ఇంటినుంచి బయటకు వెళ్లిపోగా, ప్రియ ఒంటరిగా ఏడుస్తూ కూర్చుంటుంది.వాదనలు వర్సెస్ తగాదాలుమనం మొదట్లో చెప్పినట్లు ఏ బంధంలోనైనా విభేదాలు సహజం. ఆరోగ్యకరమైన వాదనలు పరిష్కారానికి దారితీస్తే, తగాదాలు భావోద్వేగ గాయాలను మిగుల్చుతాయి. అందుకే వాదనలకు, తగాదాలకు మధ్య తేడా తెలుసుకోవడం అవసరం. 👉 ఒక సమస్యను చర్చించడం, భావాలు, పరిష్కారాలను చర్చించడం, ఆరోపణలు చేయకపోవడం ఆరోగ్యకరమైన వాదనల లక్షణం. ఉదాహరణకు, రవి ఇంటి పనుల కారణంగా ఒత్తిడిగా అనిపిస్తే, ప్రియ వ్యక్తిత్వంపై దాడి చేయకుండా తన అభిప్రాయం చెప్తాడు. ఆరోగ్యకరమైన వాదనలు 👉 విభేదాల సమయంలో కూడా భాగస్వామి పట్ల గౌరవం తొలగిపోదు. భాగస్వామి వాదన వినడం, అది భిన్నమైనదైనా అంగీకరిస్తారు. 👉 ఇద్దరూ ఎమోషనల్ గా ఉన్నప్పుడు అది మరింత దిగజారకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. 👉 విధ్వంసకరమైన తగాదాల్లో సమస్యను గాలికి వదిలి వ్యక్తిగతంగా విమర్శిస్తారు. రవి, ప్రియల మధ్య జరుగుతున్నది ఇదే. 👉 తగాదాల్లో తరచుగా గతం నుండి సంబంధం లేని విషయాలను ప్రస్తావిస్తారు. 👉 ఇద్దరూ గొంతు పెంచి అరచుకోవడం, ఒకరినొకరు అడ్డుకోవడం జరుగుతుంది. రవి తరచుగా వాదన మధ్యలో బయటకు వెళ్లిపోవడం ప్రియకు తనను పట్టించుకోవడం లేదనే అనుభూతిని కలిగించింది. కౌన్సెలింగ్ తో పరిష్కారం... రవి, ప్రియల సమస్య వాదనలు తగాదాలుగా మారడమే. అందుకే వారి మధ్య హెల్తీ కమ్యూనికేషన్ పెంపొందించేలా కౌన్సెలింగ్ సెషన్లు ప్లాన్ చేశాను. 👉 ఏ బంధంలోనైనా యాక్టివ్ లిజనింగ్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. కౌన్సెలింగ్ సమయంలో వారు ఒకరినొకరు అడ్డుకోవడం లేదా వ్యక్తిగత దాడులు చేయకుండా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం నేర్చుకున్నారు.👉 ఉద్రిక్తత పెరిగినప్పుడు ఒక చిన్న విరామం తీసుకోవడానికి అంగీకరించారు. దీనివల్ల భావోద్వేగ నష్టం తగ్గుతుంది. వారి వాదనలు నిర్మాణాత్మకంగా మారాయి.👉 వాదనల్లో ఒకే సమస్యపై కేంద్రీకరించాలని, అనవసర విషయాలు తీసుకురాకూడదని తీర్మానించుకున్నారు. 👉 ఒకరి లవ్ లాంగ్వేజ్ ను మరొకరు అర్థం చేసుకున్నారు. తగాదా సమయంలో కూడా పరస్పర గౌరవంతో, ప్రేమతో వ్యవహరించడం నేర్చుకున్నారు. సైకాలజిస్ట్ విశేష్ +91 8019 000066www.psyvisesh.com -
ఏ బంధంలోనైనా గౌరవం ముఖ్యం
కనెక్షన్ లేదా రిలేషన్షిప్ అనగానే అందరికీ లవర్స్ లేదా కపుల్స్ గుర్తొస్తారు. వారి మధ్య వచ్చే సమస్యలే గుర్తొస్తాయి. కానీ స్నేహితులు, తోబుట్టువులు, కుటుంబ సభ్యులు, సహోద్యోగులతో సంబంధం కూడా ముఖ్యం. అందుకే మన ‘కనెక్షన్ కార్నర్’లో ఇవన్నీ చర్చించుకుందాం.అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘రేసుగుర్రం’ మూవీ చూశారా? అందులో అన్నాదమ్ములిద్దరూ రోజూ కొట్టుకుంటూ ఉంటారు. కానీ అన్నకు సమస్య వచ్చినప్పుడు తమ్ముడు అండగా నిలబడతాడు. అదే బంధాలకు ఉండే ప్రాధాన్యం. అయితే అన్ని సందర్భాల్లోనూ అలా సర్దుకుపోరు. కొన్నిసార్లు అన్నదమ్ముల మధ్య గొడవలు పెరిగి పెద్దవై పోలీస్ కేసుల వరకూ వెళ్లిన సందర్భాలు కూడా మనం వార్తల్లో చూస్తుంటాం. అలాంటి ఒక కేస్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం.రోహిత్, సిద్ధార్థ్ అన్నదమ్ములు. 32 ఏళ్ల రోహిత్ స్వంత వ్యాపారం పెట్టి సక్సెస్ అయ్యాడు. 28 ఏళ్ల సిద్ధార్థ్ లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. రెండేళ్లుగా వారి రిలేషన్షిప్ బాగా దెబ్బతింది. తరచుగా వాదనలు, అపార్థాలు, సెటైర్లు.తానెంతో కష్టపడి వ్యాపారం మొదలుపెట్టి 32 ఏళ్లకే సక్సెస్ సాధించినా, తనను ‘డబ్బు మనిషి’ అంటున్నాడని సిద్ధార్థ్ పై రోహిత్ కు కోపం. మరోవైపు తక్కువ సంపాదిస్తున్నాడని రోహిత్ కు తానంటే చిన్నచూపని సిద్ధార్థ్ కు బాధ. అలా ఇద్దరూ తరచూ ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటున్నారు. అవి చిలికిచిలికి గాలివానగా మారి ఇద్దరూ కొట్టుకునేవరకూ వెళ్లింది.ఆ వయసుకొచ్చిన పిల్లలు కొట్టుకోవడం చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఏం చేయాలో అర్థంకాక వారిద్దరినీ కౌన్సెలింగ్ కు వెళ్లమని అడిగారు. వాళ్లిద్దరూ అయిష్టంగానే వచ్చారు.పరస్పర గౌరవం లేకపోవడమే సమస్య... మొదటి సెషన్ లో వాళ్లిద్దరితో విడివిడిగా మాట్లాడాను. పరస్పర గౌరవం లేకపోవడమే వారి సంఘర్షణకు మూలమని అర్థమైంది. అందుకే వారి విభేదాలు నిర్మాణాత్మకంగా కాకుండా వ్యక్తిగత దాడులుగా మారాయి. 👉 సోదరులిద్దరూ వారి కెరీర్ ఛాయిస్, వ్యక్తిగత నిర్ణయాలను తప్పుగా అంచనా వేసుకుంటూ, వారి పరస్పర విశ్వాసాన్ని దెబ్బతీస్తూ ఉంటారు.👉 ఏ ఒక్కరూ మరొకరి దృక్పథాన్ని వినకపోగా ఒకరి ఐడియాకు మరొకరు అంతరాయం కలిగిస్తున్నారు లేదా తిరస్కరిస్తున్నారు. 👉వారి సంభాషణలు తరచుగా సర్కాస్టిక్ కామెంట్స్ (వ్యంగ్య వ్యాఖ్యలు), నెగెటివ్ జడ్జ్ మెంట్స్ (ప్రతికూల తీర్పులు) గా మారి విభేదాలకు మరింత ఆజ్యం పోశాయి.👉దీంతో వారిద్దరూ సరిగా కమ్యూనికేట్ చేసుకోలేకపోతున్నారు. తన సోదరుడు తప్పుగా అర్థం చేసుకుంటున్నాడని అపార్థం చేసుకుంటున్నాడు. అతని వైఖరిని అంగీకరించడానికి ఏమాత్రం ఇష్టపడలేదు.శ్రద్ధగా వినడమే తొలి అడుగు... ఇలాంటి సందర్భాల్లో చాలామంది ఎడమొహం పెడమొహంగా మారి విభేదాలను ఇంకా పెద్దవి చేసుకుంటారు. కానీ సోదరులిద్దరూ ఒకరి కెరీర్ ఛాయిస్, లైఫ్ స్టైల్, వాల్యూస్ ను అర్థం చేసుకోవడం, అభినందించడం అవసరం. ఆ మేరకు సెషన్స్ ప్లాన్ చేశాను. 👉ప్రారంభ సెషన్లలో ‘యాక్టివ్ లిజనింగ్’ అనే కాన్సెప్ట్ను పరిచయం చేసాను. అంటే సోదరుడు మాట్లాడేటప్పుడు ఎలాంటి అభ్యంతరం పెట్టకుండా వినాలి. అతని దృక్పథంతో విభేదించినప్పటికీ, అతని భావోద్వేగాలను అంగీకరించాలి. విమర్శలకు బదులుగా నిర్మాణాత్మక సూచనలివ్వాలి. 👉తర్వాత ‘ఐ ఫీల్‘ స్టేట్మెంట్ టెక్నిక్ని ఇచ్చాను. అంటే సోదరుడిని నిందించడానికి బదులుగా ‘నాకిలా అనిపించింది’, ‘నేను బాధపడ్డాను’ అని తన అభిప్రాయాన్ని, భావోద్వేగాన్ని మాత్రమే వ్యక్తపరచాలి. ఈ టెక్నిక్ వారు వాదించుకోకుండా కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగపడింది. 👉 ఫైనాన్షియల్ సక్సెస్ సాధించడమే రోహిత్ లక్ష్యమైతే, అకడమిక్ గా టాప్ లో ఉండటమే సిద్ధార్థ్ లక్ష్యం. ఒకరి ఎంపికను మరొకరు అర్థం చేసుకునేలా చర్చించుకునేలా ప్రోత్సహించాను. 👉 వారిద్దరూ ఒకరి ఛాయిస్ ను మరొకరు ఎలా చూశారో వివరిస్తూ మనసువిప్పి లెటర్లు రాసుకోమన్నాను. ఇది వారి అభిప్రాయాలను రీఫ్రేమ్ చేసి, ఒకరినొకరు అభినందించుకునేలా చేసింది.అలా పది సెషన్లలో రోహిత్, సిద్ధార్థ్ ఒకరినొకరు పూర్తిగా అర్థంచేసుకున్నారు. సర్కాజం, క్రిటిసిజం లేకుండా ఎలా కమ్యూనికేట్ చేయవచ్చో నేర్చుకున్నారు. ఒకరి ఛాయిస్ ఏదైనా దాన్ని గౌరవించాలని, నచ్చకపోతే తన అభిప్రాయాన్ని నిర్మాణాత్మంగా వివరించాలని అర్థం చేసుకున్నారు. చక్కగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. తమ కెరీర్ ఛాయిస్ ఏదైనా కుటుంబానికి అండగా నిలబడటం, తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడం ముఖ్యమని అర్థం చేసుకుని, ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అది చూసి వారి తల్లిదండ్రులు సంతోషించారు.సోదరులనే కాదు, టీనేజ్, కపుల్, వర్క్ రిలేషన్షిప్స్ లో పరస్పర గౌరవానికి కీలక పాత్ర. గౌరవం ఉండటమే కాదు, ఉన్నట్లు కనిపించాలి. లేదంటే రోహిత్, సిద్ధార్థ్ లా అపార్థాలు, గొడవలు తప్పవు. అందుకే తీర్పులివ్వకుండా వినడం, కమ్యూనికేషన్ ను మెరుగుపరచుకోవడం, గౌరవప్రదమైన సరిహద్దులను సెట్ చేసుకోవడం, తీర్పులను రీఫ్రేమ్ చేసుకోవడం అవసరం.సైకాలజిస్ట్ విశేష్ +91 8019 000066www.psyvisesh.com -
ది మానిప్యులేటివ్ పార్టనర్
ప్రచారం పిచ్చో... డబ్బులు సంపాదించుకోవచ్చు అన్న ఆశనో తెలియదు కానీ.. ఈ మధ్యకాలంలో చాలామందికి రీల్స్ పిచ్చి పట్టుకుంది. కొన్నిసార్లు ఇది కాస్తా శ్రుతిమించి పోయి వ్యవసనంగానూ మారిపోతోంది. ఆఖరుకు ఇది దాంపత్య జీవితంలోనూ చిచ్చు పెట్టే స్థితికి చేరుకుంది. అయితే కర్ణాటకలోని ఉడుపికి సమీపంలోని కార్కడలో ఈ రీల్స్ పిచ్చి కాస్తా ఓ నిండుప్రాణం పోయేందుకు కారణమైంది. పోలీసులు చెప్పిన దాని ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి...బీదర్లోని దోణగాపురకు చెందిన జయశ్రీ (31)కి రీల్స్ అంటే తెగ పిచ్చి. ఈమెకు కార్కడ సమీపంలోని గుండ్మిలో నివసించే కిరణ్ ఉపాధ్య (44)తో పెళ్లి అయ్యింది. కొంత కాలం సంసారం బాగానే నడిచింది కానీ.. జయశ్రీ నిత్యం రీల్స్ చేస్తూండటం కిరణ్కు ఏ మాత్రం నచ్చలేదు. అంతేకాదు... జయశ్రీ ఆన్లైన్ షాపింగ్ వ్యసనం విషయంలోనూ భార్య భర్తలిద్దరి మధ్య తరచూ గొడవలు అవుతూండేవి. తనకు పెద్ద ఇల్లు కావాలని... లగ్జరీ కారు.. నగదు కావాలని... గుడులలో వంటలకు సాయంగా పనిచేస్తున్న భర్త కిరణ్ను వేధించేది. ఇది కాస్తా వారిద్దరి మధ్య వివాదం మరింత ముదిరేందుకు కారణమైంది. ఇలాగే కొన్ని రోజుల క్రితం ఇద్దరి మధ్య రీల్స్ విషయమై వాదులాట మొదలైంది. ఈ క్రమంలోనే కిరణ్ కొడవలితో దాడి చేయడంతో జయశ్రీ మరణించింది. ఆ తరువాత బంధు మిత్రులకు ఫోన్ చేసి జయశ్రీ మొదటి అంతస్తులోంచి కిందకు పడిపోయిందని... స్పందన లేదని చెప్పాడు. వారి సలహాతో ఆంబులెన్స్కు ఫోన్ చేశాడు కూడా. అయితే జయశ్రీ ఆసుపత్రికి చేరే సమయానికి ప్రాణాలతో లేదని డాక్టర్లు ప్రకటించారు. అయితే... ఆసుపత్రి నుంచి తిరిగి వచ్చిన తరువాత కిరణ్ ప్రవర్తన తేడాగా ఉండటాన్ని చుట్టుపక్కల వాళ్లు గమనించారు. ఇంట్లో రక్తపు మరకల్ని తొలగించే ప్రయత్నం చేశాడు. అనుమానం కొద్దీ ఇరుగు పొరుగు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు కిరణ్ను అరెస్ట్ చేసి విచారణ చేయడంతో అసలు విషయం బయటపడింది. కిరణ్ ముందస్తు ప్రణాళికతోనే జయశ్రీని హత్య చేశాడని, గత గురువారమే మార్కెట్లో కొత్త కొడవలిని కొనుగోలు చేశాడని స్థానికులు చెబుతున్నారు. రజని హైదరాబాద్ లోని ఒక కార్పొరేట్ హాస్పిటల్లో డాక్టర్థగా పనిచేస్తోంది. గత కొద్దికాలంగా ఆమెకు అంతా గందరగోళంగా అనిపిస్తోంది. తాను చేస్తున్నది రైటా, తప్పా అనే సందేహం తరచూ వేధిస్తోంది. ఆమె ఆత్మవిశ్వాసం బాగా దెబ్బతింది. నిరంతరం ఒత్తిడి, ఆందోళన ఫీలవుతోంది. ఎవరితోనూ మాట్లాడాలనిపించడం లేదు. ఒంటరితనం, భయం, నిస్సహాయత. దాంతో పేషంట్లను ట్రీట్ చేయడంలో కూడా నిర్ణయాలు తీసుకోలేకపోతోంది. చిన్న చిన్న విషయాలకు కూడా సారీ చెప్తోంది. నిద్ర పట్టడంలేదు. తలనొప్పి, కడుపు నొప్పి, ఇతర శారీరక సమస్యలు. డాక్టర్ కాబట్టి తనకు తానే వైద్యం చేసుకుంది. కానీ తగ్గడంలేదు. దాంతో ఇది శారీరకం కాదని, మానసికమని అర్థమై కౌన్సెలింగ్ కోసం వచ్చింది. తన సమస్య చెప్పింది. ఆమె బ్యాక్ గ్రౌండ్ గురించి చెప్పమని అడిగాను.అపనమ్మకం...రజనికి పెళ్లయి ఐదేళ్లయ్యింది. తన కొలీగ్ డాక్టర్ ఆనంద్ ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. రజని కొంచెం కలుపుగోలు మనిషి. అది ఆనంద్ కు నచ్చదు. ‘‘నీ పని నువ్వు చూసుకోక అందరితో అలా మాట్లాడతావెందుకు?’’ అని అడిగేవాడు. తరచూ రజనిపై కోప్పడేవాడు. ‘‘అందరితో బాగా నవ్వుతూ మాట్లాడతావ్. నాతో మాట్లాడాలంటే మాత్రం మొహం ముడుచుకుంటావ్. నీకంటికి నేను చేతకాని వాడిలా కనిపిస్తున్నా’’ అని దెప్పేవాడు. ‘‘అలాంటిదేం లేదు’’ అని చెప్పినా వినేవాడు కాదు. ‘‘యు ఆర్ నాట్ రైట్. నీకేదో సైకలాజికల్ ప్రాబ్లమ్ ఉన్నట్టుంది, ఒకసారి సైకియాట్రిస్ట్ ను కలువు’’ అని తరచూ అనేవాడు. కొన్నాళ్లకు రజని కూడా తన మానసిక స్థితి గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. ‘‘నిజంగానే నాకేమైనా మానసిక సమస్య ఉందేమో, లేదంటే ఆనంద్ ఎందుకలా అంటాడు’’ అని అనుకునేది.గ్యాస్ లైటింగ్... డాక్టర్ రజని చెప్పిందంతా విన్నాక ఆమె గ్యాస్ లైటింగ్ కు గురవుతుందని అర్థమైంది. గ్యాస్ గురించి అందరికీ తెలుసు. కానీ గ్యాస్ లైటింగ్ అంటే ఇంట్లో ఉన్న గ్యాస్ స్టవ్ ను వెలిగించేది కాదు. మాటలు, ప్రవర్తన ద్వారా మరోవ్యక్తి భావోద్వేగాలను కంట్రోల్ లో పెట్టుకోవడానికి కొందరు చేసే మేనిప్యులేషన్ ను ‘గ్యాస్ లైటింగ్’ అంటారు. ఇతరులపై ఆధిపత్యం చెలాయించాలనే కోరిక నుండి పుడుతుంది. తమ మాటే నెగ్గేలా, తమ దారికి అడ్డులేకుండా చేసుకోవడానికి అబద్ధాలు చెప్తారు, నిందలు వేస్తారు. తమ తప్పును కూడా భాగస్వామిపై తోసేసి తమ ప్రయోజనాలను కాపాడుకుంటారు. తనపై తనకు నమ్మకం కోల్పోయేలా చేస్తారు, చివరకు భాగస్వామి ఎమోషన్స్ పై కంట్రోల్ సాధిస్తారు. ముఖ్యంగా నార్సిసిస్టిక్ పర్సనాలిటీ, యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్స్ ఉన్నవారిలో ఈ ప్రవర్తన ఎక్కువగా కనిపిస్తుంది. డాక్టర్ ఆనంద్ అందులో మాస్టర్స్ డిగ్రీ సాధించాడని అర్థమైంది. కానీ తాను గ్యాస్ లైటింగ్ కు గురవుతున్న విషయాన్ని రజని గుర్తించలేకపోతోంది. అదే ఈ సమస్యలో ఉండే అసలు సమస్య. తనను మేనిప్యులేట్ చేస్తున్నారనే విషయం బాధితులకు తెలియదు, అసలా దిశగా ఆలోచించలేరు. ఎవరైనా చెప్పినా నమ్మరు.థెరపీతో పరిష్కారం... అందుకే మొదట రజనికి కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ద్వారా తన ఆలోచనల్లోని లోపాలు గుర్తించేలా, వాటిని సవాల్ చేసేలా చేశాను. ఆ తర్వాత గ్యాస్ లైటింగ్ గురించి, గ్యాస్ లైటర్ వాడే స్ట్రాటజీస్ గురించి వివరించాను. ఆనంద్ అలాగే చేస్తాడని చెప్పింది. తాను గ్యాస్ లైటింగ్ కు గురవుతున్నానని అర్థం చేసుకుంది. ఆ తర్వాత తన భద్రతకు సంబంధించిన ప్రణాళికను రూపొందించాను. తన బలాలు, సానుకూల లక్షణాలను గుర్తించి ఆత్మగౌరవంతో ప్రవర్తించేందుకు ఎక్సర్ సైజ్ లు నేర్పించాను. గ్యాస్ లైటింగ్ ను ఎలా ఎదుర్కోవాలో, ఒత్తిడిని, ఆందోళనను ఎలా మేనేజ్ చేసుకోవాలో వివరించాను. స్నేహితులు, కుటుంబ సభ్యుల మద్దతు తీసుకోమని ప్రోత్సహించాను. క్రమేపీ రజని తన కెరీర్ పై దృష్టి పెట్టింది. ఆనంద్ మాటలను పట్టించుకోవడం మానేసింది. రజని ఇంతకు ముందులా లేదన్న విషయం అర్థం చేసుకున్న ఆనంద్ కూడా తన ప్రవర్తను మార్చుకున్నాడు. మూడు నెలల్లో సమస్య పరిష్కారమైంది.గ్యాస్ లైటర్లు తరచూ వాడే వాక్యాలు⇒నువ్వు ప్రతిదానికీ ఓవర్ రియాక్ట్ అవుతున్నావ్. ⇒అందుకే నీకెవ్వరూ ఫ్రెండ్స్ లేరు. ⇒నీకోసమే అలా చేశాను. ⇒నీకోసం అంత చేస్తే నన్నే అనుమానిస్తావా?⇒నేను నీకు చెప్పాను, గుర్తులేదా? ⇒అలా ఏం జరగలేదు, నువ్వే ఊహించుకుంటున్నావ్. ⇒ నీపట్ల నాకెప్పుడూ నెగెటివ్ ఒపీనియన్ లేదు. నువ్వే నన్ను నెగెటివ్ గా చూస్తున్నావ్.వాళ్ల మాటలు నమ్మొద్దు⇒గ్యాస్ లైటర్లతో వాదనలకు దూరంగా ఉండాలి. లేదంటే మీ మాటలే మీపై ప్రయోగిస్తారు. ⇒గ్యాస్ లైటర్లు చెప్పేదొకటి, చేసేదొకటి కాబట్టి వాళ్లు చెప్పేదానిపై కాకుండా చేసే పనులపై దృష్టి పెట్టాలి. ⇒‘‘నీకు పిచ్చి’’ అని మిమ్మల్ని మీరే అనుమానించుకునేలా చేసేవారి మాటలు పట్టించుకోకూడదు. ⇒‘‘నేను చెప్పాను, నీకే గుర్తులేదు’’ అనే మాటలు నమ్మకూడదు. మీకెంత వరకూ గుర్తుందే అదే నిజమని గుర్తించాలి. ⇒గ్యాస్ లైటర్లు ముందుగా మీ కుటుంబ సభ్యులను, స్నేహితులను బుట్టలో వేసుకుంటారు. కాబట్టి గ్యాస్ లైటర్ కు మద్దతుగా వాళ్లు చెప్పే మాటలు పట్టించుకోకూడదు. ⇒గ్యాస్ లైటర్ తో ఉండే బంధం కన్నా మీరు సురక్షితంగా ఉండటం ముఖ్యమని గుర్తించాలి. ⇒మీ భద్రతకు ప్రమాదమని భావిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ బంధం నుంచి బయటకు వచ్చేయాలి.సైకాలజిస్ట్ విశేష్8019 000066www.psyvisesh.com -
ఆయనకు విపరీతమైన అనుమానం!
మా పెళ్ళయి పదేళ్ళయింది. ఇద్దరు పిల్లలు. మొదట్లో కొంతకాలం బాగున్నాం కానీ, తర్వాత నుంచి నా భర్తకు అనుమానం జబ్బు పట్టుకుని నన్ను మానసికంగా వేధిస్తున్నాడు. ప్రతివాళ్లతోనూ నాకు సంబంధం అంటగట్టి అనరాని మాటలతో చిత్రవధ చేస్తున్నాడు. సినిమాలకు, ఫంక్షన్లకు వెళ్ళినపుడు ఈ బాధ మరీ ఎక్కువవుతోంది. ఏం చేయాలో అర్థం కావడంలేదు. దయచేసి సలహా ఇవ్వగలరు. – ఒక సోదరి, తెనాలిమీరనుభవిస్తున్న మానసిక క్షోభను అర్థం చేసుకోగలను. వాస్తవం గాకున్నా... ఎలాంటి ఆధారం లేకున్నా ఇలా భార్యాభర్తలు ఒకరినొకరి శీలాన్ని శంకించే మానసిక రుగ్మతను ‘డెల్యూజనల్ డిజాస్ట్టర్ లేదా కాంజుగల్ ΄ారనోయియా’ అంటారు. మిగతా అన్ని విషయాల్లో వీరు మామూలుగానే ఉంటారు. ఏవేవో ఊహించుకుని ఇలాంటి భ్రమలు– భ్రాంతులకు లోనవుతూ, కేవలం జీవిత భాగస్వామిని మాత్రమే ఇలా అనుమానిస్తూ, వేధిస్తూ ఉంటారు. మానసిక రుగ్మత ఉందంటే ఒప్పుకోరు. మీరు మీ బంధువులు, ఇతర పెద్దల సహకారంతో ఆయన్ని ఏదో ఒక విధంగా ఒప్పించి, వైద్యుల దగ్గరకు వెళ్లగలిగితే, ‘యాంటీ సైకోటిక్స్’అనే మందులు, కౌన్సెలింగ్ ద్వారా చికిత్స చేసి, ఈ అనుమానాల ఊబి నుంచి పూర్తిగా బయటపడేస్తారు. మళ్ళీ మీరు ప్రశాంతంగా, సంతోషంగా జీవితాన్ని గడపగలరు. మా చుట్టాలబ్బాయి చిన్నప్పటినుంచి చదువులో టాప్! రెండు పీహెచ్డీలు చేశాడు. ఒక పెద్ద కంపెనీలో మంచి జీతంతో ఆఫర్ కూడా వచ్చింది. అయితే ఇటీవల ఉన్నట్టుండి అతని ప్రవర్తనలో బాగా మార్పు వచ్చింది. ఎవ్వరితోనూ మాట్లాడడు. ఒక్కడూ గదిలో తలుపులు వేసుకుని కూచుంటాడు. రోజుల తరబడి స్నానం చేయడు. తన లో తాను నవ్వుకోవడం... మాట్లాడుకోవడం. మా బంధువులందరూ చదువు ఎక్కువ అవడం వల్ల ఈ పిచ్చి వచ్చిందంటున్నారు. నిజమేనా?– కుమార్, కర్నూలుచదువుకు, తెలివితేటలకు, మానసిక జబ్బు రావడానికీ ఎలాంటి సంబంధం లేదు. ఇది కేవలం అ΄ోహ మాత్రమే. ఎక్కువ చదివిన వారందరికీ మెంటల్ రావాలని లేదు. అలాగే తెలివితేటలు లేనివారికి, ఎక్కువ చదువుకోనివారికీ మానసిక జబ్బులు రావని ఏమీ లేదు. మానసిక వ్యాధులకు వారసత్వ కారణాలు కొన్నయితే, పరిస్థితుల ప్రభావం, దిగ్భ్రాంతి కలిగించే సంఘటనలు జరగడం, ఆల్కహాల్, డ్రగ్స్ తీసుకోవడం, తీవ్రమైన ఒత్తిడులకు గురికావడం వంటివి ఇతర కారణాలు. ఆలస్యం చేయకుండా అతణ్ణి ఒకసారి సైకియాట్రిస్ట్కు చూపించమని చెప్పండి. స్కిజోఫ్రినియా అనే మానసిక జబ్బుకు లోను కావడం వల్ల వారికి మీరు పేర్కొన్న లక్షణాలుండే అవకాశం ఉంది. తొలిదశలోనే గుర్తించి, సరయిన చికిత్స చేయిస్తే, తొందరగా కోలుకుని తిరిగి మంచి జీవితాన్ని గడపగలడు.– డా. ఇండ్ల విశాల్ రెడ్డి సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
‘డిజిటల్ డివైడ్’.. కాపురాలు కూలుతున్నాయి
రిషి, ప్రియ అందమైన జంట. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. రోజంతా పని చేయడం, సాయంత్రాలు కలిసి చాలా చాలా కబుర్లు చెప్పుకోవడం, వారాంతాల్లో సినిమాకో, షికారుకో వెళ్లడం, అక్కడే డిన్నర్ చేసి ఇంటికి రావడం.. ఎలాంటి సమస్యలూ లేకుండా పర్ఫెక్ట్ కపుల్ లా ఉండేవారు. అలాంటిది.. అనూహ్యంగా వాళ్ల కాపురంలో చిచ్చు రగిలింది. ఎలా అంటే..ప్రియ చురుకైన వ్యక్తి, ఫ్రెండ్స్ తో చాలా సరదాగా ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా వారితో నిత్యం కనెక్ట్ అవుతుంది. వాళ్ల జీవితంలో జరిగే విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంది. తన విషయాలన్నీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్ డేట్ చేస్తుంటుంది. అప్పుడప్పుడూ వాళ్లతో చాట్ చేస్తుంది. రిషికి సోషల్ మీడియా అంటే కొంచెం చిరాకు. అన్ని విషయాలూ సోషల్ మీడియాలో అప్ డేట్ చేయాల్సిన అవసరం లేదంటాడు. ఈ విషయం తరచూ ప్రియకు చెప్తుంటాడు. ఆమె ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో, ఆమెపై చిరాకు పడుతుంటాడు.కాలంతో పాటు అప్ డేట్ కావాలని, ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటంలో తప్పేమీ లేదని ప్రియ వాదిస్తుంటుంది. ఈ విషయమై అప్పుడప్పుడూ ఇద్దరిమధ్యా వాగ్వాదాలు జరుగుతుంటాయి. ఈ విధంగా వారి మధ్య "డిజిటల్ డివైడ్" ఏర్పడింది. వారి ఆన్ లైన్ అలవాట్లు, ఆఫ్ లైన్ జీవితంపై ప్రభావం చూపించడం మొదలైంది.అందమైన సినిమా...సోషల్ మీడియా అందమైన సినిమాలాంటిది. అందరూ తమ జీవితంలోని అందమైన, ఆకర్షణీయమైన భాగాన్ని మాత్రమే అక్కడ ప్రదర్శిస్తుంటారు. ప్రియ కూడా అంతే. తమ మధ్య ఎన్ని గొడవలున్నా, తాము సంతోషంగా గడిపిన ఫొటోలను చక్కగా ఎడిట్ చేసి పోస్ట్ చేస్తుంది. అప్పుడప్పుడూ రీల్స్ కూడా. అయితే విషయం అక్కడితో ఆగలేదు. సోషల్ మీడియాలో తన ఫ్రెండ్స్ పోస్టులు, ఫొటోలు చూసి, వారి జీవితంతో పోల్చుకుంటుంది. తాను వాళ్లంత ఆనందంగా లేనని బాధపడుతుంది. వారిపై అసూయ పడుతుంది. అది ఆమె జీవితంలో అసంతృప్తికి దారితీసింది. ఇవన్నీ అప్పుడప్పుడూ ఆన్ లైన్లో తన పాత స్నేహితుడితో పంచుకుంటోంది.విశ్వాస ఉల్లంఘనప్రియ తన స్నేహితుడితో సుదీర్ఘంగా చాట్ చేస్తున్న విషయం రిషికి తెలిసింది. ఇదేంటని అడిగాడు. సరదాగా చాట్ చేస్తున్నానే తప్ప మరేమీ లేదని ప్రియ చెప్పింది. ‘‘నీ జీవితం ఆనందంగా లేదని అతనితో చెప్తున్నావ్ కదా. నాతో జీవితం అంత బాధాకరంగా ఉందా?’’ అని నిలదీశాడు. అలాంటిదేం లేదని, అవన్నీ కాజువల్ కాన్వర్జేషన్స్ అని ప్రియ చెప్పినా సంతృప్తి చెందలేదు. అతనితో చాటింగ్ మానేయమన్నాడు. తమ మధ్య ఏమీ లేనప్పుడు మానేయాల్సిన అవసరమేముందని ప్రియ వాదించింది. ‘‘నన్ను అనుమానిస్తున్నావా?’’ అని ప్రశ్నించింది. అలాంటిదేం లేదని, అయినా సరే మానేయమని రిషి కోరాడు. అలా అలా ఆ గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది. విడాకులు తీసుకోవాలని అనుకునేంతవరకూ వెళ్లారు. ఈ విషయం ఒక క్లోజ్ ఫ్రెండ్ దృష్టికి వచ్చింది. చిన్న విషయాన్ని పెద్దది చేసుకున్నారంటూ ఆమె వారిద్దరికీ చీవాట్లు పెట్టింది. ఆమె సలహా మేరకు వారిద్దరూ కౌన్సెలింగ్ కు వచ్చారు.రెండువైపులా పదునున్న కత్తిసోషల్ మీడియా అనేది రెండువైపులా పదునున్న కత్తిలాంటిది. అందులో ప్లస్, మైనస్ రెండూ ఉంటాయి. సోషల్ మీడియా రాకతో మనం దేశ విదేశాల్లోని బంధువులతో, స్నేహితులతో కనెక్షన్ ను కొనసాగించడం సులువైంది. పాత స్నేహితులు, కొలీగ్స్ తో మళ్లీ కనెక్ట్ అవ్వగలుగుతున్నాం. మనం సాధించిన విజయాలను, అనుభవాలను అందరితో పంచుకోవచ్చు. జంటలు తమ జ్ఞాపకాలను పదిలపరచుకోవడం ద్వారా వారి బంధాన్ని బలోపేతం చేసుకోవచ్చు.ఆన్లైన్ కమ్యూనిటీలు, సపోర్ట్ గ్రూప్ల ద్వారా మన జీవితంలో ఎదురైన ఛాలెంజ్ లను ఎదుర్కునేందుకు సహాయం, సలహాలు పొందవచ్చు. పార్టనర్ పట్ల ప్రేమ, ఆప్యాయత, ప్రశంలను వ్యక్తం చేయడం ద్వారా బంధాన్ని బలోపేతం చేసుకోవచ్చు.మరోవైపు సోషల్ మీడియా వల్ల రిషి, ప్రియ జీవితాల్లో ఏర్పడినట్లే సవాళ్లు కూడా ఏర్పడవచ్చు. సోషల్ మీడియాలో పర్ఫెక్ట్ జీవితాలను మాత్రమే తరచూ చూడటం వల్ల అసూయ ఏర్పడుతుంది. తమ బంధం పట్ల అభద్రత, అసమర్థ భావాలకు దారితీస్తుంది. వ్యక్తిగత సమాచారాన్ని అతిగా పోస్ట్ చేయడం వల్ల ప్రైవసీ దెబ్బతింటుంది. తరచూ ఇతరులతో పోల్చుకోవడం వల్ల అవాస్తవిక అంచనాలకు దారితీస్తుంది. సున్నితమైన విషయాలను చర్చించేటప్పుడు మనం పంపే మెజేజెస్ ను తప్పుగా అర్థం చేసుకుంటే అపార్థాలకు దారితీస్తుంది. ఒక వ్యక్తితో రోజూ చాట్ చేయడం వల్ల, మీకు తెలియకుండానే వారితో ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడుతుంది. అది ఆఫ్ లైన్ జీవితంలోని భాగస్వామితో ఎమోషనల్ కనెక్షన్ ను తగ్గించవచ్చు.ఆన్ లైన్ ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడిన వ్యక్తితో తరచూ మాట్లాడటం ఎక్కడికైనా దారితీసే ప్రమాదం ఉంది.సోషల్ మీడియా బ్యాలెన్స్...రిషి, ప్రియలకు సోషల్ మీడియా వల్ల వచ్చే లాభనష్టాలను వివరించాక, దాన్నెలా బ్యాలెన్ చేసుకోవాలో నేర్పించాను. సోషల్ మీడియా అలవాట్లు, బౌండరీస్, భయాల గురించి ఒకరితో ఒకరి ఓపెన్ గా, నిజాయితీగా మాట్లాడుకునేలా ప్రోత్సహించాను. ఇద్దరూ కలిసి మాట్లాడుకుని ఏది పోస్ట్ చేయాలి, ఏది చేయకూడదనే విషయంపై ఒక అంగీకారానికి వచ్చేలా ఫెసిలిటేట్ చేశాను. తన ప్రయాణాలు లేదా అనుభవాల గురించి పోస్ట్ చేసేటప్పుడు రిషి భావాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని, అదెందుకు అవసరమో ప్రియకు అర్థమయ్యేలా వివరించాను. ఆన్లైన్ లో కనపడేదంతా నిజం కాదని, అందువల్ల పోల్చుకోవడం మానేసి, తమ బంధాన్ని బలపరచుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించాను. అందుకు కావాల్సిన ఎక్సర్ సైజ్ లు చేయించాను. అప్పడప్పుడూ సోషల్ మీడియానుంచి పూర్తిగా డిస్ కనెక్ట్ అయ్యి పార్టనర్ తో గడపడం అవసరమని ప్రియకు అర్థమయ్యేలా చెప్పాను. అలా ఐదు సెషన్లలో రిషి ప్రియల మధ్య ఉన్న డిజిటల్ డివైడ్ ను పూడ్చేసి, వారిద్దరూ తమ జీవితాలను సంతోషంగా సాగించేందుకు అవసరమైన స్ట్రాటజీలను అందించాను.-సైకాలజిస్ట్ విశేష్+91 8019 000066psy.vishesh@gmail.com -
ఏ బంధంలోనైనా హద్దులు అవసరం
ప్రియకు 28 ఏళ్లు. ఒక అంతర్జాతీయ సంస్థలో అకౌంటెంట్ గా పనిచేస్తుంది. రోహిత్తో రెండేళ్ల కిందట పెళ్లయ్యింది. మొదట్లో అంతా బానే ఉంది. కాలం గడిచేకొద్దీ వైవాహిక బంధంలో ఉక్కపోత మొదలైంది. తన డ్రెస్సింగ్ నుంచి ఫ్రెండ్స్ వరకూ అంతా తనకు నచ్చినట్లే ఉండాలంటాడు. అలా లేకుంటే ఏదో ఒక కారణంతో గొడవ పెట్టుకుంటున్నాడు. తన ప్రవర్తనను, స్నేహాలను కూడా నియంత్రించడం ప్రియకు నచ్చడంలేదు. క్రమంగా ఇద్దరి మధ్యా దూరం పెరిగింది. దాన్ని సరిచేసుకునేందుకు రోహిత్ ఎలాంటి ప్రయత్నమూ చేయడం లేదు. తానేం చేయాలో ప్రియకు అర్థంకాక కౌన్సెలింగ్ కు వచ్చింది.స్వేచ్ఛ వర్సెస్ సంప్రదాయంప్రేమంటే రెండు మనసుల కలయిక, పెళ్లంటే రెండు జీవితాల కలయిక. మనదేశంలో మాత్రం పెళ్లంటే రెండు కుటుంబాల కలయిక. ఇద్దరు వ్యక్తుల మధ్య ఎలాంటి పరిచయం లేకపోయినా, ప్రేమ లేకపోయినా, కనీస అవగాహన లేకపోయినా... కులం, మతం, జాతకం, ఆర్థిక స్థాయిలు కలిస్తే చాలు, పెళ్లి చేసేస్తారు. ఆ తర్వాత ఆ రెండు కుటుంబాల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఆ జంటపై ఉంటుంది. ఇప్పుడదే భారం ప్రియపై ఉంది. తన వ్యక్తిగత స్వేచ్ఛకు, ఆత్మగౌరవానికి.. కుటుంబ గౌరవానికి, సంప్రదాయానికి మధ్య పోరాటం నడుస్తోంది.కాలంతో పాటు మారని మనుషులు... సాంప్రదాయ పితృస్వామ్య వ్యవస్థ ఏర్పాటు చేసిన వివాహంలో.. భర్తంటే భరించేవాడు. కుటుంబంలో భర్తదే ప్రధానపాత్ర. అతని మార్గాన్నే భార్య అనుసరించాలి. కాలం మారినా, పురుషులతో సమానంగా మహిళలు ఉద్యోగాలు చేస్తున్న రోజులొచ్చినా చాలామంది పురుషులు తమ ఆధిపత్యమే నడవాలనే భావజాలంలోనే ఉంటారు, ఉంటున్నారు. రోహిత్ ది కూడా అదే బాట. అందుకే తన భార్య తనకు నచ్చినట్టుగా ఉండాలని కోరుకుంటున్నాడు, అలా కోరుకోవడంలో తప్పు లేదనుకుంటున్నాడు. ఆ క్రమంలో వారిద్దరి మధ్యా దూరం పెరిగింది. ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ప్రియ తన మనసులోని మాట చెప్పలేకపోతోంది. దాంతో మనసులో అసహనం, కోపం పెరిగిపోతున్నాయి. ఆ నేపథ్యంలోనే కౌన్సెలింగ్ కు వచ్చింది. ఆమె చెప్పినదంతా విన్నాక, వారికి ‘హెల్తీ బౌండరీస్’ గురించి అవగాహన లేదని అర్థమైంది.టాక్సిక్ రిలేషన్స్ లక్షణాలు...• జంటలో ఒకరి ఇష్టాయిష్టాలకే ప్రాధాన్యం• తరచుగా వ్యంగ్యం, నిందలు, అవమానాలు• ఫోన్ చెక్ చేయడం, ఫ్రెండ్స్, పేరెంట్స్కు దూరం చేయడం• పార్టనర్ ను సంప్రదించకుండానే ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవడం• పార్టనర్ ను కంట్రోల్ చేయడానికి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడం• పార్టనర్ తెలివిని, నిర్ణయాలనూ చులకన చేయడం• ఎవరితో క్లోజ్గా ఉన్నా అసూయ పడటం, దూరం చేయడానికి ప్రయత్నించడం• ప్రతీ చిన్న విషయానికీ గొడవపడుతుండటంసరిహద్దుల అవసరం... ఏ బంధంలోనైనా బౌండరీస్ అవసరం. భార్య అయినంత మాత్రాన తన మాట తప్పక వినాలనీ, భర్త అయినంత మాత్రాన తాను చెప్పినట్లే నడుచుకోవాలనీ అనుకోవడమే జంటల మధ్య చాలా సమస్యలకు కారణం. సరిహద్దులు అనేవి మన శారీరక, మానసిక వెల్ బీయింగ్ ను కాపాడుకోవడానికి మన చుట్టూ గీసుకునే అదృశ్య రేఖలు, మీ అవసరాలు, అంచనాలు, ఆమోదయోగ్యమైన ప్రవర్తన ఏమిటో తెలియజేసే చర్యలు. ప్రతీ జంటకూ హెల్తీ బౌండరీస్ గురించిన అవగాహన అవసరం. • ప్రతి వ్యక్తికీ తనకంటూ కొన్ని ఇష్టాయిష్టాలు, అభప్రాయాలు ఉంటాయి. వాటిని గుర్తించి, గౌరవించినప్పుడే బంధం బలపడుతుంది. అది సంప్రదాయాన్ని తిరస్కరించడం కాదు. బంధం మరింత బలపడటానికి మార్గం. • ‘‘నువ్వలా చేస్తున్నావు’’, ‘‘నువ్విలా అంటున్నావు’’ అని కాకుండా... ‘‘నేనిలా అనుకుంటున్నాను’’, ‘‘నేనిలా ఫీలవుతున్నాను’’ అని మాట్లాడటం వల్ల చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. ఉదాహరణకు, ‘‘నేనే డ్రెస్ వేసుకోవాలో నువ్వు చెప్పినప్పుడు నాకు అసౌకర్యంగా ఉంటుంది. ఇద్దరికీ నచ్చేదాని గురించి మాట్లాడుకుందామా?’’ అని చెప్పడం, ఇష్టంలేకుండా ఒప్పుకోవడం నుంచి మాట్లాడి పరిష్కరించుకోవడానికి దారితీస్తుంది. • ఒక వ్యక్తిని గౌరవించడమంటే వారి వ్యక్తిత్వాన్ని గౌరవించడం. వారి స్వేచ్ఛకు, స్నేహాలకు విలువనివ్వడం. భార్యకు లేదా భర్తకు కూడా పర్సనల్ స్పేస్ ఉంటుందని గుర్తించడం. అది వారిని నచ్చిన పాటలు వినడం కావచ్చు, తన ఫ్రెండ్స్ తో మాట్లాడటం కావచ్చు. • మారుతున్న కాలంతో పాటు సంప్రదాయాల్లోనూ మార్పు వస్తుందని గుర్తించాలి. సంప్రదాయానికి, స్వేచ్ఛకు మధ్య సమతుల్యత సాధించాలి. అది ఒకరి పట్ల మరొకరికి అవగాహనను, నమ్మకాన్ని పెంచుతుంది. • సరిహద్దులను సెట్ చేయడం సవాలే. మీ భాగస్వామి ఒప్పుకోకపోవచ్చు. అది మీ బాధ్యత కాదు. మీ అంచనాలకు అనుగుణంగా స్థిరంగా ఉండండి. • మీ హద్దులు దాటితే పరిణామాలు ఎలా ఉంటాయో నిర్ణయించుకోండి. పరస్పర చర్చల ద్వారా హద్దులను సర్దుబాటు చేసుకోండి.ప్రియ, రోహిత్ లకు మూడు సెషన్లలో వీటిని వివరించి, వారి మధ్య ఉన్న అపోహలను తొలగించి, ఓపెన్ కమ్యూనికేషన్ డెవలప్ అయ్యేలా కొన్ని ఎక్సర్ సైజ్ లు చేయించాను. ఇప్పుడిద్దరూ చిలకాగోరింకల్లా జీవిస్తున్నారు. అప్పుడప్పుడూ వాట్సప్ లో పలకరిస్తుంటారు.సైకాలజిస్ట్ విశేష్+91 8019 000066psy.vishesh@gmail.com -
సహజీవనంలో ఆమెకు ఆ హక్కుందా?
ప్రియ, భార్గవ్.. మూడేళ్లుగా లివ్ ఇన్ టుగెదర్ రిలేషన్ లో ఉంటున్నారు. ఇద్దరూ ఒకే కంపెనీలో పనిచేసేవాళ్లు. ఆరు నెలల కిందట ప్రియకు ఉద్యోగం పోయింది. దాంతో ఇంటి బాధ్యత అంతా భార్గవ్దే. అయితే ప్రియ ఇటీవల భార్గవ్ ఏం చేసినా తప్పు పడుతోంది. ఎవరితో మాట్లాడనివ్వకుండా.. తనతో తప్ప ఎవరితో ఎక్కడికీ వెళ్లనివ్వకుండా కట్టడి చేస్తోంది. ఆఫీస్ అవసరాల రీత్యా భార్గవ్ కొలీగ్స్కి ఫోన్ చేసినా, ఫోన్ ని అతను అటెండ్ అయినా పెద్ద యుద్ధమే! గొడవలే! భరించలేక భార్గవ్ ఒకరోజు ‘ఈ టార్చర్ తట్టుకోవడం నా వల్ల కాదు.. నీతో కలసి ఉండలేను’ అన్నాడు. దాంతో ప్రియ ‘నాతో బ్రేకప్ చేసుకుంటే నీ మీద రేప్ కేసు పెడతా’ అని బెదిరించింది. హడలిపోయాడు భార్గవ్. నిజంగానే ప్రియకు ఆ హక్కు ఉందా?కొత్తగా అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత, సెక్షన్ 69 ప్రకారం.. ఏ వ్యక్తి అయినా పెళ్లి చేసుకునే ఉద్దేశం లేక΄ోయినా.. మోసపూరితంగా, ఓ పథకం ప్రకారం.. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ స్త్రీతో శారీరక సంబంధం నెరపితే.. సదరు పురుషుడికి పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. రేప్ అయితే యావజ్జీవం కూడా పడవచ్చు. జూన్ 30 వరకు అమల్లో ఉన్న పాత శిక్షాస్మృతి ప్రకారం కూడా పెళ్లి చేసుకుంటానని చెప్పి, మోసపూరితంగా స్త్రీతో శారీరకసంబంధం నెరపిన పురుషుడిపై ఐపీసీ 376, ఐపీసీ 420 సెక్షన్ లను కలిపి కేసు నమోదు చేసేవారు. అయితే, ఆ పురుషుడు మొదటినుంచీ మోసం చేసే ఉద్దేశంతోనే ఉన్నాడు అని రుజువుకాకపోతే మాత్రం దాన్ని రేప్గా పరిగణించలేమని హైకోర్ట్, సుప్రీంకోర్టు పేర్కొన్న సందర్భాలు, తీర్పులూ ఉన్నాయి. ఇలాంటి కేసుల్లో ముఖ్యంగా చూడాల్సినదేంటంటే.. పెళ్లి చేసుకునే ఉద్దేశం లేక΄ోయినా చేసుకుంటానని నమ్మించి కేవలం శారీరక సంబంధం కోసమే అతను లివ్ ఇన్లో ఉన్నాడా అనే అంశం. మొదట బాగానే ఉన్నాడు.. పెళ్లి చేసుకోవాలనే అనుకున్నాడు.. కానీ తర్వాత మనస్పర్థలు, భేదాభి్రపాయాలు వచ్చి విడి΄ోవాలనుకుంటున్నాడు అని రుజువైతే శిక్ష పడదు. భారతీయ న్యాయ సంహిత, సెక్షన్ 69 ప్రకారం కూడా లివ్ ఇన్ రిలేషన్ లోని పురుషుడు ‘మోసపూరితమైన ఆలోచనతోనే రిలేషన్ మొదలు పెట్టాడు’ అని రుజువు చేయాలి. అయితే ఈ కేస్ స్టడీలో భార్గవ్ మీద ప్రియ కేసు పెట్టే అవకాశం కచ్చితంగా ఉంది. అతను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇన్నాళ్లు లివ్ ఇన్ లో ఉండి ఇప్పుడు వద్దు అంటున్నాడని ప్రియ రుజువు చేయగలిగితే భార్గవ్కి పదేళ్లవరకు శిక్ష పడే అవకాశం ఉంది. అయితే సెక్షన్ 69 వలన సహజీవనం, ప్రేమ అనే అంశాలు ఆది నుంచీ అనుమానంతో మొదలయ్యే ప్రమాదం ఉంది. సహజీవనానికి ముందు లేదా కలసి ఉంటున్న క్రమంలో ఒకరిపై ఒకరు స్పష్టత తెచ్చుకోవడం అవసరం. ఇలాంటి రిలేషన్స్ వ్యక్తిగతమైనప్పటికీ, వీలైనంత మేర అందరికీ తెలిసేలా ఉండడం లేదా కనీసం సన్నిహితులకైనా తెలిసుండటం వల్ల కొంతవరకు రక్షణ కలగవచ్చు. – శ్రీకాంత్ చింతల, హైకోర్ట్ అడ్వొకేట్ -
అన్ని బంధాలకూ మూలం బాల్యంలోనే!
హలో ఫ్రెండ్స్,గతవారం సారా గురించి మాట్లాడుకున్నాం కదా. బాల్యంలో పేరెంట్స్, గార్డియన్స్, కుటుంబ సభ్యులతో ఉన్న అనుబంధం జీవితానికి ఒక పునాదిలా పనిచేస్తుంది. ఆ తర్వాత వివిధ వ్యక్తులతో సాన్నిహిత్యం, భావోద్వేగాలను నియంత్రించే సామర్థ్యం, సంఘర్షణలను పరిష్కరించుకునే సామర్థ్యాకు బ్లూప్రింట్ లా ఉంటుంది. వీటినే అటాచ్మెంట్ స్టైల్స్ అంటారు. జీవితంలో బలమైన కనెక్షన్ లను నిర్మించుకోవాలంటే వీటిని అర్థం చేసుకోవడం అవసరం.నాలుగు రకాలు... Secure Attachment: బాల్యంలో అనేక అవసరాలు ఉంటాయి. అన్నీ పిల్లలు చేసుకోలేరు. తల్లిదండ్రులు లేదా సంరక్షకుల అవసరం ఉంటుంది. ఆ అవసరాలను వెంటనే గుర్తించి, స్పందించి, సంరక్షించే పేరెంట్స్ ఉన్నప్పుడు పిల్లల్లో భద్రంగా ఉన్నామనే ఫీలింగ్ ఏర్పడుతుంది. అలా సెక్యూర్ అటాచ్మెంట్ స్టైల్ ఏర్పడుతుంది. వయసుతో పాటు అదీ పెరుగుతూ ఇతరులతో బంధాలను ఏర్పరచుకోవడంలో దిక్సూచిలా పనిచేస్తుంది. ఈ అటాచ్మెంట్ స్టైల్ ఉన్నవారు తమకు ఏ కష్టం వచ్చినా తన జీవిత భాగస్వామి అందుబాటులో ఉంటారని నమ్ముతారు. తమ మనసులోని భావాలు ఎలాంటివైనా నేరుగా కమ్యూనికేట్ చేస్తారు. తన లైఫ్ పార్టనర్ తో సాన్నిహిత్యంగా, సుఖంగా ఉంటారు. అందరితోనూ సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు.Anxious Attachment: బాల్యంలో పేరెంట్స్ లేదా గార్డియన్స్ అందుబాటులో లేకపోవడం, ఉన్నా పట్టించుకోకపోవడం, అవసరాలను గుర్తించకపోవడంతో... తనను ఎవరూ పట్టించుకోవడంలేదు, వదిలేస్తారనే భయం, ఆతృత ఏర్పడుతుంది. ఆ భయం వారి జీవితాంతం ఉంటుంది. అందుకే మనసులోని భావాలను నేరుగా చెప్పలేరు. చెప్తే తమను వదిలివేస్తారనే భయం వారిని వెంటాడుతూ ఉంటుంది. పార్టనర్ మౌనంగా ఉంటే అది తిరస్కారంగా భావిస్తారు. ‘నేనంటే ఇష్టంలేదా?’ అని పదే పదే అడుగుతారు. చాలా ఇష్టమని చెప్పినా సంతృప్తి చెందరు. వదిలేస్తారేమోనని భయపడుతుంటారు. దాంతో మరింత దగ్గరగా అతుక్కుపోతారు. మరోవైపు పార్టనర్ చర్యలను తప్పుగా అర్థం చేసుకుంటారు. అసూయ, అభద్రత వంటి వారిని కంట్రోల్ చేసుకోవడానికి కష్టపడుతుంటారు. ఇలాంటివారికి భరోసా ఇవ్వడం పార్టనర్ కు తలకు మించిని భారమవుతుంది. సారా సమస్య ఇదేనని గుర్తొచ్చిందా?Avoidant Attachment: కొందరు పేరెంట్స్ పిల్లలను పట్టించుకోరు, దూరంగా పెడుతుంటారు. వాళ్లేం చేసినా నిరుత్సాహపరుస్తుంటారు. అందువల్ల పిల్లలు వారితో సాన్నిహిత్యంగా ఉండలేరు. ఎమోషన్స్ ను వ్యక్తం చేయలేరు. అలా వ్యక్తంచేయడం అసౌకర్యంగా భావిస్తారు. స్వతంత్రంగా ఉండలేరు. ఒంటరిగా ఫీలవుతుంటారు. అలా ఈ అటాచ్మెంట్ స్టైల్ అభివృద్ధి చెందుతుంది. ఇలాంటి అటాచ్మెంట్ స్టైల్ ఉన్నవారు ఏదీ ఓపెన్ గా మాట్లాడలేరు. మానసికంగా దూరంగా ఉంటారు. తరచూ పోట్లాడుతుంటారు. ఒంటరిగా ఫీలవుతుంటారు. వీరితో ఎలా వ్యవహరిస్తే ఏమవుతుందోనని పార్టనర్ గందరగోళానికి గురవుతారు.Disorganized Attachment: కొందరు పేరెంట్స్ లో తెలియని భయాలు ఉంటాయి. దాంతో వారి ప్రవర్తన ఎప్పడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఇలాంటి పేరెంట్స్ దగ్గర పెరిగిన పిల్లల్లో ఇలాంటి అటాచ్మెంట్ స్టైల్ అభివృద్ధి చెందుతుంది. వీరు ఇతరులతో సాన్నిహిత్యం కోరుకుంటారు. కానీ వాళ్లను విశ్వసించాలంటే తీవ్రమైన భయం. దాంతో వారి బంధాలు, అనుబంధాలు అస్థిరంగా ఉంటాయి. వారి భావోద్వేగ ప్రతిస్పందనలు అనూహ్యంగా ఉంటాయి. వీరికి ఎమోషనల్ సెక్యూరిటీ అందించడంలో పార్టనర్స్ ఇబ్బందులు పడుతుంటారు.మరేం చెయ్యాలి?సరే సర్. అటాచ్మెంట్ స్టైల్స్ రిలేషన్ షిప్ డైనమిక్స్ ను ప్రభావితం చేస్తాయంటున్నారు సరే, ఇప్పుడేం చెయ్యాలి? అని మీరు అనిపించవచ్చు. బాల్యంలో ఏర్పడిని అటాచ్మెంట్ స్టైల్స్ అలాగే శిలేసుకుని కూర్చోవు. వాటిపట్ల అవగాహన పెంచుకుని, మార్చుకునేందుకు ప్రయత్నం చేస్తే మారతాయి. సైకాలజిస్ట్ సహాయంతో సురక్షితమైన అటాచ్మెంట్ స్టైల్ ను అభివృద్ధి చేసుకోవచ్చు. గతవారం సారా కేసులో జరిగింది ఇదే. అందుకోసం ముందుగా మీరేం చేయాలో చెప్తా.• మీ అటాచ్మెంట్ శైలిని గుర్తించడం అనేది హెల్తీ కనెక్షన్లను నిర్మించుకోవడంలో తొలి అడుగు. మీ శైలిని అర్థం చేసుకోవడం వల్ల మీ ప్రవర్తనకు మూల కారణాలను గుర్తించవచ్చు. మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేసేందుకు సైకాలజిస్ట్ సహాయపడతారు. • మనం మొదటివారం చెప్పుకున్నట్లు అన్ని బంధాలూ మీ సెల్ఫ్ ఎస్టీమ్ పైనే ఆధారపడి ఉంటాయి. మీపై మీకు గౌరవం, విశ్వాసం ఉంటే ఇతరులపై ఆధారపడటం తగ్గిస్తుంది. సురక్షితమైన అనుబంధాన్ని సులభతరం చేస్తుంది• నిజాయితీతో కూడిన ఓపెన్ కమ్యూనికేషన్ స్కిల్స్ను పెంపొందించడం విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. రిలేషన్స్ లో వచ్చే సంఘర్షణలను సమర్థంగా పరిష్కరించుకునేందుకు, మీ అవసరాలను నేరుగా వ్యక్తీకరించేందుకు ఉపయోగపడుతుంది. • బంధాలలో ఏది ఓకేనో, ఏది నాట్ ఓకేనో స్పష్టమైన సరిహద్దులను సెట్ చేయడం మీ ఎమోషనల్ వెల్ బీయింగ్ ను కాపాడుతుంది. పరస్పరం గౌరవప్రదంగా ఉండేలా ప్రోత్సహిస్తుంది. • రిలాక్సేషన్ టెక్నిక్స్, మైండ్ఫుల్నెస్ ప్రాక్టీసెస్ వంటివి మీ భావోద్వేగ నియంత్రణను మెరుగుపరుస్తాయి. నెగెటివ్ ఎమోషన్స్ మీ సంబంధాలను దెబ్బతీయకుండా కాపాడతాయి. • బంధాలకు సంబంధించిన నెగెటివ్ ఆలోచనా విధానాలకు గుర్తించడానికి, వాటిని మార్చుకోవడానికి కాగ్నిటివ్-బిహేవియరల్ థెరపీ (CBT) ఉపయోగపడుతుంది. మీ ఎమోషనల్ రెగ్యులేషన్ కు, సెల్ఫ్ కంపాషన్ పెంపొందించడానికి కోపింగ్ మెకానిజమ్లను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది.సైకాలజిస్ట్ విశేష్+91 8019 000066psy.vishesh@gmail.com -
‘డిజైన్డ్’ సంసారం! సిటీలో స్థిరపడుతున్న సహజీవన సంస్కృతి!!
కలిసి జీవనం ప్రారంభించడం, బాధ్యతలు, వ్యయాలు సమానంగా పంచుకోవడం, పరస్పర వ్యక్తిగత ఇష్టాయిష్టాలను గౌరవించుకోవడం, ఒకరిపై ఒకరు ఆధిపత్యం చలాయించకపోవడం, ఇష్టమున్నంత కాలం కలిసి ఉండడం, ఇద్దరిలో ఎవరు వద్దనుకున్నా సింపుల్గా ‘బై..బై’ చెప్పేయడం.. ఇదే ‘లివిన్’. సహజీవనంతో మరింత బలపడిన అనుబంధాన్ని పెళ్లితో చట్టబద్దం చేసుకుంటున్నవారూ లేకపోలే దు.. అయితే కొంతకాలం అనుబంధం తర్వాత విడిపోయి కూడా ఫ్రెండ్స్గా కొనసాగే వారూ ఉన్నారు.ఇటీవల యువ అనుబంధాలపై లయన్స్ గేట్ ప్లే అనే సంస్థ స్వతంత్ర అధ్యయనం నిర్వహించింది. ‘లయన్స్గేట్ ప్లే రిలేషన్ షిప్ మీటర్’ పేరిట విడుదల చేసిన అధ్యయన ఫలితాల్లో అత్యధికులు లివిన్ రిలేషన్ షిప్స్కి జై కొడుతున్నారు. ఆ అధ్యయనం వెల్లడించిన విశేషాలను పరిశీలిస్తే... – సాక్షి, సిటీబ్యూరోశాశ్వత సంబంధాలను ఏర్పరచుకోవడానికి బదులు వారు లివిన్ రిలేషన్ షిప్ వంటి ప్రత్యామ్నాయ మార్గాలనే ఆధునికులు ఎంచుకుంటున్నారు. భాగస్వామిని అర్థం చేసుకోవడానికి పెళ్లికన్నా లివిన్ రిలేషన్ షిప్లో ఉండటం మేలని 50 శాతం మంది అంటున్నారు. ఈ రిలేషన్ షిప్లో ఉండటానికి తల్లిదండ్రులు అంగీకరిస్తారని 34% మంది భావిస్తున్నారు.భార్య, భర్త కాదు.. ఓన్లీ ఫ్రెండ్స్..ప్రేమను కొనసాగించడానికి స్నేహమే మూలమని నవతరం నమ్ముతున్నారు. ఆ మధ్య ప్రేమ అంటే స్నేహం అని అర్థం చెప్పిన బాలీవుడ్ హీరో షారుఖ్ఖాన్ అభిప్రాయం సరైనదేనని 87 శాతం మంది పురుషులు 92 శాతం మహిళలు భావిస్తున్నారు. విడిపోయిన తర్వాత కూడా స్నేహితులుగా కొనసాగొచ్చు అంటూ ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు తమ మాజీ ప్రియుడితో స్నేహం చేయడం మంచిదంటున్నారు. కేవలం 30% మంది భారతీయులు మాత్రమే తమ భాగస్వామి అపోజిట్ సెక్స్కి చెందిన క్లోజ్ ఫ్రెండ్ని కలిగి ఉండటం పట్ల అసౌకర్యంగా ఉన్నారు.ఎంపికలో కీలకం ఇవే..భాగస్వామి ఎంపికలో భావోద్వేగ సంబంధం కన్నా అందానికే 50 శాతం మంది పురుషులు ప్రాధాన్యత ఇస్తుండగా మహిళలు 35 శాతం మంది మాత్రమే లుక్స్కి విలువ ఇస్తున్నారు. ఆర్థికంగా సురక్షితంగా ఉండే రిలేషన్ షిప్లోకి మాత్రమే ప్రవేశించాలని 72 శాతం మంది భావిస్తున్నారు. ఇంటి ఖర్చులను జంటగా పంచుకోవాలని 50 శాతం మంది మహిళలు అంటుంటే 37 మంది పురుషులు మాత్రమే దీనిని అంగీకరిస్తున్నారు.బ్రేకప్.. వాట్ నెక్ట్స్?అనుబంధాలు ముక్కలయ్యాక ఏమిటి పరిస్థితి? హృదయం ముక్కలైపోతుందేమోనని, ఒంటరిగా ఉండడం కష్టమని, మళ్లీ ప్రేమ దొరకదేమోననే భయాల్లో 60 శాతం మంది ఉన్నారు. అయితే ఈ విషయంలో పురుషులు ఎమోషనల్గా కనిపిస్తుండగా, మహిళలు ఆచరణాత్మకమైన విధానాన్ని ఎంచుకుంటున్నారు. 53% మంది మహిళలు ‘మాజీని మరచిపోయి ముందుకు సాగుదాం’ అనే వైఖరిని కలిగి ఉన్నారు. కానీ 66% మంది పురుషులు తమ మొదటి ప్రేమకు తిరిగి వెళ్లడానికి ఇష్టపడుతున్నారు.అలాగే 37% మంది విడిపోయిన తర్వాత కూడా భాగస్వామితో కలిసి ఒకే ఇంట్లో నివసించడంలో తప్పు లేదని అభిప్రాయపడ్డారు. అయితే రిలేషన్ను తిరిగి నిర్మించుకోవడం కంటే ముగించుకోవడమే సులభమని 33 నుంచి 38 సంవత్సరాల వయస్సు గల వారిలో 72% మంది 27 నుంచి 32 సంవత్సరాల వయస్సు గల వారిలో 67% మంది అంగీకరిస్తున్నారు. అలాగే అనుబంధం ముగిశాక ముందుకు సాగడానికి కొత్త బంధాన్ని ప్రారంభించడం ఉత్తమమని 48% మంది భావిస్తున్నారు.తారా పథంలో..ఫ్యాషన్ల నుంచి ఎమోషన్ల వరకూ దేనికైనా సరే అపరిమితమైన ఫాలోయింగ్ రావాలంటే.. దాన్ని సెలబ్రిటీ ఆదరించాలి. ఈ లివిన్ రిలేషన్íÙప్ విషయంలో కూడా అదే జరిగింది. చాలామంది నటీనటులు ఇలా ‘కలిసి జీవించడం’ కనిపిస్తోంది. దాన్ని అనుసరిస్తూ కార్పొరేట్, ఐటీ కంపెనీలు అధికంగా ఉన్న బెంగుళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో పెళ్లికి ప్రత్యామ్నాయంగా యువత ఈ అనుబంధం ఏర్పరచుకుంటున్నారు. అప్పట్లో హాలీవుడ్లో బ్రాడ్పిట్, ఏంజెలినా జోలి నుంచీ ప్రీతిజింతా, సుస్మితాసేన్, సంజయ్దత్లతో పాటు కరీనా–సైఫ్ అలీఖాన్ ఇంకా ఎందరెందరో ఈ కల్చర్ని కలర్ఫుల్గా మార్చారు.నగరంలో స్థిరపడిన సంస్కృతి..వుయ్ ఆర్ మ్యారీడ్ అన్నంత సహజంగా వుయ్ ఆర్ ఇన్ రిలేషన్ షిప్ అంటున్నాయి జంటలు. ఆ అనుబంధం పేరే లివిన్. ‘లివింగ్ టు గెదర్’ తెలుగీకరిస్తే ‘సహజీవనం’. వివాహంతో పనిలేకుండా, జీవితాంతం కలిసి జీవిస్తామని ప్రమాణాలు చేసుకోకుండా, స్త్రీ–పురుషుడు కలిసి ఉండడమే ‘లివిన్ రిలేషన్íÙప్’. భిన్న సంస్కృతుల నిలయమైన నగర జీవనంలో వైవాహిక బంధానికి ప్రత్యామ్నాయంగా ఈ సరికొత్త సంస్కృతి స్థిరపడిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది.పెరుగుతున్న మోసాలు.. గతంలో మహిళా కమిషన్ వర్గాలు వెల్లడించిన డేటా ప్రకారం.. లివ్ ఇన్కు సంబంధించిన మోసాలు తెలుగు రాష్ట్రాల్లో పెరిగినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి, తెలంగాణలోని రంగారెడ్డి ఈ విషయంలో పోటీ పడుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో అగ్రగామిగా హైదరాబాద్ నిలిచింది. లివిన్ చీటింగ్ కేసుల్లో 47 శాతం ఒక్క హైదరాబాద్ నగరంలోనే చోటు చేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని మహిళా కౌన్సిలింగ్ కేంద్రాలకు ఒక్క ఏడాదిలోనే 2వేలకు పైగా ఫిర్యాదులు వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు.జాగ్రత్తలు తప్పనిసరి..ఏదేమైనా తప్పుకాదనుకునో, తప్పనిసరిగానో ఈ అనుబంధంలోకి అడుగుపెడుతున్నవారు పలు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. భాగస్వామి మరణించినా, మరే కారణం చేత దూరమైనా చట్టపరమైన ఇబ్బందులు రాకుండా ఉండాలంటే.. ‘లివిన్’ కొనసాగుతున్నప్పుడు అర్జించిన ఉమ్మడి ఆదాయాలకి సంబంధించిన ఒప్పందాలు, స్థిర, చరాస్తుల పంపకాలకు సంబంధించిన ఒప్పందాలను ముందుగానే రాసుకోవడం మంచిదని న్యాయనిపుణులు సూచిస్తున్నారు.పుట్టిన పిల్లలకు కూడా మున్ముందు సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడాల్సి ఉంది. అనూహ్యమైన ప్రమాదాలతో భాగస్వామి ఆస్పత్రి పాలైతే అవసరమైన సేవలు అందించడానికి, చికిత్సకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి బాధితవ్యక్తి తల్లిదండ్రులు, బంధువుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాలి. మెడికల్ పవర్ ఆఫ్ అటారీ్నని ముందుగా రాయడం ద్వారా అధిగమించవచ్చు.‘లివిన్’కు కారణాలెన్నో..నగరం ఈ తరహా బంధాలకు నెలవుగా మారుతోంది. సినిమా, మోడలింగ్, ఎంటర్టైన్మెంట్, టీవీ, మీడియా, ఐటీ, సాఫ్ట్వేర్.. రంగాలకు చెందిన యువతీ యువకులు ఈ అనుబంధంవైపు తేలికగా ఆకర్షితులవుతున్నారు.మహిళలు, పురుషులు ఎవరికి వారు వ్యక్తిగత కెరీర్ను, విజయాలను కోరుకోవడం, కెరీర్ను కొనసాగిస్తూనే భావోద్వేగపూరిత బలమైన అనుబంధాన్ని కోరుకుంటున్నారు.వ్యక్తిగత ఖర్చులు భరించలేక రూమ్ షేర్ చేసుకోవడంతో మొదలై ‘లివిన్’గా మారుతోంది.పబ్స్ నుంచి క్లబ్స్ వరకూ ‘స్టాగ్స్ నాట్ అలవ్డ్’ అని బోర్డు పెడతారు. దీంతో రోజుకొకర్ని వెంటేసుకుని వెళ్లేకన్నా.. స్థిరంగా ఉండే బాయ్ఫ్రెండ్/గరల్ ఫ్రెండ్ మిన్న అని భావించడం.పెళ్లిద్వారా పరస్పరం సంక్రమించే హక్కుల పట్ల భయం.చట్టబద్దమైన బంధంలోకి వెళ్లే ముందుగా తమ భాగస్వామిని అర్థం చేసుకోవాలనుకోవడం.ఈ కొత్త తరహా జీవనశైలి మానసిక సంఘర్షణకు, తీవ్ర ఒత్తిడికీ దారి తీస్తాయి. అద్దె ఇంటి దగ్గర్నుంచి ఆఫీసు వ్యవహారాల వరకూ పెళ్లికాని కాపురం చేయాలనుకునే యువత చాలా సమస్యలే ఎదుర్కోవాల్సి వస్తుంది. ‘వివాహం కంటే బలమైన అనుబంధం తమ మధ్య ఉందనుకున్నప్పుడు మిగిలిన విషయాలకు అంతగా ప్రాముఖ్యత ఇవ్వకూడదు. అలాగే ఆవేశంలోనో, ఫ్యాషన్గానో, సహజీవనంలోని లోతుపాతులు తెలియకుండా అడుగుపెట్టడం సహజీవనంలోకి అడుగుపెట్టడం మంచిది కాదు’ అంటారు రచయిత్రి ఓల్గా. ఫిర్యాదులు ఇలా..నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో గత ఫిబ్రవరి 18న ఈవెంట్ ఆర్గనైజర్ సేవలు అందించే 30ఏళ్ల మహిళ తన భాగస్వామి ఖాలిద్ చిత్రహింసలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది.గత ఏప్రిల్ 1న గచ్చి»ౌలిలోని ఓ ఆపార్ట్మెంట్లో నివసిస్తున్న లివ్ ఇన్ కపుల్ మధ్య వ్యక్తిగత విబేధాలు తారాస్థాయికి చేరడంతో ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో ఆ అమ్మాయిది చత్తీస్గఢ్ కాగా అబ్బాయిది బీహార్ కావడం గమనార్హం.అనురాథారెడ్డి అనే మహిళ తనకన్నా వయసులో చిన్నవాడైన చంద్రమోహన్ అనే వ్యాపారితో రిలేషన్ షిప్లో ఉంటూ హత్యకు గురయ్యారు. ముక్కలైన ఈమె మృతదేహాన్ని గతేడాది మే 25న పోలీసులు కనుగొన్నారు.లివిన్ రిలేషన్ షిప్లో ఉంటూ తమ జల్సాలు తీర్చుకోవడం కోసం మ్యాట్రిమోనియల్ పేరిట అబ్బాయిలకు వలవేస్తున్న యువతిని, ఆమె లివిన్ పార్ట్నర్ని రాచకొండ పోలీసులు 2022 డిసెంబరు 18న అరెస్ట్ చేశారు.గతేడాది జూలై 23న ఫిలింనగర్కు చెందిన సెక్యూరిటీ గార్డ్ శివకుమార్ తన లివిన్ పార్ట్నర్తో వచి్చన విబేధాల కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.మహిళల పక్షపాతిగా మారిన కొన్ని చట్టాలు అబ్బాయిల్ని పెళ్లికి విముఖులుగా మార్చి, ఈ బంధం వైపు ప్రేరేపిస్తున్నట్టు తెలుస్తోంది.ఆడవాళ్లకే నష్టం ఎక్కువ..ఏదేమైనా, ఇందులో పార్ట్నర్స్ ఇద్దరికీ ఎటువంటి హక్కులూ ఉండవు. ‘సహజీవనం’ విఫలమై మా వద్దకు వస్తున్న మహిళలు కొంత కాలం కలిసి జీవించాక విడిపోతే మనోవర్తి వస్తుందా? అని అడుగుతున్నారు. ఈ బంధానికి చట్టపరమైన రక్షణ లేకపోవడం వల్ల ఆడవాళ్లకే నష్టం ఎక్కువ జరుగుతోంది. – నిశ్చలసిద్ధారెడ్డి, హైకోర్టు అడ్వకేట్ఇవి చదవండి: స్పేస్–టెక్ స్టార్టప్ ‘దిగంతర’ రూపంలో సాకారం.. -
వదిలేస్తారనే భయంతో పెళ్లికి దూరం..
సారా 28 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఇంజినీర్. ఇంకా పెళ్లి కాలేదు. ఇప్సటికైనా పెళ్లి చేసుకోమని పేరెంట్స్ నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తోంది. పెళ్లంటే సారాకేం వ్యతిరేకత లేదు. కానీ భయం. ఎందుకంటే ఇప్పటివరకూ తాను ఐదుగురితో డేటింగ్ చేసింది. మొదట్లో అతను చూపించే కేర్, లవ్, అఫెక్షన్ అంతా బాగానే ఉంటుంది. అతని సాన్నిహిత్యంలో జీవితం భద్రంగా ఉంటుందని ఫీలవుతుంది. కానీ బంధం బలపడేకొద్దీ సారా ప్రవర్తన మారుతుంది. అతను తనను వదిలేస్తాడేమోననే భయం మొదలవుతుంది. దాంతో పొసెసివ్ గా మారుతుంది. అతని బిహేవియర్ మొత్తం తన కంట్రోల్ లో ఉండాలనుకుంటుంది. అలా లేకపోతే ఏమాత్రం ఆలోచించకుండా అతనికి దూరమవుతుంది. మళ్లీ అతను బ్రతిమలాడినా వెనక్కు వెళ్లదు. ఇలాగా ఐదుగురితో డేటింగ్ చేసి, పెళ్లి చేసుకుందామనుకుని, చివరకు వదిలేసింది. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి పెరగడంతో, అసలు తన బిహేవియర్ లో ఏమైనా సమస్య ఉందేమో తెలుసుకునేందుకు కౌన్సెలింగ్ కు వచ్చింది.అప్పటి బాధ.. ఇప్పుడు భయం..సారా చెప్పింది విన్నాక, ఆమె బాల్యం, పెరిగిన వాతావరణం గురించి అడిగాను. పేరెంట్స్ ఇద్దరూ ఇంజినీర్లేనని, ఎప్పుడూ బిజీగా ఉంటేవారని, ముగ్గురం ఇంట్లోనే ఉన్నా ఒకరికొకరం దూరంగా ఉన్నట్లు ఉండేదని చెప్పింది. ఎమోషనల్ గా పేరెంట్స్ అందుబాటులో లేకపోవడం సారాలో అభద్రతా భావాన్ని కలిగించింది. ఆప్యాయత కోసం ఆమె మనసు ఆరాటపడేది. బాల్యంలో సారా తల్లిదండ్రులతో అనుభవించిన ఎమోషనల్ డిస్టెన్స్ ఆమెతో పెరిగి పెద్దదయ్యింది. ఇప్పుడు డేటింగ్ చేసినవాడు తనను వదిలివేస్తాడనే భయంగా మారింది. ఆ భయం పుష్-పుల్ డైనమిక్స్ గా వ్యక్తమవుతోంది. అంటే ఆప్యాయత కోసం దగ్గరవ్వడం, దూరమవుతారనే ఆందోళనతో దూరమవ్వడం. దీన్నే యాంగ్జయిటీ అటాచ్మెంట్ స్టైల్ అంటారు.బాల్యంలో పేరెంట్స్ వల్ల ఏర్పడే అటాచ్మెంట్ స్టైల్ కు ఆ తర్వాత జీవితంలో ఏర్పడే రిలేషన్షిప్స్ లో సంతృప్తికి సంబంధం ఉందని పరిశోధనల్లో తేలింది. సారా వంటి అటాచ్మెంట్ స్టైల్ ఉన్న వ్యక్తులు నమ్మకం, సాన్నిహిత్యం పోరాడతారు. వదిలివేస్తారనే భయం ఎమోషనల్ రోలర్ కోస్టర్ కు దారితీస్తుంది. చివరకు సారాలా ఏ బంధంలోనూ నిలబడలేరు. ఆరు నెలల్లో ఆందోళన దూరం... కాగ్నిటివ్-బిహేవియరల్ థెరపీ (CBT): సారాతో మాట్లాడి ఆమె సమస్యను అర్థం చేసుకున్నాక థెరపీ ప్రారంభించాను. తనను వదిలివేస్తారనే నెగెటివ్ థాట్స్ ను గుర్తించడానికి, సవాలు చేయడానికి సీబీటీ పద్ధతులు ఆమెకు సహాయపడ్డాయి. ఉదాహరణకు ‘‘అతను నన్ను విడిచిపెడతాడు’’ అని ఆలోచించే బదులు, దాన్ని రీఫ్రేమ్ చేసి ‘‘ఈ రిలేషన్షిప్ పనిచేయకపోవచ్చు, అలాగని నేనేం ఒంటరిగా ఉండిపోను, హేండిల్ చేయగలను’’ అని ఆలోచించడం. ఎమోషనల్ రెగ్యులేషన్ స్కిల్స్: సారా తన ఎమోషన్స్ ను, ముఖ్యంగా వదిలివేస్తారనే యాంగ్జయిటీని మేనేజ్ చేసుకోవడానికి మైండ్ఫుల్నెస్ వంటి టెక్నిక్స్ నేర్పించాను. భయాన్ని హడావుడిగా డీల్ చేయకుండా, మాట్లాడి పరిష్కరించుకోవడం నేర్చుకుంది.ఆత్మగౌరవాన్ని పెంపొందించడం: సెల్ఫ్ వర్త్, సెల్ఫ్ ఎస్టీమ్ పెంపొందించే కార్యకలాపాలు ప్రోత్సహించాను. తన విలువ తాను తెలుసుకోవడం ద్వారా ఇతరుల అప్రూవల్ పై ఆధారపడటం తగ్గింది. సురక్షిత బంధానికి మార్గం: థెరపీ సాగేకొద్దీ సారా ప్రవర్తనలో మార్పులు వచ్చాయి. తన అవసరాలను స్పష్టంగా కమ్యూనికేట్ చేయడం, ఆందోళనను సమర్థంగా నిర్వహించడం నేర్చుకుంది. సెల్ప్ అవేర్నెస్, ఎమెషనల్ కంట్రోల్ రావడం ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. ఆరు నెలల తర్వాత సారా డేవిడ్ను కలుసుకుంది. క్రమక్రమంగా వారి బంధం బలపడింది. డేవిడ్ పర్సనల్ స్పేస్ ను గౌరవిస్తూ సారా తన అవసరాలను స్పష్టంగా చెప్పింది. తనను వదిలివేస్తాడనే యాంగ్జయిటీని అధిగమించగలిగింది. మూణ్నెళ్ల కిందట పెళ్లి కూడా చేసుకుంది. అఫ్కోర్స్, ఇద్దరూ వచ్చి పెళ్లికి పిలిచారు, వెళ్లి ఆశీర్వదించి వచ్చాను.సారా బాల్యంలో ఏర్పడిన అటాచ్మెంట్ స్టైల్, దానివల్లనే రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ వచ్చాయని అర్థం చేసుకోవడం ఈ కేసులో కీలకం. ఆ తర్వాతే థెరపీ. అందుకే వచ్చేవారం అటాచ్మెంట్ స్టైల్స్ గురించి, వాటి ప్రభావం గురించి మరితం వివరంగా తెలుసుకుందాం. అప్పటివరకూ హ్యాపీ వీకెండ్.సైకాలజిస్ట్ విశేష్8019 000066psy.vishesh@gmail.com -
బంధాలే నిజమైన బలం
హాయ్ ఫ్రెండ్స్.. వెల్కమ్ టూ "కనెక్షన్ కార్నర్". ఇది మనం కలిసి ఒక కప్పు కాఫీ తాగుతూ మనసువిప్పి మాట్లాడుకునే ప్రాంతం. కాఫీ తాగుతూ ఏం మాట్లాడుకుంటాం? లైఫ్ గురించి మాట్లాడుకుంటాం. దాన్లోని కష్టసుఖాలను పంచుకుంటాం. అలా మాట్లాడుతూ మాట్లాడుతూ, భావాలను పంచుకుంటూ అనుబంధాన్ని పెంచుకుంటాం. ఇక్కడ కూడా అదే పని చేద్దాం. మన జీవితంలో అతి ముఖ్యమైన పాత్ర పోషించే రకరకాల మానవ సంబంధాల గురించి మాట్లాడుకుందాం.మానవ సంబంధాలు మనం పీల్చే ఆక్సిజన్ లాంటివి. గాలి పీల్చుకోవడానికి మనం ప్రత్యేకంగా ఎలాంటి ప్రయత్నమూ చేయం, కానీ ఆ గాలి మనం జీవించడానికి అత్యవసరం. బంధాలు కూడా అలాంటివే. మన శారీరక, మానసిక, భావోద్వేగ ఆరోగ్యం బాగుండాలంటే రిలేషన్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయని అనేక అధ్యయనాల్లో రుజువైంది.బంధాలే జీవితం..జీవితాన్ని విశాలమైన సముద్రంలా ఊహించుకోండి. సవాళ్లు, సంతోషాల కెరటాల మధ్య మనల్ని నిలబెట్టే లైఫ్ బోట్లే మన బంధాలు, బాంధవ్యాలు. మనం పుట్టిన క్షణంలో ఏడ్చే మొదటి ఏడుపు కనెక్షన్ కోసం తొలి పిలుపు. వెంటనే అమ్మ పాలు ఇస్తుంది, మన కడుపు నింపుతుంది. ఆ తర్వాత నాన్న మన అవసరాలన్నీ కనిపెట్టి తీరుస్తాడు. వయసు పెరిగే కొద్దీ ఈ కనెక్షన్ అవసరం తగ్గదు, కేవలం పరిణామం చెందుతుంది. ఆహారం, భద్రత వంటి ప్రాథమిక అంశాల తర్వాత వచ్చే ఆకలి ప్రేమ. ఇక్కడే బంధాలు, అనుబంధాలు మన జీవితాన్ని వెచ్చదనంతో నింపుతాయి.మానసిక ఆరోగ్యానికి కూడా కీలకం..మీ ఫ్రెండ్ తో మనసువిప్పి మాట్లాడితే మీ మనసెంత తేలికవుతుందో, మీ గుండెల్లో భారం ఎలా తగ్గిపోతుందో ఎప్పుడైనా గమనించారా? నేనేదో కవిత్వం చెప్తున్నా అనుకోకండి. డబ్బు లేదా కీర్తికంటే సన్నిహిత సంబంధాలే ప్రజలను జీవితకాలం సంతోషంగా ఉంచుతాయని... ఒకటికాదు రెండు కాదు 75 సంవత్సరాల పాటు జరిపిన ‘హార్వర్డ్ స్టడీ ఆఫ్ అడల్ట్ డెవలప్మెంట్’లో కనుగొన్నారు. జీవితంలో అసంతృప్తుల నుంచి మానవ బంధాలే రక్షిస్తాయి.మనం స్నేహితులతో మాట్లాడినప్పుడు, మన మెదడు ఆక్సిటోసిన్ను విడుదల చేస్తుంది, ఈ మాయా రసాయనం మన ఒత్తిడిని తగ్గించడమే కాదు, మనం ప్రేమించేలా చేస్తుంది. అందుకే దీన్ని "కడ్ల్ హార్మోన్" అని పిలుస్తారు. అమెరికన్ జర్నల్ ఆఫ్ సైకియాట్రీలో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం, బలమైన సోషల్ నెట్వర్క్లు ఉన్న వ్యక్తులు నిరాశ, ఆందోళనతో బాధపడే అవకాశం తక్కువ. మన సంబంధాలు మానసిక ఆరోగ్యానికి విటమిన్ల లాంటివి, జీవితంలో ఎదురయ్యే తుఫానులను తట్టుకునేలా తయారుచేస్తాయి. ఆరోగ్యానికి బూస్టర్లు..మీ శరీరాన్ని తోటలా భావించండి. ఆ తోట పుష్పించడానికి సహాయపడే కాంతి, నీరే బంధాలు. బలమైన సామాజిక సంబంధాలు ఉన్న వ్యక్తులు ఆరోగ్యంగా మరియు ఎక్కువ కాలం జీవిస్తారని పరిశోధనలు చెబుతున్నాయి. ధూమపానం, ఊబకాయంలానే ఒంటరితనం కూడా ప్రాణాంతకం కావచ్చని ఒక అధ్యయనం కనుగొంది. తోటలో రకరకాల మొక్కలు, పువ్వులు ఉన్నట్లే... జీవితంలోనూ వివిధ రకాల సంబంధాలతో వర్ధిల్లుతాయి. స్నేహితులు రంగురంగుల పువ్వుల్లా ఆనందాన్నిస్తారు. కుటుంబసభ్యులు మర్రిచెట్లులా చల్లని నీడను అందిస్తారు. వృత్తిపరమైన కనెక్షన్ లు పొద్దుతిరుగుడు పువ్వుల్లా దిశను అందిస్తాయి. శృంగార బంధాలు గులాబీల్లా జీవితానికి అందాన్ని, ఆనందాన్ని, సుఖాన్ని అందిస్తాయి.బంధాల తోటను సాగుచేద్దాం.. జీవితంలో కనెక్షన్లు ఎంత ముఖ్యమైనవో అర్థమైంది కదా. వాటిని ఎలా పెంచుకోవాలి? తోటను పెంచడానికి సంరక్షణ ఎంత అవసరమో బంధాన్ని కాపాడుకోవడానికి కూడా అంతే అవసరం. మట్టిని తేమగా ఉంచే నీరులాంటిది కమ్యూనికేషన్. సూర్యకాంతి లాంటిది సహానుభూతి. వివాదాలను పరిష్కరించుకోవడమంటే కలుపు మొక్కలను తీసివేయడం లాంటిది. ఆరోగ్యకరమైన తోటలాంటి బంధాలు పెరగాలంటే ఇవన్నీ అవసరం. కానీ బంధాలు, అనుబంధాలు కరువైన కుటుంబాల్లో పెరిగిన పిల్లలు బాల్యంలో బాధపడటమే కాదు, పెరిగి పెద్దయ్యాక కూడా ఆ సమస్యలను మోసుకెళ్తారు. విద్య, ఉద్యోగ, వైవాహిక జీవితాలను బాధామయం చేసుకుంటారు.అందుకే మనం "కనెక్షన్ కార్నర్"లో అన్ని రకాల బంధాల గురించి మాట్లాడుకుందాం. వాటిలో వచ్చే తప్పులను తెలుసుకుందాం, సరిదిద్దుకుందాం, జీవితాన్ని ఆనందమయం చేసుకుందాం. మీరు ఆనందమయమైన కనెక్షన్ లను పెంపొందించుకోవడానికి మీకు సహాయపడే చిట్కాలు, సలహాలు, శాస్త్రీయ సమాచారం అందించేందుకు నేను ఎదురుచూస్తుంటాను. వచ్చేవారం కలుసుకుందాం.మీ.. సైకాలజిస్ట్ విశేష్8019 000066psy.vishesh@gmail.com -
రీల్ విలన్తో టాలీవుడ్ హీరోయిన్ రిలేషన్.. ఇక మిగిలింది పెళ్లే?
టాలీవుడ్ హీరోయిన్ రిలేషన్ గురించి మరోసారి బయటపడిపోయింది. ప్రియుడితో రొమాంటిక్ పోజులిచ్చింది. వాటిని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. గత కొన్నాళ్ల నుంచి వీళ్ల బంధంపై రూమర్స్ వస్తున్నప్పటికీ.. లేటెస్ట్ స్టిల్స్ చూస్తుంటే మాత్రం త్వరలో పెళ్లి పక్కా అనిపిస్తుంది. ఇంతకీ రీల్ విలన్-హీరోయిన్ జోడీ సంగతేంటి? అనేది ఇప్పుడు చూద్దాం.ఆస్ట్రేలియాలో భారతి సంతతికి చెందిన కుటుంబంలో పుట్టి పెరిగిన విమలా రామన్.. 2006లో తమిళ మూవీతో నటిగా మారింది. ఎవరైనా ఎప్పుడైనా, గాయం 2, రంగా ది దొంగ, రాజ్, చట్టం, నువ్వా నేనా తదితర తెలుగు సినిమాల్లో హీరోయిన్గా చేసింది. గతేడాది రిలీజైన 'గాండీవధారి అర్జున' చిత్రంలో చివరగా కనిపించింది.(ఇదీ చదవండి: స్టార్ హీరోయిన్కి హైకోర్టు నుంచి నోటీసులు.. కారణం ఏంటంటే?)విమలా రామన్ ప్రస్తుత వయసు 42 ఏళ్లు. అయితే ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది. కానీ గత కొన్నాళ్ల నుంచి నటుడు వినయ్ రాయ్తో కనిపిస్తోంది. బయటకు చెప్పకనప్పటికీ వీళ్ల బంధం గురించి ఇప్పటికే చాలాసార్లు రూమర్స్ వచ్చాయి. కానీ తాజాగా VV (వీవీ) పేరుతో ఫొటోషూట్ చేస్తున్నారు. ఈ ఫొటోల్ని విడతల వారీగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.ఇదంతా చూస్తుంటే లేటు వయసులో వినయ్ రాయ్ -విమలా రామన్ పెళ్లికి రెడీ అయిపోతున్నారా? అనే సందేహం వస్తోంది. ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలోని చాలామంది పెళ్లి బంధంలోకి అడుగుపెడుతున్నారు. మరి ఆ లిస్టులోకి హీరోయిన్ విమలా రామన్ కూడా చేరుతుందా లేదా చూడాలి.(ఇదీ చదవండి: నెల రోజులకే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్ మూవీ) View this post on Instagram A post shared by Prashun Prashanth Sridhar (@prachuprashanth) -
‘ఫ్రెండ్షిప్ మ్యారేజ్’ ఏంటి? ఫిజికల్ రిలేషన్ షిప్కు ఎందుకు తావులేదు?
వివాహం అంటే రెండు ఆత్మల కలయిక అని చెబుతుంటారు. వివాహానికి ఇచ్చే వివరణల్లో కాలనుగుణంగా అనేక మార్పులు వచ్చాయి. లివ్ ఇన్ రిలేషన్ షిప్ కూడా ఇలాంటివాటిలో ఒకటి. దీనిలో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ భార్యాభర్తలుగానే కలసి జీవిస్తుంటారు.ఇప్పుడు పెళ్లి విషయంలో మరో కొత్త ప్రయోగం జరుగుతోంది. ఇది జపాన్లో ప్రారంభమయ్యింది. అక్కడి యువతలో ‘ఫ్రెండ్షిప్ మ్యారేజ్’ ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇది వివాహాల్లో మరో నూతన విధానం. ఇందులో యువతీయువకులు భాగస్వాములుగా మారుతారు. అయితే ‘ఫ్రెండ్షిప్ మ్యారేజ్’లో ప్రేమ లేదా శారీరక సంబంధానికి అవకాశం ఉండదు. జపాన్లోని మొత్తం జనాభాలో ఒక శాతం మంది ఈ రకమైన వివాహాన్ని ఇష్టపడుతున్నారు.‘ఫ్రెండ్షిప్ మ్యారేజ్’లో చట్టబద్ధంగా వివాహం చేసుకుంటారు. కానీ ఫిజికల్ రిలేషన్ షిప్కి అవకాశం ఉండదు. అయితే కృత్రిమ గర్భధారణ ద్వారా పిల్లలను కనేందుకు అవకాశం ఉంటుంది. ఇటువంటి వివాహంలో ఇద్దరు భాగస్వాములూ విడివిడిగా వారికి నచ్చిన మరో మరొక భాగస్వామితో సంబంధం పెట్టుకునే స్వేచ్ఛను పొందుతారు. ఇలాంటి వివాహం చేసుకున్న ఒక జంట మీడియాతో మాట్లాడుతూ ‘ఫ్రెండ్షిప్ మ్యారేజ్’అంటే మనకు నచ్చిన రూమ్మేట్ని ఎంచుకోవడం లాంటిదని అన్నారు. ఈ విధంగా ఒకచోటు చేరిన భాగస్వాములు ఇంటి ఖర్చులను, ఇతర ఖర్చులను సమానంగా పంచుకుంటారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం 32 ఏళ్లుదాటిన యువతీ యువకులు ఇటువంటి వివాహలపై మక్కువ చూపిస్తున్నారు. పెళ్లయిన తర్వాత కూడా స్వేచ్ఛగా ఉండాలనుకునే వారు ఇటువంటి ‘ఫ్రెండ్షిప్ మ్యారేజ్’కు ప్రాధాన్యతనిస్తున్నారు. 2015 మార్చి తరువాత నుండి జపాన్లో వంద మందికి పైగా యువతీ యువకులు ఈ విధమైన వివాహం చేసుకున్నారని సమాచారం. -
పండంటి కాపురానికి ఏడడుగులు!
పెళ్లంటే.. రెండు మనసుల కలయిక మాత్రమే కాదు.. రెండు కుటుంబాల కలయిక. కాపురం చక్కగా సాగాలని కోరుతూ పెళ్లిలో ఏడు అడుగులు నడిపిస్తారు. ఇందులో ఒక్కో అడుగుకు ఒక్కో అర్థం ఉంది. మొత్తంగా కాపురం సుఖంగా సాగేందుకు దేవతలందరూ కరుణించాలని ప్రార్థన. స్నేహంగా, పరస్పరం గౌరవించుకుంటూ, కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ అన్యోన్యంగా జీవించాలని ప్రమాణాలు చేస్తారు. ఆ ప్రమాణాలను త్రికరణ శుద్ధిగా ఆచరించిన దంపతుల సంసారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది. లేదంటే మూడు వాదనలు, ఆరు గొడవలుగా రచ్చకెక్కుతుంది. పెద్దల పంచాయతీకి చేరుతుంది. చివరకు విడాకులుగా తేలుతుంది. వైవాహిక బంధాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలనే విషయంపై సైకాలజిస్టులు విస్తృతంగా పరిశోధనలు, అధ్యయనాలు చేశారు. వైవాహిక జీవితాలను నాలుగు దశాబ్దాల పాటు అధ్యయనం చేసిన డాక్టర్ జాన్ గాట్మన్, నాన్ సిల్వర్.. వైవాహిక బంధం బలపడటానికి ఏడు సూత్రాలను చెప్పారు. అవేమిటో ఈరోజు తెలుసుకుందాం. 1. పరస్పర అవగాహనే ప్రేమకు మూలం పెళ్లంటే వేర్వేరు ప్రపంచాల్లో పెరిగిన ఇద్దరు వ్యక్తులు ఒకటిగా జీవించడం. ఆ జీవితం సుఖంగా సాగాలంటే ఒకరి అనుభవాలను మరొకరు తెలుసుకోవాలి. వారి జీవితంలో ముఖ్యమైన సంఘటనలను పంచుకోవాలి, గుర్తుంచుకోవాలి. పరస్పర అవగాహన ఒకరి పట్ల మరొకరికి శ్రద్ధను కలిగిస్తుంది, బంధాన్ని పెంచుతుంది. మీ భాగస్వామికి ఇష్టమైన మూడు పాటలేవి? ఎందుకిష్టం? వారి అతిపెద్ద భయం ఏమిటి? భవిష్యత్తు కోసం వారు కంటున్న కలలు ఏమిటి? వారు దేనికి ఒత్తిడి చెందుతారు? వారి జీవితంలో జరిగిన కొన్ని ప్రధాన సంఘటనలు ఏమిటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఉంటే మీకు పరస్పర అవగాహన ఉందని అర్థం. లేదంటే, పెంచుకోవడానికి ప్రయత్నించాలి. 2. మీ అభిమానాన్ని పంచుకోండి, పెంచుకోండి వైవాహిక బంధం బలపడటంలో ప్రేమ, అభిమానాలది ప్రధానపాత్ర. అవి లోపించినప్పుడు ఆ బంధం నిలిచే అవకాశాలు తక్కువ. మీ వైవాహిక బంధంలో అభిమానం ఉందో లేదో అంచనా వేయడానికి మీ తొలి పరిచయం రోజులను వివరించడం మంచి మార్గం. బంధాన్ని బలపరచుకోవడానికి చేయాల్సిన పనులు.. కలసి గడపడానికి ప్లాన్ చేయలి ఇద్దరూ కలసి కొత్త హాబీ నేర్చుకోవాలి భాగస్వామికి కృతజ్ఞతలు తెలపాలి భాగస్వామిని అభినందించాలి అభిమానాన్ని పెంపొందించుకోవడంలో సమస్యలుంటే కపుల్ థెరపీకి వెళ్లాలి 3. కలసి మెలసి నడవండి ఆరోగ్యకరమైన సంబంధంలో భాగస్వాములు తరచుగా ఒకరినొకరు చూసుకుంటారు. ఒకరినొకరు చూసుకోవడం వారి ప్రేమ ట్యాంక్ను నింపుతుంది. ఇరువురి మధ్య ఎమోషనల్ కనెక్షన్ పెరిగేందుకు తోడ్పడుతుంది. లైంగిక జీవితాన్ని ప్రోత్సహిస్తుంది. దీర్ఘకాలం మాట్లాడుకోకపోవడం, చూసుకోకపోవడం జంటను దూరం చేస్తుంది. 4. భాగస్వామి మాటకు విలువనివ్వండి దంపతులు జట్టుగా పనిచేసినప్పుడు కలసి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు, అభిప్రాయాలను పంచుకునేటప్పుడు లేదా ఆలోచనా విధానంలో జీవిత భాగస్వామి అభిప్రాయాలకు విలువనివ్వాలి. ఏకీభవించనప్పుడు గౌరవంగా, ప్రశాంతంగా, హేతుబద్ధమైన చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. 5. పరిష్కరించగల సమస్యలను పరిష్కరించుకోండి వివాహంలో రెండు రకాల సమస్యలు ఉత్పన్నమవుతాయి: శాశ్వతమైనవి, పరిష్కరించదగినవి. పరిష్కరించగల సమస్యల్లో వైరుధ్యం, ఆగ్రహం ఉండవు. కేవలం సవాలు మాత్రమే ఉంటుంది. ఐదు దశల్లో వాటిని పరిష్కరించుకోవచ్చు. ఇద్దరూ ప్రశాంతంగా ఉన్న సమయంలో చర్చ ప్రారంభించాలి · మాటలు, చేతల వల్ల సంఘర్షణ పెరగకుండా చూసుకోవాలి అవసరమనిపించినప్పుడు 20 నిమిషాల విరామం తీసుకోవాలి· ఇద్దరూ కలసి బతికేందుకు అవసరమైతే రాజీ పడాలి ఒకరి తప్పులను ఒకరు సహించాలి 6. పీటముడిని అధిగమించండి నిరంతర విభేదాలు సంఘర్షణకు కారణమైనప్పుడు పీటముడి పడుతుంది. మాటలు ఆగిపోతాయి. ఒకరినొకరు ద్వేషించుకోవడం మొదలవుతుంది. దీన్ని అధిగమించడానికి.. సమస్య మూలాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి ప్రశాంతంగా కమ్యూనికేట్ చేయాలి · చర్చించలేని వివాదాలను అంచనా వేయడానికి మార్గాన్ని కనుగొనాలి భాగస్వామికి కృతజ్ఞతలు, ప్రశంసలు తెలుపుతూ ప్రశాంతంగా చర్చను ముగించాలి 7. భాగస్వామ్యానికి సరైన అర్థాన్ని సృష్టించాలి జీవన భాగస్వామ్యమంటే.. కేవలం పెళ్లి చేసుకోవడం మాత్రమే కాదు. మీ లక్ష్యాలు, పాత్రలు, ఆచారాలను కలపడం పరస్పర అవసరాలు, కోరికలు, కలలను గుర్తించడానికి అనుమతించడం అన్ని రకాల సాన్నిహిత్యాన్ని పంచుకోవడం అర్థవంతమైన అనుభవాలను సృష్టించుకోవడం --సైకాలజిస్ట్ విశేష్ psy.vishesh@gmail.com (చదవండి: భూమికే గొడుగు పట్టనున్న శాస్త్రేవత్తలు! ఏకంగా లక్షల కోట్లు..) -
మీరు ప్రేమిస్తున్న వ్యక్తి నిజంగా ప్రేమిస్తున్నారో లేదో తెలుసుకోవాలంటే..!
‘మీరు ప్రేమిస్తున్న వ్యక్తి మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తుంది లేదా ప్రేమిస్తున్నాడు అనేది క్షణాల్లో తెలుసుకోవాలనుకుంటున్నారా? దీనికి ఒక మార్గం ఉంది. అదే ఆరెంజ్ పీల్ థియరీ’ అంటూ ఇంటర్నెట్లో మొదలైన సందడి వైరల్ కావడానికి ఎంతో టైమ్ పట్టలేదు. లవ్ లిట్మస్ టెస్ట్గా భావించే ‘ఆరెంజ్–పీల్–థియరీ’ సోషల్ మీడియా వైరల్ ట్రెండ్గా మారింది. ఈ ట్రెండ్లో భాగంగా ఎన్నో మీమ్స్ వస్తున్నాయి. తాజాగా కమేడియన్ అంచల్ అగర్వాల్ ‘ఆరెంజ్ పీల్ థియరీ’పై తన తల్లితో కలిసి చేసిన వీడియో వైరల్ అయింది. 7 మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది. ఇంతకీ ఏమిటి ఆరెంజ్ పీల్ థియరీ? సింపుల్గా చెప్పాలంటే ఒక ఆరెంజ్ను లవర్కు చూపిస్తూ....‘నా కోసం ఈ ఆరెంజ్ తొక్క తీయగలవా?’ అని అడగాలి.లవర్ వెంటనే ‘ఓకే’ అంటే మనది నిజమైన ప్రేమ! ఇది సిల్లీ టెస్ట్గా అనిపిస్తున్నప్పటికీ ఇంటర్నెట్ లోకవాసులలో చాలామంది దీన్ని స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు. ఈ వైరల్ ట్రెండ్ పుణ్యమా అని ఆరేంజ్ ఫలాలు తెగ అమ్ముడవుతున్నాయట! View this post on Instagram A post shared by Aanchal Agrawal (@awwwnchal) (చదవండి: షాకింగ్ ఘటన అసలు కంటి భాగమే ఏర్పడకుండా పుట్టిన చిన్నారి) -
చాలా ఏళ్ల నుంచి అతనితో డేటింగ్ లో ఉన్నాను..
-
'సహజీవనం' అంటే సులువుగా 'సెపరేట్ అయ్యే బంధమా?
సహజీవనం పేరుతో సాగించి బంధాలు చివరికి సన్నగిల్లి అంతం చేసుకునే స్థాయికి వెళ్లిపోతున్నాయి. ఏ ఉద్దేశ్యంతో కలిసి ఉండాలనుకున్నారో ఆ బంధమే వెక్కిరింపుగా మిగిలిపోతుంది. 'సహజీవనం' కాస్త సెపరేట్ అవ్వుతోంది. చివరికి మోసానికి కేరాఫ్ అడ్రస్గా మారి జీవితాలు అల్లకల్లోలంగా మారిపోతున్నాయి. ఇదెంత వరకు కరెక్ట్? పెళ్లి కంటే సహజీవనమే బెటర్ అనేది కొందరి యువత అభిప్రాయం. పైగా ఇరువురి అండర్స్టాండింగ్తో కలిసుంటాం కాబట్టి సమస్యలొస్తే సెపరేట్ అయిపోతాం. సులవుగా రిలేషన్ నుంచి బయటపడిపోవచ్చు అనుకుంటున్నారు. అలాంటప్పుడూ ఆ సహజీవనం ఎందుకు నేరాలకు తావిస్తోంది. చివరికి ఎందుకు విషాదాంతంగా మిగిలి అసహ్యమైన బంధాలుగా మిగిలిపోతున్నాయి అనేదాని గురించే ఈ కథనం!. సమాజంలో ఈ 'సహజీవనం' పేరుతో మోసపోతున్న యువతీయువకుల ఉదంతాలు రోజుకొకటి చొప్పున తెరమీదకు వస్తునే ఉన్నా వాటి ఉచ్చులోనే పడుతునే ఉంటున్నారు. కన్నవాళ్లకి, వారిని నమ్ముకున్న వాళ్లకి తీరని వ్యథని, ఓ కళంకాన్ని మిగిల్చి కటకటాల పాలవ్వడం లేదా చనిపోవడం జరుగుతోంది. అలాంటి ఉందంతమే మహారాష్ట్రలో ప్రియాసింగ్ అనే మహిళ విషయంలో చోటు చేసుకుంది. ఆమె సమాజంలో అత్యున్నత హోదాలో ఉన్న ఓ సీనియర్ బ్యూరోక్రాట్ కుమారుడు అశ్వజిత్ గైక్వాడ్తో ఒకటి, రెండు కాదు ఏకంగా నాలుగన్నరేళ్లు సహజీవనం సాగించింది. పూర్తిగా నమ్మింది. కానీ అతడు తనకు పెళ్లి అయ్యిందనే విషయాన్ని బయటపెట్ట లేదు. పోనీ ఆ విషయం ఆమె ఎలాగో తెలుసుకున్నాక అయినా కాస్త తెలివిగా బయటకొచ్చే యత్నం చేయక అతడిని మళ్లీ గుడ్డిగా నమ్మింది. ఎందుకిలా చేశావ్? అని అమాయకంగా ప్రశ్నించింది. వెంటనే అతడు మాటదాటేసి..తన భార్యతో విడిపోయనన్నాడు. త్వరలో విడాకులు తీసుకున్నాం. నేను నీతోనే ఉంటానని ప్రియాసింగ్కి కల్లబొల్లి మాటలు చెప్పాడు. ఇక్కడ అశ్వజిత్ తనకు పెళ్లై అయ్యిందనేది దాచేసినవాడు. తర్వాత చెప్పే ప్రతి మాట ఎంత వరకు నిజం అనేది ప్రియాసింగ్ ఆలోచించలేదా, అతడి మీద ఉన్న ప్రేమ లేదా వ్యామోహం ఆ స్థాయిలో ఆలోచించనివ్వ లేదో తెలియదు. కానీ ప్రియాసింగ్ మాత్రం అతడే ఏం చెప్పిన గుడ్డిగా నమ్మింది. ఉన్నటుండి తెల్లవారుఝామున ఫోన్ చేసి కలుద్దామని ప్రియాసింగ్ని ఫోన్ చేసి పిలిపించాడు అశ్వజిత్. లోకేషన్ కూడా షేర్ చేశాడు. తీరా ప్రియాసింగ్ అక్కడికి వెళ్లితే తన బాయ్ఫ్రెండ్ తన భార్య, దగ్గరి స్నేహితులతో కనిపించాడు. ఒక్కసారిగా షాక్కి గురైన ప్రియాసింగ్ ఏం అర్థంకాక కాసేపు నీతో వ్యక్తిగతంగా మాట్లాడాలని భయంభయంగా అడిగింది. అందుకు నిరాకరించిన ఆ వ్యక్తి ఆమె ఎవరో తెలియనట్లు అరిచి, గొడవకు దిగాడు. పైగా తన స్నేహితులతో దుర్భాషలాడించాడు. చివరికి ఆమెపై దాడికి కూడా దిగాడు. ఏకంగా తన డ్రైవర్ చేత కారుని ఆమెపై పోనిచ్చి దారుణంగా గాయపరిచి అక్కడ నుంచి పరారయ్యాడు. చివరికి ఆమె తీవ్రగాయలపాలై ఆస్పత్రిపాలయ్యింది. పైగా తన బాయ్ఫ్రెండ్ మోసం చేశాడంటూ కేసు పెట్టింది. ఇక్కడ ఆమె బాయ్ఫ్రెండ్ మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ గైక్వాడ్ కొడుకు. చాలా పరపతి, అధికారం ఉన్న ఓ వ్యక్తి కొడుకు. ఇక్కడ ఆమెకు ఎంత వరకు న్యాయం జరగుతుందనేది కూడా తెలియదు. అస్సలు ఈ కేసు సవ్యంగా నడుస్తుందా? అన్నది కూడా అనుమానమే!. ఇరువురిలో ఎవరిది మోసం అనేది కూడా పోలీసులు విచారణలో పూర్తి స్థాయిలో తెలియాల్సి కూడా ఉంది. ఈ రిలేషన్లు చివరికి సుఖాంతమేనా..? సహజీవనం అనే అక్రమసంబంధాలు ఎప్పటికీ పూర్తి స్థాయిలో కడవరకు సవ్యంగా జరగవు. పెద్దలు కుదర్చిన పెళ్లి సంబంధాల్లోనే ఎన్నో సమస్యలు వచ్చి విడిపోతున్న ఘటనలు జరుగుతున్నాయి. ఇంకా అక్కడ.. ఇరువైపుల బంధువుల సమక్షంలో పెళ్లి జరగుతుంది కాబట్టి కొద్దోగొప్పో న్యాయం జరిగే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి సహజీవనం లాంటి సంబంధాల్లో తమకు ఎవరి మద్దతు, అండదండ లభిస్తుందో యువత ఆలోచించాలి. ఆ తర్వాత ఎదురయ్యే ఏ సమస్య అయినా అధిగమించగలం అనుకుంటేనే వీటి జోలికి వెళ్లండి. అలాగే ఇరువురికి ఒకరి నేపథ్యం గురించి ఒకరికి పూర్తి స్థాయిలో తెలుసుండాలి. మొదట్లో ఇద్దరి మధ్య ఏ చిన్న చోట మాట తేడావస్తున్నా.. ఒకరిమీద ఒకరికి ఉన్న మోజులో అది చిన్న విషయంగా కనపడుతుంది. ఎప్పుడైతే ఇరువురి మధ్య గొడవలొస్తోయే అప్పుడే ప్రతి విషయం పెద్ద పెద్ద సమస్యలుగా కనిపిస్తాయి. ఒక్కటి మాత్రం గుర్తించుకోండి ఏ బంధంలో అయినా దాపరికాలు ఉండకూడదు. అప్పుడే ఆ బంధం స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంకొకటి ఇలాంటి (సహజీవనం)బంధాల వల్ల కచ్చితంగా మానసిక ప్రశాంతతకు దూరం అయ్యి మిమ్మల్ని మీరే కోల్పోతారు. సహజీవనం చేయాలనుకుంటే అవతలి వ్యక్తిపై పూర్తి నమ్మకం ఉందంటేనే సాగించండి. అది కూడా హద్దుల్లోనే మీ స్నేహితులు లేదా కుంటుంబ సభ్యులకు కూడా ఆ వ్యక్తి గురించి తెలియజేయండి. ఆ తర్వాత ఎప్పుడైనా ఆ రిలేషన్లో ఎలాంటి సమస్య వచ్చినా..మీ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు మొదట్లో మీకు మద్దతు ఇవ్వకపోయినా, కనీసం మనకు ముందుగా తెలియజేసింది కదా! అన్న ఫీల్తో మనసు మార్చుకుని మీకు సపోర్ట్ లేదా సాయం చేసే అవకాశం ఉంటుంది. పెళ్లి పీటల వరకు తీసుకువెళ్లగలం అనే నమ్మకం ఉంటే వాటి జోలికి వెళ్లండి. లేదంటే ఇంట్లో తల్లిదండ్రుల మాట విని వారు కుదిర్చిన పెళ్లి చేసుకోండి. ఎందులోనైనా సమస్యలు వస్తాయి. దీన్ని కాదనలేం. కానీ పెద్దల సమక్షంలో జరిగితే.. అన్యాయమైతే ఇంట్లో వాళ్లు ఆదుకుంటారు లేదా స్నేహితులైనా సాయం చేయగలుగుతారు. సమాజం నుంచి కూడా కొద్దోగొప్పో మద్దతు లభిస్తుంది. బహుజాగ్రత్తగా ఆలోచించి రిలేషన్స్ విషయంలో మంచిగా అడుగులు వేయండి. జీవితం గజిబిజి అయ్యి, నరకంగా మారదు. ఏదైనా మన చేతిలోనే ఉందనేది మరచిపోకండి. (చదవండి: పుట్టింటికి భారమై.. మెట్టింటికి దూరమై.. జీవితాన్ని యోగవంతం చేసుకుంది!) -
కోడలి గురించి 'సుధామూర్తి' మనసులో మాట - ఏం చెప్పిందంటే?
ప్రముఖ రచయిత్రి, విద్యావేత్త, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ 'సుధామార్తి' (Sudha Muthy) ఇటీవల తన కోడలు 'అపర్ణ కృష్ణన్' (Aparna Krishnan)తో ఎలా ఉంటుంది. కోడలి వల్ల ఏమైనా సమస్యలు ఉన్నాయా? అనే విషయాలను బయటపెట్టింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సూధామూర్తి కొడుకు రోహన్ మూర్తి మొదట్లో 'లక్ష్మీ వేణు'ను వివాహం చేసుకున్నాడు. కానీ వీరు ఎక్కువ రోజులు కలిసి ఉండలేక విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత రోహన్ 'అపర్ణ క్రష్ణన్' అనే యువతిని రెండో వివాహం చేసుకున్నాడు కొడుకు పెళ్లిని చాలా సింపుల్గా చేసినప్పటికీ.. కోడలిని మాత్రం బాగా చూసుకుంటుందని.. అపర్ణ క్రష్ణన్ గతంలో స్వయంగా వెల్లడించింది. తన అత్తగారి గురించి ఎవరైనా అడిగితే.. నాకు ఆమె రోల్ మోడల్ అని, అంతే కాకుండా ప్రతి అత్తకు రోల్ మోడల్ అని చెబుతానని చెప్పింది. సుధామూర్తిని తన కోడలితో సంబంధం ఎలా ఉంటుంది అని అడిగితే, ఏ సమస్య లేదని చెబుతూ.. ఒకరినొకరు అపార్థం చేసుకోవడానికి చాలా సమయం కావాలని. నేను ఎప్పుడూ నా పనిలో బిజీగా ఉంటాను, ఆమె పనిలో ఆమె బిజీగా ఉంటుంది. అపర్ణ చాలా మంచిది, సమర్థవంతమైందిని స్పష్టం చేసింది. ఇదీ చదవండి: సెలవు తీసుకోకుండా పనిచేస్తా.. దిగ్గజాలను భయపెడుతున్న కొత్త 'సీఈఓ' సుధా మూర్తి ఇటీవల యూట్యూబ్లో 'సుధా అమ్మ' పేరుతో పిల్లల కోసం ఓ కొత్త యానిమేషన్ సిరీస్ ప్రారంభించింది. ఈ సందర్భంగా సుధామూర్తి 'కంటెంట్ నాదే కానీ ఇది అపర్ణ బేబీ'ది అని చెప్పింది. ఈ సిరీస్ ప్రారంభించడానికి కోడలి ఆలోచనే కారణమని కూడా వెల్లడించింది. -
ప్రభాకర్రెడ్డిపై జరిగిన దాడితో నాకు సంబంధం లేదు
పాలమూరు: దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డిపై జరిగిన దాడితో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఈ విషయంలో తనపై బురదజల్లడం సరికాదని దుబ్బాక ఎమ్మెల్యే, బీజేపీ నేత రఘునందన్రావు అన్నారు. సోమవారం మహబూబ్నగర్ వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ప్రభాకర్రెడ్డిపై దాడి జరగడం దురదృష్టకరమని, దీన్ని ఖండిస్తున్నానని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ వారైనా ప్రచారం చేసుకోవచ్చన్నారు. ఈ ఘటనతో రఘునందన్రావుకు సంబంధం ఉందని ప్రచారం చేయడం సరికాదని పేర్కొన్నారు. 20 ఏళ్ల రాజకీయ జీవితంలో హింసకు ఎప్పుడూ పాల్పడలేదని, అలాంటి ఘటనలు ప్రోత్సహించే వ్యక్తిని తాను కాదన్నారు. దాడి చేసిన గటాని రాజు అనే వ్యక్తికి దళితబంధు రాలేదని ఉద్దేశంతోనే దాడి చేసినట్లు వార్తలు వస్తున్నాయని రఘునందన్రావు చెప్పారు. రాజు ఫేస్బుక్ ఖాతాను పరిశీలిస్తే అతను కాంగ్రెస్ నేతలతో ఉన్న ఫొటోలు, ఇతర వివరాలు లభ్యమవుతాయని, అతని దగ్గర ఓ చానల్ ఐడీ కార్డు కూడా దొరికిందని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని, ఎవరెంత బురద చల్లినా దుబ్బాకలో తన గెలుపు ఖాయం అని ధీమా వ్యక్తంచేశారు. సిద్దిపేట సీపీ కేసు పరిశీలించి, అతని ఇతర అకౌంట్లు పరిశీలించి మాట్లాడాలి కానీ, మీరే బీజేపీ సానుభూతిపరుడని అని చెప్పడం సరికాదన్నారు. సీపీ మాట్లాడిన మాటలతో బీజేపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని రఘునందన్రావు ఆందోళన చెందారు. పాలమూరు నుంచి నేరుగా ఆస్పత్రి దగ్గరకు వెళ్లి చికిత్స పొందుతున్న ప్రభాకర్రెడ్డిని పరామర్శిస్తానని చెప్పారు. -
ఎలాన్ మస్క్పై పిటిషన్.. ఆ రైట్స్ కల్పించాలంటున్న మాజీ భార్య!
ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్పై మాజీ భార్య గ్రిమ్స్ పిటిషన్ వేస్తూ శాన్ఫ్రాన్సిస్కోలోని సుపీరియర్ కోర్టుని ఆశ్రయించింది. ఇందులో తమ ముగ్గురి పిల్లల సంరక్షణను చూసుకోవాలని డిమాండ్ చేస్తూ దావా వేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కెనడాకు చెందిన మ్యుజిషియన్ గ్రిమ్స్తో ఎలాన్ మస్క్ 2018 నుంచి 2021 వరకు డేటింగ్ చేసాడు. ఈ ఇద్దరికీ ముగ్గురు పిల్లలున్నట్లు ఇటీవలే వెలుగులోకి వచ్చింది. మస్క్ బయోగ్రఫీ బుక్తో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 2021 నాటికి వీరు విడిపోయారు. అప్పటి వరకు వీరికి ఓ కొడుకు, కూతురు ఉన్న విషయం మాత్రమే చాలామందికి తెలుసు. కానీ వారిద్దరికీ మూడో బిడ్డ ఉన్నట్లు, అతని పేరు టెక్నో మెక్నానికస్ అని స్వయంగా ఎలన్ మస్క్ వెల్లడించాడు. ముగ్గురు పిల్లల్లో ఒకరిపై తనకు ఎటువంటి అధికారాలు లేవని మస్క్ ఆరోపిస్తున్నట్లు గ్రిమ్స్ తెలిపింది. అంతే కాకుండా అతన్ని చూడటానికి కూడా నన్ను అనుమతించడం లేదని, తనకు కూడా ప్యారంటల్ రైట్స్ కల్పించాలని కోరింది. మస్క్తో డేటింగ్ చేసిన రోజుల్ని మరిచిపోలేనని చెప్పింది. ఇదీ చదవండి: రెండు రోజుల్లో రూ. 345 కోట్లు.. టిమ్ కుక్ అంటే అట్లుంటది! నిజానికి ఎలాన్ మస్క్కు ముగ్గురు భార్యలు, 11 మంది పిల్లలు. ప్రస్తుతం ముగ్గురికి విడాకులిచ్చాడు. ప్రస్తుతం గ్రిమ్స్ వేసిన ఓపిటిషన్ మీద మస్క్ స్పందించలేదు. కాగా ఇటీవల మస్క్ టర్కీ అధ్యక్షుడు 'తయ్యిప్ ఎర్డోగాన్' అమెరికా పర్యటనకు వచ్చినప్పుడు మస్క్ అతనితో సమావేశమయ్యారు. ఆప్పుడు అతనితో తన కొడుకుని కూడా తీసుకెళ్లాడు. ఇది చూసి ఎర్డోగాన్ మీ భార్య ఎక్కడ అని ప్రశ్నించగా.. ఆమె శాన్ఫ్రాన్సిస్కోలోని ఉందని, ప్రస్తుతం విడిపోయామని తెలిపాడు. -
ఆ ఫీలింగ్స్ గురించి ఆడవారిని మాట్లాడనివ్వరు: బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్!
హారర్ వెబ్ సిరీస్ రాగిణి ఎంఎంఎస్: రిటర్న్స్ 2తో తన కెరీర్ ప్రారంభించిన బ్యూటీ దివ్య అగర్వాల్. పలు రియాలిటీ షోల్లో భామ బిగ్బాస్ ఓటీటీ సీజన్ -1 విన్నర్గా నిలిచింది. ప్రస్తుతం ఆమె కింక్(కిస్ ఇష్క్ ఎన్ కనెక్షన్స్) రియాలిటీ షో హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. అంతేకాకుండా సమాజంలో భార్య, భర్తల మధ్య రిలేషన్పై మాట్లాడింది. ఆమె హోస్ట్గా వ్యవహరిస్తున్న కింక్ షో గురించి ప్రస్తావించింది. (ఇది చదవండి: జవాన్ డైరెక్టర్పై నయన్ అసంతృప్తి.. కారణం అదేనా..!!) ఇంటర్వ్యూలో దివ్య మాట్లాడుతూ.. 'నా ప్రయాణం అద్భుతంగా సాగింది. వాస్తవానికి, నేను యుక్తవయస్సులో అమాయకంగా ఉన్నా. కానీ నా ఒరిజినాలిటీయే నన్ను ముందు నడిపిస్తుందని నమ్ముతున్నా. నేనెప్పుడూ కూడా అలా మాట్లాడటానికి భయపడను. భార్య, భర్తల మధ్య రిలేషన్ గురించి ఒపెన్గానే ఉంటాను. కానీ నాకు బాగా అర్థం చేసుకునే భర్త దొరికాడు.' అని చెప్పుకొచ్చింది. భార్య, భర్తల మధ్య రిలేషన్పై మాట్లాడుతూ.. 'మన సమాజంలో ఉన్న ఇబ్బంది ఏంటంటే మహిళలు తమ లైంగిక కోరికలను బయటకు చెప్పడాన్ని ప్రోత్సహించరు. ఎందుకంటే మన సమాజం ఇలాంటి వాటిపై మాట్లాడదు కూడా. ఈ అంశానికి సంబంధించి చాలా మందికి సందేహాలు ఉంటాయి. ఒక స్త్రీ తనకు, భర్తకు మధ్య ఏదో మిస్సయిందని భావించినప్పుడు.. తప్పనిసరిగా సాయం కోరుతుంది. భార్య భర్తల మధ్య సాన్నిహిత్యం, అనుకూలత మాత్రమే బంధానికి నిదర్శనం. మీరు మీ జీవితాంతం ఎవరితోనైనా ఉండాలని కోరుకుంటే ఇలాంటి సంభాషణలు చేయడం చాలా ముఖ్యం. అలాంటి పరిస్థితుల్లో తరచుగా తలెత్తే కమ్యూనికేషన్ గ్యాప్ను తగ్గించడానికి ఈ షో ద్వారా ప్రయత్నించడం నాకు సంతోషంగా ఉంది. ఇక్కడ భాగస్వాములిద్దరూ తమ భావాలను వ్యక్తపరచడం చాలా ముఖ్యం.' అని అన్నారు. (ఇది చదవండి: ఓటీటీలో ఎంట్రీ ఇచ్చేసిన హీరోయిన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) -
పెళ్లికి ముందు అలాంటి రిలేషన్ ఓకేనా?.. హీరోయిన్ కామెంట్స్ వైరల్!
కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫేమ్ తెచ్చుకున్న హీరోయిన్ అతుల్య. 2017లో కాదల్ కన్ కట్టుడే అనే తమిళ సినిమాతో కోలీవుడ్లోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ.. ఆ తర్వాత అదే ఏడాదిలోనే కథానాయకన్ చిత్రంలో నటించారు. అంతేకాకుండా కిరణ్ అబ్బవరం నటించిన మీటర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. సినిమాల్లోకి రాకముందు అతుల్య పలు షార్ట్ ఫిల్మ్స్లో నటించింది. ప్రస్తుతం కోలీవుడ్లో సినిమాలతో బిజీగా ఉన్న ముద్దుగుమ్మ ఏడాదికి మూడు నాలుగు సినిమాల్లో నటిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతుల్యకు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. అదేంటో తెలుసుకుందాం. (ఇది చదవండి: ఓ ఇంటివాడు కాబోతున్న మానస్.. హల్దీ వేడుకలు షురూ) ఇంటర్వ్యూలో పాల్గొన్న అతుల్య రవికి కన్యత్వంపై ప్రశ్న ఎదురైంది. వర్జినీటి కోల్పోవడానికి సరైన వయస్సు ఏదని మీరు అనుకుంటున్నారు? అని ప్రశ్నించారు. దీనికి ఆమె బదులిస్తూ.. 'ఈ విషయంలో నా అభిప్రాయం ప్రకారం 21 నుంచి 25 ఏళ్లు వయస్సు కరెక్ట్ అనిపిస్తోంది.' అని చెప్పింది. ఆ తర్వాత పెళ్లికి ముందు లైంగిక చర్యలో పాల్గొనడం సరైందేనా? లేక పెళ్లి తర్వాత మంచిదా? అని ప్రశ్నించగా.. దీనికి కూడా నటి సూటిగానే స్పందించింది. అతుల్య రవి మాట్లాడుతూ.. "నా అభిప్రాయం ప్రకారమైతే పెళ్లి తర్వాతే లైంగికపరమైన రిలేషన్షిప్ ఉత్తమం. ఇది మన ఆచార వ్యవహారాలు, సంస్కృతికి అద్దం పడుతోంది. అయితే ప్రస్తుతం లివ్ ఇన్ రిలేషన్ షిప్స్(సహజీవనం) వల్ల ఈ మధ్య కాలంలో చాలా మార్పులు వచ్చాయి. ఈ జనరేషన్లో రిలేషన్స్ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఒకరితో రిలేషన్లో ఉండడమనేది అది వారి వ్యక్తిగత నిర్ణయం. దీనిపై ఎవరికీ అధికారం లేదు. అయితే వివాహమే అన్నింటికంటే ఉత్తమమైన రిలేషన్ " అని అన్నారు. (ఇది చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న హిట్ మూవీ, మరో థ్రిల్లర్ సిరీస్ కూడా!) View this post on Instagram A post shared by Athulyaa Ravi (@athulyaofficial) -
నా భర్త సంసారానికి పనికిరాడు.. పెళ్లయి రెండేళ్లయినా..
కర్ణాటక: స్వలింగ సంపర్కానికి అలవాటుపడిన భర్తతో వేగలేనంటూ అతని భార్య పోలీస్స్టేషన్ మెట్లెక్కింది. బాధితురాలు నగరంలోని జ్ఞానభారతి పోలీస్స్టేషన్ పరిధిలో నివసిస్తోంది. ఫిర్యాదులో పేర్కొన్న మేరకు... 2020 ఆగస్టు 30 తేదీన మల్లత్తహళ్లి బాలాజీ లేఔట్కి చెందిన ఐటీ ఇంజినీరుతో ఆమెకు పెళ్లయింది. ఎంబీఏ చదివి న ఆమె పెళ్లికి ముందు, తరువాత రెండేళ్లు ఇన్ఫోసిస్లో ఉద్యోగం చేసింది. ఉద్యోగానికి వెళ్లరాదని అత్తమామ ఒత్తిడి చేయడంతో రాజీనామా చేసి ఇంట్లో కూర్చుంది. పెళ్లయి రెండేళ్లయినా ఇద్దరి మధ్య లైంగిక సంబంధం లేదు. సంతానం లేకపోవడం పట్ల ఇరుగుపొరుగు, బంధువులు ఆమెను ప్రశ్నించారు. భర్త తమ్మునికి పెళ్లయి ఏడాదిలో పిల్లలు పుట్టారు, మీకేమిటి సమస్య అని అడిగేవారు. దీనిపట్ల మహిళ భర్తతో చర్చించగా అతడు పట్టించుకోలేదు, కృత్రిమ గర్భధారణకు ప్రయత్నించగా అది విఫలమైంది. మొబైల్లో గుట్టు రట్టు భర్త మొబైల్ను పరిశీలించగా అందులో పురుషునితో శారీరక సంబంధం ఉన్న ఫోటోలు, వీడియోలు కనబడ్డాయి. దీనిపై ప్రశ్నించగా భర్త వేధింపులు మొదలుపెట్టాడు. భర్త స్వలింగ సంపర్కంతో విరక్తి చెందిన భార్య పుట్టింటికి చేరుకుంది. భర్త ఆమెకు నిత్యం ఫోన్ చేసి ఇలాంటి తప్పు చేయనని, ఇంటికి రావాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగాడు. పెద్దలు కూడా రాజీ యత్నాలు చేసినా గే తో సంసారం చేయలేనని ఆమె తేల్చిచెప్పింది. దీంతో వేధింపులు పెరిగిపోవడంతో బాధితురాలు భర్త, అత్తమామలపై జ్ఞానభారతి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. -
'రానా నాయుడు' బ్యూటీ రిలేషన్ కన్ఫర్మ్.. పెళ్లి అప్పుడే!
కొన్నాళ్ల ముందు 'రానా నాయుడు' వెబ్ సిరీస్ రిలీజైంది. ఇందులో రానాని టెంప్ట్ చేసే పాత్రలో నటించిన ఓ అమ్మాయి.. బాగా హైలెట్ అయింది. ఈమెని ఇంతకుముందు ఎక్కడో చూశామే అని తెలుగు ప్రేక్షకులు అనుకున్నారు. అవును ఓ పదేళ్ల క్రితం కిస్, జోరు, అసుర తదితర సినిమాలు చేసిన ప్రియా బెనర్జీకి ఇక్కడ పెద్దగా కలిసి రాలేదు. దీంతో బాలీవుడ్కి చెక్కేసింది. ప్రస్తుతం ఓటీటీల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ భామ.. ఓ యంగ్ హీరోతో లవ్ కన్ఫర్మ్ చేసింది. (ఇదీ చదవండి: ఓటీటీల్లోకి ఈ శుక్రవారం 18 మూవీస్) మూడేళ్లుగా కలిసే 'ప్రతీక్ నేను గత మూడేళ్లుగా కలిసున్నాం. మా బంధంపై పెద్దగా డిస్కషన్ జరగకూడదని.. రిలేషన్ గురించి బయటకు చెప్పలేదు. ఈ ఏడాది ప్రేమికుల దినోత్సవం రోజున అఫీషియల్గా మా లవ్ని ప్రకటించాం. మాకు అనవసరమైన ప్రచారం అక్కర్లేదని భావించి ఇన్నాళ్లు ఊరుకున్నాం. ప్రతీక్ నేను ప్రస్తుతం కెరీర్పై దృష్టి పెట్టాం. తనకు పనిమీద ఫోకస్ ఎక్కువ. తానేంటో ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు' త్వరలో పెళ్లి 'రిలేషన్లో ఉన్నాం కదా మా పెళ్లి జరుగుతుంది. అయితే అది ఎప్పుడనేది మేం టైమ్ చూసుకుని ప్రకటిస్తాం. ప్రస్తుతానికైతే ప్రేమలో చాలా సీరియస్ గా ఉన్నాం. ఈ ఏడాది మాత్రం పెళ్లి చేసుకోం' అని నటి ప్రియా బెనర్జీ చెప్పుకొచ్చింది. పలు సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ తరహా పాత్రలు చేస్తున్న ప్రతీక్.. గతంలో హీరోయిన్ అమీ జాకన్స్తో డేటింగ్ చేసినట్లు టాక్. 2019లో సన్యా సాగర్ అనే నిర్మాతని పెళ్లి చేసుకున్నాడు కానీ ఏడాదిలోనే విడిపోయారు. View this post on Instagram A post shared by prateik patil babbar (@_prat) (ఇదీ చదవండి: 'జైలర్'.. ఆ హాలీవుడ్ సినిమాకు కాపీనా?) -
బంధం నిలబడాలంటే అదొక్కటే సరిపోదు!
సునీత, సురేష్ అందమైన జంట.. వాళ్లకొక పాప. ఇద్దరూ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. వారాంతంలో పార్టీలు, నెలకోసారి విహారయాత్రలు, ఏడాదికోసారి విదేశీ యాత్రలు.. అంతా బాగానే ఉంది. కానీ నెలకో, రెణ్నెల్లకో గొడవ గ్యారంటీ. కారణాలు చాలా చిన్నవి..గొడవలు మాత్రం పెద్దవి. చివరకు విడిపోదామని నిర్ణయించుకున్నారు. లాయర్నూ సంప్రదించారు. చివర్లో మిత్రుడి సలహా మేరకు మ్యారిటల్ కౌన్సెలింగ్కు వచ్చారు. సునీత, సురేష్లతో రెండు గంటలపాటు మాట్లాడాక.. వారి మధ్య శారీరక సాన్నిహిత్యం తప్ప మరెలాంటి బంధమూ లేదని అర్థమైంది. సునీత శాలరీ ఎంతో కూడా సురేష్కు తెలియదు. అడిగినా చెప్పదు. అది నీకు సంబంధంలేని విషయం అంటుంది. ఏ మాటంటే సురేష్కు కోపం వస్తుందో సునీతకు తెలియదు. ఏం చేస్తే సునీత సంతోషపడుతుందో సురేష్కు తెలియదు. పగలు ఎన్ని గొడవలున్నా.. రాత్రికి ఒకటైతే.. అన్ని గొడవలూ సర్దుకుంటాయని వారు బలంగా భావిస్తున్నారు. కానీ బంధం బలపడటానికి, నిలబడటానికి ఇతర సాన్నిహిత్యాలు కూడా అవసరమని వారికి తెలియదు. అందువల్ల వారెలాంటి ప్రయత్నమూ చేయడం లేదు. ఫలితమే చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు.. తిట్టుకోవడాలు.. కొట్టుకోవడాలు.. విడాకుల ప్రయత్నాలు. జీవితంలో మనకు స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులు.. ఇలా అనేక మందితో సాన్నిహిత్యం లేదా ఆత్మీయత ఉంటుంది. వైవాహిక బంధంలో ఇది మరింత అవసరం. అయితే సాన్నిహిత్యం అనగానే చాలామంది సునీత, సురేష్లలా శారీరక సాన్నిహిత్యం గురించి మాత్రమే ఆలోచిస్తారు. కానీ బంధాలు బలపడాలంటే ఇతర సాన్నిహిత్యాలు కూడా అవసరం. అవేంటో ఈరోజు తెలుసుకుందాం. శారీరక సాన్నిహిత్యం: చేయి పట్టుకోవడం, ముద్దులు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం, తాకడం.. శారీరక సాన్నిహిత్యానికి ఉదాహరణలు. అయితే దీన్ని బహిరంగంగా ప్రదర్శించడం కొందరికి ఇబ్బందిగా అనిపిస్తుంది. సురేష్కు కూడా. భావోద్వేగ సాన్నిహిత్యం: భవిష్యత్తులో దంపతులిద్దరూ ఏం కోరుకుంటున్నారు, మీరు ఆందోళన చెందుతున్న విషయాలు, పని ఒత్తిడితో కూడిన సంఘటనల గురించి మాట్లాడుకోవడం ఎమోషనల్ ఇంటిమసీకి ఉదాహరణలు. సునీత, సురేష్ల మధ్య ఇది శూన్యం. మేధా సాన్నిహిత్యం: చదివిన పుస్తకం గురించి మాట్లాడటం, ఆలోచనలు, అనుభవాలు, ప్రశ్నలు పంచుకోవడం లాంటివి ఇంటలెక్చువల్ ఇంటిమసీకి ఉదాహరణలు. సురేష్కు నాన్ ఫిక్షన్ ఇష్టమైతే, సునీతకు ఫిక్షన్ అంటే ప్రాణం. అనుభవ సాన్నిహిత్యం: ఆరోగ్యకరమైన సంబంధాల్లో కలసి పంచుకునే అనుభవాలు ముఖ్యం. కలసి సమయాన్ని గడపడం, పనులు చేసుకోవడం వంటివి ఎక్స్పీరియెన్షియల్ ఇంటిమసీకి ఉదాహరణలు. సురేష్, సునీతల మధ్య ఇది ఫర్వాలేదు. ఆధ్యాత్మిక సాన్నిహిత్యం: విలువలు, విశ్వాసాలు, మతపరమైన ఆచారాలలో పాల్గొనడం, ఆధ్యాత్మిక విషయాలను జీవిత భాగస్వామితో చర్చించడం స్పిరిచ్యువల్ ఇంటిమసీ. సునీత భక్తురాలు. సురేష్ నాస్తికుడు. నిరంతరం ప్రయత్నించాలి.. ఎంతకాలం కలసి ఉన్నా, సాన్నిహిత్యాన్ని ఎప్పటికప్పుడు పెంచుకోవడం అవసరం. సునీత, సురేష్లకు వారి మధ్య విభేదాలను వివరించడంతో పాటు, వారి సాన్నిహిత్యాన్ని పెంచుకోవడానికి కౌన్సెలింగ్ చేశాను. అలాగే మీ జీవితంలో సాన్నిహిత్యాలను బలోపేతం చేయడానికి కొన్ని సులువైన మార్గాలున్నాయి. శారీరక సాన్నిహిత్యమంటే కేవలం సెక్స్ మాత్రమే కాదు. ఇద్దరూ ఇష్టాయిష్టాలను పంచుకోవడం, చేతులు పట్టుకోవడం, కౌగిలించుకోవడం శారీరక సాన్నిహిత్యాన్ని పెంపొందిస్తాయి· భాగస్వామి చెప్పే మాటలు వినడానికి, భావాలను పంచుకోవడానికి ప్రతిరోజూ కొంత సమాయాన్ని కేటాయించడం భావోద్వేగ సాన్నిహిత్యాన్ని పెంచుతుంది· భోజనం చేస్తున్నప్పుడు లేదా జీవిత భాగస్వామితో కలసి ప్రదర్శనను చూస్తున్నప్పుడు మొబైల్ ఫోన్, గాడ్జెట్స్ను దూరంగా పెట్టండి · ఇద్దరూ కలసి కొత్త విషయాలను ఆస్వాదించడం సరదాగా ఉంటుంది. అందుకే ఇద్దరూ వెళ్లని ప్రదేశానికి ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి· కొత్త విషయాల గురించి మాట్లాడుకోవడం, ఆర్టికల్స్ పంచుకోవడం మేధో సాన్నిహిత్యాన్ని పెంపొందిస్తుంది· భాగస్వామి నమ్మకాల మేరకు ఆధ్యాత్మిక సందర్శనలు ప్లాన్ చేసుకోవాలి. ఆత్మీయతకు ఆటంకాలు ప్రతి బంధంలోనూ విభేదాలు, హెచ్చు తగ్గులు ఉంటాయి. వాటిని అర్థం చేసుకుని ఆనందించాలి. కానీ కొన్ని అడ్డంకులు ఇంటిమసీని దెబ్బతీస్తాయి. వాటిని గుర్తించి సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అవేంటో తెలుసుకుందాం. కోపం, చిరాకు, అపనమ్మకంతో భాగస్వామితో నిత్యం వాదిస్తూ ఉంటే అది ఇద్దరిమధ్య ఆత్మీయతను దెబ్బతీస్తుంది పని, అనారోగ్యం, ఆర్థిక, పిల్లలు, ఇతర సమస్యల వల్ల కలిసి ఒత్తిడి కూడా దంపతుల సాన్నిహిత్యాన్ని దూరం చేస్తుంది · భాగస్వామితో మాట్లాడటం, వారు చెప్పేది వినడం ఆత్మీయత పెంపొం దించడానికి అవసరం. మీరు మీ భావాలను, అవసరాలను సరిగా వ్యక్తీకరించలేకపోతే అది సాన్నిహిత్యంపై ప్రభావం చూపుతుంది· కొన్నిసార్లు, కొంతమంది గత అనుభవాలు, గాయాల వల్ల భాగస్వామితో సన్నిహితంగా ఉండటానికి భయపడతారు. దీన్నే ఫియర్ ఆఫ్ ఇంటిమసీ అంటారు. సునీతలో ఇది కనిపించింది. (చదవండి: ఈ సరస్సు ఎంత ప్రమాదకరమంటే.. ఒడ్డున నిలుచున్న ప్రమాదమే..!) -
చికిత్స కోసం వచ్చిన బాధితునితో నర్సు రిలేషన్.. ఆసుపత్రి బయట కూడా!
ఆ విషయం తెలియగానే ఆసుపత్రి యాజమాన్యంలో కలకలం చెలరేగింది. పోలీసులు ఆ నర్సుపై కేసు నమోదు చేయడంతో, యాజమాన్యం ఆమెను ఉద్యోగం నుంచి తొలగించింది. దర్యాప్తులో ఆమె ఆ బాధితుడు డయాలసిస్ కోసం వస్తుంటాడని చెప్పింది. ఆసుపత్రి యాజమాన్యం కంటపడకుండా.. చికిత్స కోసం వచ్చిన బాధితునితో ఒక నర్సు రిలేషన్షిప్ పెట్టుకుంది. ఆసుపత్రి బయట కూడా ఆ బాధితుడిని కలుస్తూ వచ్చింది. ఈ వ్యవహారం ఆసుపత్రి యాజమాన్యం కంటపడకుండా గుట్టుగా సాగింది. అయితే ఒక రోజు ఆ బాధితుడు చికిత్సలో నిర్లక్ష్యం కారణంగా కన్నుమూశాడు. అతనికి హార్ట్ ఎటాక్ వచ్చింది. విషయం పోలీసుల వరకూ చేరింది. పోలీసులు ఆ నర్సుపై కేసు నమోదు చేశారు. సోషల్ మీడియా సాయంతో.. డెయిలీ స్టార్ రిపోర్టులోని కథనం ప్రకారం ఈ ఉదంతం ఇంగ్లాండ్లో చోటుచేసుకుంది. పెనెలోప్ విలియం అనే మహిళ 2019 నుంచి నేషనల్ హెల్త్ సర్వీస్లో నర్సుగా పనిచేస్తోంది.ఈ నేపధ్యంలో ఆమెకు ఒక పేషెంట్తో సంబంధం ఏర్పడింది. వారు రహస్యంగా కాల్ చేసుకోవడం, కలుసుకోవడం చేస్తూ వచ్చారు. సోషల్ మీడియా సాయంతో ఇద్దరూ చాటింగ్ చేసుకునేవారు. ఆసుపత్రి బయట తరచూ కలుసుకునేవారు. అయితే ఒక రోజు అనుకోని ప్రమాదం చోటుచేసుకుంది. కారులో వారిద్దరూ రహస్యంగా కలుసుకున్న సమయంలో ఆ పేషెంట్కు గుండెపోటు వచ్చింది. సహోద్యోగికి ఫోను చేసి.. వెంటనే పెనెలోప్ అంబులెన్స్కు కాల్ చేసింది. ఇంతలో వారుంటున్న కారులోనే ఆ బాధితుడు మృతి చెందాడు. అయితే పెనెలోప్ తన సహోద్యోగినికి ఫోను చేసి, సీపీఆర్ అందించేందుకు పిలిచింది. అయితే అప్పటికే సమయం మించిపోయింది. విషయం ఆసుపత్రివర్గాలకు తెలియగానే కలకలం చెలరేగింది. ఈ ఉదంతంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆసుపత్రి యాజమాన్యం పెనెలోప్ను విధుల నుంచి తొలగించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా ఆమెను ప్రశ్నించగా, అతను ఆరోజు డయాలసిస్ కోసం ఆసుపత్రికి వచ్చాడని తెలిపింది. అయితే ఆమె ఫేస్బుక్లోని ఒక మెసేజ్లో అతనికి చెస్ట్ పెయిన్ వచ్చినట్లు ఉంది. దీంతో పెనెలోప్ అబద్దం చెబుతున్నదని యాజమాన్యానికి స్పష్టమైంది. ఉద్దేశ పూర్వకంగానే పిలిచిందంటూ.. ఆమె అతనికి ఫోను చేసి, ఉద్దేశ పూర్వకంగానే పిలిచిందని దర్యాప్తులో తేలింది. అతను రాగానే వారిద్దరూ కారులో సరససల్లాపాల్లో తేలారు. సరిగ్గా అదే సమయంలో ఆ బాధితునికి గుండెపోటు వచ్చి, మృతి చెందాడు. ఆ నర్సు, బాధితునికి మధ్య గత రెండేళ్లుగా ఈ ఎఫైర్ ఉందని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు ఆ బాధితుని పేరు వెల్లడించలేదు. ఈ విషయమై ఆసుపత్రి దర్యాప్తు కమిటీ సభ్యుడు ఒకరు మాట్లాడుతూ పెనెలోప్ విలియమ్స్ ఆ బాధితునితో తనకు ఎటువంటి సంబంధం లేదని, బాధితునికి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి, మృతి చెందాడని తెలిపిందన్నారు. ఇది కూడా చదవండి: తండ్రి మృతుని తట్టుకోలేని చిన్నారి.. సమాధి దగ్గరకు వెళ్లి.. -
ప్రేమలో ప్రతిసారీ నేనే మోసపోయాను: యంగ్ హీరోయిన్
దాదాపు హీరోయిన్లు ఎవరైనా సరే తమ జీవితంలోని ప్రేమ, రిలేషన్షిప్ గురించి మాట్లాడటానికి పెద్దగా ఇష్టపడరు. కొన్నిసార్లు మాత్రం సందర్భాన్ని బట్టి బయటపడుతుంటారు. అలా ఇప్పుడు బాలీవుడ్ నటి షెహనాజ్ గిల్.. తన ప్రేమ, బ్రేకప్స్ గురించి రివీల్ చేసింది. తను ఎవరినీ మోసం చేయలేదని, ప్రతిసారీ తనే మోసపోయాననే విషయాన్ని బయటపెట్టింది. పంజాబీ నటి అయిన షెహనాజ్ గిల్.. సొంత భాషలో పలు సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ శుక్లాతో రిలేషన్లో ఉంది. బిగ్బాస్లో ఈ జోడీ అప్పట్లో చాలా పాపులర్. కానీ సిద్ధార్థ్ అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో చనిపోయాడు. దీంతో షెహనాజ్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. కొన్నాళ్లకు కుదుటపడి సినిమాలు, ఆల్బమ్ సాంగ్స్ చేస్తూ కాస్త బిజీగా ఉంది. తాజాగా షెహనాజ్ నటించిన ఓ ఆల్బమ్ సాంగ్ విడుదలైంది. ఈ సందర్భంగానే తన బ్రేకప్స్ గురించి మాట్లాడింది. 'నేను ఎవరినీ ప్రేమ విషయమై మోసం చేయలేదు. కానీ నన్నే చాలాసార్లు మోసం చేశారు. ఈ రోజుల్లో నేను నమ్మేది ఒక్కటే. బ్రేకప్ చెప్పి, దూరంగా వెళ్లిపోవాలనుకుంటే వెళ్లిపోండి' అని నటి షెహనాజ్ గిల్ ఆవేదన వ్యక్తం చేసింది. అయితే తాను పూర్తిగా రిలేషన్షిప్కు దూరం కాలేదని, నిజమైన ప్రేమ దొరికితే మాత్రం అస్సలు విడిచిపెట్టనని క్లారిటీ ఇచ్చింది. (ఇదీ చదవండి: మహేశ్నే మించిపోయిన సితార.. ఆ ఒక్క విషయంలో) -
బాలీవుడ్ నటుడితో ప్రేమ.. ట్రెండింగ్లో తమన్నా.. (ఫొటోలు)
-
వావివరుసలు మరచిన వదిన,మరిది..చివరికి జరిగిందిదే!
రాజస్థాన్లో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. తనకన్నా 8 ఏళ్లు చిన్నవాడైన మరిదిపై వదిన మనసు పారేసుకుంది. కొన్ని రోజులుగా తనను పెళ్లిచేసుకోవాలంటూ అతనిపై ఒత్తిడి తీసుకువచ్చింది. ఫలితంగా ఊహించని పరిణామం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే రాజస్థాన్లోని భీల్వాడాలో ఒక మహిళ హత్య కేసును పోలీసులు చేధించారు. ఈ కేసులో వదినతో అక్రమ సంబంధం పెట్టుకున్న మరిదిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ వదినతో ఇతనికి సంబంధం ఏర్పడిన దరిమిలా ఆమె అతనిని వివాహం కోసం ఒత్తిడి చేసింది. ఈ నేపధ్యంలో ఆమె పోరుపడలేని మరిది ఆమెను హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతురాలు రాయ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మదన్పురా గ్రామంలో తన అత్త కూతురి వివాహానికి హాజరయ్యింది. అయితే మే 23న ఉన్నట్టుండి ఆమె మాయమయ్యింది. అయితే మర్నాడు రోడ్డు పక్కన పొదల్లో ఆమె మృతదేహం కనిపించింది. ఈ ఉదంతం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తమ దర్యాప్తులో ప్రాధమికంగా ఆమె నుంచి నగలు లాక్కొని ఎవరో హత్య చేశారని భావించారు. అయితే వీరి దర్యాప్తు ముమ్మరమైన తరుణంలో పలు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి. మృతురాలు నైనా కన్వర్కు ఇద్దరు పిల్లలు ఉన్నారని, భర్త ముంబైలో ఉద్యోగం చేస్తున్నాడని తెలిసింది. పోలీసు అధికారి కన్నయ్యాలాల్ మాట్లాడుతూ మే 24న మదన్పురా గ్రామశివారులోని పొదల్లో 28 ఏళ్ల వివాహిత మృతదేహం రక్తపు మడుగులో కనిపించిందన్నారు. ఆమెపై దాడిచేసి, గొంతునులిమి హత్య చేశారన్నారు. వెంటనే మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించామన్నారు. అయితే పోలీసుల దర్యాప్తులో మృతురాలు మే 23న రాత్రి పోనులో ఎవరితోనో మాట్లాడుతూ ఇంటి నుంచి బయటకు వెళ్లిందన్నారు. ఉదయానికి కూడా ఆమె తిరిగిరాలేదన్నారు. పోను కాల్ డిటైల్స్ ఆధారంగా పోలీసులు ఆ మహిళ మరిదిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారన్నారు. కాగా నైనా భర్త ముంబైలో ఉంటుండగా, వారి ఇద్దరు పిల్లలు చదువుల కోసం ననిహాల్లో ఉంటున్నారు. ఈ సమయంలో ఆమెకు మరిదితో సాన్నిహిత్యం ఏర్పడింది. మూడేళ్లుగా వారి సంబంధం కొనసాగుతూనే ఉంది. నైనా మరిది దీపక్ ఆమెన్నా 8 ఏళ్లు చిన్నవాడు. అయినా ఆమె చాలాకాలంగా తనను పెళ్లిచేసుకోవాలంటూ దీపక్ను అడుగుతూ వస్తోంది. ఈ విషయమై మే 23న రాత్రి వీరిద్దరి మధ్య వివాదం జరిగింది. ఈ నేపధ్యంలో దీపక్ ఆమపై దాడి చేసి, గొంతు నులిమి హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని పొదల్లో పారేసి అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు దీపక్ను అరెస్టు చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆస్తి కోసమే పవిత్రా లోకేష్ నరేష్తో ప్రేమాయణం నడుపుతుందా? ఆమె చెప్పిందిదే..
టాలీవుడ్లో నరేష్, పవిత్రా లోకేష్ ఎంత ఫేమస్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో ఈ జంట గురించి పలు ట్రోల్స్, మీమ్స్ వచ్చినా సరే డోంట్ కేర్ అంటూ ఇద్దరూ కలిసే ఉంటున్నారు,త్వరలోనే తమ బంధాన్ని పెళ్లిగా మార్చుకుంటామని ప్రకటించారు. అయితే ఇప్పటికే మూడు పెళ్లిళ్లు పెటాకులు చేసుకున్న నరేష్తో పవిత్రా లోకేశ్ కేవలం డబ్బు కోసమే కలిసుంటుందని, అందుకే ప్రేమాయణం సాగిస్తుందంటూ రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. తాజాగా నరేష్ తన ఆస్తుల గురించి క్లారిటీ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'అవును, నేను బిలినియర్ని. నాకు వెయ్యికోట్ల కంటే ఎక్కువగానే ఆస్తి ఉంది. అందులో వారసత్వంగా వచ్చింది కొంత ఉంటే, నేను కష్టపడి సంపాదించుకుంది కూడా ఉంది. భూముల ధరలు బాగా పెరగడంతో నా ఆస్తుల విలువ రూ. 1000కోట్లు కాదు అంతకు మించి కూడా ఉండొచ్చు. నేనెప్పుడూ ఆ లెక్క చూసుకోలేదు. అందులో బ్లాక్ మనీ లేదు. మొత్తం వైట్ మనీనే. ఎక్కడైనా, ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. చాలా గౌరవప్రదంగా నేను నా రాజ్యాన్ని స్థాపించుకున్నాను. నేను నమ్మేది ఒక్కటే.. దేవుడు ఇచ్చిన దాంట్లో మనం సంతోషంగా ఉండాలి. చుట్టూ ఉన్న వాళ్లని సంతోషంగా చూసుకోవాలి. ఇక నా డబ్బు చూసి పవిత్ర నాతో ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి నాతో డబ్బు లేదని వెళ్లిపోయినవాళ్లు ఉన్నారు. ఆస్తి కోసమే నా జీవితంలో వచ్చినవాళ్లూ ఉన్నారు.. కానీ మాది పవిత్రబంధం' అంటూ చెప్పుకొచ్చారు. ఇక నరేష్తో రిలేషన్పై పవిత్ర కూడా.. 'అసలు ఆయన బ్యాక్గ్రౌండ్ గురించి చాలారోజుల వరకు నాకు తెలియదు. ఇప్పటికే మాకు పెళ్లి అయిపోయిందనే ఫీలింగ్ ఉంది. ఆయన నన్ను కాకుండా ఇంకెవరినీ చూడరు. చివరి వరకు మా బంధం ఇలాగే నిలుస్తుంది' అంటూ పేర్కొన్నారు. -
మా బంధానికి మహేశ్ ఫ్యామిలీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు : నరేష్
సీనియర్ నటుడు వీకే నరేశ్, పవిత్రా లోకేశ్ ప్రేమాయణం గురించి అందరికి తెలిసిందే. కొన్నాళ్లుగా వీరి వ్యవహారం టాలీవుడ్లోనే కాదు, సోషల్ మీడియాలోనూ హాట్టాపిక్గా మారింది. ఇప్పటికే నరేష్కు మూడు పెళ్లిళ్లు అయ్యాయి. దీనికి తోడు పవిత్రతో సుమారు 20 ఏళ్ల తేడా ఉంటుంది. మొన్నటిదాకా మేం స్నేహితులమే అని చెప్పిన నరేష్-పవిత్రా లోకేశ్ ఇప్పుడు మాత్రం త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చారు. పైకి మాత్రం అది మా స్టోరీ కాదంటూనే వారి నిజజీవితంలో జరిగిన సంఘటను ఆధారంగా చేసుకొని 'మళ్లీ పెళ్లి' అనే సినిమాను రూపొందించారు. ట్రైలర్తో సినిమాపై అంచనాలను పెంచేసిన నరేష్-పవిత్ర ప్రమోషన్స్ కోసంరెచ్చిపోయారు. ఆకాశం విరిగిపడినా.. భూమి బద్దలైనా మేమిద్దరం కలిసే ఉంటాం అంటూ స్టేట్మెంట్లు ఇచ్చేశారు. ఈనెల 26న సినిమా రిలీజ్ కానుండటంతో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సోషల్ మీడియాకు కావాల్సినంత కంటెంట్,పుటేజీ ఇచ్చేస్తున్నారు. తాజాగా ఓ యాంకర్.. మీ ప్రేమని మహేశ్ బాబు కుటుంబం ఒప్పుకుందా అని నరేష్ని అడగ్గా.. తమ బంధం గురించి మహేశ్బాబుతో పాటు కృష్ణగారికి ముందే తెలుసని పేర్కొన్నారు. 'కృష్ణ గారు, విజయ నిర్మల గారు, మహేశ్ కుటుంబం మేమంతా ఒక్కటే. మేం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అందరం కలిసే తీసుకుంటాం. మా రిలేషన్ గురించి వాళ్లకు ఎప్పట్నుంచో తెలుసు. ఫ్యామిలీ నుంచి మాకు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం కాలేదు. మా ప్రేమని ఇంట్లో అందరూ ఒప్పుకున్నారు. మహేశ్కు పవిత్ర అంటే కూడా గౌరవం. ఆమె వంటను కూడా ఎంతో ఇష్టపడతారు' అంటూ నరేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి. -
నవ్యస్వామితో డేటింగ్పై క్లారిటీ ఇచ్చిన 'విరూపాక్ష' నటుడు
బుల్లితెర నటుడు రవికృష్ణ-నవ్య స్వామి జోడీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓ సీరియల్లో జంటగా నటించిన వీరిద్దరు అప్పట్నుంచి ఎక్కడ చూసిన జంటగా కనిపిస్తున్నారు. పలు ఎంటర్టైన్మెంట్ షోలకి జంటగా వెళ్తున్నారు. ఈ క్రమంలో వీరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. ఇద్దరూ ప్రేమలో ఉన్నారని అందుకే కలిసి ఇన్ని ప్రాజెక్టులు చేస్తున్నారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై అలాంటిదేమీ లేదు, మేం జస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఎప్పట్నుంచో సమాధానం ధాటేస్తున్న రవికృష్ణకు తాజాగా మరోసారి ఇలాంటి ప్రశ్నే ఎదురైంది. మీకు, నవ్యస్వామికి ఉన్న రిలేషన్ ఏంటని యాంకర్ ప్రశ్నించగా.. సీరియల్లోనే తాము మొదటిసారి కలుసుకున్నామని, అప్పట్నుంచి తమ మధ్య మంచి స్నేహం ఉందని తెలిపాడు. అయితే ఒకవేళ నవ్యస్వామి వచ్చి ప్రపోజ్ చేస్తే మాత్రం ఆలోచిస్తాను అంటూ ఆమెతో రిలేషన్షిప్పై ఇండైరెక్ట్ హింట్ ఇచ్చాడు. ప్రస్తుతం రవికృష్ణ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి. ఇక రీసెంట్గా విరూపాక్ష సినిమాలో రవికృష్ణ కీలక పాత్రలో కనిపించి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. -
ఆ జంటలు ఎందుకు విడిపోతున్నాయి?.. సమయం దొరకడం లేదా?
లలిత ఒక ఇండియన్ కంపెనీలో పనిచేస్తుండగా, ఆనంద్ ఒక అమెరికన్ కంపెనీలో పనిచేస్తున్నాడు. లలిత ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదారు గంటల వరకు పనిచేయాల్సి ఉండగా, ఆనంద్ పని సాయంత్రం ఆరుగంటలకు మొదలవుతుంది. ప్రస్తుతం ఇద్దరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా కనీసం మాట్లాడుకోవడానికి కూడా సమయం దొరకడం లేదు. దీనివల్ల వారి కుటుంబ జీవితం సజావుగా సాగడంలేదు. సత్యది చలాకీ మనస్తత్వం. ఎవరితోనైనా ఇట్టే అల్లుకుపోతుంది. మాట కలిపిందంటే ఆపదు. ఆమె భర్త కుమార్ భిన్న ధ్రువం. తన పని, పుస్తకాలు, సినిమాలతో గడిపేస్తుంటాడు. వంద మాటలకు ఒక్కమాటతో సమాధానం చెప్తాడు. దీంతో తన మాటలు వినడంలేదని సత్య.. వింటూనే ఉన్నా కదా, ఇంకేం చేయాలని కుమార్.. రోజూ గొడవ పడుతూనే ఉన్నారు. రష్మి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి. అమెరికాలో పనిచేసే అవకాశం రావడంతో వెళ్లేందుకు సిద్ధమైంది. అది ఆమె భర్త రాజేష్కి ఇష్టంలేదు. ఇద్దరం ఇక్కడే పనిచేసుకుంటూ ఉందామన్నాడు. తనకు వచ్చిన అవకాశాన్ని వదులుకోలేనని, తన కెరీర్కి అడ్డు రావద్దని తేల్చి చెప్పింది రష్మి. ఈ విషయమై మొదలైన వాగ్వాదం చిలికి చిలికి గాలివానై విడాకుల వరకూ వెళ్లింది. మారుతున్నకాలంతో పాటు ఉద్యోగాలూ మారుతున్నాయి. భిన్నమైన టైమింగ్స్, విభిన్నమైన వాతావరణాల్లో పని చేయాల్సి వస్తోంది. దీనివల్ల దంపతుల మధ్య సమస్యలు రావడంతో పాటు వారి శారీరక, మానసిక ఆరోగ్యాలపై ప్రభావం చూపుతున్నాయి. కొన్నిసార్లు అవి విడాకులకు దారితీస్తున్నాయి. ఇటీవల కాలంలో ఇలాంటి కేసుల సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలో వేర్వేరు టైమ్ జోన్స్లో పనిచేస్తున్న జంటలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని, వాటికి పరిష్కారాలు అన్వేషించాల్సిన అవసరం ఉంది. పనివేళల్లో తేడాల వల్ల వచ్చే సమస్యలు ♦వేర్వేరు పని షెడ్యూళ్ల కారణంగా జంటలు ఎదుర్కొనే ముఖ్యమైన సమస్యల్లో ఒకటి కలసి గడిపేందుకు సరిపడా సమయం లేకపోవడం. దీనివల్ల దంపతుల్లో ఒకరి పై ఒకరికి నిర్లక్ష్యభావం ఏర్పడుతుంది. ఇది ఆ బంధంలో ఒత్తిడిని పెంచుతుంది. విరుద్ధమైన పని షెడ్యూళ్లలో పనిచేసే జంటలు తామిద్దరూ మాట్లాడుకోవడానికి ఇద్దరికీ అనుకూలమైన సమయాన్ని సర్దుబాటు చేసుకోలేకపోవడం. ఇది సవాలుగా మారి ఆ దాంపత్యంలో అపార్థాలు, ఉద్రిక్తతలకు దారి తీస్తుంది. ఫలితంగా సంఘర్షణ, మానసిక క్షోభను అనుభవించాల్సి వస్తుంది. ఒక భాగస్వామికి పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువ పని ఒత్తిడి ఉన్న భాగస్వామే ఇంటి పనులను ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ఇది కోపానికి, వాగ్వావాదానికి కారణమవుతుంది. ∙ఒక భాగస్వామికి ఎక్కువ పని గంటలు.. అంతే ఎక్కువ పని ఒత్తిడీ ఉన్నప్పుడు ఆ అలసట, బర్న్ అవుట్.. భావోద్వేగ సమస్యలకు దారితీయవచ్చు. దీనివల్ల దంపతుల మధ్య మానసిక దూరం ఏర్పడుతుంది. వేర్వేరు పని షెడ్యూళ్లు మానసిక ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఆందోళన, నిరాశ, ఇతర మానసిక ఆరోగ్య సమస్యలతో సతమతమవ్వొచ్చు. అలాంటి సమస్యలున్న భాగస్వామికి మద్దతునివ్వడం మరొక భాగస్వామికి కష్టం కావచ్చు. ఇలా సర్దుబాటు చేసుకోవచ్చు ♦విభిన్నమైన పని షెడ్యూళ్లను నిర్వహించడంలో మొదటి, అతిముఖ్యమైన దశ.. మీ భాగస్వామితో నిజాయితీగా మీ ఆందోళనలు, అవసరాలు, అంచనాలను పంచుకోవడం. మీ భాగస్వామి అభిప్రాయాన్ని జాగ్రత్తగా వినడం. ♦మీ పని షెడ్యూళ్లు, బాధ్యతల చుట్టూ స్పష్టమైన సరిహద్దులను సెట్ చేసుకోండి. వీలైనంత వరకూ అవి ఇద్దరికీ అనుకూలంగా ఉండేలా అడ్జస్ట్ చేసుకోండి. ∙మీకెంత బిజీ షెడ్యూళ్లు ఉన్నప్పటికీ మీ పార్టనర్తో బంధానికి ప్రాధాన్యం ఇవ్వండి. ఇద్దరికీ సమయం కుదిరినప్పుడు మీ యాక్టివిటీస్ షెడ్యూల్ చేసుకోండి. అలా కుదరనప్పుడు మెసేజెస్, కాల్స్, ఇ మెయిల్స్ ద్వారా కనెక్ట్ అయ్యేలా చూసుకోండి. ♦మీ భాగస్వామి పని డిమాండ్లను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వారి అవసరాలకు అనుగుణంగా మీ సొంత షెడ్యూల్స్ను మార్చుకోవడానికీ సిద్ధంగా ఉండండి. అవసరమైతే ఇంట్లో అదనపు బాధ్యతలు తీసుకోండి. పిల్లలు ఉంటే, వీలైనంతవరకు వారిని మీ కార్యకలాపాల్లో కలుపుకోండి. ఇది మీరు కుటుంబంగా కలసి ఉండటంలో, జ్ఞాపకాలను క్రియేట్ చేయడంలో తోడ్పడుతుంది. మీ భాగస్వామితో కలసి చేయగల పనుల కోసం చూడండి. అది భాగస్వామి అభిరుచి, ఫిట్నెస్ రొటీన్ లేదా ఇష్టమైన టీవీ షో కూడా కావచ్చు. ♦అన్నింటికంటే ముఖ్యంగా మీకు తగినంత నిద్ర, వ్యాయామం, విశ్రాంతి, తదితర కార్యకలాపాల కోసం సమయాన్ని వెచ్చించండి. ∙ఇవన్నీ చేసినా మీ ఒత్తిడి, ఆందోళన తగ్గకపోతే ఏమాత్రం మొహమాటపడకుండా సైకాలజిస్ట్ని సంప్రదించండి. మీ ఇద్దరి మధ్య గొడవలు తగ్గకపోతే ఫ్యామిలీ కౌన్సెలింగ్ తీసుకోండి. చదవండి👉 ఐటీ ఉద్యోగులకు బంపరాఫర్.. డబుల్ శాలరీలను ఆఫర్ చేస్తున్న కంపెనీలు! -
ప్రభాస్ను అనుష్క ముద్దుగా ఏమని పిలుస్తుందో తెలుసా?
టాలీవుడ్లో ప్రభాస్-అనుష్కల జోడీకి సెపరేట్ ఫ్యాన్బేస్ ఉంది. ఆన్స్క్రీన్లోనే కాకుండా, ఆఫ్స్క్రీన్లోనూ వీరి కెమిస్ట్రీకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఇక ఎప్పటినుంచో ప్రభాస్-అనుష్కలు ప్రేమలో ఉన్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారనే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. చదవండి: 'విమానం'లో అనసూయ లుక్ అదిరిందిగా.. రంగమ్మత్తలా ఉందే! కానీ అందరూ అనుకున్నట్టు తమ మధ్య ఏమీ లేదని, కేవలం ఫ్రెండ్స్ అని అనుష్క, ప్రభాస్లో క్లారిటీ ఇచ్చినా ఫ్యాన్స్ మాత్రం వీళ్లు రియల్ లైఫ్ కపుల్ అయితే బాగుండని కోరుకుంటారు. ఇక తాజాగా మరోసారి ప్రభాస్-అనుష్కల రిలేషన్షిప్పై సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఏమైందంటే.. అనుష్క, నవీన్ పొలిశెట్టి జంటగా నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి టీజర్ రీసెంట్గా విడుదలైన సంగతి తెలిసిందే. దీన్ని ప్రభాస్ తన ఇన్స్టా స్టోరీలో షేర్ చేస్తూ.. టీజర్ చాలా బావుందంటూ ప్రశంసలు కురిపించాడు. దీనిపై అనుష్క స్పందిస్తూ.. థ్యాంక్యూ 'పప్సు' అంటూ కామెంట్ చేసింది. ఈ స్టోరీని స్క్రీన్ షాట్ చేసిన పలువురు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. చదవండి: వారికి ఇష్టమైనప్పుడు.. మనం ఏం చేయగలం: కంగనా -
తన రిలేషన్ షిప్ స్టేటస్ బయటపెట్టేసిన అఖిల్ అక్కినేని
అఖిల్ అక్కినేని నటిస్తున్న తాజా చిత్రం ఏజెంట్.సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినమా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. అఖిల్ కెరీర్లో తొలిసారి పాన్ ఇండియా చిత్రంగా వస్తుండటంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ జోరు పెంచారు మేకర్స్. ఇందులో భాగంగా తాజాగా కాకినాడలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను గ్రాండ్గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అఖిల్ మాట్లాడుతూ పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. కొంతకాలంగా అఖిల్ పెళ్లిపై పలు వార్తలు వస్తున్నాయి. తాజాగా పెళ్లెప్పుడు అని అభిమాని అడిగిన ప్రశ్నకు అఖిల్ సమాధానిమిస్తూ..“అప్పుడే పెళ్లి చేసుకోమంటారా?” అంటూ ఫన్నీగా బదులిచ్చాడు. ప్రస్తుతం సింగిల్గానే ఉన్నానంటూ తన రిలేషన్షిప్పై క్లారిటీ ఇచ్చాడు. -
త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్న రకుల్ ప్రీత్ సింగ్
నటి రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు యమ ఖుషీగా ఉన్నారు. ఈ ఉత్తరాది బ్యూటీ తొలుత కన్నడంలో ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత కెరటం చిత్రంతో టాలీవుడ్కు, తడయార తాక్క చిత్రంతో కోలీవుడ్కు పరిచయం అయ్యారు. తొలి రోజుల్లో సరైన సక్సెస్లు లేక నిరాశ పడినా ఆ తరువాత దక్షిణాదిలో వరుస విజయాలతో క్రేజీ కథానాయకిగా రాణిస్తున్నారు. ప్రస్తుతం పెద్ద క్రేజ్ లేకపోయినా హిందీ, తెలుగు, తమిళం భాషల్లో అవకాశాలు వస్తనే ఉన్నాయి. తమిళంలో శివకార్తికేయన్కు జంటగా నటిస్తున్న అయలాన్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం కమలహాసన్ సరసన ఇండియన్ 2 చిత్రంలో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే మూడు పదుల వయసు దాటిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు తన బాయ్ ఫ్రెండ్ బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ బద్నానితో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఇటీవలే తన బాయ్ ఫ్రెండ్ గురించి బహిరంగంగా వెల్లడించారు. అంతేకాదు బాయ్ ఫ్రెండ్తో చెట్టా పెట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఇటీవల తన పుట్టిన రోజును కూడా జాకీ బద్నానితో ఖుషీ ఖుషీగా జరుపుకున్నారు. ఆ ఫొటోలు సామాజిక వధ్యమాల్లో వైరల్ అయ్యాయి. తాజాగా తన బాయ్ ఫ్రెండ్తో కలిసి దిగిన ఫొటోను ఇన్ స్ట్రాగామ్లో పోస్ట్ చేసి తనకు శాంతా ఇచ్చిన గిఫ్ట్ జాకీ అని పేర్కొన్నారు. కాగా వచ్చే ఏడాది ఈ ప్రేమ జంట పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
బాయ్ఫ్రెండ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన శ్రుతిహాసన్
డూడుల్ ఆర్టిస్ట్ శంతనుతో తాను రిలేషన్లో ఉన్న విషయాన్ని శ్రుతీహాసన్ ఎప్పుడూ సీక్రెట్గా ఉంచలేదు. సోషల్ మీడియాలో అతనితో క్లోజ్గా ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ, కామెంట్లు పెడుతుంటారీ బ్యూటీ. తాజాగా శంతను వల్ల తనలో వచ్చిన మార్పు గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘‘నేను, శంతను బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరం కలిసి ఉంటాం. ఇద్దరం కలిసి కామెంట్లు చదువుతుంటాం. ఎందుకంటే ఆ కామెంట్స్ కామెడీగా ఉంటాయి. ఇక తన వల్ల నేను ప్రశాంతంగా మారిపోయాను. అలాగే దయగల వ్యక్తిగా వరాను. శంతను చాలా ప్రశాంతంగా, దయగా ఉంటాడు. అందుకే తనంటే నాకు ఇష్టం. ఈ రెండు లక్షణాలను నేను అలవాటు చేసుకున్నాను’’ అని ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు శ్రుతీహాసన్. ఇక సినివల విషయానికి వస్తే.. ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ చిత్రాలతో ఈ సంక్రాంతికి థియేటర్లలో కనిపించనున్నారు శ్రుతీహాసన్. ప్రస్తుతం ప్రభాస్ సరసన ‘సలార్’ చిత్రంలో నటిస్తున్నారు. -
హీరో సందీప్ కిషన్తో రెజీనా డేటింగ్? వైరల్గా మారిన పోస్ట్
తమిళసినిమా: ప్రస్తుతం వార్తల్లో ఉన్న నటి రెజీనా కసాండ్రా. ఈ చెన్నై అమ్మాయి బహుభాషా కథానాయికగా రాణిస్తోంది. తమిళంలో కండనాళ్ ముదల్ చిత్రంతో 2017లో కథానాయకిగా పరిచయమైంది. మొదటి చిత్రంతోనే మంచి పేరు తెచ్చుకున్న రెజీనా కేడి బిల్లా కిలాడి రంగ చిత్రంతో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఆ తర్వాత టాలీవుడ్కు పరిచయమైంది. తమిళంలో కంటే తెలుగులోనే ఈ బ్యూటీ ఎక్కువ చిత్రాలు చేయడం, కథానాయకిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడం విశేషం. అదేవిధంగా ఈ 32 ఏళ్ల అమ్మాయి ఇప్పటికి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాలర్గానే ఉంది. అయితే ఈ అమ్మడి ప్రేమ గురిం రకరకాలుగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఆ మధ్య ఒక టాలీవుడ్ యువ నటుడి ప్రేమలో గాఢంగా మునిగిపోయిందని ప్రచారం హోరెత్తింది. తాజాగా మరో యువ నటుడితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిందని ప్రచారం జరుగుతోంది. ఈ బ్యూటీ ఇటీవల తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంది. ఆ సందర్భంగా నటుడు సందీప్ కిషన్ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేశారు. ఆయన ట్విట్టర్లో పుట్టినరోజు శుభాకాంక్షలు పాప. ఐ లవ్ యూ. ఎప్పుడూ నీకు మంచే జరగాలి అని ట్విట్టర్లో పేర్కొని నటి రెజీనాతో తను సన్నిహితంగా ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇలాంటి వార్తలపై నటి రెజీనా, సందీప్ కిషన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. Happpyyyy Birthdayyyy Papa… Love you and Wishing you only the best of everything,always ♥️ Stay Happy..Stay Blessed ♥️@ReginaCassandra pic.twitter.com/pZGd9d5ibn — Sundeep MICHAEL Kishan (@sundeepkishan) December 13, 2022 -
ప్రభాస్తో కృతి ప్రేమలో ఉందా? లీక్ చేసిన బాలీవుడ్ హీరో
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్-కృతిసనన్ డేటింగ్లో ఉన్నారంటూ కొంతకాలంగా వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆదిపురుష్ సినిమాలో జంటగా నటించిన వీరిద్దరు షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డట్లు ప్రచారం జరుగుతుంది. ఇక ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ను పెళ్లి చేసుకుంటా అని కృతి చెప్పడం ఈ రూమర్స్కి మరింత బలాన్ని చేకూర్చింది. తాజాగా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ సైతం ప్రభాస్-కృతిసనన్ల రిలేషన్షిప్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బేఢియా సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఓ రియాలిటీ షోకు వరుణ్, కృతిసనన్ గెస్టులుగా వెళ్లారు. ఈ క్రమంలో కృతి మనసులో ఎవరున్నారు అన్న ప్రశ్నకు వరుణ్ ధావన్ సమాధానమిస్తూ.. కృతి మనసులో ఒక హీరో ఉన్నాడు. అతను ఇప్పుడు ముంబైలో లేడు కానీ దీపికా పదుకోణెతో షూటింగ్లో ఉన్నాడు అంటూ హింట్ ఇచ్చేశాడు. ఇతడి మాటలకు కృతి కూడా సిగ్గుపుడతూ నవ్వేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కాగా గతంలో ఓ షోలో కృతి ప్రభాస్కు కాల్ చేయడం, ఆదిపరుష్ టీజర్ ప్రమోషన్స్లో ప్రభాస్తో క్లోజ్గా ఉండటం వంటివి చూసి వీళ్లిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ బీటౌన్లో జోరుగా టాక్ వినిపిస్తుంది. Whaaaaaaattt 😯😁🥰💖...... Joo meyy soch raha hoo, voo aap log bii?!😌😹🤔🤔. #KritiSanon #Prabhas𓃵 !! #ProjectK 🪐 pic.twitter.com/F3s91EyFwe — Jai Kiran💕Adipurush🏹 (@Kiran2Jai) November 27, 2022 -
జపాన్ కంపనీ నైడెక్తో హీరో ఎలక్ట్రిక్ జోడీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ మోటార్స్ తయారీలో ఉన్న జపాన్ దిగ్గజం నైడెక్ కార్పొరేషన్తో హీరో ఎలక్ట్రిక్ ప్రాధాన్య భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా హీరో తయారీ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల్లో నైడెక్ రూపొందించిన ఎలక్ట్రిక్ మోటార్స్ను వినియోగిస్తారు. 2023 ఫిబ్రవరిలో ఈ ఎలక్ట్రిక్ బైక్స్ మార్కెట్లోకి రానున్నాయి. ఎలక్ట్రిక్ టూ వీలర్స్కు కావాల్సిన మోటార్స్ను సంయుక్తంగా అభివృద్ధి చేసేందుకు నైడెక్తో రెండేళ్ల క్రితమే చేతులు కలిపినట్టు హీరో ఎలక్ట్రిక్ వెల్లడించింది. తమ సరఫరా గొలుసు సమస్యలను తగ్గించడంలో జపాన్ నైడెక్తో భాగస్వామ్యం తోడ్పడుతుందని, ఉత్పత్తుల శ్రేణిలో పవర్ట్రెయిన్ భాగాలను క్రమంగా అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుందని హీరో ఎలక్ట్రిక్సీఈవో సోహిందర్గిల్ అన్నారు. అలాగే భారతీయ పరిస్థితులకు తగినఆధునిక అధునాతన సాంకేతికతతో కూడిన హబ్ మోటార్ అభివృద్ధికి హీరో ఎలక్ట్రిక్తో భాగస్వామ్యం ఉపయోగపడనుందని నైడెక్ ప్రతినిధి సంతోషం వ్యక్తం చేశారు. -
సహజీవనం చేసి పెళ్లాడకుంటే...మోసగించినట్టు కాదు
బెంగళూరు: సహజీవనం చేసి పెళ్లాడకపోతే అది మోసగించడం కిందకు రాదని కర్నాటక హైకోర్టు పేర్కొంది. సదరు వ్యక్తిపై ఐపీసీ సెక్షన్ 420 కింద కేసు పెట్టలేమని న్యాయమూర్తి జస్టిస్ కె.నటరాజన్ స్పష్టం చేశారు. తన బోయ్ఫ్రెండ్ ఎనిమిదేళ్లు సహజీవనం చేసి చివరికి పెళ్లికి నిరాకరించాడంటూ ఓ మహిళ చేసిన ఫిర్యాదును కొట్టేస్తూ ఆయన తీర్పు వెలువరించారు. ఇద్దరి మధ్య ఉన్న సహజీవన ఒప్పందాన్ని అతను మోసపూరిత ఉద్దేశంతో ఉల్లంఘించాడని చెప్పలేమని ఈ సందర్భంగా న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఇంట్లోవాళ్లు ఇంకో అమ్మాయితో పెళ్లి కుదిర్చిన కారణంగా సహజీవనాన్ని వైవాహిక బంధంగా మార్చుకునేందుకు సదరు అబ్బాయి నిరాకరించాడు. -
49ఏళ్ల వయసులో నటుడితో మలైకా రెండో పెళ్లి!.. పోస్ట్ వైరల్
బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్, మలైకా అరోరా ప్రేమలో మునిగితేలుతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని వారు ఎప్పుడూ దాచలేదు. వెకేషన్స్, పార్టీ, ఫంక్షన్స్ ఇలా ప్రతీ వేడుకకు కలిసే హాజరవుతుంటారు. బీటౌన్లో మలైకా-అర్జున్ల జోడికి ప్రత్యేక స్థానం ఉంది. ఇక సినిమాల కంటే డేటింగ్ వార్తలతో టాక్ ఆఫ్ ది టౌన్గా మారిన ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అవుతున్నారట. ఈ మేరకు మలైకా తన ఇన్స్టాగ్రామ్లో ఓ ఫోటోను షేర్ చేస్తూ.. అవును నేను, అంగీకరించాను అంటూ లవ్ ఎమోజీని షేర్ చేసింది. దీంతో అర్జున్-మలైకాలు ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి డిసైడ్ అయ్యారంటూ బీటౌన్ మీడియా కోడై కూస్తుంది. మరి నిజంగానే వీళ్లు పెళ్లిపీటలు ఎక్కనున్నారా? లేదా ఏదైనా మూవీ ప్రమోషన్స్ కోసం చేసిన స్టంటా? అన్నది త్వరలోనే తేలనుంది. కాగా మలైకా ఆరోరాకు ఇదివరకే అర్భాజ్ ఖాన్తో పెళ్లయింది. 17ఏళ్ల వివాహ బంధం తర్వాత వీరు విడిపోయారు. ప్రస్తుతం మలైకా తనకంటే 12 ఏళ్లు చిన్నవాడైన అర్జున్ కపూర్తో ప్రేమలో ఉంది. View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) -
Gautham Karthik-Manjima Mohan: అవును మేము ప్రేమలో ఉన్నాం!
చిత్ర పరిశ్రమకు చెందిన హీరో హీరోయిన్లు ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం కొత్తేమీ కాదు. అలా తాజాగా కోలీవుడ్, మాలీవుడ్కు చెందిన మరో జంట ప్రేమలో పడ్డారు. ఆ జంటలో హీరో గౌతమ్ కార్తీక్. సీనియర్ నటుడు కార్తీక్ వారసుడు ఈయన. మణిరత్నం దర్శకత్వం వహించిన కడల్ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం అయిన గౌతమ్ కార్తీక్ ఆ తరువాత వరుసగా చిత్రాలు చేస్తున్నారు. ఇకపోతే నటి మంజిమా మోహన్ గురించి చెప్పాలంటే మలయాళం చిత్రం ప్రేమమ్ ద్వారా పరిచయం అయిన ముగ్గురు హీరోయిన్లలో ఈ బ్యూటీ ఒకరు. అచ్చం యన్బదు మడమయడ చిత్రం ద్వారా దర్శకుడు గౌతమ్ మీనన్ ఈ అమ్మడిని కోలీవుడ్కు దిగుమతి చేశారు. ఆ చిత్రం హిట్తో ఇక్కడ అవకాశాలను అందుకుంటున్నారు. అలా గౌతమ్ కార్తీక్, మంజిమా మోహన్ కలిసి దేవరాట్టం చిత్రంలో నటించారు. ఆ పరిచయం ప్రేమగా మారింది. వీరి ప్రేమ గురించి ప్రచారం చాలా కాలంగానే జరుగుతోంది. అయితే ఆ వార్తలపై నటుడు గౌతమ్ కార్తీక్ గానీ, నటి మంజిమా మోహన్ స్పందించలేదు. అలాంటిది ఇన్నాళ్లకు నటుడు కార్తీక్ తమ ప్రేమ గురించి బ్లో అప్ అయ్యారు. అవును మేము ప్రేమించుకున్నాం అని ఇన్ స్ట్రాగామ్ లో మంజిమామోహన్ కలిసున్న ఫొటోను పోస్ట్ చేశారు. అయితే పెళ్లికి ముహూర్తం ఎప్పుడు అన్నది వెల్లడించలేదు. -
భర్త నుంచి విడిపోయాక ఇప్పుడు మరింత సంతోషంగా ఉన్నా: నటి
భర్త అర్బాజ్ఖాన్తో 18 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికిన బాలీవుడ్ సీనియర్ నటి మలైకా అరోరా ఇప్పుడు మరింత ఆనందంగా ఉన్నానని చెప్పుకొచ్చింది. పెళ్లి బంధం నుంచి విడిపోయాక తమ ఇద్దరికీ జీవితం పట్ల అవగాహన పెరిగిందని, మెరుగ్గా ఆలోచిస్తున్నామని పేర్కొంది. కాగా, 1998 డిసెంబర్లో పెళ్లి చేసుకున్న మలైక, అర్బాజ్ఖాన్ 2017లో పెళ్లి బంధానికి స్వస్తి పలికారు. ఆ తర్వాత ఆమె నటుడు అర్జున్ కపూర్తో, అతను జార్జియా యాండ్రియానితో రిలేషన్షిప్లో ఉన్నారు. 19 ఏళ్ల కుమారుడు అర్హాన్ ఖాన్కు తల్లిదండ్రులుగా బాధ్యతలు నెరవేరుస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో.. మాజీ భర్తతో మీరు టచ్లో ఉన్నారా? అని ప్రశ్నించగా మలైకా మాట్లాడుతూ.. నచ్చినట్టు బతకడమే జీవితమని ఆమె వ్యాఖ్యానించింది. జీవితంలో సంతోషం వెతుక్కోవాలని.. తన మాజీ భర్త, తాను అదే పని చేశామని చెప్పింది. అర్బాజ్ఖాన్ మంచి వ్యక్తి అని, అతను బాగుండాలని ఎప్పుడూ కోరుకుంటానని తెలిపింది. ఇద్దరు వ్యక్తులు చాలా అంశాల్లో మంచివారై ఉండినప్పటికీ.. కలిసి బతికే విషయాల్లో ఆ రకంగా ఉండకపోవచ్చని.. తమ దాంపత్య జీవితంలో అదే జరిగిందని వెల్లడించింది. కుమారుడితో తనకు మంచి అనుబంధం ఉందని పేర్కొంది. తన నిర్ణయాలను అతను గౌరవిస్తాడని, తాను సంతోషంగా ఉంటే అర్హాన్ ఆనందిస్తాడని చెప్పింది. ‘విడాకుల విషయమై ముందుగా నేనే నిర్ణయం తీసుకున్నా. నాకు ఏది సరైంది అనిపించిందో అదే చేశా. మనసుకి నచ్చిన నిర్ణయాలు తీసుకోవాడానికి భయపడొద్దు. ఇబ్బందులు సహజం.. వాటిని దాటుకుని ముందుకెళ్లాలి. అందరినీ సంతోషపెట్టాలనుకోవడం కుదరదు’ అని మలైకా పేర్కొంది. ఇండియన్ బెస్ట్ డాన్సర్ షోకు ఆమె గతంలో జడ్జిగా వ్యవహరించింది. ఇక అర్బాజ్ సోని లివ్ షో ప్రసారం చేయనున్న పొలిటికల్ డ్రామా తానావ్లో నటిస్తున్నాడు. -
ఎవర్నీ ఫూల్ చేయాలనుకుంటున్నారు!.. విదేశాంగ మంత్రి ఫైర్
వాషింగ్టన్: పాక్ అమెరికాల బంధం అంత తేలిగ్గా ముగిసిపోయేది కాదని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చమత్కరించారు. పాక్కి అమెరికా సేవలందించడం లేదా అమెరికా తన ప్రయోజనాల కోసం పాక్ సేవలు అందించడం వంటి విడదీయరాని బంధం అని వ్యగ్యంగా అన్నారు. ఈ మేరకు జై శంకర్ వాషింగ్టన్లోని ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్కి అమెరికా 450 మిలయన్ డాలర్ల వ్యయంతో ఎఫ్-16 ఫైటర్ జెట్ సస్టైన్మెంట్ ప్రోగ్రామ్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంతో భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అంతేగాదు భారత్ ఆందోళనలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెంటనే అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్కు తెలియజేశారు కూడా. ఐతే అమెరికా మాత్రం అది విక్రయమే తప్ప భద్రతా సాయం కాదని చెప్పుకొచ్చింది. ఈ విషయమై భారత విదేశాంగ మంత్రి మాట్లాడుతూ..ఇలాంటి మాటలతో ఎవర్నీ మోసం చేయాలనుకుంటున్నారంటూ మండిపడ్డారు. అలాగే పాక్ ప్రభుత్వంతో ఈ ఎఫ్ 16 జెట్ విమానాల విక్రయాలతో అమెరికాకు ఒనగగురే ప్రయోజనం ఏమిటో తనకు తెలుసునని అన్నారు. అదీగాక ఎఫ్ 16 జెట్ విమానం ఎంత సామర్థ్యం గలవో వాటి ఉపయోగం ఏమిటో మనందరికి తెలుసునని నొక్కి చెప్పారు. (చదవండి: విక్రయమే తప్ప సాయం కాదన్న అమెరికా... టెన్షన్లో అమెరికా) -
ఆ నటుడితో సహజీవనం.. అవకాశాలు కోల్పోయిన హీరోయిన్!
తమిళసినిమా: కోలీవుడ్లో కథానాయికగా ఎదుగుతున్న నటి వాణి భోజన్. యాంకర్గా జీవితాన్ని ప్రారంభించి ఆ తరువాత బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చి ఇక్కడ మంచి గుర్తింపును తెచ్చుకుని ఆపై సినీ రంగప్రవేశం చేసిన నటి ఈ బ్యటీ..ఓ మై కడవులే చిత్రంలో రెండో హీరోయిన్గా పరిచయమై తొలి చిత్రంతోనే మంచి పేరు తెచ్చుకుంది. ఆ తరువాత పలు చిత్రాల్లో నటించే అవకాశాలను అందుకుంటూ వస్తోంది. ఇటీవల తమిళ్ రాకర్స్ అనే వెబ్సిరీస్లోనూ నటించింది. అయితే ఇప్పటీకి సోలో హీరోయిన్గా నటనకు అవకాశం ఉన్న మంచి పాత్రలో నటించిన దాఖలాలు లేవనే చెప్పాలి. అయినా వార్తల్లో మాత్రం బాగానే నానుతోంది. నటుడు జైతో సహజీవనం చేస్తున్నట్లు ఇప్పటికే ప్రచారం గొల్లుమంటోంది. ఇవాళ రేపు సహజీవనం అనేది సహజంగా మారిపోయింది. అలాంటివారు నయనతార విఘ్నేష్ శివన్ మాదిరి కాస్త ఆలస్యమైనా పెళ్లి పీటలు ఎక్కితే స్వాగతించవచ్చు. అలాకాకుండా కొన్నాళ్లు కలిసి జీవించి ఆ తరువాత బ్రేకప్ అంటేనే సమస్య. ఇప్పుడు వాణి భోజన్ పరిస్థితి ఇదేననే టాక్ స్ప్రెడ్ అవుతోంది. ఈ అమ్మడు నటుడు జైతో సహజీవనం చేయడం వలన ఆమె జీవితం మొత్తం ఆయన చేతిలోకి వెళ్లిపోయిందని, దర్శక, నిర్మాతలు ఆమెను కలిసే పరిస్థితి లేదని, ఆమెకు సంబంధించిన ఏ విషయాన్ని అయినా జైతోనే సంప్రదించాల్సిన పరిస్థితి నెలకొందనే ప్రచారం సామాజిక మాద్యమాలలో హోరెత్తుతోంది. దీంతో వాణిభోజన్ పలు అవకాశాలను కోల్పోతున్నట్లు సమాచారం. ఇదంతా సహించలేక ఆమె జైకు బైబై చెప్పినట్లు కూడా ప్రచారం వైరల్ అవుతోంది. అయితే ఇందులో నిజం ఎంత అన్నది వాణి భోజన్నిగాని, జై గాని స్పందించే వరకు తెలిసే అవకాశం లేదు. అయితే నటుడు జై, నటి అంజలిలో విషయంలో కూడా ఇంతకుముందు ఇలాంటి ప్రచారమే జరిగిందన్నది గమనార్హం. -
2024 ఎన్నికల్లో పోటీ చేస్తా
న్యూజెర్సీ: అగ్రరాజ్యం అమెరికాలో 2024లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీచేస్తానన్న సంకేతాలను మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చారు. తాను పోటీలో ఉండాలని ప్రజలంతా కోరుకుంటున్నారని, ఎన్నికల్లో కచ్చితంగా ముందంజలో నిలుస్తానని అన్నారు. ఆయన తాజాగా ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్భుతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. తన పాలనలో భారత్తో దృఢమైన సంబంధాలు ఏర్పాటు చేసుకున్నామని వివరించారు. భారత్కు తనకంటే అమెరికా అధ్యక్షుడిగా గొప్ప మిత్రుడు గతంలో ఎన్నడూ దొరకలేదని వ్యాఖ్యానించారు. ఈ విషయం ప్రధాని మోదీని అడిగితే బాగా తెలుస్తుందని అన్నారు. ఇండియాతో, నరేంద్ర మోదీతో తనకు చక్కటి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయని చెప్పారు. మోదీతో తనకు చాలాకాలంగా పరిచయం ఉందని.. మోదీ, తాను మంచి స్నేహితులమని పేర్కొన్నారు. ఆయన గొప్ప వ్యక్తి, ప్రధానిగా అద్భుతమైన సేవలు అందిస్తున్నారని కొనియాడారు. నిజానికి ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడం అంత సులభం కాదని పేర్కొన్నారు. అమెరికాలోని భారతీయ సమాజం తనకు అండగా నిలుస్తోందని డొనాల్డ్ ట్రంప్ ఆనందం వ్యక్తం చేశారు. -
హీరోయిన్తో రహస్యంగా దేవీశ్రీ ప్రసాద్ పెళ్లి? ఆమె ఏమందంటే..
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్తో రహస్యంగా పెళ్లి జరిగింది అంటూ వస్తున్న వార్తలపై హీరోయిన్ పూజిత పొన్నాడ స్పందించింది. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె దేవీశ్రీతో తనకు సీక్రెట్ మ్యారేజ్ అంటూ వస్తున్న కథనాలపై క్లారిటీ ఇచ్చింది. అక్కినేని నాగార్జున, కార్తీ హీరోలుగా నటించిన ఊపిరి చిత్రంతో వెండితెరకు పరిచయం అయిన పూజిత అచ్చమైన తెలుగింటి అమ్మాయే. విశాఖపట్నానికి చెందిన ఈ బ్యూటీ రంగస్థలం, హ్యాపీ వెడ్డింగ్, ఓదెల రైల్వే స్టేషన్ వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె నటించిన 'ఆకాశ వీధుల్లో' అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో ప్రమోషన్లో పాల్గొన్న పూజిత తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'దేవీశ్రీ ప్రసాద్తో రిలేషన్లో ఉన్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం. ఇలాంటి పుకార్లు ఎలా పుట్టుకొచ్చాయో నాకు అర్థం కావడం లేదు. మేమిద్దరం రహస్యంగా పెళ్లి చేసుకున్నామని వార్తలు రాస్తున్నారు. ఇందులో నిజం లేదు. నేను ఎవరితోనూ రిలేషన్లో లేను.. ప్రస్తుతానికి నేను సింగిల్' అంటూ చెప్పుకొచ్చింది. -
ఛార్మితో రిలేషన్ బయటపెట్టిన పూరి జగన్నాథ్
పంజాబీ ముద్దుగుమ్మ ఛార్మి కౌర్ తెలుగులో ఎన్నో హిట్ సినిమాల్లో నటించి ఇప్పుడు నిర్మాతగా కొనసాగుతుంది. పూరి జగన్నాథ్తో కలిసి పూరి కనెక్ట్స్ పేరుతో సినిమాలు చేస్తుంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా 'లైగర్' సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎప్పటి నుంచో పూరి-ఛార్మిల మధ్య ఏదో ఉందన్న ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కారణంగానే ఛార్మి ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిందని వార్తలు వస్తున్నాయి. చదవండి: చేతిలో రూపాయి లేకపోయినా ఆఫర్ను రిజెక్ట్ చేశా : ఛార్మి తాజాగా ఛార్మితో తనకున్న రిలేషన్ షిప్ను బయటపెట్టారు పూరి జగన్నాథ్. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. 'ఛార్మీ 13 ఏళ్ల వయసప్పటి నుండి తనకు తెలుసని, దశాబ్దాలుగా ఆమెతో కలిసి పనిచేస్తున్నానని తెలిపారు. ఛార్మీకి నాకు ఏదో అఫైర్ ఉందని ఏదేదో మాట్లాడుకుంటారు. ఆమె ఇంకా యంగ్గా ఉండటం వల్లే ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. అదే అదే ఛార్మికి 50ఏళ్లు ఉంటే ఇలా మాట్లాడేవారు కాదు. ఆమెకు వేరేవాళ్లతో పెళ్లి జరిగినా పట్టించుకునేవారు కాదు. చదవండి: రాజకీయాల్లోకి హీరోయిన్ త్రిష? ఎంజీఆర్, జయలలిత దారిలో.. కానీ తామిద్దరం ఒకే ఇండస్ట్రీలో ఉండటం, ఎన్నో సంవత్సరాలుగా ట్రావెల్ అవుతుండటంతో ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటున్నారు. ఒకేవళ అఫైర్ ఉన్నా అది ఎక్కువరోజులు నిలబడదు. ఆకర్షణ అనేది కొన్నిరోజుల్లోనే చచ్చిపోతుంది. స్నేహమే శాశ్వతం. తామిద్దరం మంచి ఫ్రెండ్స్' అంటూ పుకార్లకు పూరి ఫుల్ స్టాప్ పెట్టారు. -
విజయ్తో డేటింగ్?.. ఎట్టకేలకు బయటపెట్టిన రష్మిక మందన్నా
రష్మిక మందన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో తీరిక లేకుండా గడిపేస్తుంది. రష్మిక కెరీర్ ఆరంభం నుంచి ఆమె వ్యక్తిగత జీవితంపై అనేక రూమర్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా విజయ్ దేవరకొండ- రష్మికలు చాలాకాలంగా డేటింగ్లో ఉన్నట్లు ఫిల్మీ దునియాలో జోరుగా ప్రచారం జరుగుంది. ఇప్పటికే విజయ్ ఈ రూమర్స్పై క్లారిటీ ఇచ్చాడు. అయినప్పటికీ వీరి రిలేషన్పై గాసిప్స్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ రూమర్స్పై రష్మిక మందన్నా స్పందించింది. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ.. ప్రస్తుతం నేను ఐదు సినిమాలు చేస్తున్నా. వాటి గురించి అడిగితే ఎంతసేపైనా మాట్లాడతా. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాన్ని తెలుసుకోవాలన్ని ఆసక్తి ఉండటం సహజమే. కానీ పదేపదే అవే ప్రశ్నలు అడగటం ఇబ్బందిగా అనిపిస్తుంది. ప్రేమ, పెళ్లి విషయాల్లో పుకార్లను అస్సలు నమ్మొద్దు. నేను చెప్పేందవరకు ఒక నిర్ణయానికి రాకండి. నా గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు అంటూ చెప్పుకొచ్చింది ఈ నేషనల్ క్రష్. -
మలైకాతో పెళ్లికి రెడీగా లేను.. అర్జున్ కపూర్ షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్, మలైకా అరోరా ప్రేమలో మునిగితేలుతున్న విషయం తెలిసిందే. సినిమాల కంటే డేటింగ్ వార్తలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు ఈ జంట. ఇదిలా ఉండగా త్వరలోనే ఈ ప్రేమపక్షలు పెళ్లి పీటలు ఎక్కనున్నారంటూ బీటౌన్ మీడియా కోడై కూస్తుంది. ఈ వార్తలపై అర్జున్ కపూర్ ఆసక్తికర రీతిలో స్పందించారు. పాపులర్ షో కాఫీ విత్ కరణ్ షోకి గెస్ట్గా వచ్చిన అర్జున్ కపూర్ మలైకాతో ప్రేమ, పెళ్లి విషయాలపై స్పందించాడు. 'నేను మలైకాను ఇప్పుడే పెళ్లి చేసుకునేందుకు రెడీగా లేను. కోవిడ్ లాక్డౌన్ కారణంగా రెండేళ్లు సినిమాలు లేక అలా సమయం గడిచిపోయింది. ఇప్పుడు నేను నా కెరీర్ మీద దృష్టిపెట్టాలని అనుకుంటున్నా. నా పని నాకు సంతోషాన్ని కలిగిస్తుంది. నేను సంతోషంగా ఉంటేనే నా భాగస్వామిని సంతోషపెట్టగలను. ప్రస్తుతానికి పెళ్లి ఆలోచనలేమీ లేవు' అంటూ పేర్కొన్నాడు. ప్రస్తుతం అర్జున్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
నా రిలేషన్ గురించి దాచాలనుకోవట్లేదు: శ్రుతి హాసన్
Shruthi Haasan About Relationship With Shanthanu Says He Is Amazing: 'గతంలో నాకు రిలేషన్షిప్స్ ఉండేవి. కానీ వాటి గురించి నేను బహిరంగంగా మాట్లాడలేదు. ఎందుకంటే నాతో రిలేషన్లో ఉన్న వ్యక్తి అలా బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడలేదు. కానీ ప్రస్తుతం రిలేషన్షిప్ గురించి దాచాల్సిన అవసరం నాకు లేదనిపించింది. ఎందుకంటే నేనొక అద్భుతమైన వ్యక్తి (శంతను)తో రిలేషన్లో ఉన్నాను.' అని తెలిపింది శ్రుతి హాసన్. డూడుల్ ఆర్టిస్ట్ శంతనుతో శ్రుతి రిలేషనల్లో ఉందన్న వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. శంతను గురించి శ్రుతి హాసన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నా జీవితంలో ఒక ముఖ్యమైన భాగం (శంతను)తో గడపాలనుకుంటున్నాను. తనతో ఉంటున్నందుకు నాకు గర్వంగా ఉంది. ఇక మేం ఎక్కడికి వెళ్లినా ఫొటోగ్రాఫర్లు ఫొటోలు తీస్తుంటారు. సో.. మేం దాచాలన్న దాగదు. అయినా ఇప్పుడు తనతో నా అనుబంధం గురించి నేను కూడా దాచాలనుకోవడం లేదు. ఎందుకంటే నా లైఫ్లో ఆ అనుబంధానిది చాలా పెద్ద భాగం. నేనెంతో కష్టపడి పని చేసి, ఇంటికెళతాను. ఆ తర్వాత నా జీవితంలో ఇంపార్టెంట్ పార్ట్ అయిన ఓ అద్భుతమైన పార్ట్నర్తో ఉంటాను. అందుకే నాకు దాచాలని అనిపించడంలేదు. మా ఇద్దరి ఈక్వేషన్ నాకు చాలా ఇష్టం' అని పేర్కొంది. చదవండి: స్కూల్ డేస్ను గుర్తు చేసే 'టెన్త్ క్లాస్ డైరీస్'.. -
ముస్లిం యువతిని ప్రేమించడమే ఆ యువకుడికి శాపమైందా?
బెంగళూరు: వేరే మతానికి చెందిన అమ్మాయిని ప్రేమించడమే ఆ యువకుడి పాపమైంది. ప్రేమించిన అమ్మాయితో జీవితాంతం సంతోషంగా ఉండాలనుకున్న అతని ఆశాలు అడియాశాలయ్యాయి. ఎంతో అందంగా ఊహించుకున్న భవిష్యత్తును మధ్యలోనే సమాధి చేశారు. ఎదిగి వచ్చిన కొడుకును దూరం చేసి కన్నతల్లికి కడుపుకోత మిగిల్చారు. ముస్లిం యువతితో సన్నిహితంగా ఉంటున్నాడని దళిత యువకుడిని హత్య చేశారు. ఈ అమానుష ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. కాలబురాగి(గుల్బర్గా) వాడిటౌన్లోని భీమా నగర్లో లేఅవుట్లో నివిస్తున్న 25 ఏళ్ల విజయ్ కాంబ్లే, ముస్లిం యువతిని ప్రాణంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ ప్రేమ విషయం యువతి కుటుంబ సభ్యులకు నచ్చలేదు. తన సోదరితో దూరంగా ఉండాలని యువతి సోదరులు విజయ్ను పలుమార్లు హెచ్చరించారు. అయినా యువకుడి ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో ఎలాగైనా విజయ్ను అంతమొందించాలని ముస్లిం యువతి కుటుంబ సభ్యులు పథకం పన్నారు. ఈ క్రమంలో శుక్రవారం విజయ్ను అడ్డగించి కత్తితో పొడిచి చంపి అక్కడి నుంచి పరారయ్యారు. చదవండి: Hyderabad: ప్రియురాలిపై మాజీ ప్రియుడి ఘాతుకం.. నడిరోడ్డుపై తన కుమారుడిని ముస్లిం యువతి సోదరులే హత్య చేశారని మృతుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులు షాహుద్దీన్, నవాజ్ అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరితోపాటు ఇరు కుటుంబ సభ్యులను కూడా విచారిస్తున్నారు. అయితే యువతి సోదరులు తమ కొడుకును పలుమార్లు బెదిరించారని మృతుడి తల్లి పేర్కొంది. తన చెల్లెలితో రిలేషన్షిప్ను వదులుకోవాలని లేకుంటే చంపేస్తామని బెదిరించినట్లు తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ‘విజయ్కు ఫోన్ కాల్ రావడంతో ఇంటినుంచి బయటకు వెళ్లిపోయాడు. తను ఎవరితో మాట్లాడాడో కూడా నాకు తెలీదు. తరువాత విజయ్ను ఎవరో కొట్టారని మాకు కాల్ వచ్చింది. వెంటనే తన వద్దకు పరిగెత్తాము. అప్పటికే మా అబ్బాయి మెడపై కత్తితో పొడిచి చంపారు. ఈ సంఘటనకు ముందు ఎలాంటి గొడవలు జరగలేదు. యువతి సోదరుడు మాత్రం ఒకసారి ఇంటికొచ్చి.. ‘నీ కొడుక్కి మంచి బుద్ధులు నేర్పించు. లేకపోతే తన తల నరికి నీకు అప్పగిస్తాం’ అని బెదిరించి వెళ్లాడు’ అని విజయ్ తల్లి చెబుతూ కన్నీటి పర్యంతమైంది. చదవండి: లైంగిక ఆరోపణలు.. మనస్తాపంతో మాజీ మంత్రి ఆత్మహత్య -
జాకీతో ప్రేమ.. అది నాకిష్టం లేదు: రకుల్ ప్రీత్ సింగ్
టాలీవుడ్లో అతికొద్ది సమయంలోనే స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది కూల్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ఈ ఫిట్నెస్ బ్యూటీ ఇటీవల 'రన్ వే 24', జాన్ అబ్రహం అటాక్ చిత్రాలతో బాలీవుడ్ ప్రేక్షకుల్ని అలరించింది. 'రన్ వే 24' మూవీలో బిగ్బీ అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగణ్ వంటి స్టార్స్తో కలిసి నటించింది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో కెరీర్, ప్రేమపై పలు ఆసక్తికర విషయాలు తెలిపింది. ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత జీవితం ఉంటుందని, అది చాలా సహజం అని చెప్పుకొచ్చింది. 'జాకీ భగ్నానీ నేను మంచి స్నేహితులం. మా అభిరుచులు కలవడంతో ప్రేమలో పడ్డాం. మా రిలేషన్షిప్ గురించి ఓకే అనుకున్నప్పుడే వీలైనంత త్వరగా ప్రపంచానికి తెలియజేయాలనుకున్నాం. ఎందుకంటే రిలేషన్ను బయటకు చెప్పకపోతే మా గురించే వచ్చే వార్తలు, పుకార్లతో ప్రశాంతంగా ఉండలేం. నిజానికి మా వ్యక్తిగత జీవితం గురించి కాదు, మేము చేసే వర్క్ గురించి అందరూ మాట్లాడుకోవాలి. ప్రతి ఒక్కరికీ పర్సనల్ లైఫ్ ఉంటుంది. ఒక రిలేషన్షిప్లో ఉండటం చాలా సహజం. మన లైఫ్లో పేరెంట్స్, బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్ ఎలా ఉంటారో అలాగే మనకోసం ఒకరు ఉంటారు. సెలబ్రిటీలు కావడంతో మాపై అందరి దృష్టి ఎక్కువగానే ఉంటుంది. అది మాకిష్టం లేదు. అందుకే మేము బహిరంగంగా చెప్పేశాం.' అని రకుల్ తెలిపింది. చదవండి: ఆ మాటే నాకు నచ్చదు: రకుల్ ప్రీత్ సింగ్ వెబ్ సిరీస్గా మారిన అక్షయ్, రకుల్ చిత్రం.. -
టెన్నిస్ స్టార్తో త్వరలోనే ఖడ్గం బ్యూటీ వివాహం!
బాలీవుడ్ నటి, ఖడ్గం బ్యూటీ కిమ్ శర్మ టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్తో గత కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ లవ్బర్డ్స్ తమ ప్రేమను నెక్ట్స్ లెవల్కి తీసుకెళ్లాలని భావిస్తున్నారట. త్వరలోనే ఈ ప్రేమజంట పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు బీటౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కిమ్ శర్మ, పేస్ల తల్లిదండ్రులు కూడా ఇటీవలె ముంబైకి చేరుకున్నారని, పెళ్లికి సంబంధించి ఇరు కుటుంసభ్యులు చర్చలు జరుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరి పేరెంట్స్ కిమ్, పేస్ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, దీంతో అతి త్వరలోనే అతి త్వరలోనే వీరిద్దరూ కోర్టు మ్యారేజ్ చేసుకోనున్నట్లు సమాచారం. కిమ్-పేస్ల తల్లిదండ్రులు ఇలా కలుసుకోవడం ఇదేమీ మొదటిసారి కాదు. గతేడాది డిసెంబర్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ను వీరంతా కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. కాగా కిమ్ కిమ్.. ఖడ్గం,మగధీరలో 'ఏం పిల్లడో' పాటల ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది.అయితే ఆమె సినిమాల కంటే లవ్ ఎఫైర్స్తోనే బాగా పాపులర్ అయ్యింది. 2010లో కెన్యా వ్యాపారవేత్తను వివాహం చేసుకున్న కిమ్ కొన్నాళ్లకే విడాకులు తీసుకుంది. అనంతరం నటుడు హర్షవర్ధన్ రాణేతో ఎఫైర్ సాగించిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం లియాండర్ పేస్తో రిలేషన్షిప్లో ఉంది. -
భర్తను పరస్త్రీతో పంచుకోవడం కంటే.. చావే మేలు అనుకుంది!
భర్త విషయంలో భారతీయ స్త్రీలు విపరీతమైన ఆలోచనా ధోరణితో ఉంటారని, తన భర్త తనకు మాత్రమే సొంతం అనుకుంటారని, పరాయి స్త్రీతో బంధాన్ని పంచుకోవడానికి ఏమాత్రం సహించబోరని అలహాబాద్(ఉత్తర ప్రదేశ్) హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. భారతీయ వివాహిత మహిళలు భర్త తమకు మాత్రమే సొంతం అనుకుంటారు. వాళ్ల గురించి విపరీతంగా ఆలోచిస్తుంటారు. ఒకవేళ అతను గనుక వేరే మహిళతో సంబంధం పెట్టుకున్నా, వివాహం చేసుకోవాలనుకునే ప్రయత్నం.. చివరికి ఆలోచనా చేసినా అది ఆ భార్యను కుదిపేసే అంశమే. అలాంటి విపత్కర పరిస్థితుల్లో తీవ్ర నిర్ణయాలే తీసుకుంటారు. ఈ కేసులోనూ అదే జరిగింది అంటూ జస్టిస్ రాహుల్ చతేర్వేది నేతృత్వంలో ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు.. తన భర్త రహస్యంగా మరో మహిళను వివాహం చేసుకోబోతున్నాడని, లేదంటే వివాహం చేసుకున్నాడనే ఒక్క కారణం చాలూ.. ఆమె తన ప్రాణం తీసుకునేందుకు అంటూ కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కేసు వివరాలు.. వారణాసి మాండువాది చెందిన సుశీల్ కుమార్ అనే వ్యక్తి, అతని కుటుంబం మీద అతని భార్య చనిపోయే ముందు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు అయిన వెంటనే ఆమె విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో వాళ్ల మీద కేసు నమోదు అయ్యింది. అయితే భార్య ఆత్మహత్యకు తామేమీ కారణం కాదని, కేసుల నుంచి ఉపశమనం ఇప్పించాలని సుశీల్ కోర్టులను ఆశ్రయించాడు. అయితే సుశీల్ కుమార్కు ఇదివరకే రెండు వివాహాలు అయ్యాయని, మరో వివాహం చేసుకోవడంతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడింది ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు ధృవీకరించినట్లయ్యింది. -
ఈ లవ్ బర్డ్స్ బ్రేకప్ చెప్పుకున్నారా? అసలేం జరిగిందంటే..
Is Sidharth Malhotra, Kiara Advani Broken Up: బాలీవుడ్ లవ్బర్డ్స్ కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రాల బ్రేకప్ బి-టౌన్లో హాట్టాపిక్ నిలిచింది. కొంతకాలంగా సీక్రెట్గా డేటింగ్ చేస్తున్న ఈ జంట క్యూటెస్ట్ కపుల్గా పేరు తెచ్చుకున్నారు. అలాంటి వీరు విడిపోయారంటూ వార్తలు రావడంతో ఈ జంట ఫ్యాన్స్ షాక్కు గురవుతున్నారు. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కుతారనుకుంటే ఇలా ఎవరి దారి వారదే అని విడిపోవటం ఏంటని చర్చించుకుంటున్నారు. అయితే ఈ వార్తల్లో నిజమెంత అనేది స్పష్టత లేదు. చదవండి: అందుకే ‘జెర్సీ’లో నటించనని చెప్పా: రష్మిక వివరణ కానీ, బ్రేకప్ రూమర్స్పై ఈ జంట ఇంతవరకు స్పందించకపోవడంతో అభిమానులంతా ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో వారందరికి ఊరటనిస్తూ ఈ జంట విడిపోలేదని వారి సన్నిహిత వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం కియారా, సిద్ధార్థ్లు కలిసి లేరనేది వాస్తవమే కానీ, అది గొడవల వల్ల కాదని చెబుతున్నారు. షూటింగ్లతో బిజీగా ఉండటం కారణంగా కొద్ది రోజులు ఈ జంట విడిగా ఉంటున్నారని వారు స్పష్టం చేశారు. ప్రస్తుతం సిద్ధార్థ్ షూటింగ్లో భాగంగా టర్కిలో ఉండగా.. కియారా తన తాజా చిత్రం ‘భూల్ భులయ్యా-2’ మూవీ ప్రమోషన్తో బిజీగా ఉందట. చదవండి: పిల్లలతో వెకేషన్లో శ్రీజ కొణిదెల.. ఫోటోలు వైరల్ అందువల్లే వీరిద్దరు కలుసుకోవడం లేదని, సిద్ధార్థ్ టర్కి నుంచి రాగానే మీకే క్లారిటీ వస్తుందని కియారా, సిద్ధార్థ్ల మ్యూచువల్ ఫ్రెండ్స్ నుంచి సమాచారం. కాగా వీరిద్దరు తొలిసారి జంటగా నటించిన షేర్షా మూవీ షూటింగ్ సమయంలో కియారా, సిద్ధార్థ్లు ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి పార్టీలు, వెకేషన్స్ అంటూ తెగ చక్కర్లు కొట్టారు. ఆలియా-రణ్బీర్ల తర్వాత పెళ్లి చేసుకునే కపుల్ వీళ్లేనంటూ బీటౌన్లో ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. కానీ అందరికి షాక్ ఇస్తూ కియారా- సిద్దార్థ్లు విడిపోయినట్లు ఒక్కసారిగా బాలీవుడ్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. -
బాలీవుడ్లో మరో బ్రేకప్.. పెళ్లిదాకా వచ్చి విడిపోయిన స్టార్ కపుల్
బాలీవుడ్లో మరో జంట బ్రేకప్ చెప్పేసుకున్నారు. కొన్ని రోజుల క్రితమే లైగర్ బ్యూటీ అనన్య ప్రియుడు ఇషాన్ ఖట్టర్తో విడిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో బ్యూటీఫుల్ కపుల్ తమ రిలేషన్కి ఎండ్ కార్డ్ వేసేశారు. బాలీవుడ్ మోస్ట్ క్యూటెస్ట్ కపుల్గా పేరు తెచ్చుకున్న కియారా అద్వానీ- సిద్దార్థ్ మల్హ్రోత్రా బ్రేకప్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. గత కొంతకాలంగా డేటింగ్లో ఉన్న ఈ జంట త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు కూడా వినిపించాయి. కానీ సడెన్గా ఏం జరిగిందో తెలియదు.. వీరు తమ బంధానికి ఫుల్స్టాప్ పెట్టేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. దీనికి తోడు కియారా బ్రేకప్ వార్తలు నిజమే అంటూ ఆమె సన్నిహితులు క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు షాక్ అవుతున్నారు. కాగా షేర్షా మూవీతో కలిసి తొలిసారి కలిసి నటించిన కియారా- సిద్దార్థ్లు ఈ సినిమా సమయంలోనే ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి పార్టీలు, వెకేషన్స్ అంటూ తెగ చక్కర్లు కొట్టారు. ఆలియా-రణ్బీర్ల తర్వాత పెళ్లి చేసుకునే కపుల్ వీళ్లేనంటూ బీటౌన్లో జోరుగా ప్రచారం జరిగింది. కానీ అందరికి షాక్ ఇస్తూ కియారా- సిద్దార్థ్లు విడిపోయినట్లు బాలీవుడ్ మీడియా వెల్లడించింది. -
ఎన్టీఆర్ నాగశౌర్యకు ఏమవుతాడు? క్లారిటీ ఇచ్చిన శౌర్య తల్లి
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఊహలు గుసగుసలాడే సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైన శౌర్య ఛలో సినిమాతో మంచి హిట్ కొట్టారు. అందంతో పాటు టాలెంట్ కూడా ఈ యంగ్ హీరోకి ఇప్పటివరకు అనుకున్నంతగా సక్సెస్ రాలేదు. తాజాగా కృష్ణ వ్రింద విహారి సినిమాతో త్వరలోనే ప్రేక్షకులను పలకరించనున్నారు.చదవండి: ఎన్టీఆర్ను డామినేట్ చేశారా? చరణ్ ఆన్సర్ అదిరిందిగా ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్లో భాగంగా నాగశౌర్య తల్లి ఉషా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇక ఇండస్ట్రీకి అడుగుపెట్టినప్పటి నుంచి శౌర్యకి ఎన్టీఆర్ కుటుంబంతో బంధుత్వం ఉందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై నాగశౌర్య తల్లి ఉషా క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..శౌర్యకు ఎన్టీఆర్ అంటే అభిమానం. ఇక తారక్ భార్య లక్ష్మీ ప్రణతి కజిన్కు శౌర్య మంచి ఫ్రెండ్. ఆ విధంగా రూమర్స్ వచ్చి ఉండొచ్చు. కానీ వాళ్లు కుటుంబంతో బంధుత్వం లేదు కానీ ఫ్యామిలీ ఫ్రెండ్లా ఉంటారు అంటూ చెప్పుకొచ్చింది. దీంతో నాగ శౌర్యకి ఎన్టీఆర్ బంధువు అవుతారన్న వార్తల్లో నిజం లేదని స్పష్టమైపోయింది. చదవండి: ఇదెక్కడి మాస్ మేనియా.. ఎగ్జామ్ పేపర్లో 'పుష్ప' డైలాగులు -
ఏడాదిగా వివాహేతర సంబంధం.. పిక్నిక్ పేరుతో ఆమెను అక్కడికి పిలిచి..
భోపాల్: సమాజంలో యువతులు, మహిళలపై రోజురోజుకు లైంగిక దాడులు పెరుగుతున్నాయి. కొందరు మృగాలు నమ్మించి మహిళలను లొంగదీసుకుంటున్నారు. పిక్నిక్ పేరుతో ఓ మహిళను వంచించి చివరకు ఆమెకు విషం తాగించి.. బాధితురాలు చావుకు ముగ్గురు కారణమయ్యారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసకుంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మహిళ(28)తో షాదబ్ ఉస్మాన్ అనే వ్యక్తి పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఏడాదిగా వారి మధ్య వివాహేతర సంబంధం నడుస్తోంది. కాగా, పిక్నిక్ పేరుతో ఆమెను.. నిందితుడు షాదోల్ జిల్లాలోని క్షీర్సాగర్ తీసుకెళ్లాడు. అక్కడికి ఉస్మాన్ స్నేహితులు రాజేష్ సింగ్, సోనూ జార్జ్ సైతం వచ్చారు. ఈ క్రమంలో వారు ఫుల్గా మద్యం సేవించి ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా పైశాచికత్వంతో బలవంతంగా ఆమెకు విషం తాగించారు. దీంతో ఆమె ఘటనా స్థలంలోనే మృతి చెందింది. ఆమె చనిపోవడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నివేదికలో ఆమెపై లైంగిక దాడి చేసి, విష ప్రయోగం జరిగినట్టు వైద్యులు తేల్చారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితులను గుర్తించి అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నట్టు వెల్లడించారు. -
నెంబర్ వన్ పాయే.. 15 ఏళ్ల బంధానికి ముగింపు
సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్.. తన కోచ్ మరియన్ వాజ్దాతో ఉన్న 15 ఏళ్ల బంధానికి ముగింపు పలికాడు. జొకోవిచ్ 20 గ్రాండ్స్లామ్ టైటిల్స్ సాధించడంలో అతని పాత్ర మరువలేనిది. దాదాపు 15 ఏళ్ల పాటు టెన్నిస్లో రారాజుగా వెలిగిన జొకోవిచ్ వెనకాల మరియన్ వాజ్దా కృషి ఉందంటే అతిశయోక్తి కాదు. గతేడాది ట్యురిన్ వేదికగా జరిగిన ఏటీపీ టూర్ వరల్డ్ ఫైనల్స్ సందర్భంగా జొకోవిచ్.. మరియన్తో బంధం ముగుస్తున్నట్లు పేర్కొన్నాడు. తాజాగా జొకోవిచ్ పర్సనల్ వెబ్సైట్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించాడు. కష్టాల్లో తన వెన్నంటి నిలిచిన మరిమన్కు జొకోవిచ్ ఘనమైన వీడ్కోలు పలుకుతూ వెబ్సైట్లో సుధీర్ఘ సందేశాన్ని రాసుకొచ్చాడు. చదవండి: Russia-Ukraine Crisis: దేశం కోసం కీలక మ్యాచ్ను వదిలేసుకున్న టెన్నిస్ స్టార్ ''నా కెరీర్లో కోచ్గా మరియన్ వాజ్దా పాత్ర మరువలేనిది. 15 సంవత్సరాల మా బంధంలో అతను చూపెట్టిన స్నేహం, అంకితభావానికి కృతజ్ఞత తెలుపుకుంటున్నా. నేను సాధించిన అద్భుత విజయాలలో అతను భాగస్వామిగా ఉన్నాడు. కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలబడ్డాడు. ఇప్పుడు మా బంధానికి ముగింపు పలకడం బాధిస్తున్నా తప్పని పరిస్థితి. మరియన్ కేవలం వృత్తిపరంగానే నాకు దూరమవుతున్నాడు.. వ్యక్తిగత జీవితంలో మాత్రం నాకు.. నా కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటాడని ఆశిస్తున్నా. ఈ 15 ఏళ్లలో అతను నాకు చేసిన సహాయాన్ని కృతజ్ఞతతో సరిపెట్టుకోలేను.. అంతకుమించి ఏదైనా చేయాలి'' అంటూ రాసుకొచ్చాడు. జొకోవిచ్ సందేశానికి ముగ్దుడైన మరియన్ వాజ్దా స్పందిస్తూ.. '' జొకోవిచ్.. వృతిపరంగా మాత్రమే నీకు దూరమవుతున్నా. కోర్టు లోపల.. బయట నీకు ఎప్పుడు నా మద్దతు ఉంటుంది. ఈ 15 ఏళ్ల మన బంధంలో ఎన్నో మధురానుభూతులు సంపాదించుకున్నా. మనిద్దరం కలిసి వెనుకకు తిరిగి చూస్తే అద్భుతమైన విజయాలు ఎన్నో ఉన్నాయి. ఆ విజయాలకు నేను కృతజ్ఞతుడిని. కొత్త సవాళ్ల కోసం ఎప్పుడు ఎదురుచూస్తూనే ఉంటా.'' అంటూ తెలిపాడు. కాగా జొకొవిచ్ ఇటీవలే తన నెంబర్వన్ ర్యాంక్ను రష్యా టెన్నిస్ స్టార్ డానిల్ మెద్వెదెవ్కు కోల్పోయాడు. దాదాపు 361 వారాల పాటు జొకోవిచ్ నెంబర్వన్గా కొనసాగాడు. వ్యాక్సిన్ వేసుకోని కారణంగా ఆస్ట్రేలియా ప్రభుత్వం జొకోవిచ్ను ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఎంత చెప్పినా తన పట్టు వదలని జొకోవిచ్.. కోర్టు మెట్లు ఎక్కినప్పటికి నిరాశే ఎదురైంది. మూడు సంవత్సరాల పాటు ఆస్ట్రేలియాలో అడుగుపెట్టకుండా ఆ దేశ ప్రభుత్వం జొకోవిచ్పై వేటు వేసింది. ఇక 20 గ్రాండ్స్లామ్ టైటిళ్లతో జొకోవిచ్ ప్రస్తుతం రోజర్ ఫెదరర్తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. జొకో ఖాతాలో 9 ఆస్ట్రేలియన్ ఓపెన్, ఆరు వింబుల్డన్, మూడు యూఎస్ ఓపెన్, రెండు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ ఉన్నాయి. ఇక స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్ 21 గ్రాండ్స్లామ్ టైటిళ్లతో తొలి స్థానంలో ఉన్నాడు. చదవండి: Ravichandran Ashwin: 'సోయి లేకుండా మాట్లాడొద్దు'.. జర్నలిస్ట్ను ఉతికారేసిన అశ్విన్ Kohli-BCCI: 'కోహ్లిపై కోపం తగ్గలేదా'.. బీసీసీఐని ఏకిపారేసిన క్రికెట్ ఫ్యాన్స్ -
తన రిలేషన్షిప్ గురించి చెప్పిన విశ్వక్ సేన్ బ్యూటీ
Rukshar Dhillon Said About Her Relationship In Past: 'కృష్ణార్జున యుద్ధం' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రుక్సార్ దిల్లాన్. వరుస సినిమాలతో ఫుల్ జోష్ మీద ఉంది ఈ ఏబీసీడీ బ్యూటీ. ప్రస్తుతం యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కుతున్న 'అశోకవనంలో అర్జున కల్యాణం' సినిమాలో కథానాయికగా చేస్తోంది. ఈ చిత్రం ముప్పై ఏళ్లు వచ్చిన ఓ వడ్డీ వ్యాపారీ పెళ్లి కోసం పడే పాట్ల నేపథ్యంలో సాగనున్నట్లు సమాచారం. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనకు కాబోయే వాడు ఎలా ఉండాలనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చింది రుక్సార్. తాను గతంలో రిలేషన్షిప్లో ఉన్నానని పేర్కొంది. అలాగే తనకు కాబోయేవాడు నిజాయితీగా, నిబద్ధతో ఉంటడాలని కోరుకుంటోందట ఈ అమ్మడు. (చదవండి: విశ్వక్ సేన్కు పిల్ల దొరికేసింది.. జనవరి 19న) ఆమె పెళ్లి చేసుకుని జీవితాంతం గడిపే వ్యక్తి గురించి ముందు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటోంది రుక్సార్. పూర్తిగా అర్థం చేసుకున్నాకే వివాహం చేసుకుంటానని చెప్తున్న రుక్సార్కు ప్రేమ వివాహంపై నమ్మకం ఉందని తెలిపింది. 2017లో ఆకతాయి సినిమాతో టాలీవుడ్లో తెరంగ్రేటం చేసింది. లండన్లో పుట్టిన ఈ సుందరి ఫ్యాషన్ డిజైనింగ్ చేసింది. బెంగళూర్లో నివాసం ఉంటోన్న ఈ భామ 2020లో 'భాంగ్రా పా లే' అనే హిందీ సినిమాతో బీటౌన్కు కూడా పరిచయమైంది. (చదవండి:ఒక్క సంబంధం చూడండి, లేదంటే ఎలా పడేయాలో చెప్పండి) -
సల్మాన్ ఖాన్తో సీక్రెట్ డేటింగ్, క్లారిటీ ఇచ్చిన నటి సమంత..
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రేయసిల జాబితా చాలా పెద్దది. అప్పటి నటి సోమి అలీ, ఐశ్వర్యరాయ్ నుంచి ఇప్పటి కత్రినా కైఫ్తో పాటు పలువురు హీరోయిన్స్ వరకు ఎంతో మంది సల్మాన్ ప్రేమలో మునిగితేలారు. అయితే భాయిజాన్ మాత్రమే ఎవరితో ప్రేమాయాణం సాగించిన అది కొంతకాలం వరకే. ఆ తర్వాత ఎవరి దారులు వారే అన్నంటూ విడిపోయారు. అందుకే అయిదు పదుల వయసులో కూడా సల్మాన్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా పిలిపించుకుంటున్నాడు. తాజగా సల్మాన్ ప్రియురాళ్ల జాబితాలో అమెరికా భామ సమంత లాక్వుడ్ చేరింది. చదవండి: డబ్బు కోసం ఇంతలా దిగజారతావా, నీ స్థాయి మరిచిపోయావా?: హీరోయిన్పై ట్రోల్స్ కొంతకాలంగా భాయిజాన్ ఆమెతో డేటింగ్లో ఉన్నట్లు బీ-టౌన్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. గత లాక్డౌన్లో సల్మాన్-సమంత లాక్వుడ్లు ఫాంహౌజ్లోనే ఉన్నారు. అప్పటి నుంచే వీరిద్దరు సీక్రెట్ డేటింగ్లో ఉన్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. అంతేగాక సమంత లాక్వుడ్ కూడా సల్మాన్, అతడి ఫ్యామిలీ ఫంక్షన్స్కు హజరవ్వడం, భాయిజాన్ కుటుంబంతో తనకు ఎక్కువ అటాజ్మెంట్ కూడా ఉంది. దీంత సల్మాన్ ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడంటూ ఓ దశలో ప్రచారం కూడా జరిగింది. అయితే ఇప్పడు అవన్ని సద్దుమణిగాయి. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్య్వూలో సల్మాన్తో తన రిలేషన్పై తొలిసారిగా నోరు విప్పింది అమెరికా భామ. చదవండి: ఒంటరిగా ఉండటం నచ్చడం లేదు.. షాకింగ్ న్యూస్ చెప్పిన నటి సల్మాన్తో తన రిలేషన్పై క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘‘ప్రజలు చాలా మాట్లాడుతుంటారు. లేని దాని గురించి చాలానే చెప్పగలరు. నేను సల్మాన్ ఖాన్ను కలుసుకున్నాను. ఆయన మంచి వ్యక్తి. చెప్పడానికి ఇంతకు మించి ఏమీ లేదు. ప్రజలకు ఈ ఆలోచన ఎలా వచ్చిందో నాకు తెలియదు. నేను కలవడం అంటే.. హృతిక్ రోషన్ కూడా కలుసుకున్నాను. కానీ, నా గురించి, హృతిక్ గురించి ఎవరూ ఏమీ మాట్లాడలేదు. ఈ వార్తలు ఎక్కడ నుంచి వచ్చాయో తెలియడం లేదు’’ అని స్పష్టం చేసింది. గత నెలలో హృతిక్ రోషన్తో తీసుకున్న సెల్ఫీని సమంత తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోవడం తెలిసిందే. కాగా ఆమె ‘షూట్ ది మూవీ’తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. చదవండి: మరో వివాదంలో హీరో సిద్ధార్థ్, మహిళా కమిషన్ ఎంట్రీ -
భార్యభర్తల గొడవ.. కోర్టు సంచలన తీర్పు!
అహ్మదాబాద్: ఒక మహిళను భర్తతో కలిసి నివశించాలని, కాపురం చేయాలని కోర్టులు బలవంతం చేయలేవని గుజరాత్ హైకోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు కుటుంబ కోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసింది. అంతేకాకుండా ముస్లిం చట్టం బహుభార్యత్వం అనుమతిస్తోంది కానీ ప్రోత్సహించలేదని, అందువల్ల ఒక వ్యక్తి తొలిభార్య అతనితో కలిసి ఉండేందుకు నిరాకరించవచ్చని కూడా వ్యాఖ్యానించింది. సవతులతో కలిసి జీవించాలని భార్యను బలవంతం చేసే హక్కును భర్తకు ఇవ్వలేదని తెలిపింది. ఈ సందర్భంగా ఉమ్మడి పౌరస్మృతి ఒక ఆశగా మిగలకూడదన్న ఢిల్లీ హైకోర్టు అభిప్రాయాన్ని గుజరాత్ హైకోర్టు గుర్తు చేసింది. దాంపత్య హక్కులు కేవలం భర్తకు మాత్రమే సొంతమైనవి కాదని జస్టిస్ పార్దివాలా, జస్టిస్ నీరల్ మెహతాల బెంచ్ అభిప్రాయపడింది. ఈ విషయంలో తీర్పు ఇచ్చేముందు భార్య అభిప్రాయాన్ని కుటుంబ కోర్టు తెలుసుకోవాలని సూచించింది. 2010లో పిటిషనర్ మహిళకు ఒక వ్యక్తితో వివాహమైంది. 2015లో వీరికి ఒక కుమారుడు కలిగాడు. నర్సుగా ఆమెను ఆస్ట్రేలియాకు పంపాలన్న భర్తకుటుంబ నిర్ణయంతో వ్యతిరేకించి 2017లో ఆమె అత్తింటి నుంచి బయటకు వచ్చింది. దీనిపై భర్త కుటుంబ కోర్టును ఆశ్రయించగా కాపురానికి వెళ్లాలని ఆమెను కోర్టు ఆదేశించింది. దీనిపై ఆ మహిళ హైకోర్టుకు వెళ్లింది. విచారణ జరిపిన కోర్టు బలవంతంగా కాపురం చేయించడం జరగదని తేల్చిచెప్పింది. -
రిలేషన్ షిప్ స్టేటస్ను బయటపెట్టనున్న కియారా..
Kiara Advani And Sidharth Malhotra Relationship: బాలీవుడ్ లవ్ బర్డ్స్ కియారా అద్వానీ-సిద్దార్థ్ మల్హోత్రాలు గత కొంతకాలంగా డేటింగ్లో ఉన్నట్లు బీటౌన్లో వార్తలు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. . అయితే వీరి రిలేషన్పై ఈ జంట ఎప్పుడూ స్పందించలేదు. వారి ప్రేమాయణాన్ని గొప్యంగా ఉంచుతూ వస్తున్నారు. కానీ వీళ్లిద్దరూ కలిసి హాలీడే వెకేషన్స్కి వెళ్లడం,ముంబై రోడ్లపై చెట్టాపట్టాలేసుకుంటూ కెమెరాలకు చిక్కారు. అంతేగాక కియారా పలుసార్లు మల్హోత్రా ఇంటికి వెళ్లిన వీడియో, ఫొటోలు గతంలో విపరీతంగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ప్రేమజంట తమ రిలేషన్ షిప్ను బయటపెట్టాలని చూస్తున్నారట. కొత్త సంవత్సరం సందర్భంగా ఇద్దరూ తమ ప్రేమను అఫీషియల్గా అనౌన్స్ చేయడానికి సిద్ధమైనట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. అంతేకాకుండా త్వరలోనే వీరు పెళ్లి పీటలు ఎక్కాలని కూడా నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది. కాగా కాగా సిద్దార్థ్, కియారాలు తొలిసారి జంటగా‘షెర్షా’మూవీలో కలిసి నటించారు. ఆ సినిమా సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందని బీటౌన్ టాక్. -
స్టేజ్పై సన్నీ అన్న మాటలకు ఎమోషనల్ అయిన సిరి
Bigg Boss 5 Winner Sunny Comments On Shanmukh Friendship With Siri:ఎలాంటి అంచనాలు లేకుండా బిగ్బాస్లోకి అడుగుపెట్టిన సన్నీ టైటిల్ ఎగరేసుకుపోయాడు. టాస్కుల్లో వందశాతం ఆడటంతో పాటు హౌస్లో రియల్ ఎంటర్టైనర్ అనే పేరు సంపాదించాడు. దీంతో పాటు షణ్నూ-సిరిలపై నెగిటివిటి పెరగడం సన్నీకి మరింత లాభం చేకూర్చింది. మచ్చా అంటూ తనదైన మ్యానరిజంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సన్నీ బిగ్బాస్ టైటిల్ను సొంతం చేసుకున్నాడు. ఈ సందర్భంగా గ్రాండ్ ఫినాలేలో మాట్లాడిన సన్నీ.. సిరి, షణ్నూల రిలేషన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'షణ్నూ-సిరిల రిలేషన్ గురించి ఒక క్లారిటీ ఇస్తాను. అది ఈ స్టేజ్ మీదే మాట్లాడాలి. సిరి, అండ్ షణ్ముఖ్ అలాంటి ఫ్రెండిష్ దొరకడం అదృష్టం. నాకు, మానస్కు మధ్య ఎలాంటి స్నేహం ఉందో వాళ్లిద్దరి మధ్య కూడా అదే ఉంది' అంటూ చెప్పుకొచ్చాడు. సన్నీ అన్న మాటలకు సిరి ఎమోషనల్ అయ్యింది. -
హమీదాతో నా రిలేషన్ అదే; ఆ సెంటిమెంట్ వర్కవుట్ కాలేదు: శ్రీరామ్
Bigg Boss 5 Sreeram About Relationship With Hamida And His Journey: బిగ్బాస్ సీజన్-5లో సింగర్ శ్రీరామచంద్ర టాప్-3 స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఇండియన్ ఐడెల్తో బాలీవుడ్లోనూ క్రేజ్ దక్కించుకున్న శ్రీరామ్కు సోనూసూద్, శంకర్ మహదేవన్ సహా పలువురు హిందీ సెలబ్రిటీలు సైతం మద్దతుగా నిలిచారు. అయితే ఓటింగ్లో మాత్రం శ్రీరామ్ మూడవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బిగ్బాస్ జర్నీ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ఓటమికి కారణాలు ఇంకా తెలియదు.. కానీ ప్రేక్షకుల నిర్ణయాన్ని తను అంగీకరిస్తాను. సన్నీ, షణ్నూ ఇద్దరూ తనకు మంచి ఫ్రెండ్స్ కానీ టైటిల్ విన్నర్ ఒకరే కాబట్టి సన్నీ గెలవడం సంతోషంగా ఉంది. ఇండియన్ ఐడెల్ సీజన్-5లో తాను గెలిచాను, దీంతో బిగ్బాస్ తెలుగు సీజన్-5లో కూడా గెలుస్తానని అనుకున్నాను. కానీ ఆ సెంటిమెంట్ వర్కవుట్ కాలేదు. ప్రేక్షకులు నేను మూడో స్థానంలో ఉండాలనుకున్నారు. వాళ్ల నిర్ణయానికి గౌరవిస్తా' అని పేర్కొన్నాడు. ఇక హమీదాతో తన రిలేషన్ గురించి మాట్లాడుతూ.. 'తను నాకు చాలా మంచి ఫ్రెండ్. క్లోజ్ అవుతున్న టైంలోనే బయటకు వెళ్లిపోయింది. ఒకరి గురించి ఒకరికి ఇంకా తెలీదు. బిగ్బాస్లో కొంచెం ఉన్నా దాన్ని పెద్దగా చేసి చూపిస్తారుగా'.. అంటూ ఫన్నీగా బదులిచ్చాడు. : -
షణ్నూ చాలా స్పెషల్, బయట కూడా అలాగే ఉంటాం: సిరి
Bigg Boss 5 Siri Comments About Her Marriage And Negative Trolls On Social Media: బిగ్బాస్ షోలో సిరి-షణ్నూల రిలేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరూ బెస్ట్ఫ్రెండ్స్ అని స్టేట్మెంట్స్ ఇచ్చినా ఆడియెన్స్కు మాత్రం వీరి రిలేషన్ అంతగా రుచించలేదు. బయట వీరిద్దరికి బాగానే ఫాలోయింగ్ ఉన్నా హౌస్లోకి వచ్చాక మాత్రం నెగిటివిటి పెరిగింది. ఈ కారణంగానే టైటిల్ రేసులో ఉన్న షణ్ముక్ కప్పు చేజార్చుకున్నాడనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. తాజాగా హౌస్ నుంచి బయటకు వచ్చిన సిరి తనపై వస్తున్న నెగిటివ్ కామెంట్స్, షణ్నూతో తనకున్న రిలేషన్ గురించి మాట్లాడింది. 'బయటకు రాగానే యూట్యూబ్లో వచ్చిన థంబ్నేల్స్, వీడియోలు,సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్స్ చూసి షాక్ అయ్యా. షణ్నూ నాకు చాలా మంచి ఫ్రెండ్. నా లైఫ్లోనే తను చాలా స్పెషల్. హౌస్ లోపల ఎంత నిజాయితిగా ఉన్నామో, బయటకు వచ్చాక కూడా మేం అలాగే ఉంటాం. షణ్నూ నన్ను చాలా మోటివేట్ చేసేవాడు. అలా మేం క్లోజ్ అయ్యాం. కానీ హగ్ చేసుకోవడం బయట రిసీవ్ చేసుకోలేదు' అని అర్థమైంది. అయినా మా పర్సనల్ లైఫ్ గురించి మా ఇద్దరికీ క్లారిటీ ఉంది. మా లైఫ్ పార్టనర్స్కి కూడా క్లారిటీ ఉంది అని చెప్పుకొచ్చింది. ఇక ప్రియుడు శ్రీహాన్తో పెళ్లి గురించి మాట్లాడుతూ.. తను ఎప్పుడంటే అప్పుడే మా పెళ్లి. బయట ఒకవేళ సినిమా ఆఫర్స్ వస్తే అవి చేస్తూనే పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేస్తా అని పేర్కొంది. -
షణ్నూని ఇష్టపడుతున్నట్లు సిరి నాతో చెప్పింది: యాంకర్ రవి
Bigg Boss Buzzz: Anchor Ravi Shocking Comments on Shannu and Siri Relationship: బిగ్బాస్ సీజన్-5లో యాంకర్ రవి ఎలిమినేషన్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్గా మారింది. టాప్ -5లో ఖశ్చితంగా ఉంటాడనుకున్న రవి అనూహ్య రీతిలో 12వ వారమే హౌస్ నుంచి బయటకు వచ్చాడు. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి కూడా రవి ఎలిమినేట్ కావడాన్ని నెటిజన్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది అన్ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ బిగ్బాస్ను తిట్టిపోస్తున్నారు. రవికి మద్దతిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రవి.. తాను ఎలిమినేట్ అవుతానని అస్సలు ఊహించలేదని, ఇప్పటికీ ఇది షాకింగ్గానే ఉందని తెలిపాడు. బిగ్బాస్ హౌస్లో చాలామంది తనను ‘గుంటనక్క’ అని ఏడిపించినా తానేమీ బాధపడలేదని, దాని గురించి పట్టించుకోలేదని తెలిపాడు. ఇక నటరాజ్ మాస్టర్ అయితే హౌస్లోకి ఏదో ఇంటెన్షన్తోనే లోపలికి వచ్చాడని అభిప్రాయపడ్డారు. తనకు తెలిసి ఎవరినీ ఇన్ఫ్లూయెన్స్ చేయలేదు అని, ఒకవేళ తన మాటలకు వాళ్లు ఇన్ఫ్లూయెన్స్ అయ్యారేమో అంటూ కామెంట్ చేశాడు. ఇక షణ్నూ-సిరిల రిలేషన్ గురించి మాట్లాడుతూ... 'షణ్ముఖ్ దీప్తిని ఎంత లవ్ చేస్తాడో.. సిరి చోటూని ఎంత లవ్ చేస్తుందో ఈ ఇద్దరికీ తెలుసు.. కానీ హౌస్లో సిరి షణ్నూని ఇష్టపడుతుంది. ఈ విషయాన్ని స్వయంగా సిరినే చెప్పింది. అన్నా...ఐ లైక్ హిమ్ అని సిరి నాతో ఓపెన్అప్ అయ్యింది' అంటూ వివరించాడు. చదవండి: యాంకర్ రవి ఎలిమినేట్ అవ్వడానికి కారణాలు ఇవేనా? -
ఇప్పట్లో రకుల్ పెళ్లి లేనట్లే.. అసలు నిజం చెప్పేసిన బ్యూటీ
Rakul Preet Singh Talks About Her Wedding Plans With Jackky Bhagnani: స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవలె తను ప్రేమ విషయాన్ని బయటపెట్టిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ హీరో, నిర్మాత జాకీ భగ్నానీతో కొంతకాలంగా సీక్రెట్గా ప్రేమ వ్యవహరం కొనసాగిస్తుంది. ఇటీవలె తన 31వ బర్త్డే సందర్భంగా తన రిలేషన్షిప్ గురించి రివీల్ చేసి ఆశ్చర్యపరిచింది. ఈమధ్య కాలంలో బాలీవుడ్పై ఫోకస్ పెట్టిన ఈ బ్యూటీ ప్రస్తుతం “థాంక్స్ గాడ్” అనే మూవీ ప్రమోషన్స్లో బిజీగా ఉంది. ఈ చిత్రంలో అజయ్ దేవగన్, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రకుల్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. నాకు నచ్చిన విషయాలు వినడానికి మాత్రమే ఇష్టపడతాను. 'నా వ్యక్తిగత జీవితం గురించి ఎందుకు బయటపెట్టానంటే..అది ఓ అందమైన విషయం. అందరితో పంచుకోవాలనుకున్నా.పెళ్లికి అంత తొందరలేదు. ప్రస్తుతం నా దృష్టి అంతా కెరీర్పైనే ఉంది. సో ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. చేసుకోవాలనుకున్నప్పుడు మీ అందరితో పంచుకుంటాను' అని పేర్కొంది. -
బిగ్బాస్: 'నువ్వు ఇలా చేస్తావనుకోలేదు..నాతో రిలేషన్లో ఉండి'..
టెలివిజన్ చరిత్రలో బిగ్బాస్ రియాలిటీ షోకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ భాషలో అయినా బిగ్బాస్ షో టీఆర్పీ రేటింగులో దూసుకుపోతుంది. ఇక హిందీ బిగ్బాస్ సీజన్ 15 రోజురోజుకూ రసవత్తరంగా సాగుతుంది. తాజాగా మోడల్ రాజీవ్ అదాతియా వైల్డ్ కార్డ్గా బిగ్బాస్ హౌస్లో ఎంట్రీ ఇచ్చాడు. రావడం రావడంతోనే కంటెస్టెంట్ ఇషాన్ సెహగాల్తో తన రిలేషన్షిప్ను చెప్పి బాంబు పేల్చాడు. మీషా అయ్యర్తో సన్నిహితంగా ఉండటం ఏంటని నిలదీశాడు. ఏ కారణం వల్ల బిగ్బాస్ హౌస్కు వచ్చావ్? ఇక్కడ ఏం చేస్తాన్నావ్ అంటూ ఫైర్ అయ్యాడు. 'మనమిద్దరం చాలా కాలం పాటు రిలేషన్లో ఉన్నాం. ఇప్పుడు నువ్వు మీషాతో లవ్లో ఉండటం ఏంటి? అయినా 3రోజుల్లో ప్రేమ పుడుతుందా? నీ నుంచి ఇలాంటిది జరుగుతుందని నేను ఊహించలేదు. ఆ అమ్మాయికి నువ్వు అబద్దపు ప్రమాణాలు ఎందుకు చేస్తున్నావ్? నువ్వు నాకు ఏం ప్రామిస్లు చేశావో గుర్తింది కదా' అంటూ ఇద్దరి రిలేషన్కు సంబంధించిన డార్క్ సీక్రెట్ను బయటపెట్టాడు. కాగా బిగ్బాస్ సీజన్15లో ఇషాన్- మీషా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. మరి ఇషాన్ బై-సెక్సువల్ అని తెలిశాక మీషా-ఇషాన్ల లవ్కు బ్రేకప్ పడనుందా? లేక ఇది ట్రయాంగిల్గా మారనుందా అన్నది ఎంట్రెస్టింగ్గా మారింది. కాగా ఇటీవలె ఇషాన్ లవ్ ప్రపోజ్ చేయగా మీషా సైతం లవ్ యూ టూ అంటూ అతని ప్రేమను అంగీకరించింది. ఇక తెరపై వీళ్లిద్దరూ చేసే మితిమీరిన రొమాన్స్కు ఫ్యామిలీ ఆడియోన్స్ సైతం ఇబ్బంది పడుతున్నారు. ఇదే విషయంపై హోస్ట్ సల్మాన్ సైతం వీరిద్దరిని హెచ్చరించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by ColorsTV (@colorstv) -
రియల్ లెజెండ్స్, రీల్ రొమాంటిక్ కపుల్
సాక్షి, హైదరాబాద్: 67 ఏళ్లు దాటినా అందానికే అందం ఆమె. ఎనభైకి దగ్గర పడుతున్నా ఉరిమే ఉత్సాహానికి.. గాంభీర్యానికి పెట్టింది పేరు ఆయన. ఇద్దరి కిద్దరూ బాలీవుడ్ మెగాస్టార్లే ..వారే ది లెజెండ్స్ బిగ్బీ అమితాబ్ బచ్చన్, అందాల అభినయం రేఖ. సంవత్సరాలు వేరైనా ఇద్దరి పుట్టిన రోజులు ఒకటే నెలలో రావడం, అదీ ఒక రోజు తేడాలో ఉండటం విశేషమే మరి. చీర కడితే ఆ చీరకే వన్నె తెచ్చే అందం రేఖ సొంతమైతే, 79 ఏళ్ల వయసులో టోటల్ బాలీవుడ్లోనే బెటర్ డ్రెస్సర్గా నిలిచిన ఘనత బీగ్ బీ సొంతం. రియల్ లెజెండ్స్.. రీల్ లైఫ్ సూపర్ జోడీపై స్పెషల్ స్టోరీ... -
రకుల్ పెళ్లి చేసుకోబోయే ఈ జాకీ భగ్నానీ ఎవరో తెలుసా!
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నేడు 31వ వసంతంలోకి అడుగుపెడుతోంది. ఈ రోజు(అక్టోబర్ 10) ఆమె బర్త్డే సందర్భంగా ఓ కీలక విషయాన్ని అభిమానులతో పంచుకుంది. కొంత కాలంగా బాలీవుడ్ హీరో జాకీ భగ్నానీతో సీక్రెట్గా ప్రేమాయాణం నడిపిన రకుల్ తాజాగా వారి బంధాన్ని అధికారికంగా ప్రకటించింది. దీంతో రకుల్ త్వరలోనే జాకీని పెళ్లి చేసుకోబోతోందని, అందుకే తమ రిలేషన్షిప్ ఆఫీషియల్ చేసిందని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. చదవండి: త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోన్న రకుల్!, వరుడు ఎవరంటే.. మరోవైపు జాకీ భగ్నానీ కూడా తన ఇన్స్టాగ్రామ్ రకుల్ బర్త్డే విషెస్ చెబుతూ రకుల్పై తన ప్రేమను వ్యక్తం చేశాడు. దీంతో వీరికి కృతి సనమ్, టైగర్ ష్రాఫ్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, రాశి ఖన్నా, కాజల్ అగర్వాల్ ఆయుష్మాన్ ఖురానాతో పలువురు సెలబ్రిటీలు అభినందనలు తెలిపారు. ఈ క్రమంలో అసలు ఈ జాకీ భగ్నానీ ఎవరని నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. ఈ మేరకు జాకీ భగ్నానీ బాలీవుడ్ నటుడు, నిర్మాతగా రాణిస్తున్నాడు. అతడు కోల్కతాలోని సింధీ ఫ్యామిలిలో జన్మించాడు. చదవండి: నాకు మళ్లీ కరోనా:ప్రగ్యా జైస్వాల్ View this post on Instagram A post shared by JACKKY BHAGNANI (@jackkybhagnani) పూజా ఎంటర్టైన్మెంట్స్ పేరు మీద అతని తండ్రి వషు భగ్నానీ సినిమాలు నిర్మిస్తున్నారు. జాకీ భగ్నానీ.. 2009లో ఓ మూవీతో హీరోగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత అతడు సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ వచ్చాడు. 2016లో సరబ్జిత్ సినిమాతో ప్రొడ్యూసర్గా మారాడు. ఈ మూవీలో ఐశ్వర్యరాయ్, రణ్ దీప్ హుడా కీలక పాత్రల్లో నటించారు. కాగా త్వరలో జాకీ భగ్నానీ అక్షయ్ కుమార్ హీరోగా, రకుల్ హీరోయిన్గా ఓ సినిమాను నిర్మించనున్నాడు. కాగా జాకీ భగ్నాని కూడా రకుల్ లాగే ఫిట్నెస్ ఫ్రీక్ అని తెలుస్తోంది. View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) -
'నా మాజీ భార్య ఎవరినైనా ఇష్టపడ్డా నేను సంతోషిస్తా'
హిందీ బిగ్బాస్ ఓటీటీ టాప్5 కంటెస్టెంట్లు రాకేత్ బాపత్, షమితా శెట్టి ప్రస్తుతం ప్రేమలో మునిగితేలుతున్నారు. హౌస్లో ఇద్దరి మధ్యా నడిచిన ప్రేమాయణం షో మొత్తానికే హైలైట్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇటీవలె ఈ సీజన్ గ్రాండ్గా ముగిసింది. అయితే షో అయిపోయిన తర్వాత కూడా వీరు ప్రేమాయణం కొనసాగిస్తున్నారు. ఇటీవలె ఇద్దరూ కలిసి డిన్నర్ డేట్కు సైతం వెళ్లారు. ఈ సందర్భంగా యూ అండ్ ఐ అంటూ ఇన్స్టాలో ఫోటోలు షేర్ చేసుకున్నారు. చదవండి : ఖరీదైన కారును వదిలి ఆటోలో ప్రయాణించిన హీరోయిన్ ఇదిలా ఉండగా బిగ్బాస్ షో అనంతరం తన మాజీ భార్య రిధితో మాట్లాడానని, షమితాతో నా రిలేషన్ని ఆమె స్వాగతించిందని తెలిపాడు. 'నా బిగ్బాస్ జర్నీ పట్ల రిధికి కూడా నచ్చింది. అంతేకాకుండా నేనే షమితాతో ఉండటం చూసి ఆమె సంతోషించింది. అంతేకాకుండా ఒకవేళ రిధి ఎవరినైనా ఇష్టపడ్డా నేను సంతోషిస్తా. ఎవరి నిర్ణయాలు వాళ్లవి. మేం ఇద్దరం ఎంతో మెచ్యూర్గా ఆలోచిస్తాం. భార్యభర్తలుగా విడిపోయినా ఇప్పటికీ మేం మంచి స్నేహితులుగా కొనసాగుతున్నాం' అని పేర్కొన్నారు. కాగా ఏడేళ్ల వివాహ బంధం అనంతరం రాకేశ్ రిధి దంపతులు విడాకులు తీసుకున్నారు. చదవండి :సారికతో కపిల్దేవ్ బ్రేకప్ లవ్స్టోరీ -
సల్మాన్తో ఇప్పటికీ టచ్లోనే ఉంటా : సల్లు భాయ్ మాజీ ప్రేయసీ
కండల వీరుడు, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నడిపిన ప్రేమయాణాల గురించి తెలిసిందే. ఒకప్పటి హీరోయిన్ సంగీత బిజ్లానీతో దాదాపు దశాబ్దం పాటు డేటింగ్ చేశాడు సల్లు భాయ్. పెళ్లిదాకా వచ్చిన వీరి బంధం ఎందుకో బెడిసికొట్టింది. అనంతరం బిజ్లానీ ఇండియన్ మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ను వివాహం చేసుకుంది, అయితే 2010లో అతడితో విడాకులు తీసుకుంది. (చదవండి: మెంటల్ వెకేషన్లో హైదరాబాద్ కోడలు) అయితే ఇటీవల బిజ్లానీ ఓ ప్రముఖ పత్రికకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆమెను మీరు సినీ ఇండస్ట్రీలో ఎవరితో టచ్లో ఉంటారు అని అడగగా.. ‘సల్మాన్తో విడిపోయిన తర్వాత కూడా మేం మంచి స్నేహితులుగానే ఉన్నాం అని తెలిపింది. ఎందుకంటే మేం స్నేహానికి గౌరవమిస్తాం’ అని సల్లు భాయ్ మూవీ ‘మైనే ప్యార్ కియా’లోని డైలాగ్ ఒకటి చెప్పింది. అలాగే మీనాక్షి శేషాద్రితో సన్నిహితంగా ఉంటానని, వారిద్దరూ కలిసి వరల్డ్ టూర్ చేసినట్లు తెలపింది. మోడలింగ్ రోజుల నుంచి నేను కొల్పోయిన పాత స్నేహితులు అందరూ టచ్లోకి వచ్చారని, అందుకు కారణమైన సోషల్ మీడియాకి థ్యాంక్స్ చెప్పింది. కాగా, పెళ్లి తర్వాత సినిమా నుంచి విరామం తీసుకున్న సంగీత అంతకుముందు త్రిదేవ్, హథ్యార్, జుర్మ్తో వంటి హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె ఇటీవల డ్యాన్స్ రియాలిటీ షో సూపర్ డాన్సర్ ఓ ఎపిసోడ్లో కనిపించింది. -
బాయ్ఫ్రెండ్గా కొనసాగాలంటే..బాండ్ మీద సంతకం చేయాల్సిందే..!
టిండర్ ఈ యాప్ గురించి మనలో చాలా తక్కువ మందికి తెలుసు అనుకుంటా..! టిండర్ ఒక డేటింగ్ యాప్. ఈ యాప్తో తమకు నచ్చిన వ్యక్తులను పరిచయం చేసుకోని వారితో డేటింగ్ చేస్తూ వారి అభిరుచులను తెలుసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ యాప్తో కలుసుకున్న జంటలు కొన్ని పెళ్లి వరకు కూడా పోయాయి. మరి కొంత మందికి సరైన జోడి వెతుకులాటలో మోసపోయిన సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. చదవండి: Apple : మూఢనమ్మకాలను నమ్ముతున్న ఆపిల్..! ఎంతవరకు నిజం..? తాజాగా అమెరికాకు చెందిన యానీ రైట్ అనే మహిళ టిండర్లో పరిచయమైన మైక్ హెడ్తో మొదటిసారి డేటింగ్ చేశాక తన బాయ్ఫ్రెండ్గా స్వీకరించడంకోసం విచిత్రమైన ఐడియాతో ముందుకొచ్చింది. గతంలో తనకు జరిగిన పొరపాటును తిరిగి పునరావృతం కాకుండా ఉండడం కోసం పకడ్బందీగా ఒక బిజినెస్ డీల్ లాగా 17 పేజీల బాండ్పై సంతకం చేసి తనకు హమీ ఇవ్వాలని కాబోయే బాయ్ఫ్రెండ్కు తెలిపింది. బాండ్లో ఉన్న కట్టుబాట్లకు కచ్చితంగా నడుచుకుంటాననే హమీ ఇస్తేనే బాయ్ప్రెండ్గా స్వీకరించడానికి సిద్ధమని మైక్ హెడ్తో పేర్కొంది. తొలుత షాక్కు గురైన మైక్ హెడ్ 17 పేజీల బాండ్పై సంతకం చేసి యానీకి బాయ్ ఫ్రెండ్గా కొనసాగుతున్నాడు. వీరి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఇరువురు నిజాయితీని, ఒకరికొకరికి కావాల్సిన అవసరాలను తీర్చడంలో, ఇరువురు మధ్య స్పష్టమైన కమ్యూనికేషన్ ఉండాలని ఒప్పందంలో ఉన్నాయి. కాగా ఈ జోడీ ఈ బంధాన్ని బిజినెస్ డీల్గానే చూస్తామనడం కొసమెరుపు. చదవండి: అగ్రరాజ్యాలను వెనక్కినెట్టి సరికొత్త రికార్డు సృష్టించిన భారత్..! -
పెళ్లి రూమర్లపై స్పందించిన శ్రుతి హాసన్
Shruti Haasan Clarity On Marraige :హీరోయిన్ శ్రుతి హాసన్ గత కొంతకాలంగా డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కలిసి పార్టీలు, డిన్నర్ డేట్లకు వెళ్తూ ఈ జంట పలుసార్లు కెమెరాకు చిక్కారు. దీంతో ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరినట్లయ్యింది. అంతేకాకుండా శాంతనుతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలను శ్రుతి తరుచూ సోషల్మీడియాలో షేర్ చేస్తుంటుంది. తాజాగా వీరిద్దరి రిలేషన్, పెళ్లికి సంబంధించిన అంశాలపై శ్రుతి హాసన్ స్పందిస్తూ.. 'శాంతను నా బెస్ట్ ఫ్రెండ్. కళలు, సంగీతం పట్ల అతనికి అవగాహన ఉంది. మా ఇద్దరి అభిరుచులు ఒకటే. అందుకే అతనితో ఎక్కువ సమయం గడిపేందుకు ఇష్టపడతా. నాకు తనంటే ఎంతో గౌరవం ఉంది' అని పేర్కొంది. ఇక పెళ్లి ప్రస్తావనపై మాట్లాడుతూ.. 'చాలా మంది నా పెళ్లి గురించి అడుతున్నారు. ఇందులో ఎలాంటి సీక్రెట్స్ లేవు. నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడే ఆ వివరాలను మీడియాకు వెల్లడిస్తా. కానీ ప్రస్తుతం నాకు పెళ్లిచేసుకోవాలన్న ఆలోచన లేదు' అని తెలిపింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. క్రాక్ సినిమాతో హిట్టు కొట్టిన శ్రుతి ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ మూవీలో నటిస్తుంది. ఈ సినిమాతో తొలిసారి ఆమె ప్రభాస్తో జత కట్టనుంది. చదవండి : నితిన్ మాస్ట్రో మూవీ ఇంట్రెస్టింగ్ వీడియో -
భారత్తో వ్యాపార, రాజకీయ సంబంధాలు, తొలిసారి స్పందించిన తాలిబన్లు
సాక్షి, న్యూఢిల్లీ: అఫ్గాన్ను స్వాధీనం చేసుకున్న తరువాత భారత్తో సంబంధాలపై తాలిబన్లు కీలక ప్రకటన చేశారు. భారత దేశంతో రాజకీయ, వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలను కొనసాగించాలని కోరుకుంటున్నా మని తాలిబన్ అగ్రనేత షేర్ మహమ్మద్ అబ్బాస్ స్టనెక్జాయ్ వెల్లడించారు. ఇండియా తమకు ముఖ్యమైన దేశమని అభివర్ణించారు. ఈ మేరకు తాలిబన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఆయనొక వీడియోను షేర్ చేశారు. చదవండి : Taliban-Afghanistan: జానపద గాయకుడిని కాల్చి చంపిన తాలిబన్లు అఫ్గానిస్తాన్ను వశం చేసుకున్న తర్వాత తాలిబన్ అగ్రనేత భారత్తో సంబంధాలపై స్పందించడం ఇదే తొలిసారి. వివిధ గ్రూపులు, రాజకీయ పార్టీలతో సంప్రదింపుల ద్వారా కాబూల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయ బోతున్నామని చెప్పారు. ఇది "విభిన్న వర్గాల" ప్రజల ప్రాతినిధ్యాలను కలిగి ఉంటుందంటూ దాదాపు 46 నిమిషాల వీడియోలో పలు కీలక విషయాలను ప్రస్తావించారు. షరియా ఆధారంగా ఇస్లామిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. భారత్, పాకిస్తాన్, చైనా, రష్యా సహా వివిధ దేశాలతో సంబంధాలపై కూడా అబ్బాస్ మహమ్మద్ స్పందించారు. పాకిస్తాన్ ద్వారా భారతదేశంతో వాణిజ్యం చాలా ముఖ్యమైందని అన్నారు. దీనితో పాటు, ఇరాన్ గురించి మాట్లాడుతూ, అఫ్గాన్లో చాంబహార్ పోర్టుని భారత్ అభివృద్ధి చేసిన విషయాన్ని షేర్ మహమ్మద్ అబ్బాస్ స్టనెక్జాయ్ గుర్తు చేశారు. కాగా 1980 ప్రారంభంలో డెహ్రాడూన్లోని ప్రతిష్టాత్మక ఇండియన్ మిలిటరీ అకాడమీలో శిక్షణ పొందిన విదేశీ క్యాడెట్ల బృందంలో స్టానెక్జాయ్ ఒకరు. తరువాత అతను అఫ్గాన్ సైన్యాన్ని విడిచిపెట్టారు. చదవండి: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. -
సీక్రెట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్న కత్రినా-విక్కీ కౌశల్?
Katrina Kaif -Vicky Kaushal: బాలీవుడ్ లవ్ బర్డ్స్ కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ సీక్రెట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. గత కొన్నాళ్లుగా ప్రేమలో మునిగితేలుతున్న ఈ జంట త్వరలోనే పెళ్లి బంధంలోకి అడుగుపెడుతున్నారంటూ కొంత కాలంగా బీటౌన్ మీడియా కోడై కూస్తుంది. కానీ తాజాగా జరిగిన రోకా ఫంక్షన్లో కత్రినా- విక్కీ ఉంగరాలు మార్చుకున్నారంటూ ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్ల నుంచి వీరికి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ‘ఫీలింగ్ సారీ ఫర్ సల్మాన్ ఖాన్’ అంటూ మరికొందరు నెటిజన్లు వ్యంగ్యంగా పోస్టులు షేర్ చేస్తున్నారు. కత్రినా-విక్కీ ఎంగేజ్మెంట్పై పెద్ద ఎత్తున వార్తలు బయటకు వస్తుండటంతో ఆమె టీం దీనిపై క్లారిటీ ఇచ్చింది. 'రోకా వేడుక జరిగిందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. కత్రినా అతి త్వరలోనే ‘టైగర్-3’ షూట్ కోసం విదేశాలకు వెళ్తున్నారు' అని పేర్కొన్నారు. కాగా దాదాపు రెండేళ్లుగా విక్కీ-కత్రినా డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. న్యూఇయర్ పార్టీకి మాల్దీవులకు వెళ్లడం, కలిసి ప్రైవేటు పార్టీలు, వేడుకల్లో పాల్గొనడంతో ఈ రూమర్స్కు మరింత బలం చేకూరింది. అంతేకాకుండా ఓ షోలో సోనమ్ కపూర్ సోదరుడు, నటుడు హర్షవర్ధన్ కపూర్ కూడా కత్రినా-విక్కీ కౌశల్ రిలేషన్ షిప్లో ఉన్నారంటూ బాంబు పేల్చాడు. దీంతో ఇక వీరు ఏడడుగులు వేయడమే తరువాయి అంటూ బీటౌన్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. చదవండి : katrina kaif : కత్రినా కైఫ్ పెళ్లిపై సల్మాన్ ఖాన్ మేనేజర్ హింట్ లవ్ యూ మరిది గారూ.. భావోద్వేగానికి గురైన సోనం -
మలైకతో అర్జున్ డేటింగ్, తన గతాన్ని గౌరవిస్తున్నాను
ప్రస్తుతం బాలీవుడ్ లవ్బర్డ్స్ అంటే వెంటనే గుర్తొచ్చేది మలైకా అరోరా-అర్జున్ కపూర్ల జంట. అంతగా ఈ జంట బి-టౌన్లో చక్కర్లు కొడుతున్నారు. కొంతకాలం సిక్రెట్ డేటింగ్లో ఉన్న వీరు ఏడాది క్రితమే వారి రిలేషన్ను అధికారికంగా ప్రకటించారు. అయితే మొదట్లో ఈ జంట పెద్దగా కలిసి తిరిగేవారు కాదు. పైగా వారి రిలేషన్ గురించి బయట ఎక్కడా ప్రస్తావించడానికి ఆసక్తిని చూపేవారు కాదు. తాజాగా దీనికి కారణాన్ని వెల్లడించాడు అర్జున్. కాగా మలైకా, అర్జున్ కంటే 12 ఏళ్లు పెద్దదనే విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్తో మలైకా విడాకులు తీసుకుని విడిపోయింది. అనంతరం అర్జున్తో ప్రేమ వ్యవహారన్ని కొనసాగిస్తోంది. అయితే మలైకా-అర్భాజ్ ఖాన్ దంపతులకు ఆర్హాన్ అనే కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం అర్హాన్ మలైకాతోనే ఉంటున్నాడు. ఇదిలా ఉండగా ఇటీవల ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అర్జున్ తమ ప్రేమ వ్యవహరాన్ని గోప్యంగా ఉంచడానికి కారణం చెప్పాడు. ‘నేను నా వ్యక్తిగత విషయాలను బహిరంగంగా మాట్లాడేందుకు ఇష్టపడను. ఎందుకంటే నా జీవిత భాగస్వామిని గౌరవించాలన్నది నా అభిప్రాయం. అంతేకాదు తనకు ఓ గతం కూడా ఉంది. నేను మా రిలేషన్ గురించి మాట్లాడే ముందు తనకు ఓ కుమారుడు కూడా ఉన్నాడనేది దృష్టి పెట్టుకుని వ్యవహరించాలి. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు, పరిస్థితులు పిల్లలను ప్రభావితం చేస్తాయి. అందుకే మా వ్యక్తిగత విషయాలను ఎక్కువగా ప్రస్తావించను’ అంటు చెప్పుకొచ్చాడు. అంతేగాక తను మలైకా గతానికి గౌరవం కూడా ఇస్తానని చెప్పాడు. ‘నేను మా మధ్య ఉన్న కొన్ని సరిహద్దులను గౌరవించడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే భాగస్వామిగా తనకు నేను సౌకర్యవంతమైన పరిస్థితులను ఇవ్వాలి. అందుకే మా మధ్య కొన్ని సరిహద్దులను సృష్టించుకున్నాము. ఇక ఈ రోజు నేను దీనిపై మాట్లాడటానికి కారణం లేకపోలేదు. ఇంతకాలం మేము మాకు కావాల్సినంత సమయాన్ని కేటాయించుకున్నాము. ఇప్పుడు తన గురించి నేను, నా గురించి తను పూర్తిగా తెలుసుకుని ఒకరినొకరం అర్థం చేసుకున్నాం. దీనివల్ల తనపై, తన గతంపై నాకు ఇంకా గౌరవం పెరిగింది’ అంటూ అర్జున్ వివరణ ఇచ్చాడు. కాగా అర్జున్ నటించిన ‘సర్దార్ కా గ్రాండ్సన్’ మూవీ నెట్ఫ్లీక్స్లో విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో నీనా గుప్తా కీలక పాత్రలో కనిపించారు. ప్రస్తుతం అర్జున్ నటిస్తున్న భూట్ పోలీసులో సైఫ్ అలీ ఖాన్, జాక్వేలిన్ ఫెర్నాడేజ్, యామి గౌతమ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. -
నా ప్రియుడు మరీ ఇంత నీచంగా ఆలోచిస్తాడా?
సంబంధ బాంధవ్యాలు చాలా గమ్మత్తైనవి. ముఖ్యంగా రిలేషన్లో ఉన్నప్పుడు ఎవర్ని ఎవరు ఇష్టపడుతున్నారో, ద్వేషిస్తున్నారో అర్ధం చేసుకోవడం చాలా కష్టం అని అంటోంది ఓ యువతి. ప్రేమ స్వర్గపుటంచుల్లో విహరిస్తున్న ఆ యువతికి తన ప్రియుడి నుంచి ఎదురవుతున్న ఇబ్బందుల్ని నెటిజన్లతో పంచుకున్నారు. ప్రస్తుతం ఆ యువతి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ యువకుడితో రిలేషన్లో ఉన్న సదరు యువతి తన ప్రియుడు లేని సమయంలో బికిని ధరించాలని భావిస్తున్నారు. కానీ అందుకు ఆమె ప్రియుడు ఒప్పు కోవడం లేదు. ఎందుకంటే అతను ఇతర మగాళ్లను అస్సలు నమ్మడు. ఎందుకంటే బికిని ధరించిన అమ్మాయిల్ని తదేకంగా చూస్తానని, తను బికినీ ధరిస్తే కూడా ఇతర మగాళ్లు అలాగే చూస్తారని అనటం తనను ఎంతగానో బాధించిందని పేర్కొన్నారు. ఈ విషయంపై అతనితో వాధించానని, తను బికిని ధరించడం ఇష్టం లేకపోతే చెప్పాలని తెలిపానన్నారు. కానీ బికిని ధరించిన అమ్మాయిల్ని అలా ట్రీట్ చేయడం మానుకోవాలని హితవు పలికినట్లు చెప్పుకొచ్చారు. బికిని ధరించిన వాళ్లను ఎందుకు అలా ట్రీట్ చేస్తున్నావని ప్రశ్నించానని తెలిపారు. తనను బికినిలో చూడకూడదని అతను అనుకోవటం మంచిదే. కానీ ఇతర అమ్మాయిల గురించి అసభ్యంగా అనుకోవద్దని చెబితే తన మాటల్ని కొట్టిపారేస్తున్నాడని ఆమె తన అనుభవాల్ని నెటిజన్లతో షేర్ చేసుకున్నారు. ‘నా ప్రియుడి ఆలోచనను నేను చాలా అగౌరవంగా భావిస్తున్నాను. నా శరీరాన్ని అందంగా తీర్చిదిద్దుకోవడానికి చాలా కష్టపడుతున్నాను. ఇతరుల అటెన్షన్ను పొందడానకి బికిని ధరించడం లేదన్నా అతను నమ్మటంలేదు. పరాయి పురుషుల్ని నమ్మడు. అతను ఇతరుల పట్ల ఆలోచిస్తున్న తీరు చూస్తుంటే నాకు విసుగొస్తుంది. ప్రేమ అనే ముసుగు ధరించిన అతను నాకు రక్షణగా నిలుస్తున్నాడా?. లేదంటే నన్ను వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడా?’ అని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ఆమె ప్రియుడి ఆలోచనపై పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ‘అతను మిమ్మల్ని నమ్మడం లేదు. మిమ్మల్ని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నాడు. అతనికి గుడ్బై చెప్పడం మంచిది’ అని ఓ నెటిజన్ సలహా ఇచ్చాడు. ‘మీరు బికినీ ధరించడాన్ని నియంత్రిస్తున్నాడంటే, వివాహం తర్వాత మీ స్వేచ్ఛను ఎలా హరిస్తాడో ఊహించుకోండి’ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ‘అతను మిమ్మల్ని నమ్ముతున్నాడా? లేదా అనేది ముఖ్యం కాదు. మీరు ఎలాంటి దుస్తుల్ని ధరించినా, మిమ్మల్ని చూడనివ్వకుండా ఆపలేడు. మిమ్మల్ని అతను ఎలా ట్రీట్ చేస్తున్నారనేది మీరే డిసైడ్ చేసుకోవాలి’ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. చదవండి: వైరల్: అమ్మాయి టీ-షర్ట్పై ఆర్జీవీ కొంటె కామెంట్.. -
అనుబంధాలకూ కరోనా గండం!
సాక్షి, అమరావతి: ఏడాది క్రితం లాక్డౌన్ సమయంలో కృష్ణ జిల్లా గుమ్మడిదూరులోని వెంకటేశ్వరరావుకు నెల రోజుల పాటు ఆనందమే కన్పించింది. హైదరాబాద్ నుంచి అన్న కొడుకు సంజీవ్.. బెంగళూరు నుంచి తమ్ముడి కూతురు స్వప్న.. పుణె నుంచి తన కొడుకు మనోహర్.. ఊరొదిలిన ఇంకా అనేక మంది వచ్చారు. రోజుకో ఇంట్లో కలిసేవాళ్లు. చిన్నతనంలో ఆడిన అష్టాచెమ్మా.. దాడితో పాటు.. క్యారం బోర్డు.. సందడే సందడి. ఇప్పుడూ.. మళ్లీ అంతా ఇల్లు చేరారు. కానీ ఎవరూ ఎవరింటికీ వచ్చే సాహసం చేయడం లేదు. సంజీవ్ వస్తుంటేనే ముఖానికి గుడ్డ (మాస్క్) కట్టుకుంటున్నాడు మనోహర్. ఆఖరుకు పక్కింటికి వెళ్లడానికి ఇష్టపడడం లేదు. అప్పట్లో లాగా ఉదయం నడక కూడా లేదు. పలకరింపులన్నీ ఫోన్లోనే. వీడియో కాల్లోనే యోగక్షేమాలు. మొదటి దశలో ఇలా.. మొదటి విడత కరోనా కాలంలో ఒక రకంగా కుటుంబ అనుబంధాలు పెరిగాయి.‘అబ్బా ఎన్నాళ్లకు ఆనందం చూశాం’ అంటూ ఇంటి పెద్దల్లో ఆనందం ఉండేది. ఉపాధి వేటలో ఊరొదిలిన వాళ్లు సైతం సొంతూళ్లకు రావడంతో జ్ఞాపకాలు నెమరు వేసుకునే అవకాశం చిక్కింది. మనసారా మాట్లాడుకునే సమయం వచ్చింది. ‘ఉదయం అంతా కలిసే వాకింగ్కు వెళ్లే వాళ్లం. మధ్యాహ్నం అంతా కలిసే భోజనం చేసేవాళ్లం’ గతేడాది సన్నివేశాన్ని తెలిపింది లక్ష్మి. వాళ్లకే తెలియని చిన్ననాటి విషయాలు చెబుతుంటే.. పొలం గట్టుకు తీసుకెళ్లి చూపిస్తుంటే.. ఆ సాఫ్ట్వేర్ పిల్లలు నిజంగా చిన్నపిల్లలే అయ్యారని వెంకటేశ్వరరావు తెలిపారు. ఎక్కడ్నుంచో ఊరికొచ్చిన వాళ్లు కాకపోతే ఓ వారం పాటు ఇల్లు కదలకుండా (క్వారంటైన్) ఉండేవాళ్లు. ఆ తర్వాత అంతా ఫ్రీనే. అమ్మమ్మ, తాతయ్యతో నెలకోసారి కూడా మాట్లాడే వీల్లేని వాళ్లు దాదాపు మూడు నెలలు కలిసిమెలిసి ఉన్నారు. ఎక్కడ్నుంచో వచ్చి.. ఊళ్లో చిన్ననాటి మిత్రులతో ఆడుకోవడం కొత్త అనుభవంగా ఫీలయ్యారు. నిజానికి కరోనా కష్టకాలమే అయినా.. ఊరంతా ఓ పండుగ వాతావరణమే ఉండేది. ప్రస్తుతం అంతా రివర్స్.. ఇప్పుడా పరిస్థితి ఎక్కడా కన్పించడం లేదు. ఒక ఇంట్లో వాళ్లే కారులో వెళ్లినా మాస్క్ వేసుకోవడం తప్పనిసరి. కలిస్తే కరోనా.. మాట్లాడితే కరోనా.. దగ్గరగా వెళ్తే కూడా వచ్చే ఛాన్స్ ఉందంటూ జరిగే ప్రచారంతో భయం పట్టుకుంది. కనీసం పక్కింటి నుంచి మంచినీళ్లు కూడా అడగలేకపోతున్నారు. ‘జగ్గయ్యపేటలో ఉండే బంధువు ఇంట్లో చిన్న పూజ పెట్టుకున్నారు. పిలవడానికొస్తామంటే.. వద్దు ఫోన్లో చెప్పారుగా చాలు’ అనాల్సి వచ్చిందని విజయవాడలో ఉంటున్న సంధ్యారాణి తెలిపింది. వత్సవాయికి చెందిన సత్యవేణి విజయవాడలో ఉన్న తన తండ్రికి బాగోలేకపోతే వీడియో కాల్లోనే పరామర్శించినట్టు చెప్పింది. గ్రామాల్లోనైతే మెయిన్ గేట్కు తాళం పెట్టుకుని ఇంట్లోకి ఎవరూ రాకుండా కట్టడి చేస్తున్నారు. ఏడాదిలోనే ఆ బంధం ఏమైంది? ఇంతలోనే ఆ అనుబంధాన్ని కరోనా ఎలా కమ్మేసింది? మనిషికి మనిషి దూరం అనివార్యమే అయినా... పెనవేసుకున్న అనుబంధాన్ని అది దూరం చేసిందనే బాధ ప్రతిఒక్కరిలోనూ కన్పిస్తోంది. -
నయా పాకిస్తాన్ తీరు నమ్మదగిందేనా?
పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ బజ్వా.. భారత్తో ప్రాంతీయ వాణిజ్యం, కనెక్టివిటీని పెంచుకోవడానికి చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఆ తర్వాత భారత్, పాకిస్తాన్ సైనికాధికారులు నియంత్రణ రేఖ వద్ద కాల్పుల విరమణ ఒడంబడికను చేసుకున్నారు. మరోవైపున, పాక్ ఆర్థిక మంత్రి హమీద్ అజర్ నేతృత్వంలోని ఆర్థిక సమన్వయ కమిటీ.. ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించాలంటే భారత్తో వాణిజ్యాన్ని పునరుద్ధరించుకోవలసిన అవసరం ఉందని సిఫార్సు చేసింది. అయితే ఈ కమిటీ సిఫార్సులను పాక్ కేబినెట్ ఆ మరుసటి రోజే తోసిపుచ్చింది. జనరల్ బజ్వా చేపట్టిన చొరవను అపహాస్యం చేయడానికే ఇమ్రాన్ కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది. నియంత్రణ రేఖ పొడవునా చొరబాట్లకు వీల్లేకుండా చూడాలని శాంతికాముకులు పాక్ని హెచ్చరించాలి. తన ఇరుగుపొరుగు దేశాలతో భారత్ ఎదుర్కొంటున్న సమస్యల్లో పాకిస్తాన్తో ఉద్రిక్తతలు ఒక నిరంతర అంశంగా కొనసాగుతున్నాయి. అయితే భారత్ అంటే బద్ధ శత్రుత్వంతో ఉండే పాక్ సైన్యం చాలా కాలం తర్వాత భారత్తో ఉద్రిక్తతలను సడలించుకోవడానికి సానుకూలత చూపుతుండటంతో నయా పాకిస్తాన్ ఆవిర్భవిస్తున్న క్రమాన్ని మనం ఇప్పుడు చూస్తున్నామా? భారత్, పాకిస్తాన్ రెండు దేశాలు శాంతియుతంగా మనగలగడానికి చర్చలు జరిగే అవకాశాలపై జాగరూకతతో కూడిన ఆశావాదం పెట్టుకోవడానికి తగిన మంచి కారణాలు ఉన్నాయని ఇటీవలి కొద్ది రోజులుగా పరిణామాలు సూచిస్తున్నాయి. గత నాలుగేళ్లుగా పాకిస్తాన్లో మొండిపట్టుదలకు మారుపేరుగా ఉండే రాజకీయనేతల్లో అగ్రగామిగా ఉంటున్న ఇమ్రాన్ ఖాన్తో భారత్ వ్యవహరిస్తోందని చాలా మంది భారతీయులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇమ్రాన్ పార్టీ అయిన తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ భారత్ పట్ల బద్ధవ్యతిరేకత కలిగి ఉన్న ఐఎస్ఐ మాజీ చీఫ్ లెఫ్టెనెంట్ జనరల్ హమీద్ గుల్ ద్వారా సైద్ధాంతికంగా రూపుదిద్దుకుంది మరి. ఇమ్రాన్ ఖాన్ పాటిస్తున్న భారత వ్యతిరేక ధోరణి తనకు ఒక వరంగా మారిందని చైనా సహజంగానే గుర్తిస్తోంది. బీజింగ్ కమ్యూనిస్టు పాలకుల అధికార వాణి అయిన గ్లోబల్ టైమ్స్ ద్వారా రోజువారీగా వెలువడుతున్న భారత్ వ్యతిరేక భావాలను చైనా నాయకత్వం అభినందిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి విధించిన సవాళ్లను ఎదుర్కోవడానికి ఆర్థిక వాస్తవికతను తక్షణం అర్థం చేసుకోవలసిన అవసరం ఉందని చాలామంది గ్రహిం చడంతో భారత్ వ్యతిరేక చైనా వ్యవహారం పాకిస్తాన్పై తగు ప్రభావం చూపుతోందని చెప్పాలి. పాకిస్తాన్ విదేశీ మారకద్రవ్య నిల్వలు ఇప్పుడు కేవలం 14.8 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. కానీ పశ్చిమ పాకిస్తానీ సోదరులు సాంప్రదాయికంగా చిన్న చూపు చూసే బంగ్లాదేశ్ మాత్రం తన విదేశీ మారక ద్రవ్య నిల్వలను 44 బిలియన్ డాలర్లకు పెంచుకుంది. పైగా 1971లో ఆవిర్భవించిన తర్వాత గత అర్ధ శతాబ్ది కాలంలో బంగ్లాదేశ్ వాస్తవంగానే ఆర్థిక, సామాజిక, ద్రవ్య సూచిల్లో పాకిస్తాన్ను అధిగమించేయడం కూడా మనం చూడవచ్చు. ఈ అన్ని పరిణామాల కారణంగా తమ పొరుగుదేశాలతో ఆర్థికాభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించడం తప్పనిసరి అని పాకిస్తాన్లో పలువురు నమ్ముతున్నారు. తన గత వారసుల్లాగే పాకిస్తాన్ వాస్తవ పాలకుడిగా ఉన్న పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ బజ్వా.. భారత్తో ప్రాంతీయ వాణిజ్యం, కనెక్టివిటీని పెంచుకోవడానికి చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఆ తర్వాత కొన్ని రోజులకు, భారత, పాకిస్తాన్ సైనికాధికారులు నియంత్రణ రేఖ వద్ద కాల్పుల విరమణ ఒడంబడికను చేసుకున్నారు. మరోవైపున, పాక్ ఆర్థిక మంత్రి హమీద్ అజర్ నేతృత్వంలోని పాకిస్తాన్ కేబినెట్ స్థాయి ఆర్థిక సమన్వయ కమిటీ.. ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించాలంటే భారత్తో వాణిజ్యాన్ని పునరుద్ధరించుకోవలసిన అవసరం ఉందని సిఫార్సు చేసింది. అయితే ఈ సమన్వయ కమిటీ సిఫార్సులను పాక్ మంత్రిమండలి ఆ మరుసటి రోజే తోసిపుచ్చింది. భారత్ వ్యతిరేక వార్తలు, ప్రకటనల్లో ఆరితీరిపోయిన పాక్ మానవ హక్కుల మంత్రి షిరీన్ మజారి, పాక్ విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ఎమ్ ఖురేషి, హోంశాఖ మంత్రి షేక్ రషీద్ వంటి భారత్ బద్ధ వ్యతిరేకులు దీనివెనుక ఉండటం గమనార్హం. ఈ సందర్భంగా మజారి నొక్కి చెప్పారు: భారత్తో ఎలాంటి వాణిజ్య కార్యకలాపాలు జరగరాదని పాక్ కేబినెట్ స్పష్టంగా ప్రకటించింది. జమ్మూ కశ్మీర్పై 2019 ఆగస్టు 5న భారత్ ప్రభుత్వం తీసుకున్న చట్టవ్యతిరేక చర్యలను వెనక్కు తీసుకునే వరకు భారత్లో సంబంధాల పునరుద్ధరణ జరగదని పాక్ ప్రధాని నొక్కి చెప్పారని మజారీ తెలిపారు. అంటే భారత్తో సంబంధాలపై నెలకొన్న ఉద్రిక్తతలను సడలించడానికి చర్యలు చేపట్టాలంటూ జనరల్ బజ్వా చేపట్టిన చొరవను అపహాస్యం చేయడానికే ఇమ్రాన్ కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది. భారత్తో వాణిజ్య సంబంధాలను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పడం ద్వారా ఇమ్రాన్ ఇప్పటికీ జమ్మూకశ్మీర్పై తాను డేగ కన్ను వేసి ఉన్నట్లు సందేశం పంపారన్నమాట. బజ్వా తర్వాత పాక్ సైన్యాధిపతి కానున్న ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్తో సహా పాక్ సైన్యం లోని బజ్వా వ్యతిరేకులను సంతృప్తిపర్చడానికే ఇమ్రాన్ ఇలాంటి సందేశం పంపారన్న విషయంలో సందేహమే లేదు. అయితే అదే సమయంలో ఈ ఐఎస్ఐ చీఫ్ ప్రస్తుత ఆర్మీ చీఫ్ అయిన బజ్వా పట్ల ఎనలేని విశ్వాసం ప్రకటిస్తుంటాడనడంలో కూడా ఎలాంటి సందేహమూ లేదు. జనరల్ బజ్వాను వ్యతిరేకిస్తున్న వారిలో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి ఇమ్రాన్ చేపడుతున్న ఇలాంటి చర్యలు ఉపయోగపడవచ్చు. తీవ్రమైన రాజకీయ సవాల్ చేయడానికి తన రాజకీయ ప్రత్యర్థులైన పీపీపీకి చెందిన అసిఫ్ ఆలీ జర్దారీ, జేయుఐ పార్టీ నేత, ఛాందసవాది మౌలానా ఫజుర్ రహమాన్ వంటివారికి తాను తలుపులు తెరిచే ఉన్నట్లుగా ఇమ్రాన్ సూచించారు కూడా. రాజకీయాల్లో తాను అడుగుపెట్టిన తొలిరోజుల్లో తన ప్రత్యర్థి నవాజ్ షరీఫ్ని సవాలు చేయడానికి ఇమ్రాన్ ఖాన్కి నాటి పాక్ సైన్యం బలంగా మద్దతిచ్చిన విషయం అతడికి తెలుసు. అలాగే గతంలో జనరల్ బజ్వాతో ఇమ్రాన్కు ఉన్నంత సౌహార్థ సంబంధాలు ఇప్పుడు లేనప్పటికీ, సైన్యంలోని ఉన్నతాధికారుల మద్దతును తాను నిలబెట్టుకోగలనని ఇమ్రాన్ భావిస్తున్నారు. అదే సమయంలో అప్ఘాన్ నుంచి అమెరికా సైనిక బలగాలు సజావుగా ఉపసంహరించుకోవడంలో తాను సహకరిస్తానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కి ఇమ్రాన్ నచ్చచెప్పాల్సి ఉంటోంది కూడా. మరోవైపున రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్కు విశ్వసనీయుడిగా ఇమ్రాన్ తన పాత్ర పోషించాల్సి ఉంది. ఇప్పటికే అప్ఘాన్లోని అపారమైన వనరులపై చైనా, రష్యా రెండు దేశాలు కన్నేసి ఉంచాయి. ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో భారత్ ఎంతో నేర్పుతో తన వైఖరిని ప్రదర్శించాల్సి ఉంది. 1980ల ప్రారంభంలో ఇస్లామాబాద్లో భారత రాయబారిగా ఉన్న ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాకిస్తాన్లోని అంతర్గత పరిస్థితి సంక్లిష్టతలపై ఒక స్పష్టమైన అవగాహనను అభివృద్ధి చేశారు. ఇరుదేశాలు ముందుకు సాగాలంటే తమ తమ రాజధానుల్లో తప్పక రాయబారులను కలిగి ఉండాలి. ఆ తర్వాత దోవల్ తెర వెనుక చర్చల్లో ఎలాగూ తన పాత్రను కొనసాగిస్తారు. 2003లో కశ్మీర్లో కాల్పుల విరమణ తర్వాత జనరల్ ముషారఫ్ విశ్వసనీయుడైన తారిఖ్ అజీజ్తో సమావేశాలకుగాను పాకిస్తాన్లో నాటి హై కమిషనర్ సతీందర్ లంబా ప్రత్యేక దూతగా గణనీయమైన పాత్ర పోషించారు. అయితే ఆనాడు జరిగిన ఆ చర్చల ప్రక్రియను మొత్తంగా ముషారఫ్ స్థానంలో వచ్చిన పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అష్పాక్ కయ్యాని తోసిపడేశారు. భారత్పైకి సందుదొరికితే చాలు తుపాకి పేల్చాలనుకుం టున్న ఇమ్రాన్ ఖాన్... ఆనాడు సతీందర్ లంబాతో పాక్ సైన్యాధికారులు జరిపిన చర్చలను సవివరంగా అధ్యయనం చేయడం మంచిది. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ సాధారణ సూత్రీకరణ ప్రాతిపదికపై నాటి చర్చలు జరిగాయి. అవేమిటంటే.. సరిహద్దులు తిరిగి మార్చలేం. కానీ సరిహద్దులను మ్యాప్లోని రేఖలుగా మాత్రమే ఉంచేలా చేసేందుకు సరిహద్దు సమస్యలు అప్రస్తుతం అని తేల్చేవిధంగా మనం పనిచేయాల్సి ఉంది. అదేసమయంలో నియంత్రణ రేఖకు ఇరువైపుల ఉన్న ప్రజలు స్వేచ్ఛగా ప్రయాణిస్తూ పరస్పరం వాణిజ్యం చేసుకోవాలి. వ్యాసకర్త:జి. పార్థసారధి జమ్మూ సెంట్రల్ యూనివర్శిటీ చాన్స్లర్ పాకిస్తాన్కి మాజీ హై కమిషనర్ -
హీరోయిన్తో అల్లు శిరీష్ డేటింగ్ ? ఫోటోలు వైరల్
ఇండస్ర్టీలో హీరోయిన్లతో ప్రేమ విషయానికి వస్తే కొందరు హీరోలు గుర్తొస్తారు. కొన్నాళ్ల పాటు వారి లవ్ స్టోరీ ఇండస్ర్టీ మొత్తం హాట్ టాపిక్ అవుతోంది. ఇంకొందరేమో అమ్మాయిలంటేనే చాలా దూరంగా ఉంటారు. ఈ కోవలోకే వస్తారు టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్. 2013లో ఇండస్ర్టీలోకి ఇచ్చిన ఈయనపై ఇప్పటి వరకు ఎలాంటి రూమర్స్ లేవు. అయితే తాజాగా శిరీష్ హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్తో ప్రేమలో పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన అజ్ఞాతవాసి.. అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమాల్లో నటించింది ఈ భామ.. ఇప్పుడు అల్లు శిరీష్తో ప్రేమలో ఉందని ఇండస్ట్రీలో వార్తలు బలంగానే వినిపిస్తున్నాయి కొంతకాలంగా వీరి మధ్య సమ్థింగ్, సమ్థింగ్ ఉందంటూ ప్రచారం జరుగుతుంది. లేటెస్ట్గా అల్లు శిరీష్ షేర్ చేసిన ఓ పోస్ట్ ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తుంది. రెండు రోజుల క్రితం మార్చి28న నటి అను ఇమ్మాన్యుయేల్ పుట్టినరోజు కావడంతో అల్లు సిరిష్ తన ఇన్స్టాగ్రామ్లో ఓ స్పెషల్ వీడియోను షేర్ చేశారు. లేట్గా విషెస్ చెబుతున్నానని నాకు తెలుసు..కానీ ఈ వీడియోతో రావడానికి లేట్ అయ్యింది. హ్యాపీ బర్త్డే సైకో అంటూ శిరీష్ విషెస్ చెప్పారు.ఎప్పుడూ సినిమాలు లేదా ఫిట్నెస్పై మాత్రమే దృష్టి పెట్టే శిరీష్..కొన్నాళ్లుగా అను ఇమ్మాన్యుయేల్తో డేటింగ్లో ఉన్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా త్వరలోనే వీరిద్దరూ కలిసి ఓ సినిమాలో నటించనున్నారని కూడా తెలుస్తుంది.ప్రస్తుతం శర్వానంద్ హీరోగా వస్తున్న మహా సముద్రం సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ నటిస్తుండగా, శిరీష్ ఓ సినిమాకు సైన్ చేసినట్లు సమాచారం. View this post on Instagram A post shared by Allu Sirish (@allusirish) చదవండి : వకీల్సాబ్ ట్రైలర్ లాంచ్.. ఫ్యాన్స్ రచ్చ రచ్చ దర్శకుడితో ప్రేమలో ప్రముఖ హీరోయిన్! -
ర్యాప్ అండ్ రాకెట్ లవ్ స్టోరీ
ఇష్టం లేని పనుల్ని కూడా కూర్చోబెట్టి మరీ చేయిస్తుంది ప్రేమ! తాజా గ్రాండ్ స్లామ్ టెన్నిస్లో విజేత అయిన నయోమీకి.. కార్డీ అని ఒక బాయ్ఫ్రెండ్ ఉన్నాడు. ఆమె కోసం ఆమె ఆటని ప్రతిసారీ ఏడ్చుకుంటూ చూస్తుంటాడు. నయోమీ గెలుపు, ఓటమి లెక్క కాదు అతడికి. ఆటను త్వరగా ముగించేస్తే ఇద్దరూ వెళ్లి ఎక్కడైనా డిన్నర్ చేస్తూ ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ మాట్లాడుకోవడం అతడికి ఇష్టం. రెండేళ్ల నుంచీ రిలేషన్లో ఉన్నారు. ఆమెలో అతడికి నచ్చింది ఆమే. ఆమె ఆట కాదు. అతడిలో ఆమెకు నచ్చింది అతడొక్కడే కాదు. అతడి ‘ర్యాప్’ కూడా. ఎలా కుదిరింది? ఎలా కుదురుతుంది? నయోమీ ఒసాకా.. టెన్నిస్ స్టార్. కార్డే అమరీ.. ర్యాప్ స్టార్. ఆమె నాలుగుసార్లు గ్రాండ్స్లామ్ చాంపియన్. అతడు గ్రామీ–నామినేటెడ్ ర్యాపర్. ఇద్దరూ యూఎస్లోనే ఉంటారు. అయితే ఇద్దరివీ వేర్వేరు ప్రపంచాలు. ఆమెకు ‘ర్యాప్’ పనిగట్టుకునేమీ ఇష్టం లేదు. అతడికి ఈ లోకంలో టెన్నిస్ అనే ఆట ఒకటుందనే స్పృహే లేదు. అలాంటి ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. వీళ్లు పడ్డారు సరే. వీళ్ల ప్రేమ నిలబడుతుందా? అది మన సందేహం మాత్రమే. వాళ్ల సమాధానం వేరుగా ఉంది. ‘‘నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నామంటే మన ప్రేమకు కాళ్లలో శక్తి లేదనే’’ అని నవ్వుతూ అనేస్తారు. ఆమె రాకెట్ శక్తి, అతడి ర్యాప్ శక్తి కలిపి ఎప్పటికప్పుడు పునఃస్థాపించుకోవలసిన స్థితిలోనైతే వారి ప్రేమ లేదనే అనిపిస్తోంది. దానిక్కారణం ఉంది. ఇద్దరి లో ఒకరు ఇంకొకరి కోసం ‘ట్రై’ చేస్తే జనించిన ప్రేమ కాదు వాళ్లది. తనకై తను ఆవిర్భవించిన ప్రేమ! ∙∙ మొదట నయోమీ దృష్టే కార్డే మీద పడింది. అప్పటికే ఆమె తన తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ (యు.ఎస్. ఓపెన్) సాధించి ఉన్న టెన్నిస్ ప్లేయర్. లాస్ ఏంజెలిస్ క్లిప్పర్స్ బాస్కెట్ బాల్ గేమ్ చూడ్డానికి వెళ్లింది. అక్కడే కార్డే కూడా ఉన్నాడు. అతడూ ఆట చూడ్డానికే వచ్చాడు. అతడిని గుర్తుపట్టిన కొందరు ఫొటోల కోసం చుట్టుముట్టడం, కార్డే పసి పిల్లాడిలా నవ్వుతూ అడిగిన వారందరితో ఫొటోలకు ఫోజులు ఇవ్వడం నయోమీ దూరాన్నుంచి చూసింది. వెళ్లి పలకరించింది. ‘హాయ్’ అన్నాడు. ‘నేను నయోమీ. టెన్నిస్ ప్లేయర్’ అంది. ‘నువ్వు టెన్నిస్ ప్లేయర్ ఎలా అవుతావు? సెరెనా సిస్టర్స్ కదా టెన్నిస్ ప్లేయర్స్’ అన్నట్లు చూసి.. ‘‘టెన్నిస్ గురించి నాకేమీ తెలీదు’’ అన్నాడు. ‘‘నాకు కార్డే ర్యాప్ గురించి కొంచెం తెలుసు’’ అని నవ్వింది. కార్డే మాత్రం ఇప్పటికీ అదే మాట చెబుతుంటాడు. ‘‘నయోమీ మాత్రమే నాకు తెలుసు. నయోమీ ఆట గురించి తెలీదు. కానీ ఆమె కోసం ఆమె ఆటను చూస్తూ కూర్చుంటాను’’ అంటాడు. జంటగా నయోమీ, కార్డే ; జీక్యూ మ్యాగజీన్ తాజా సంచికపై నయోమీ, కార్డే మొన్నటితో నాలుగు గ్రాండ్స్లామ్లు గెలిచింది నయోమీ. 2018లో యూ.ఎస్. ఓపెన్. అప్పటికి ఇద్దరికీ పరిచయం లేదు. 2019 ఆస్ట్రేలియన్ ఓపెన్. అదే తొలిసారి టెన్నిస్ ఆటను చూడటం కార్డే. ‘కూర్చొని చూడు’ అని నయోమీ అంటే కూర్చొని చూశాడు. 2020లో యు.ఎస్. ఓపెన్. కరోనా టైమ్లో డిప్రెషన్లోకి వెళ్లిపోయిన నయోమీ.. ‘‘నువ్వుంటే నాకు ధైర్యంగా ఉంటుంది’’ అని ఫోన్ చేస్తే న్యూయార్క్ నుంచి ఫ్లయిట్లో దిగి ఆమె మ్యాచ్కి గ్యాలరీలో కూర్చొని గెలిపించాడు. ‘అవును. కార్డే వచ్చినందు వల్లనే నేను గెలిచాను’ అంటుంది నయోమీ. ఆ మ్యాచ్ జరుగుతున్నపుడే.. ‘ఇది నా ప్లేస్ కాదు. కానీ నయోమీ కోసం నాది కాని ప్లేస్లోకి వచ్చాను’ అన్నాడు కార్డే. మొన్న శనివారం నయోమీ 2021 ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలవగానే యూఎస్ పత్రికలన్నీ ఈ జంటను చుట్టేశాయి.. పెళ్లెప్పుడని. ఇద్దరూ ఈడూ జోడు. ఒకే ఏడాది పుట్టినవారు. వయసు 23. ∙∙ పెళ్లా! అసలు ఈ రెండేళ్లుగానే నయోమీ, కార్డే కాస్త దగ్గరగా ఉండటం. ప్రారంభంలో వాళ్లిద్దరి మధ్యా కుదురుకోడానికి వాళ్ల ప్రేమ చాలా తిప్పలు పడింది. ఆమె ఉండటం కాలిఫోర్నియాలో. అతడు ఉండటం నార్త్ కరోలినాలో. కలుసుకోడానికి పెద్ద దూరం ఏమీ కాదు. కలుసుకున్నాక మాట్లాడుకోడానికే టైమ్ ఉండదు. చీకటింకా పోక ముందే రాకెట్ పట్టుకుని ప్రాక్టీస్కి వెళ్లిపోతుంది నయోమీ. ఆ ప్రాక్టీస్ మధ్యాహ్నం దాటిపోయేవరకు, కొన్నిసార్లు చిన్న చిన్న బ్రేకులతో సాయంత్రం వరకు సాగుతుంది. కార్డేదీ సాయంత్రం నుంచి, కొన్నిసార్లు మధ్యాహ్నం నుంచే రాత్రంతా సాగే కచేరీ కార్యక్రమం. ఒకరిది పగటి ప్రపంచం. ఇంకొకరిది రాత్రి ప్రపంచం. అయినా చంద్రుడు, సూర్యుడు అప్పుడపుడు ఉదయం, సాయంత్రం ఆకాశంలో ఒకే సమయం లో కనిపించినట్లు వీళ్లు భూమ్మీద సంధ్యా సమయాల్లో కలుసుకుంటూనే ఉన్నారు. కలిసి డిన్నర్ చేస్తూనే ఉన్నారు. ఎప్పుడైనా.. ‘నిన్ను చూడాలని ఉంది’ అంటే వచ్చి వాలిపోతాడు కార్డే. అతడికి చూడాలనిపిస్తే చెప్పాపెట్టకుండా వచ్చి, కళ్ల నిండా చూసుకుని వెళ్లిపోతాడు. మొన్నటి ఆస్ట్రేలియన్ ఓపెన్ మొదలవడానికి ముందు జీక్యూ మ్యాగజీన్ వీళ్లను జంటగా చేసిన ఇంటర్వ్యూ వల్ల ఈ మాత్రమైనా వీళ్ల ప్రేమ గురించి ప్రపంచానికి తెలిసింది. లేకుంటే ఇప్పటికీ గుట్టుగా ఉండిపోయేవాళ్లే. ‘కార్డేలో మీకు ఏం నచ్చింది?’ అంటే.. ‘క్వయిట్ రొమాంటిక్ డూడ్’ అంటుంది నయోమీ. ‘నయోమీలో మీకేం నచ్చింది’ అంటే.. ‘నయోమీలో కాదు, నయోమీ మొత్తం నచ్చింది’ అని తన హిప్హాప్ స్టెయిల్లో ధ్వనిహాసం చేస్తాడు కార్డే. -
పీకల్లోతు ప్రేమలో ఇరా ఖాన్
ముంబై : బాలీవుడ్ హీరో ఆమిర్ఖాన్ కూతురు ఇరా ఖాన్ లవ్ ఎఫైర్తో గత కొంతకాలంగా తరుచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. తన తండ్రి ఆమిర్ ఫిట్నెస్ కోచ్ నుపూర్ షిఖరేతో ఇరా పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది. తాజాగా ప్రామిస్డే సందర్భంగా తన బాయ్ఫ్రెండ్ నుపూర్తో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మై వాలెంటైన్ అని పోస్ట్ చేసింది. దీంతో ఆమె అఫీషియల్గా తన ప్రేమ విషయాన్ని బయటపెట్టిందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఇరాకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇరా పోస్ట్పై పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఎమోజీల రూపంలో ఆమెకు విషెస్ చెబుతున్నారు. ఇక గతేడాది దీపావళి సందర్భంగా మొదటిసారి తన ప్రియుడిని ఫ్యాన్స్కు పరిచయం చేసిన ఇరా..కొన్నాళ్లు ఆమిర్ ఫాంహౌజ్లోనే ఉన్నారని, ఈ క్రమంలో అక్కడే పలు పండుగలను కూడా సెలబ్రెట్ చేసుకున్నట్లు సమాచారం. (నాలుగేళ్లు డిప్రెషన్లో ఉన్నా: ఇరా ఖాన్) View this post on Instagram A post shared by Ira Khan (@khan.ira) గతంలో ఇరా మిషాల్ అనే వ్యక్తితో ఇరా ఖాన్ ప్రేమాయాణం నడిపిన విషయం తెలిసిందే. రెండేళ్ల పాటు ప్రేమించుకున్న ఇరా, మిషాల్లు 2019లో కొన్ని కారణాల వల్ల విడిపోయారు. కాగా నూపూర్ షిఖరే గత కొన్నేళ్లుగా ఆమిర్కు పర్సనల్ ఫిట్నెస్ ట్రైనర్గా ఉంటున్న విషయం తెలిసిందే. ఇక లాక్డౌన్లో ఇరా ఫిట్నెస్పై శ్రద్ద పెట్టడంతో నుపూర్ ఆమెకు కూడా కోచ్గా మారాడు.ఈ క్రమంలో నుపూర్ వ్యక్తిత్వం నచ్చడంతో ఇరా అతడితో ప్రేమలో పడినట్లు సమాచారం. గతేడాది అక్టోబర్లో ఇరా తన బాయ్ఫ్రెండ్ నుపూర్ పచ్చబొట్టును వేయించుకుంది. మొదటిసారి టాటూ వేయించుకున్నానంటూ తన ఇన్స్టాగ్రామ్లో వెల్లడించింది. (లైంగిక వేధింపులకు గురైనా.. : హీరో కుమార్తె) View this post on Instagram A post shared by Ira Khan (@khan.ira) -
అత్యాచారం చేయలేదు.. రిలేషన్లో ఉన్నాం: మంత్రి
ముంబై: మహారాష్ట్ర సామాజిక, న్యాయశాఖ మంత్రి ధనంజయ్ ముండేపై 38 మహిళ అత్యాచార ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. వీటిపై ధనంజయ్ స్పందించారు. సదరు మహిళ తప్పుడు ఆరోపణలు చేస్తుందని.. వాస్తవానికి ఆమె సోదరి, తను రిలేషన్లో ఉన్నామని పేర్కొన్నారు. అంతేకాక అక్కాచెల్లెల్లిద్దరు తనను బ్లాక్ మెయిల్ చేస్తూ.. డబ్బులు గుంజాలని ప్రయత్నిస్తున్నారని తెలిపారు. వీరిద్దరి మీద తాను గతేడాది నవంబర్లో పోలీసులకు ఫిర్యాదు కూడా చేశానన్నారు. తనపై ఆరోపణలు చేసిన మహిళ సోదరితో తనకు 2003 నుంచి సంబంధం ఉందని.. తమకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని ధనుంజయ్ ముండే తెలిపారు. అంతేకాక ఈ మధ్య కాలంలోనే తమ సంబంధం గురించి కుటుంబ సభ్యులకు తెలియజేశానని. వారు కూడా అంగీకరించారని.. అంతా బాగుందనుకున్న సమయంలో తనపై ఇలా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండి పడ్డారు. (చదవండి: కామాంధుడిని పొడిచి చంపేసింది.. ఆపై) ఇక ధనంజయ్ ప్రకటన వెలువడిన అనంతరం మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ.. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు లేటర్ రాశారు. రెండు రోజుల క్రితం సదరు మహిళ ధనుంజయ్ ముండే తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఒడిశాలోని అంధేరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా ఆమె తరపు లాయర్ మాట్లాడుతూ.. ‘బాధితురాలికి 1997 నుంచి ధనుంజయ్ ముండేతో పరిచయం ఉంది. తొలుత బాలీవుడ్లో సింగర్గా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి ఆమెతో క్రమంగా పరిచయం పెంచుకున్నాడు’ అని తెలిపారు. (చదవండి: శివసేనకు చెక్: పట్టు బిగిస్తున్న బీజేపీ) ‘ఈ క్రమంలో 2008లో ముండే తొలిసారి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఏళ్లుగా ఆమెపై లైంగిక దాడికి పాల్పడుతూనే ఉన్నాడు. ఇక 2019లో ఆమె తనను వివాహం చేసుకోవాల్సిందిగా అతడిని కోరింది. కానీ ధనుంజయ్ అందుకు అంగీకరించలేదు. అంతేకాక దీని గురించి ఎవరికైనా చెబితే వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని బెదిరించడం ప్రారంభించాడు. దాంతో అతడి మీద ఫిర్యాదు చేశాం. కానీ పోలీసులు ధనుంజయ్ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు. మేం కోర్టుకు వెళ్తాం. ఇక బాధితురాలికి ఏమైనా జరిగితే అందుకు ధనుంజయ్ బాధ్యత వహించాల్సి ఉంటుంది’ అన్నారు. -
మన చెలిమికి ఆకాశమే హద్దు
భారతదేశంతో అమెరికా ఏర్పర్చుకున్న బలమైన రక్షణ బాంధవ్యం ప్రపంచంలో మరే రెండు దేశాల మధ్యా లేదని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. గత రెండు దశాబ్దాలుగా మన వ్యూహాత్మక భాగస్వామ్యం కొత్త పుంతలు తొక్కింది. భారతీయులకు ఉద్యోగాల కల్పన, వినియోగదారీ వస్తువులు, సాంకేతిక నైపుణ్యం, ఆర్థికపరమైన మెరుగుదల వంటివాటిని కల్పించడంలో అమెరికా లాగా ప్రపంచంలో మరే దేశమూ ముందుకు రాలేదు. సరిహద్దుల్లో చైనా దూకుడు కార్యకలాపాలను భారత్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న నేపథ్యంలో అమెరికా, భారత్ మధ్య సన్నిహిత సమన్వయం చాలా ముఖ్యమైనది. నాలుగేళ్లుగా మన రెండు దేశాలూ సాధించిన విజయాలు గర్వకారణం. అమెరికా నూతన ప్రభుత్వం కూడా ఈ సంబంధాలను కొనసాగించగలదు. అమెరికా సంయుక్త రాష్ట్రాలు, భారతదేశం మధ్య నెలకొన్న విశాలమైన, కీలకమైన, సుసంపన్నమైన ద్వైపాక్షిక సంబంధాలు ప్రపంచంలో మరే రెండు దేశాల మధ్య తరచి చూసినా లేవు. రక్షణ రంగం, ఉగ్రవాద నిరోధం, సైబర్ భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనరంగం, పర్యావ రణం, ఆరోగ్యం, విద్య, శాస్త్ర సాంకేతిక రంగాలు, వ్యవసాయం, అంతరిక్షం ఇలా ఎన్నో రంగాల్లో మన రెండు దేశాలూ ప్రస్తుతం సహ కరించుకుంటున్నాయి. గత రెండు దశాబ్దాలుగా మన వ్యూహాత్మక భాగస్వామ్యం వాస్తవానికి కొత్త పుంతలు తొక్కింది. ప్రత్యేకించి గత నాలుగేళ్ల సమయం మన రెండు దేశాలు తమ ఆకాంక్షలు, విజ యాలను నెరవేర్చుకున్న కాలంగా నిలిచిపోయింది. భారత్ వికాసం పట్ల అమెరికా నిబద్ధత, స్వేచ్ఛాయుతమైన, పారదర్శకమైన ఇండో పసిఫిక్ ప్రాంతంపై పరస్పర దార్శనికతల నుంచి మన రెండు దేశాల మధ్య దౌత్యపరమైన సమన్వయం సాధ్యపడింది. ఇండో–పసిఫిక్ సహకార భావన రూపొందుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టినప్పటికీ గత నాలుగేళ్లుగా ఆ భావన వాస్తవ రూపం దాల్చడానికి మన రెండు దేశాలూ గొప్ప ఆకాంక్షనూ, పరిణ తినీ ప్రదర్శించాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాలకు సంబంధించి నంత వరకు ఇండో–పసిఫిక్ అంటే అర్థం ఏమిటంటే.. ప్రపంచం ముందు గొప్ప మార్పు, సవాళ్లు ఎదురవుతున్న సమయంలో, ఈ గతిశీలమైన ప్రాంతంలో శాంతి, సౌభాగ్యాలను పరిరక్షించడంలో, విస్తరింపజేయడంలో భారత్ ఒక కీలక భాగస్వామి అని మేము పరిగణిస్తుండటమే. ఆసియన్ దేశాల కీలకస్థానాన్ని మేం బలపరుస్తూనే ఈ ప్రాంతం రూపురేఖలను స్పష్టంగా నిర్మించడానికి భావ సారూప్యత కలిగిన దేశాలతో సమన్వయాన్ని ప్రారంభించాము. మనం ఇటీవలికాలంలో నిర్వహించుకున్న త్రైపాక్షిక సదస్సులు (2018, 2019 సంవత్సరాల్లో జపాన్తో), మన నాలుగు దేశాల మంత్రులతో సదస్సులు (2019, 2020 సంవత్సరాల్లో జపాన్, ఆస్ట్రేలియాతో) అనేవి సముద్ర భద్రత, మహమ్మారి నిర్వహణ, ప్రాంతీయ అనుసంధానం, మానవతా సహాయం, విపత్తు ఉపశమనం, సైబర్ భద్రత వంటి వాటితోపాటు మన దేశాల మధ్య గొప్ప సహకారానికి దారితీశాయి. సార్వభౌమా ధికారం, చట్టప్రాతిపదికన పనిచేసే వ్యవస్థను ఎంతగానో గౌరవించే ప్రాంతం నుండి అన్ని దేశాలు సౌభాగ్యం పొందేలా తదుపరి నాలుగు సంవత్సరాలు, ఆ పై సంవత్సరాల్లో కూడా తగిన అవకాశాన్ని కల్పిం చడమే మన లక్ష్యంగా ఉంటుంది. బలమైన ప్రజాస్వామ్య దేశాలుగా అమెరికా సంయుక్త రాష్ట్రాలు, భారతదేశం శాంతి, దౌత్యపరమైన పరిష్కారాలకు కట్టుబడి ఉంటు న్నాయి. గత నాలుగేళ్లుగా మన దేశాలు సురక్షితంగా ఉండేలా జాగ్ర త్తలు తీసుకోవడమే కాకుండా మన సరిహద్దుల అవతల కూడా భద్ర తను కల్పించడానికి మన రక్షణ, భద్రతా సహకారాన్ని మరింతగా పెంచుకున్నాము. ఇకపోతే 2018 సెప్టెంబర్ నాటికి మన ద్వైపాక్షిక రక్షణ, భద్రతాపరమైన భాగస్వామ్యం కొత్త దశకు చేరుకుంది. ఆ సంవత్సరం అమెరికా, భారత రక్షణ, విదేశీ విధాన నిర్ణేతల మధ్య 2+2 మంత్రిత్వ శాఖల సంభాషణను ప్రారంభించాం. అలాంటి మూడు మంత్రిత్వ శాఖల చర్చలను మనం నిర్వహించుకున్నాం. ఆ క్రమంలో మన బలగాలు, రక్షణ రంగ పరిశ్రమలు కలిసి పనిచేసేలా కీలకమైన రక్షణ ఒప్పందాలను కూడా కుదుర్చుకున్నాం. 2019లో మొట్టమొదటిసారిగా ఆస్ట్రేలియాతో కలిసి మన మూడు దేశాల సైనిక విన్యాసాలను నిర్వహించడం, అలాగే మలబార్ తీరంలో జపాన్తో సైనిక విన్యాసాలు నిర్వహించడం ద్వారా మన మధ్య అనేక సైనిక విన్యాసాలను విస్తరింపజేసుకున్నాం. ఇలాంటి ఎన్నో ఇతర విజయా లను గుర్తు చేసుకుంటూ, భారతదేశంతో అమెరికా ఏర్పర్చుకున్న బలమైన రక్షణ బాంధవ్యం ప్రపంచంలో మరే రెండు దేశాల మధ్య కూడా లేదని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. అలాగే భారతీయుల భద్రతకు కూడా ఇతోధికంగా తోడ్పడగలిగాం. సరిహద్దుల్లో చైనా దూకుడు కార్యకలాపాలను భారత్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న నేప థ్యంలో మన సన్నిహిత సమన్వయం చాలా ముఖ్యమైనదని నేను దృఢంగా భావిస్తున్నాను. ఆర్థిక రంగంలోనూ ఈ స్థాయితో కూడిన ఆకాంక్షలను కలిగి ఉండాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. మన రెండుదేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడులకు సంబంధించిన పొత్తు పెరుగుతూనే వస్తోంది కానీ అవి తమ పూర్తి సామర్థ్యానికి ఇంకా చేరుకోలేదు. 2019లో అమెరికా, భారతదేశం మధ్య ద్వైపాక్షిక వ్యాపారం వస్తు సేవల రంగంలో 146.1 బిలియన్ డాలర్లకు పెరిగింది. 2001 సంవత్సరంలో ఇది కేవలం 20.7 బిలియన్ డాలర్ల వద్దే పరిమితమై ఉన్నదని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు భారతదేశ మొత్తం ఎగుమతుల్లో 16 శాతం వరకు అమెరికాకు చేరుకుంటున్నాయి. అమెరికా ఇప్పుడు భారతదేశ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. మొత్తం మీద అమెరికా వాణిజ్యరంగంలో భారత్ 12వ అతిపెద్ద భాగస్వామిగా ఉంటోంది. అన్నిటికీ మించి భారతీయులకు ఉద్యోగాల కల్పన, విని యోగదారీ వస్తువులు, సాంకేతిక నైపుణ్యం, ఆర్థికపరమైన మెరుగు దల వంటివాటిని కల్పించడంలో అమెరికా లాగా ప్రపంచంలో మరే దేశమూ ముందుకు రాలేదని గర్వంగా చెబుతాను. మన రెండు దేశాల మధ్య మరో కీలక భాగస్వామ్యం ఇంధన రంగంలో ఉంది. గత నాలుగేళ్లలో మనం ఈ విషయంలోనూ గణ నీయ ఫలితాలను సాధించామని చెప్పాలి. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక ఇంధన భాగస్వామ్యాన్ని మనం 2018లో ప్రారంభించాం. రెండుదేశాల ప్రభుత్వాల మద్దతు కారణంగా ఇప్పుడు భారత ఇంధన రంగానికి అమెరికా అతి ముఖ్యమైన వనరుగా ఉంటోంది. 2019 నాటికి బొగ్గు రంగంలో అమెరికాకు అతిపెద్ద దిగుమతిదారుగా భారత్ ఆవిర్భవించింది. ముడి చమురును అమెరికా నుంచి దిగుమతి చేసు కుంటున్న నాలుగో అతిపెద్ద దేశంగా భారత్ స్థానం సంపాదించింది. కాగా అమెరికా సహజవాయువుకు ఏడవ అతిపెద్ద దిగుమతిదారుగా భారత్ నిలిచింది. ఇవన్నీ కలిసి భారతదేశ వైవిధ్యపూరిత ఇంధన వనరులకు ఎంతగానో తోడ్పడ్డాయని చెప్పాలి. ఈరోజు భారత దేశంలో ఇంధన రంగంలో దాదాపు 100 అమెరికా కంపెనీలు పనిచేస్తు న్నాయి. ఈ రంగంలోని అన్ని విభాగాల్లోనూ అమెరికన్ కంపెనీలు ప్రవేశించాయని గర్వంగా చెబుతున్నాను. ఇకపోతే ఆరోగ్య, బయో మెడికల్ ఆవిష్కరణల రంగం కూడా మన రెండు దేశాలకు కీలక ప్రాధాన్య రంగంగా ఉంటోంది. విజయ వంతమైన మన సహకార చరిత్ర కోవిడ్–19 మహమ్మారిపై కలిసి సహకరించుకునేందుకు వీలు కల్పించింది. అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ప్రివెన్షన్ (సీడీసీ) నిపుణులు కరోనా వైరస్ జాడ పసిగట్టడంలో, పరీక్షించడంలో, ఇన్ఫెక్షన్ నిరోధించడంలో, ఆరోగ్య సంస్థల నియంత్రణలో భారత్ ప్రయత్నాలకు సాంకేతిక మార్గదర్శ కత్వం, శిక్షణను అందించారు. అమెరికాకు చెందిన సీడీసీలో వంద లాది పట్టభద్రులు శిక్షణ పొంది ఉండటంతో వైరస్ను దీటుగా ఎదుర్కొవడంలో భారత్ ముందంజ వేసింది. పైగా, అమెరికా, భారత శాస్త్రవేత్తలు కోవిడ్–19 వ్యాక్సిన్, చికిత్సా పద్ధతులను అభివృద్ధి చేయడంలో పరస్పరం సహకరించుకున్నారు. ఇది మరింత సురక్షిత వైద్య సప్లయ్ చైన్లను వృద్ధి చేయడంతోపాటు మన రెండు దేశాల ఆరోగ్యరంగాల మధ్య మరింత బలమైన కృషి జరగడానికి వీలు కల్పించనుంది. ఆరోగ్య రంగంలో మన సహకారం రెండు దేశాలను మరింతగా మెరుగుపర్చడమే కాకుండా ప్రపంచ ప్రజలందరికీ ప్రయో జనం కలిగించింది. ఘనమైన ప్రజాస్వామ్య వ్యవస్థలను కలిగి ఉన్న మన రెండు దేశాలూ, ప్రభుత్వాలూ ప్రజాభిప్రాయాన్ని తప్పనిసరిగా ఆలకిస్తాయి. మన ప్రజల మధ్య సంబంధాలు బలమైన పునాదిని ఏర్పర్చడమే కాకుండా మన సంబంధాల విషయంలో చోదకశక్తిగా కూడా పని చేస్తున్నాయి. ఈ సంబంధాలను సరైన మార్గంలోకి తీసుకుపోవడం, స్వేచ్ఛాయుతమైన, పారదర్శకమైన ఇండో–పసిఫిక్ ప్రాంతాన్ని రూపొందించడం రెండు దేశాలకు ఎంతో ముఖ్యమని, అమెరికా– భారత్ నాయకులు గుర్తించారు. చివరగా, గత నాలుగేళ్లుగా మనం సాధించిన విజయాల పట్ల నేను ఎంతో గర్వపడుతున్నాను. రాబోయే అమెరికా నూతన ప్రభుత్వ యంత్రాంగం కూడా భారతీయ భాగస్వా ములతో ఈ సంబంధాలను కొనసాగించగలదని ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. ఎందుకంటే కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రతి అమెరికా ప్రభుత్వ యంత్రాంగం కూడా తనకు మునుపటి ప్రభుత్వం భారత్తో విస్తరించిన సంబంధాలను విజయవంతంగా ముందుకు తీసుకు పోతూ వచ్చింది మరి. -కెన్నెత్ ఐ. జస్టర్ వ్యాసకర్త భారత్లో అమెరికా రాయబారి -
ట్రంప్ వైపు ఇండియన్ అమెరికన్లు మొగ్గు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇండియన్ అమెరికన్లు డొనాల్డ్ ట్రంప్ వైపే మొగ్గు చూపిస్తున్నారు. ప్రధానంగా స్వింగ్ స్టేట్స్లో ఈ పరిస్థితి కనిపిస్తోందని ఆ పార్టీ అంతర్గత సర్వేలో వెల్లడైంది. ట్రంప్కి, ప్రధాని మోదీకి మధ్యనున్న స్నేహ బంధం వల్లే ప్రవాస భారతీయులు ట్రంప్కి మద్దతుగా నిలుస్తున్నట్టుగా ఆ సర్వే పేర్కొంది. ట్రంప్ విక్టరీ ఇండియన్ అమెరికన్ ఫైనాన్స్ కమిటీ నిర్వాహకుడు అల్ మసన్ ఈ సర్వే నిర్వహించారు. స్వింగ్ స్టేట్స్లోట్రంప్కే మద్దతు ఫ్లోరిడా, మిషిగావ్, పెన్సిల్వేనియా, జార్జియా, ఉత్తర కరోలినా వర్జీనియా వంటి స్వింగ్ స్టేట్స్లో భారతీయ అమెరికన్లు అధికంగా ఉన్నారు. ఈ రాష్ట్రాల్లో సంప్రదాయంగా డెమొక్రాట్లకే మద్దతునిచ్చే ఇండియన్ అమెరికన్లు ఈసారి ట్రంప్వైపు మొగ్గు చూపిస్తున్నట్టుగా సర్వేలో తేలింది. ట్రంప్ చైనా పట్ల అత్యంత కఠినంగా ఉండడం వల్లే డ్రాగన్ దేశం భారత్పైకి యుద్ధానికి దిగలేదని ఇండియన్ అమెరికన్ల అభిప్రాయంగా ఉంది. ట్రంప్, మోదీ మధ్య స్నేహంతో ప్రపంచ పటంలో భారత్ స్థానం ఎదిగిందన్న అభిప్రాయమూ ఉంది. ముఖ్యంగా చైనాపై పూర్తిస్థాయిలో వ్యతిరేకత వల్ల ప్రవాస భారతీయులు ట్రంప్ వైపు తిరిగారని శ్రీధర్ చిట్యాల అనే పారిశ్రామికవేత్త తెలిపారు. ఇండియన్ అమెరికన్లు ట్రంప్కి భారీగా ఎన్నికల నిధులు ఇస్తున్నారని చెప్పారు. సీటు దిగుతారా? వచ్చే నవంబర్లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఒకవేళ ఓటమి సంభవిస్తే ట్రంప్ సీటు దిగేందుకు అడ్డం తిరుగుతాడా? అంటే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇటీవల కాలంలో ఇందుకు సంబంధించిన అంశాలపై ప్రశ్నలను ట్రంప్ దాటవేయడం, నర్మగర్భంగా సమాధానాలివ్వడం చూస్తే ఫలితాలు తేడాకొడితే ట్రంప్ సీటు దిగేందుకు ససేమిరా అనవచ్చని భావిస్తున్నారు. పోస్టల్ ఓటింగ్పై తనకు సందేహాలున్నాయని, ఈ సారి ఎన్నికల ఫలితాలు చివరకు సుప్రీంకోర్టులో తేలతాయని వ్యాఖ్యానించడం ఈ అనుమానాలను మరింత బలపరుస్తోంది. నవంబర్ ఎన్నికల అనంతరం ఓటమి సంభవిస్తే ఎలాంటి ఆటంకాలు సృష్టించకుండా పదవి బాధ్యతలను ప్రత్యర్ధికి అప్పగిస్తారా? అని మీడియా సమావేశంలో ట్రంప్ను ప్రశ్నించారు. అయితే దీనికి ట్రంప్ ‘ ఏం జరుగుతుందో చూద్దాం’ అని అన్నారు. వాషింగ్టన్లోని సుప్రీంకోర్టు భవనంలో జస్టిస్ రూత్ బాడర్కు నివాళులర్పిస్తున్న అధ్యక్షుడు ట్రంప్ దంపతులు -
‘అప్పట్లో సుశాంత్, ఆమె ప్రేమలో ఉన్నారు’
ముంబై: దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసులో రోజు రోజుకు అసక్తికర విషయాలు బయటకే వస్తున్నాయి. తాజాగా మరో సంచలన విషయం వెలుగు చూసింది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్, సుశాంత్ ఇద్దరూ ప్రేమించుకున్నారని సుశాంత్ స్నేహితుడు శామ్యూల్ హోకిప్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. శామ్యూల్ ఈ విషయం గురువారం ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. ‘కేదార్ నాథ్' చిత్రంలో సుశాంత్, సారా ఇద్దరూ కలిసి నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం సమయంలో వీరిద్దరూ ప్రేమించుకున్నారు. సినిమా ప్రమోషన్ సమయంలో సుశాంత్, సారా పీకల్లోతు ప్రేమలో ఉన్నారు’ అని తన ఇన్స్టా పోస్ట్లో రాసుకోచ్చాడు. సుశాంత్ తదుపరి సినిమా 'సోన్ చిరియా' ప్లాప్ అవ్వడంతో సారా అతడిని విడిచి వెళ్లిపోయిందని, ఈ విషయం తనను ఆశ్చర్యపరిచిందని శామ్యూల్ చెప్పాడు. (చదవండి: రియా సీబీఐకి తప్పక సహకరిస్తుంది) View this post on Instagram We accept the love we think we deserve -Stephen Chbosky A post shared by Samuel Haokip (@jamlenpao) on Aug 19, 2020 at 9:21pm PDT బాలీవుడ్ మాఫియా వల్లే సుశాంత్ ‘సోన్ చిరియా’ చిత్రం ఫ్లాప్ అయిందని అతడు ఆరోపించాడు. అదే విధంగా బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ కూడ ఆసుశాంత్, సారాల రిలేషన్షిప్పై ట్వీట్ చేశారు. ‘‘బ్రేకింగ్ న్యూస్ ఆఫ్ సుశాంత్ సింగ్ రాజ్పుత్(ఎస్ఎస్ఆర్), సారాల రిలేషన్షిప్. వారి ప్రేమ వ్యవహారం ప్రస్తుతం మీడియాలో ముఖ్యాంశంగా మారింది. అవుట్ డోర్ షూటింగ్లో వారిద్దరూ ఒకే రూంలో ఉన్నారన్న విషయం కూడా స్పష్టం అవుతోంది. ఈ ఫ్యాన్సీ నేపోటిజంలో స్టార్ కిడ్స్ బయటి నుంచి వచ్చిన వారి డ్రీమ్స్తో ఆడుకుంటారు. ఆ తరువాత వారి జీవితాలను బహిరంగంగా నాశనం చేస్తారు’ అంటూ కంగనా ట్వీట్ చేశారు. అయితే ఈ కేసు విషయంలో సుశాంత్ గర్ల్ఫ్రెండ్ రియా చక్రవర్తి సుశాంత్ డబ్బును దొంగలించిందని, అతడి ఆత్మహత్యకు ప్రేరేపించేలా ప్రవర్తించేదని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో కొత్తగా సారా పేరు వినిపించడంతో కేసు కొత్త మలుపు తిరిగిందని చెప్పుకొవచ్చు. (చదవండి: సుశాంత్ డిప్రెషన్ వల్లే చనిపోయి ఉండొచ్చేమో) News of SSR and Sara affair was all over the media, apparently they were even sharing a room during their outdoor, why these fancy Nepotism kids show dreams to vulnerable outsiders and then publicly dump them?No wonder he fell for a vulture post that. https://t.co/A4er01wZ6p — Kangana Ranaut (@KanganaTeam) August 20, 2020 -
భార్య.. భర్త.. మూడు తగవులు
వాదన మొదలెట్టినవాళ్లు దానిని ముగించడం కూడా తెలుసుకొని ఉండాలి. తెగే దాకా లాగితే తాడే కాదు వైవాహిక బంధం కూడా తెగుతుంది. బయట కరోనా ఉంది. ఆ అశాంతి సరిపోనట్టుగా ఇంట్లో మనశ్శాంతి కరువు చేసుకుంటామా? అసలు ఇంట్లో తగువు ఎందుకు? తగువు రేపుతున్న మూడు కారణాలు ఏమిటి? చూద్దాం. పని మనుషులు ఇంకా పూర్తిగా రావడం లేదు. వాళ్లు వస్తామన్నా భయం వల్ల వద్దంటున్నవాళ్లే ఎక్కువ. ఆఫీసులకు పూర్తిగా వెళుతున్నవాళ్లు తక్కువ. వ్యాపారాలు, పనులు ఇంతకు ముందంత సేపు చేస్తున్నవాళ్లూ తక్కువ. ఏతావాతా ఇంట్లో భార్యాభర్తలు ఎక్కువ సేపు ఉండక తప్పని పరిస్థితి కరోనా వల్ల వచ్చింది. ఇది మరికొంత కాలం ఉంటుంది. కాని మరోవైపు ఇంట్లో తగాదాలు పెరిగిపోతున్నాయి. పోలీసులకు ఫోన్ల వరకు వెళుతున్నాయి. కేసులు పెట్టే వరకూ పెద్దవవుతున్నాయి. దీనిని ఆపలేమా? పుదుకొట్టయి చెప్పిన సంగతి తమిళనాడులో కరోనా ఉద్ధృతిగా ఉంది. లాక్డౌన్ ప్రత్యక్షంగా పరోక్షంగా సాగుతూ ఉంది. అక్కడ మార్చి నెలాఖరు నుంచి మే 31 వరకు దాదాపు 14 వేల గృహహింస ఫిర్యాదులు అందాయి. ఫోన్ల ద్వారా, ఈ మెయిల్స్ ద్వారా, స్టేషన్కు వచ్చి మొర పెట్టుకోవడం ద్వారా వచ్చిన ఫిర్యాదులు ఇవి. గృహహింస ఆ రాష్ట్రంలో చిన్న ఊళ్లలో పట్టణాలలో ఎక్కువగా ఉంటే చెన్నై సిటీలో తక్కువగా ఉండటం గమనార్హం. చిన్న ఊళ్లలో కూడా కేవలం లక్ష జనాభా ఉన్న ‘పుదుకొటై్ట’ అనే ఊరిలో 1400 గృహహింస ఫిర్యాదులు అందాయి. ఈ మొత్తం కేసులను పోలీసులు పరిశీలించగా మూడు కారణాలు తగవును రేపుతున్నాయని తేలింది. అవి 1. ఇంటి పని విభజన 2. భాగస్వామిపై అనుమానం 3. ఆర్థిక సమస్యలు. ఈ విషయాల్లో కీచులాడుకోవడం ఈ రాష్ట్రంలోనే కాదు బహుశా దేశమంతా జరుగుతూ ఉండొచ్చు. ఈ మూడు కారణాలతో మన ఇంట్లో కూడా పేచీ ఏమైనా మొదలయ్యిందా చెక్ చేసుకోవాలి. ఇంటి పని ఇంటి పని భారం ప్రధానంగా గృహిణి మీద ఉంటుంది. ఆమె గృహిణి అయినా ఉద్యోగిని అయినా ఇంటి పని ఆమెదే అనే ధోరణి భర్తకు ఉంటుంది. మామూలు రోజుల్లో పని మనుషుల వల్ల, బయట తిండి తెచ్చుకోవడం వల్ల, వారూ వీరూ వచ్చి సాయ పడుతూ ఉండటం వల్ల ఈ భారం గృహిణికి అంతో ఇంతో తగ్గేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. భర్త, పిల్లలు అన్ని వేళలా ఇంట్లో ఉండటం వల్ల పని పెరిగింది. ఈ పని చేసి చేసి ఇళ్లల్లో స్త్రీలకు విసుగు చిరాకు పెరిగి భర్తను నిలదియ్యాల్సి వస్తోంది. భర్త ఇంటి పనిని పంచుకుంటే సరేసరి. లేకుంటే ఈ తగాదా పెరిగి పెద్దదైపోతోంది. ఇంట్లోని పెద్దలిద్దరూ ఇంటి పని ఎంత ఉందో అది ఎంత శ్రమను కలిగిస్తుందో బేరీజు వేసుకోవడం చాలా ముఖ్యం. పని పెంచుకోవడం, ఎదిగిన పిల్లలు ఉంటే వారు చేయదగ్గ పనిని పంచి ఇవ్వడం ఇంకా ముఖ్యం. ఒక టైమ్టేబుల్ వేసుకొని రోజుకు ఏ టైమ్లో ఎవరు ఏ పని చేయాలో రాసుకుంటే చాలామటుకు గొడవ రాకుండా ఉంటుంది. ఉదాహరణకు ఉదయాన్నే లేచి చెత్తబుట్ట బయటపెట్టే పని భర్తది అని అనుకుంటే భార్యకు సగం ఓదార్పుగా ఉంటుంది. మొక్కలకు నీళ్లు పోయడం, పిల్లలను నిద్ర లేపడం, భార్య వంట చేసినా పిల్లలకు టిఫిన్ పెట్టే పని భర్త చూడటం.. ఇలా ఎవరికి ఏది సౌకర్యమో చేసుకోకపోతే ఇల్లు రచ్చలోకి పడే ప్రమాదం ఉంది. పని అంతా భార్య చేయాలని అనుకోవడం ఎలా సరి కాదో పని అంతా భర్త చేయాలని అనుకోవడం కూడా సరి కాదని తెలుసుకోవడం కూడా ముఖ్యమే. అనుమానం పెనుభూతం లాక్డౌన్ సమయంలో ఫోన్తో కాలక్షేపం కుటుంబాలలో కలత రేపుతున్నదంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కాని ఇది నిజం. భర్త ఆఫీస్ పని చేసుకుంటూ ఉంటే భార్య ఫోన్లో మునిగినా, భార్య ఇంటి పని చేసుకుంటూ ఉంటే భర్త ఫోన్లో మునిగినా, ఇద్దరికీ ఏ పని లేని సమయంలో అర్ధరాత్రి వరకూ ఫోన్ చూస్తూ ఉన్నా, చాటింగ్ చేస్తూ ఉన్నా అది ఎంత అయినవారితోనో, బంధువులతోనో, మిత్రులతోనో అయినప్పటికీ అనుమానాలు వచ్చేస్తుండటం తాజా స్థితి. సాధారణ రోజుల్లోని ప్రైవసీ ఇప్పుడు లేకపోవడం వల్ల ఇరువురూ చేస్తున్న పని అనుక్షణం కనపడుతూ ఉండటం వల్ల ఈ తగాదాలు వస్తున్నాయి. ఎదుటి పక్షానికి సందేహం కలిగించే సంభాషణలు, ఫోన్ సమయాలు పరిహరించుకోవడమే దీనికి పరిష్కారం. మాట్లాడే అవసరం ఉన్న మాటలు శషబిషలు లేకుండా పబ్లిక్గా మాట్లాడటం కూడా ఒక పరిష్కారం. ఫోన్లలోని కాలక్షేపం వీడియోలు చూసేటట్టయితే అదేదో ఇద్దరం చూద్దాం రా అని పిలిచి పక్కన కూచోపెట్టుకోవడం కూడా పరిష్కారమే. మన చేతులు మనవిగా ఉంటూ అవి ఫోన్ని కాకుండా భార్య చేతులనో భర్త చేతులనో పట్టుకుంటూ ఉంటే ఇంట్లో మనశ్శాంతి గ్యారంటీ. డబ్బు పెద్ద జబ్బు కరోనా శరీర కష్టాన్నే కాకుండా డబ్బు కష్టాన్ని కూడా తెచ్చి పెట్టింది. ఉద్యోగాలు పోవడం, సగం జీతాలు రావడం, వ్యాపారాలు సరిగ్గా జరక్కపోవడం ఇవన్నీ ఆర్థిక సమస్యలను తెచ్చిపెట్టాయి. సంపాదించలేకపోతున్నానన్న బాధ భర్తకు, సంపాదించింది చాలట్లేదన్న ఫ్రస్ట్రేషన్ భార్యకు ఉంటే ఇక ఇల్లు ప్రమాదంలో పడినట్టే. ఈ విషయంలో మాత్రం భార్య, భర్త సంపూర్ణంగా సహకరించుకోవాలి. సర్దుబాట్లు చేసుకోవాలి. భ్రమల్లో ఉండకుండా వాస్తవిక అంచనాలతో ఇంటి భవిష్యత్తును ప్లాన్ చేసుకోవాలి. డబ్బు ఉన్నది/కావాల్సినది అనే విషయం ఇరువురూ ట్రాన్స్పరెన్సీని పాటిస్తే చాలా వరకు సమస్య తీరినట్టే. డబ్బు లేదు కదా అని మనసును కష్టపెట్టే మాటలు మొదలెడితే అవి లోతైన గాయం చేస్తాయి. పాజిటివ్గా మాట్లాడటం, పరస్పరం సహకరిస్తున్నట్టుగా మాట్లాడుకోవడం ఇంటిని చాలా చాలా ప్రశాంతతతో ఉంచుతుంది. కష్టం వస్తే ఏముందిలే ప్రేమైతే ఉంది కదా అని అనిపించేలా చేస్తుంది. ఇల్లు తయారు కావడానికి ఏళ్లు పడుతుంది. ఛిద్రం చేసుకోవడానికి క్షణం పట్టదు. ఆరోగ్యాన్ని కరోనా నుంచి కాపాడుకుంటున్నట్టుగానే ఇంటిని స్పర్థల నుంచి, తగవుల నుంచి కాపాడుకుందాం. – సాక్షి ఫ్యామిలీ -
డబ్ల్యూహెచ్ఓతో సంబంధాలు రద్దు : ట్రంప్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)తో సంబంధాలను తెగదెంపులు చేసుకుంటున్నట్టు శుక్రవారం ప్రకటించారు. కరోనా వైరస్ గురించి ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించిందని మరోసారి తీవ్రంగా ఆరోపించిన ఆయన అమెరికా ఈ రోజు డబ్ల్యూహెచ్ఓతో సంబంధాలను రద్దు చేయబోతోందన్నారు. తాము కోరిన విధంగా ఎంతో అవసరమైన సంస్కరణలు చేయడంలో విఫలమైనందున సంస్థ నుంచి వైదొలగుతున్నామన్నారు. వైట్ హౌస్ రోజ్ గార్డెన్లో ట్రంప్ మాట్లాడుతూ డబ్ల్యూహెచ్ఓను బీజింగ్ సమర్థవంతంగా నియంత్రిస్తోందని, చైనా ప్రభుత్వ కోరిక మేరకే కరోనా వైరస్ గురించి ప్రపంచాన్ని తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. చైనాలో వైరస్ పుట్టుక, దాని వ్యాప్తి విషయాలను డబ్ల్యూహెచ్ఓ కప్పిపుచ్చిందని, సరిగ్గా వ్యవహరించలేదని ఆయన ఆరోపించారు. దీనికి ఆ సంస్థ బాధ్యత వహించేలా తప్పకుండా చేయాలని అన్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 400 మిలియన్ల డాలర్లు (మూడు వేల కోట్ల రూపాయలకు పైగా) వార్షిక సహకారాన్ని ఇతర ఆరోగ్య సంస్థలకు మళ్ళించనున్నామని తెలిపారు. అమెరికాతో పోల్చితే సంవత్సరానికి కేవలం 40 మిలియన్ డాలర్లు మాత్రమే చెల్లించే చైనా డబ్ల్యూహెచ్ఓను పూర్తిగా నియంత్రిస్తోందని మండిపడ్డారు.(సోషల్ మీడియాకు షాక్ : కత్తి దూసిన ట్రంప్) కాగా కరోనా వైరస్ వ్యాప్తిపై స్పందించే విషయంలో డబ్ల్యూహెచ్ఓ తన కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో విఫలమైందంటూ ఆరోపించడంతో పాటు డబ్ల్యూహెచ్ఓకు నిధులు నిలిపివేస్తామంటూ గతంలోనే హెచ్చరించారు. తాత్కాలికంగా నిధులను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈ ఏడాది నవంబర్లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్విటర్ జోక్యం చేసుకుంటోందంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా అధ్యక్షుడు సామాజిక మాధ్యమాలపై కొరడా ఝళిపించిన సంగతి తెలిసిందే. (‘థర్డ్ పార్టీ’ ప్రమేయం వద్దు) -
కార్మికులతో సంబంధాలను పునరుద్ధరించుకోవాలి
న్యూఢిల్లీ: కోవిడ్–19 పరిణామాల నేపథ్యంలో కార్మికులతో సంబంధాలను పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉందని పరిశ్రమకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ విజ్ఞప్తి చేశారు. అలాగే నైపుణ్యతలేని కార్మికుల పట్ల ఎలా అనుసరించాలన్న అంశానికి సంబంధించి ఒక నిర్దిష్ట మార్గాన్ని పరిశీలించాలనీ ఆమె సూచించారు. ఆయా అంశాలకు సంబంధించి అనుసరించే విధానాలు అందరికీ ఆమోదనీయం కావాల్సిన అవసరం ఉందనీ పేర్కొన్నారు. భారత పారిశ్రామిక సమాఖ్య (సీఐఐ) 125 వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆమె ఆ సంస్థ సభ్యులతో మాట్లాడారు. ఈ మేరకు సీఐఐ ఒక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం... పరిశ్రమలపట్ల ప్రభుత్వానికి పూర్తిస్థాయి విశ్వాసం ఉందని సీతారామన్ పేర్కొన్నారు. కోవిడ్–19కు ముందుసైతం గ్రామీణ ప్రాంతాల్లోని సంస్థలకు చేయూతను అందించడానికి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుందని అన్నారు. రుణ లభ్యతకు ఎటువంటి అవరోధాలు లేకుండా నిర్ణయాలు తీసుకుందన్నారు. వ్యవసాయం, మౌలిక రంగం వృద్ధికి కేంద్రం తగిన అన్ని చర్యలూ తీసుకుంటుందని తెలిపారు. -
గత రిలేషన్షిప్పై దీపిక సంచలన వ్యాఖ్యలు
ఒక్కసారి రిలేషన్షిప్లో మోసపోతే మళ్లీ ఆ బంధాన్ని యథావిధిగా కొనసాగించలేమని అంటున్నారు బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనే. గతంలో తాను ఎంతో మానసిక ఒత్తిడికి గురైనట్లు ఆమె తెలిపారు. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీపికా మాట్లాడుతూ.. తన గత ప్రేమ బంధం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రేమలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. అయితే ఎవరి పేరు ప్రస్తావించకుండా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.(రోమి దేవ్ పాత్రలో అదిరిపోయిన దీపిక!) ‘‘శృంగారం కేవలం శరీరానికి సంబంధించినది మాత్రమే కాదు. భావోద్వేగాలతో కూడుకొని ఉంటుంది. నేను రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఎవ్వరిని మోసం చేయలేదు. ఒకవేళ నేను ముర్ఖుల మధ్య ఉన్నా అని నాకు తెలిసినప్పుడు.. నేను ఎందుకు రిలేషన్షిప్లో ఉంటాను. ఒంటరిగా, ఆనందంగా ఉండటమే మంచిది కదా. అయితే అందరూ అలా ఆలోచించరు. బహుశా అందుకే నేను గతంలో బాధపడ్డాను. తెలివి తక్కువదానిలా అతనికి రెండో అవకాశం ఇచ్చాను. ఎందుకంటే తాను నన్ను వేడుకున్నాడు. అప్పటికే నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ తన ఇంకా నన్ను మోసం చేస్తున్నాడని చెబుతూనే ఉన్నారు. అప్పడు నేను అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను. అయితే ఆ సంఘటన నుంచి బయటికి రావడానికి నాకు కొంత సమయం పట్టింది. కాని ఒకసారి ఏదైనా నిర్ణయించుకున్నాక. మళ్లీ వెనక్కి వెళ్లడానికి ఏమి చేయలేం. జీవిత ప్రయాణంలో ముందుకు సాగాల్సిందే’’ అంటూ చెప్పుకొచ్చారు. (ప్రభాస్తో బాలీవుడ్ భామ రొమాన్స్..!) "అతను నన్ను మోసం చేసిన మొదటిసారి, బంధంలోనో, లేదా నాలో లోపం ఉందని అనుకున్నాను, కాని ఎవరైనా మోసాన్ని అలవాటుగా చేసుకున్నప్పుడు, అతనే సమస్య తెలిసి పోతుంది. నేను రిలేషన్లోషిప్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. కానీ తిరిగి ప్రతిఫలంగా ఆశించను. కానీ ఒక్కసారి రిలేషన్షిప్లో మోసం చేస్తే.. గౌరవం పోతుంది, బంధానికి ఉన్న నమ్మకం పోతుంది. అతనితో కలిసి ఉండలేం అన్న నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది’’ అని అన్నారు. కాగా కొన్నేళ్లపాటు హీరో రణ్బీర్ కపూర్తో ప్రేమ వ్యవహారం నడిపించిన విషయం తెలిసిందే. దీపిక.. రణ్బీర్ రెండేళ్లపాటు డేటింగ్ చేసి, అనంతరం 2009లో విడిపోయారు. -
స్వాతికి తెలియదు
స్వాతికే కాదు.. సీతకు, శ్వేతకూ తెలియదు. పల్లవికి, ప్రవల్లికకూ తెలియదు. బాధ్యతగా ఆమె పప్పుల్నీ, ఉప్పుల్నీ లెక్కగట్టి మూడు పూటలా ఇంటిని నడిపిస్తున్నప్పుడు.. బాధ్యతగా అతడూ అప్పుల్నీ, తప్పుల్ని ఏరోజు కారోజు ఇంటికి రాగానే చీటీలో రాసి ఆమె చేతిలో పెట్టాలి. నెలకోసారి.. పే స్లిప్ చూపించడం కాదు. గైస్.. ఒక రూపాయి అప్పు చేసేముందు ఆమెకు ఫోన్ చేసి చెప్పండి.. ఫోన్కి పది రూపాయలు అవుతున్నా సరే! ఒక సంతకం పెట్టే ముందు ఆమె అనుమతి తీసుకోండి.. ఆమె కోసం మీరు కొనబోతున్న శ్వేత సౌధపు అగ్రిమెంట్ కాగితాలైనా సరే. ఉదయం ఆఫీస్కి వెళ్లిన నాన్న సాయంత్రం కొత్త కారుతో ఇంటికి వస్తే పిల్లలు వాకిట్లోకి ఒక్క గెంతు గెంతి ‘హే.. కొత్త కారు’ అని కారులోకి దూకి కూర్చుంటారు. మరీ చిన్నపిల్లలైతే వెళ్లి స్టీరింగ్ సీట్లో కూర్చొని స్టీరింగ్ని ‘జుయ్జుయ్’మని తిప్పుతారు. ‘మనదేనా నాన్నా’.. పిల్లలు అడిగే మొదటి ప్రశ్న. ‘ఎక్కడికెళ్దాం నాన్నా’.. రెండో ప్రశ్న. పిల్లల్ని ఎత్తుకుని బుగ్గలపై ముద్దుపెడుతూ భార్య వైపు చూస్తాడు అతడు. ‘మనదే కారు’ అంటూ ఒక ముద్దు. ‘నువ్వు చెప్పు ఎక్కడికెళదామో’ అంటూ ఇంకో ముద్దు. పిల్లలు అడిగినట్లే ఆమెకూ ఒక ప్రశ్న అడగాలని ఉంటుంది. ‘ఎక్కడిదండీ కారు?’ అని. కానీ అడగదు. అడిగితే, కారు ఎలా ఉందో చెప్పకుండా, కారు ఎలా వచ్చిందో చెప్పమని అడుగుతుందేమిటి’ అని భర్త నొచ్చుకుంటాడేమోనని ఆమె భయం. నొచ్చుకుంటాడన్న భయంతో ఆమె అతడిని చాలానే అడగలేదు. పెళ్లయి ఏడెనిమిదేళ్లు అవుతున్నా ఏ నెలలోనూ జీతమెంత అని భర్తను అడగలేదు. జీతంలో కటింగ్స్ ఎన్ని అని అడగలేదు. ఇంట్లోకి ఒకేసారి హైఎండ్ ఏసీ, ఫ్రిజ్, వాషింగ్మిషన్, టీవీ.. ఇంకా రెండుమూడు ‘చిన్న వస్తువుల్ని’ పిల్లల ఆటబొమ్మల్లా భుజాన మోసుకొచ్చిప్పుడు కూడా భుజం మీద నుంచి బరువును దింపిందే తప్ప, దింపాక పెరిగే వాటి బరువు గురించి అతడిని అడగలేదు. ‘ఈఎమ్ఐల్లో తెచ్చా. చిటికెలో అయిపోతాయి’ అని అన్నప్పుడు కూడా ఎవ్రీ మంత్ శాలరీ కన్నా, ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్స్ ఎక్కువైపోవు కదా’ అని అడగలేదు. అడిగితే అతడు నొచ్చుకుంటాడు. ‘చిన్న వస్తువుల్ని’ ఇంటికి తెచ్చిన కొన్నాళ్లకే ఓరోజు అతడు ఆమె కళ్లకు గంతలు కట్టి కారులో ఓ పెద్ద ఇంటికి తీసుకెళ్లాడు. గంతలు విప్పాక, కళ్లు నులుముకుని చూసి, అప్పుడు మాత్రం అడిగింది, ‘ఎవరిల్లండీ, బాగుంది’ అని! ‘మనదే!’ అనలేదు అతను. ‘నీదే’ అన్నాడు. ‘నీ కోసమే’ అన్నాడు. అతడెప్పుడూ అలాగే మాట్లాడతాడు. మాట్లాడ్డం కాదు, నిజంగానే అతడు చేసేవన్నీ ఆమె కోసమే. చేయాలనుకునేవన్నీ ఆమె కోసమే. ‘ఇప్పుడున్న ఇంటికే అంత అద్దె కడుతున్నాం. ఈ ఇంటికి ఇంకా ఎక్కువ ఉండదా’ అంది.. కొత్త గోడల్ని, కొత్త తలుపుల్ని, కొత్త కిటికీల్ని తడిమి చూస్తూ. పెద్దగా నవ్వి, ఆమె చుట్టూ చేతులు వేసి గాల్లోకి లేపాడు అతడు. ‘ఇది మన సొంతిల్లు. నీ కోసం, పిల్లల కోసం కొన్న ఇల్లు’ అన్నాడు. ‘ఇకనుంచి మనం అద్దె కట్టనక్కర్లేదు’ అన్నాడు. ‘ఆ కట్టేదేదో మన సొంత ఇంటికి కట్టుకుంటే సరిపోతుంది’ అన్నాడు. కట్టుకున్నది సొంతిల్లు అవుతుంది కానీ, నెల నెలా కట్టేది సొంతిల్లు అవుతుందా! ఆ మాటే ఆమె అనబోయింది. అతడు అననివ్వలేదు. ప్రశ్నలు కట్టిపెట్టు అని ఆమెను దగ్గరకు లాక్కున్నాడు. అతడి చేతుల్లో ఆమె భద్రంగా ఉంది. ఇంత భద్రత కొత్తింట్లో ఉంటుందా.. పది వేల అద్దెకు బదులు నెలనెలా కట్టే ఇరవై వేల లోన్ కట్టవలసిన ఇంట్లో?! అతడు సంతోషంలో ఉన్నాడు. తనకొచ్చిన సందేహాలన్నీ భర్తకూ వచ్చి ఉంటాయి. అయినా సంతోషంగా ఉన్నాడూ అంటే.. తను వేరుగా సందేహపడాల్సిందేమీ లేదు. కుడికాలు లోపలికి పెట్టింది. పిల్లలు ‘ఓ.. ఓ..’ అంటూ కొత్తింట్లోని హాల్లోకి, బెడ్రూమ్లోకి, కిచెన్లోకి, బాత్రూమ్లోకి, బాల్కనీలోకి పరుగులు తీస్తున్నారు. ఎంత పిల్లల్తో పోటీపడి పరుగెత్తలేని కాలమైనా రోజుల్ని, వారాల్ని దాటి నెల దగ్గరికి వచ్చేస్తుంది. నెల తర్వాతి నెలకూ వచ్చేస్తుంది. ‘కాస్త టైట్గా ఉంది గురూ. వచ్చే నెల రెణ్ణెల్ల ఇంట్రెస్ట్ కలిపి ఇచ్చేస్తా..’ ఆమె వాకిట్లో ముగ్గేస్తోంది. అతడు ఆమెకు వినిపించనంత దూరం వెళ్లి ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఆఫీస్లోనే కాదు, ఇంట్లో ఉన్నప్పుడైనా ఫోన్లో ఏ ఉద్యోగం చేస్తుంటే ఆ మాటలే రావాలి. టెకీ అయితే అదేదో జార్గాన్ ఉంటుంది. ఫ్లోచార్టు, డీబగ్, లైఫ్ సైకిల్, టెస్టబుల్ కోడ్.. ఇలాంటి మాటలు రావాలి. డాక్టర్ అయితే రిపోర్ట్స్ అనీ, ఇన్వెస్టిగేషన్ అనీ, మెడికల్ హిస్టరీ అనీ రావాలి. జర్నలిస్ట్ అయితే ప్రెస్మీట్ అని, స్కూప్ అనీ, లీడ్ అనీ ఏవో ఉంటాయి. అవి రావాలి. ఇవేమీ కాకుండా టైట్గా ఉందనీ, ఒకేసారి రెణ్ణెల్లదీ ఇచ్చేస్తాననీ అంటున్నాడంటే.. అదీ ముంగిట్లో ముగ్గు పడే వేళ నుంచే కొత్తగా ‘టైట్ టాక్’ మొదలవుతోందంటే.. ఏనాడూ భార్యాబిడ్డల్తో కలిసి కూర్చుని భోజనం చేసే స్థిమితం కూడా లేని అతడు.. త్వరలోనే త్వరగా ఇంటికి రాబోతున్నాడనే! త్వరగా ఇంటికి వచ్చిన ఆ రాత్రి.. తనని చూసి కేరింతలు కొడుతూ నిద్రమానుకున్న పిల్లలతో కలిసి.. తండ్రీ బిడ్డల్ని చూసి మురిసిపోతున్న భార్యతో కలిసి.. భోజనం చేయబోతున్నాడనే! బయటి నుంచి తను తెచ్చిన ‘ఫుడ్ ఐటమ్స్’ని అందరి భోజనంలో తలా ఇంత చేర్చి పిల్లలకు, భార్యకు తనే మొదటి ముద్ద తినిపించబోతున్నాడనే! హైదరాబాద్లో శనివారం రాత్రి ఇలాగే ఓ కుటుంబం ‘కలిసి భోజనం’ చేసింది! అతడు, ఆమె, ఇద్దరు పిల్లలు. ఆరేళ్లొకరికి. ఏడాదిన్నరొకరికి. టెకీ అతను. చిన్న వయసే. పెద్ద కంపెనీలో పని. పెద్ద జీతం. అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాడు. బిజినెస్ చేసి అప్పు తీర్చాలనుకున్నాడు. బిజినెస్ కోసం మళ్లీ అప్పు చేశాడు. బాగా బతకడం కోసం కాదు ఇవన్నీ. ఇంకా బాగా బతకడం కోసం. చివరికి బతకలేక తనను, కుటుంబాన్ని చంపుకున్నాడు! జీతం అప్పును పుట్టిస్తుంది. అప్పును కట్టలేదు. ఒకట్రెండు వాయిదాలైతే జీతం తీర్చేస్తుంది. అప్పుల్ని, వడ్డీల్ని తీర్చే కెపాసిటీ ఎంత పెద్ద జీతానికైనా ఉండదు. ఆ సంగతి అతడికెవరూ చెప్పలేకపోయారా! ఇంత జరుగుతోందని అతడెవరికైనా చెబితేనే కదా! భార్యకు కూడా చెప్పలేదు. చనిపోతూ తండ్రికి రాసిన ఉత్తరంలో మాత్రం చెప్పాడు. ‘స్వాతికి ఇవేవీ తెలియదు నాన్నా..’ అని చెప్పాడు! స్వాతి అతడి భార్య. అతడు నొచ్చుకుంటాడని అతడిని ఏనాడూ ఎందుకు, ఎలా అని అడగని భార్య.. ‘బతకాలని ఉంది స్వాతీ’ అని ఒక్కమాట అని ఉంటే.. బతకలేనంత కష్టం ఏమొచ్చిందో అడిగి తెలుసుకుని ఉండేది. కష్టమో, నష్టమో కలిసే బతుకుదాం అని ధైర్యం చెప్పి ఉండేది. మాటైనా చెప్పకుండా భార్యనీ పిల్లల్నీ తనతో తీసుకుపోయాడు! l -
ఒంటిరిగా ఉండటానికి భయపడుతున్నారా?
మనం ఎవరితోనైనా ప్రేమలో పడగానే వారితో రిలేషన్షిప్లోకి అడుగుపెట్టాలని కోరుకోవటం పరిపాటి. ముఖ్యంగా ఎదుటి వ్యక్తిపై నమ్మకం, వారు పాటించే విలువులు, ఇద్దరి మధ్యా సామీప్యతలు బంధంలోకి అడుగుపెట్టడానికి కారణాలుగా కనిపిస్తాయి. అయితే చాలామంది ఒంటరిగా ఉండటానికి ఇష్టంలేక..భయపడి ప్రేమబంధంలోకి అడుగుపెడతారు. అలాంటి వారు తమ భాగస్వామి ఇతరుల పట్ల ఏమాత్రం శ్రద్ధ చూపించినా తట్టుకోలేరు. స్వార్థపూరితమైన బంధం ఎక్కువకాలం నిలవలేదన్న విషయాన్ని గుర్తించలేరు. ఓ వ్యక్తి ఒంటరిగా ఉండటానికి ఇష్టంలేక.. భయపడి ప్రేమబంధంలోకి అడుగుపెట్టారని చెప్పే కొన్ని లక్షణాలు.. 1)కామన్ థింగ్స్ ! ఇష్టపడే ఆహారం, నచ్చే హీరో, ప్రదేశాలు.. హాబీస్ ఇలా ఏ విషయంలోనైనా ఓ జంట మధ్య చాలా పోలికలు ఉన్నట్లయితే కుటుంబమో.. స్నేహితులో.. మీ మధ్య చాలా విషయాల్లో పోలికలు ఉన్నాయంటూ పొగడటం మామూలే. అయితే ఎవరైనా మీ జంటలోని మీ ఇద్దరి మధ్య కామన్ థింగ్స్ ఏంటంటూ మిమ్మల్ని అడిగారనుకో.. అవేంటో చెప్పటానికి మీరు బుర్ర బద్ధలు కొట్టుకుంటుంటే మటుకు మీరు ఒంటరిగా ఉండలేక బంధంలోకి అడుగుపెట్టారనడానికి సూచన. 2) అభద్రతా భావం ఓపెన్గా చెప్పటానికి మీరు ఇబ్బంది పడొచ్చుకానీ, మీ పార్ట్నర్ ఎవరితోనైనా చనువుగా ఉంటే మాత్రం మీరు తట్టుకోలేరు. మాటలో వర్ణించలేని ఈర్ష్యతో రగిలిపోతారు. ఎదుటి వ్యక్తి మిమ్మల్ని ఎక్కడ మోసం చేస్తారోనన్న భయంతో అల్లాడిపోతారు. ఇది మీరు ఒంటరిగా ఉండటానికి భయపడుతున్నారనడానికి సూచన 3) ఎదుటి వ్యక్తి సంతోషం కోసం.. ఎదుటి వ్యక్తిని సంతోషపెట్టడానికి మీకు సంబంధించిన కొన్ని విషయాల గురించి అబద్ధాలు చెబుతున్నారా? అవునంటే! మీలోని కొన్ని లక్షణాలు ఎదుటి వ్యక్తికి నచ్చవన్న భావన మీకు ఉన్నట్లు గుర్తించాలి. వాటి వల్ల మీ బంధానికి ఇబ్బంది కలుగుతుందేమోనన్న భయం మీకు కచ్చితంగా ఉండిఉంటుంది. ఇలా అయితే గనుక మీ బంధం గురించి ఓసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 4) భాగస్వామి పక్కనలేకపోతే.. మీ పార్ట్నర్ మీకు దూరంగా ఉన్నప్పుడు ఒంటరిగా ఫీల్ అవుతున్నారా?.. ‘నన్ను విడిచి దూరంగా వెళ్లొద్దు’ అంటూ ఆమె/అతడితో గొడవపడుతున్నారా? అయితే మీరు ఒంటరిగా ఉండలేక ప్రేమ బంధంలోకి అడుగుపెట్టారని కచ్చితంగా చెప్పొచ్చు. ముఖ్యంగా మీ భాగస్వామి మీ ఫోన్ కాల్స్కు రిప్లై ఇవ్వకుండా, మీ స్నేహితులతో చనువుగా ఉన్నపుడు ఏదో కోల్పోయిన వారిలా ఒంటరిగా ఫీల్ అవుతుంటే ఆలోచించాల్సిన విషయమే.. ఇలాంటి ప్రవర్తన మీ బంధాన్ని ఇరకాటంలో పడేస్తుందని గుర్తించండి. 5) భాగస్వామితో బంధం ఓ పెద్ద అచీవ్మెంట్! మీ భాగస్వామితో బంధంలోకి అడుగుపెట్టడమే ఓ పెద్ద అచీవ్మెంట్లా ఫీలవతున్నారా? ఇతరుల ఎదుట మీరు ఒంటరివారు కాదని నిరూపించుకోవటానికి పరితపిస్తున్నారా? మీ భాగస్వామి మిమ్మల్ని విడిచిపెట్టివెళ్లకుండా ఏ విధంగా ఇబ్బందిపెట్టినా పర్లేదనుకుంటున్నారా? అయితే మీరు ఒంటరిగా ఉండటానికి భయపడేవారని గుర్తించండి. లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
అలాగని చీటికిమాటికి గొడవపడితే..
ఓ ఇద్దరు వ్యక్తులు జంటగా బంధంలోకి ప్రవేశించినపుడు అన్ని రకాల ఛాలెంజ్లను వారు ఫేస్ చేయాల్సి ఉంటుంది. పరిస్థితులకు తగ్గట్టుగా నడుచుకోవాల్సి వస్తుంది. ఏ జంటకైనా కొన్ని కష్టసమయాల్లో ఏం చేయాలో తోచని పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి జంటలకు చిన్న సలహాలు కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. అలాంటి జంటల కోసం బెస్ట్ రిలేషన్షిప్ టిప్స్!! 1) వ్యక్తిగత సరిహద్దులు జంట మధ్య బంధం సాఫీగా సాగాలంటే వ్యక్తిగత సరిహద్దుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకరికొకరు కొంత ఫ్రైవేట్ స్పేస్ను ఏర్పరచుకోవాలి. అనుమతి లేకుండా భాగాస్వామి సెల్ఫోన్ను చెక్చేయటం, పర్శనల్ వస్తువులను వారికి తెలియకుండా వాడుకోవటం లాంటివి చేయకూడదు. దీనివల్ల ఎదుటివ్యక్తికి మనపై ఉన్న నమ్మకం సన్నగిల్లుతుంది. 2) నచ్చని అలవాట్లు .. బంధం అంటేనే అంగీకారం, సర్దుకుపోవటం. బంధంలోకి అడుగుపెట్టగానే ఎదుటి వ్యక్తిని లేదా వారి అలవాట్లను మార్చాలనుకోవటం, అది కుదరక నిరుత్సాహపడిపోవటం మామూలే. అయితే మనం నిజంగా ఓ వ్యక్తిని ప్రేమిస్తున్నట్లయితే వారిని లేదా వారి అలవాట్లను మార్చాలని అనుకోము! వారిని వారిగా స్వీకరిస్తాము. అయితే ఎదుటి జీవితాన్ని నాశనం చేసే ఆరోగ్యపు అలవాట్ల విషయంలో మాత్రం ఈ సూత్రం వర్తించదు. 3) అన్యోన్యమైన జంట గొడవపడదు! అన్యోన్యమైన జంట గొడవపడదు అని చెప్పటం జంటలను పక్కదోవ పట్టించటమే. జంటల మధ్య గొడవలు జరగటం వల్ల వారి బంధం మరింత బలపడుతుంది. గొడవలు పడకుండా జంట సర్దుకుపోవటం వల్ల ధీర్ఘకాలంలో వారి బంధాన్ని నాశనం చేసే విషయాలను వారు స్వేచ్ఛగా చర్చించలేరు. అలాగని చీటికిమాటికి గొడవపడటం ఎంత మాత్రమూ మంచిది కాదు. 4) అనుకూలమైన భాగస్వామి భాగస్వామి కోసం వెతుకుతున్నపుడు అనుకూలమైన వారి కోసం అన్వేషించటం పరిపాటి. చాలామంది అనుకూలతలేని భాగస్వామితో జీవితం బాగుండదని నమ్ముంతుంటారు. అయితే అనుకూలత అన్నది ఓ స్థిరమైన గుణం కాదని, నెమ్మదిగా అలవర్చుకునేదని నిపుణులు చెబుతున్నారు. కొంతమంది మొదటి చూపులోనే అనుకూలంగా కనిపించకపోవచ్చు. అలాగని వారిని దూరం చేసుకోవటం మంచిదికాదు. లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
మీ పార్ట్నర్లో ఈ ఐదు లక్షణాలు ఉంటే!..
జిహ్వకో రుచి పుర్రెకో బుద్ధి అన్నట్లు మనషులందరూ ఒకేలా ఉండరు. ఒక్కో వ్యక్తి ఆలోచనలు ఒక్కో రకంగా ఉంటాయి. భిన్న ఆలోచనా విధానాలతో బంధంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు తమ జీవితాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేప్పుడు చాలా విషయాల్లో ఏకాభిప్రాయం కుదరక గొడవపడటం సర్వసాధారణం. అయితే బంధంపై క్లారిటీ ఉండి, ఒకరిపై మరొకరికి ప్రేమ ఉండి గొడవలు పడేవారితో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ, బంధంపై క్లారిటీ లేకుండా ఎదుటి వ్యక్తిపై ప్రేమ లేకుండా ఏదో మొక్కుబడిగా బంధంలోకి అడుగుపెట్టే వారితోనే అసలు చిక్కు. ముఖ్యంగా కమిట్మెంట్ ఫోబియా ఉన్న వ్యక్తులతో రిలేషన్లో ఉన్నట్లయితే జీవితం నిత్యం నరకప్రాయంగా మారుతుంది. అయితే మనం రిలేషన్లో ఉన్న వ్యక్తికి కమిట్మెంట్ ఫోబియా ఉందోలేదో తెలుసుకోవటమే పెద్దపని. ఈ క్రింది లక్షణాలు గనుక మీ భాగస్వామిలో ఉన్నట్లయితే వారికి కమిట్మెంట్ ఫోబియా ఉన్నట్లు గుర్తించాలి! వారితో జాగ్రత్తగా ఉండాలి. 1) దాటవేసే ధోరణి కమిట్మెంట్ ఫోబియా ఉన్నవారు బంధానికి సంబంధించిన విషయాల్లో దాటవేసే ధోరణిని అవలంభిస్తుంటారు. ఎప్పుడైనా బంధం గురించిన చర్చకు తెరతీసినపుడు వారు దానికి సుముఖత వ్యక్తం చేయరు. బంధానికి సంబంధించిన విషయాలను మాట్లాడుతున్న ప్రతిసారి టాపిక్ను డైవర్ట్ చేయటానికి ప్రయత్నిస్తారు. వారి వద్ద రిలేషన్కు సంబంధించిన ఏ విషయంపైనా సరైన సమాధానం ఉండదు. సరదాగా బయటికి వెళదామని అడిగితే ‘ చూద్దాం!’ అంటూ ఇష్టంలేని సమాధానాలు ఇస్తారు. 2) భవిష్యత్తు ప్రశ్నార్థకం రిలేషన్లో ఉన్నపుడు, దాన్ని కలకాలం కొనసాగించాలనుకున్నపుడు భవిష్యత్ గురించిన చర్చ తప్పని సరిగా వస్తుంది. ఓ జంట తమ భవిష్యత్ను గురించి మాట్లాడుకోవటంలో సిగ్గు పడాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదు. అయితే కమిట్మెంట్ ఫోబియా ఉన్న వ్యక్తులు భవిష్యత్తును గురించిన విషయాలు మాట్లాడినపుడు విముఖత వ్యక్తం చేస్తారు. ‘ ఎప్పటి సంగతో ఇప్పుడెందుకు. ముందు ప్రస్తుతం గురించి ఆలోచిద్దాం.’ అంటూ విసుక్కుంటారు. 3) చిన్న చిన్న విషయాలకే బ్రేకప్ కమిట్మెంట్ ఫోబియా ఉన్న వారు రిలేషన్ మీద సరైన క్లారిటీ లేకపోవటం వల్ల చిన్న చిన్న విషయాలకే గొడవపడి బ్రేకప్ చెప్పేస్తారు. ఎదుటి వ్యక్తి ఇష్టాయిష్టాలకు ఎటువంటి ప్రాధాన్యతా ఇవ్వరు. వారి అభిప్రాయాలకు, ఆలోచనలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంటారు. బంధాన్ని ముందుగా తీసుకెళదామా? వద్దా? అన్న చోటే ఆగిపోతారు. భాగస్వామి ఎడ్డెం అంటే వీరు తెడ్డెం అంటూ గొడవలకు నాంది పలుకుతారు. 4) గోప్యత పాటించటం కమిట్మెంట్ ఫోబియా ఉన్న వారు తమ బంధాన్ని నలుగురి ముందు బహిర్గతం చేయటానికి ఇష్టపడరు. ముఖ్యంగా సోషల్ మీడియాకు సంబంధించిన వాటిల్లో. ఏళ్లు గడుస్తున్నా తమ బంధాన్ని గోప్యంగా ఉంచాలని చూస్తుంటారు. 5) ప్రేమను వ్యక్తీకరించకపోవటం మీరు చాలా కాలం నుంచి రిలేషన్లో ఉంటున్నప్పటికి మీ పార్ట్నర్ మీతో ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను’ అని చెప్పకపోయినట్లయితే వారు కచ్చితంగా కమిట్మెంట్ ఫోబిక్ అని గుర్తించాలి. కమిట్మెంట్ ఫోబియో ఉన్నవారు ఎదుటి వ్యక్తిపై ఉన్న ప్రేమను డిసైడ్ చేసుకోలేరు. ప్రేమను వ్యక్తపరిచినట్లయితే అంతా ముగిసిపోతుందని భావిస్తుంటారు. లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
సీక్రెట్లుంటే సైడ్ అయిపోతారు!
రిలేషన్లో ఉన్నపుడు జంట మధ్య రహష్యాలు లేకుండా ఉండటం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే అన్ని జంటలు తమ మధ్య రహష్యాలు లేని పారదర్శకమైన బంధం కావాలని కోరుకోవటం లేదు. తమ జీవితంలో చోటుచేసుకున్న కొన్ని సంఘటనలను రహష్యంగా ఉంచినా పర్లేదు అనుకుంటున్నారు. కానీ, కొన్ని విషయాలను సీక్రెట్గా ఉంచటం వల్ల జరిగే మంచికంటే చెడే ఎక్కువగా ఉంటుంది. కలతల్లేని మంచి బంధాన్ని కోరుకుంటున్నట్లయితే రహష్యాలకు దూరంగా ఉండాలి. ఎదుటి వ్యక్తి పట్ల నమ్మకంగా వ్యవహారించాలి. ఎదుటి వ్యక్తితో సుధీర్ఘమైన బంధాన్ని కొనసాగించాలనుకుంటే ముఖ్యంగా మన ఆర్థిక పరిస్థితుల విషయంలో రహష్యాలు ఉండరాదు. మన పరిస్థితి గురించి ఎదుటి వ్యక్తికి వివరించి చెప్పాలి. అయితే చాలా మంది తాము అప్పుల్లో కూరుకుపోయి ఇబ్బంది పడుతున్నా ఎదుటి వ్యక్తిని ఇంప్రెస్ చేయటానికి పైన పటారం లోన లొటారంలా వ్యవహరిస్తుంటారు. తర్వాతి కాలంలో ఇది బంధానికి గొడ్డలి పెట్టులా తయారవుతుంది. అదే విధంగా మతాల విషయంలోనూ, రాజకీయ విషయాలకు సంబంధించి కూడా ఒకే విధమైన ఆచరణలు, ఆలోచనలు ఉండాల్సిన అవసరం లేదు. ఎదుటి వ్యక్తి కోసం మనం వాటిని దాచిపెట్టుకోవల్సిన, మార్చుకోవల్సిన అవసరం లేదు. ఇలాంటి విషయాల్లో చాలా క్లారిటీతో ఉండాలి. ఇలాంటి విషయాలే బంధంలో కీలక పాత్రల్ని పోషిస్తాయని గుర్తించాలి. ఇక గతానికి సంబంధించిన విషయాల్లో కూడా కచ్చితంగా ఉండాలి. మన గతంలోని ప్రేమ, ఎంగేజ్మెంట్, పెళ్లి గురించిన విషయాలను ఎదుటివ్యక్తికి తప్పక చెప్పాలి. ఆవతలి వ్యక్తుల నుంచి కూడా క్లారిటీ పొందాలి. ఇలాంటి విషయాల్లో దాపరికాలు ఉన్నట్లయితే బంధం ఏ నిమిషమైనా ఇబ్బందుల్లో పడటానికి అవకాశం ఉంటుంది. వీటి విషయంలో సరైన క్లారిటీ ఉన్నట్లయితే భవిష్యత్తులో చోటుచేసుకోబోయే అపార్థాలకు ముందుగానే అడ్డుకట్టపడుతుంది. లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
కొత్త జీవితానికి శుభాకాంక్షలు
కొత్త సంవత్సరం వచ్చేది పాతవి వదిలిపెట్టడానికి.12 నెలల– 52 వారాల– 365 రోజుల గత జీవితాన్ని అందులోని అప్రియమైన సంగతులను వదిలి ముందుకు సాగడానికి.కొత్త సంవత్సరంలో అంతా మంచి జరగాలని కోరుకోవడం అంటే ఉన్న బంధాన్ని కొత్తగా నిర్వచించుకోవడమే.గొడవలున్న తేదీలను మార్క్ చేసిన పాత కేలండర్ని పారేద్దాం.సంతోషాలను ప్లాన్ చేసుకున్న కొత్త కేలండర్ను స్వాగతిద్దాం.హ్యాపీ న్యూ ఇయర్. భార్యతో టైమ్ స్పెండ్ చేయలేని సక్సెస్ అది ఎంత పెద్దదైనా కాని సక్సెస్ కాదు. ఎప్పుడో వస్తాయనుకునే కంఫర్ట్స్ కోసం ఇప్పటి లైఫ్లోని కంఫర్ట్ను పాడుచేసుకుంటున్నారు. లైఫ్ పార్టనర్ను టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటే కలిగే నష్టం చాలా ఎక్కువ. జనవరి 1 మరో రెండు వారాలు ఉందనగా ఆమె ఫోన్ చేయడం మొదలుపెట్టింది. ‘చూడండి. ఏదైనా ఉంటే మీరు క్లినిక్కు వచ్చి మాట్లాడండి. ఫోన్లో మీ కేస్ను అసెస్ చేయడం కుదరదు’ అన్నాడు సైకియాట్రిస్ట్. ‘కాదు డాక్టర్. నాకు మీ దగ్గరకు రావాలంటే భయం. సైకియాట్రి క్లినిక్లకు వచ్చేంతగా నేనింకా ప్రిపేర్ కాలేదు. మిమ్మల్ని కలవాలి అనుకున్న వెంటనే నా మనసు నీకేమైనా పిచ్చా.. సైకియాట్రిస్ట్లను పిచ్చివాళ్లే కలుస్తారు అనడం మొదలెట్టింది’ సైకియాట్రిస్ట్కు నవ్వు వచ్చింది. ‘మీరు సినిమాలు ఎక్కువ చూస్తారులాగుంది’ అన్నాడు. ‘అవును. మీకెలా తెలుసు’ ‘సినిమాల్లో పిచ్చివాళ్లను రకరకాలుగా చూపిస్తుంటారు. పిచ్చి అంటే చెట్టెక్కి కూచుని వింత చేష్టలు చేయడం మాత్రమే అని వారి అవగాహన. చూడండి... జలుబు అనారోగ్యమే. కేన్సర్ అనారోగ్యమే. రెండూ శరీరానికి వస్తాయి. మనసు విషయంలో కూడా జలుబు స్థాయి ఉంటుంది... కేన్సర్ అంత తీవ్రస్థాయి ఉంటుంది. జలుబుకు టేబ్లెట్ వేసుకునే మనం మనసులో చిన్న గుబులు వచ్చినప్పుడో, వ్యాకులత పెరిగినప్పుడో, నిర్ణయాల్లో నిలకడ లేనప్పుడో, మనసుకు తగిలిన గాయాలు ఎంతకీ మానలేకపోయినప్పుడో ఎందుకు మందులు వాడము? ఎందుకు సైకియాట్రిస్ట్ సలహా తీసుకోము? చెప్పండి’ అటువైపు నిశ్శబ్దం ఆవహించింది. ఆ మరుసటి రోజే ఆమె క్లినిక్కు వచ్చింది. ‘నా భర్తకు జనవరి 1న గుడ్బై చెప్దామనుకుంటున్నాను డాక్టర్’ అందామె. ముప్పై ఐదేళ్లుంటాయి. చామనఛాయలో కొద్దిపాటి బొద్దుగా ఉంది. ఇద్దరు పిల్లలట. అమ్మాయిలు. ‘ఏమిటి.. ఆ డేట్ ప్రత్యేకత?’ ‘ఏం లేదు.. కొత్త సంవత్సరం కదా. లైఫ్ను కొత్తగా స్టార్ట్ చేద్దామని’ ‘అంటే ఇంకో రెండువారాల్లో’ ‘రెండు వారాల్లోనే’ ‘ఆలోచిద్దాం. ముందు మీ సమస్య ఏమిటో చెప్పండి’ అన్నాడు సైకియాట్రిస్ట్ సర్దుకుని కూచుంటూ. ఆమె పేరు రాధ. ఊరు కొత్తగూడెం. డెంటిస్ట్రీ చేసింది. పెళ్లయ్యాక హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యింది. అతని పేరు మహేంద్ర. సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్. నల్గొండ సొంత ఊరు. పెద్దలు కుదిర్చిన ఈ పెళ్లిలో మహేంద్ర చదువు, ఉద్యోగం మొదటి నుంచి పై చేయి అయ్యాయి. అతను, అత్తామామలు రాధ చదువు గురించి గొప్ప భావనలో లేరు. డెంటిస్ట్రీ చేసినవాళ్లు చాలామంది ఉంటారని, డాక్టరు కాలేనివారు పంటి డాక్టర్లు అవుతారని, ఆ ప్రొఫెషన్లో పెద్ద ఎదుగుదల ఉండదని వారు అందరూ కల్పించిన అభిప్రాయంలో ఉన్నారు. రాధకు డెంటిస్ట్గా రాణించాలన్న కోరిక మొదట్లోనే దెబ్బతిన్నట్టయ్యింది. అప్పటికే తను కొత్తగూడెంలో రెండేళ్లు జూనియర్ డెంటిస్ట్గా ఒక క్లినిక్లో పని చేసింది. కాని ఆమె పని తీరు సీనియర్ కంటే బాగుండేదని పేషెంట్లు అనేవారు. ఆమె ప్రాక్టీసు విషయం తేలకముందే– ‘నేను చేసుకోవడమే ఆలస్యంగా చేసుకున్నాను. పిల్లలను పోస్ట్పోన్ చేయొద్దు’ అన్నాడు మహేంద్ర. ఇద్దరు పిల్లలు వెంటవెంటనే పుట్టారు. వారి బాగోగుల్లో ఏడెనిమిదేళ్లు గడిచిపోయాయి. రాధకు అంతా బాగున్నట్టే అనిపిస్తోంది కానీ ఏమిటో అసౌకర్యం. మహేంద్ర చెడ్డవాడు కాదు. అతనికి పని పిచ్చి. సాఫ్ట్వేర్ రంగంలో సీనియర్ లెవల్లో ఉండటం వల్ల టీమ్ను మేనేజ్ చేయడం ఒక సమస్యగా, తన పైవారిని హ్యాండిల్ చేయడం మరో సమస్యగా సతమతం అయ్యేవాడు. ఉదయం ఎనిమిదిన్నరకు క్యాబ్ ఎక్కితే రాత్రి పదికి వచ్చేవాడు. వచ్చినా మళ్లీ ల్యాప్టాప్ను ముందు పెట్టుకునేవాడు. అత్తామామలు నల్గొండలోనే ఉండిపోవడం వల్ల ఈ మొత్తం వ్యవహారంలో రాధకు తోడు మిగిలింది పనిమనిషే. ఆ పనిమనిషి కూడా సరిగ్గా వచ్చేది కాదు. ఒక ఇల్లు కాకపోతే మరో ఇల్లు సులభంగా దొరుకుతుందని లెక్కలేనితనం. పిల్లలకు నలతగా ఉన్నా, చటుక్కున హాస్పిటల్కు తీసుకువెళ్లాలన్నా, వాళ్లను సముదాయించాలన్నా రాధకు చాలా కష్టమయ్యేది. వారికి వండటం, తనకు వండుకోవడం, భర్తకు వండిపెట్టడం... ఇవన్నీ చిన్నగా కనిపించే పెద్ద పనులు. ‘నాకు కష్టంగా ఉంది’ అని మహేంద్రతో అంటే ‘ఓపిక పట్టు’ అని అంటాడు. ‘నా కెరీర్ కూడా వదులుకున్నాను. ఇంట్లో ఉండి మాత్రం ఏమి బావుకున్నాను’ అని ఆమెకు అనిపించసాగింది. ఫలితంగా తీవ్రమైన డిప్రెషన్. చిరాకు. మూడీనెస్. కళ్లకింద వలయాలు. పిల్లలను గదమాయించడం. అసలేమిటో అర్థం కానంత హైరానా. చీటికిమాటికి ఏడుపు ముంచుకురావడం. పోయిన జనవరి 1న ‘నెక్ట్స్ జనవరి1 నాటికి నువ్వు మన లైఫ్ను సెట్ చేయాలి’ అని భర్తతో అంది. అతను ‘అలాగే’ అనగలిగాడు కానీ అలా చేయలేకపోయాడు. మళ్లీ జనవరి 1 వచ్చింది. అతనితో అలాగే ఉండిపోతే ఇంకో జనవరి వచ్చాక కూడా పరిస్థితి అలాగే ఉంటుందని ఆమెకు అనిపించింది. ‘అందుకని వదిలేద్దామనుకుంటున్నాను డాక్టర్. పేషెంట్ల పళ్లు రిపేర్ చేస్తూ నా బతుకు నేను బాగు చేసుకుంటాను’ అందామె. సైకియాట్రిస్ట్ పొడుగ్గా ఊపిరి వదిలాడు. జనవరి 1 రావడానికి ఉన్న రెండు వారాల్లో మహేంద్రను మూడుసార్లు పిలిపించాడు సైకియాట్రిస్ట్. ‘భార్యతో టైమ్ స్పెండ్ చేయలేని సక్సెస్ అది ఎంత పెద్దదైనా కాని సక్సెస్ కాదు. కుటుంబం కోసం కష్టపడుతున్నాననుకుంటున్నారు మీరు. కాని కుటుంబాన్ని కోల్పోయేంతగా పడే కష్టంలో అర్థం లేదు. మీ పని తగ్గించుకోవాలి. మీ వైఫ్కు ఆమె పని ఆమెను చేయనివ్వాలి. ఎప్పుడో వస్తాయనుకునే కంఫర్ట్స్ కోసం ఇప్పటి లైఫ్లోని కంఫర్ట్ను పాడు చేసుకుంటున్నారు. లైఫ్ పార్టనర్ను టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటే కలిగే నష్టం చాలా ఎక్కువ’ అని రాధ తీసుకోవాలనుకుంటున్న నిర్ణయం చెప్పాడు అతనితో. మహేంద్ర మొదట షాక్ తిన్నా మెల్లగా సర్దుకున్నాడు. అతను తీసుకున్న కొత్త సంవత్సర నిర్ణయాల్లో ప్రధానమైనది భార్యను గౌరవించే ఇల్లుగా తన ఇంటిని మార్చుకోవడం. అది అతను రాధకు చెప్పాడు. అందుకు సైకియాట్రిస్ట్ కూడా బలం చేకూర్చాడు. రాధ డిసెంబర్ 31 రాత్రిని తన అపార్ట్మెంట్లో అందరితో కలిసి భర్తా పిల్లల తోడుగా జరుపుకుంది. కొత్త సంవత్సరం ఆమెకు నిజంగానే కొత్తది. హ్యాపీ న్యూ ఇయర్. కథనం: సాక్షి ఫ్యామిలి -
కన్ఫర్మ్ చేసిన హార్దిక్ పాండ్యా
న్యూఢిల్లీ: టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తన లవర్ ఎవరూ ప్రపంచానికి చాటిచెప్పాడు. కొంతకాలంగా డేటింగ్ చేస్తున్న సెర్బియా మోడల్ నటాషా స్టాన్తో తన రిలేషన్షిప్ను ఆఫీషియల్గా రివీల్ చేశాడు. ఈ మేరకు కొత్త సంవత్సరం సందర్భంగా ఇన్స్ట్రాగ్రామ్లో ఒక పోస్టు పెట్టాడు. నటాషాతో తాను దిగిన ఫొటోను షేర్ చేస్తూ... ‘స్టార్టింగ్ ద ఇయర్ విత్ మై ఫైర్వర్క్’ అంటూ కామెంట్ చేశాడు. ఇది నటాషా గురించి పాండ్యా మొదటి ఆఫీషియల్ స్టేట్మెంట్. ఆమెతో గత కొంతకాలంగా పాండ్యా ప్రేమాయణం నడుపుతున్నాడని, వీరిద్దరూ పీకల్లోతూ ప్రేమలో మునిగిపోయారని పెద్ద ఎత్తున రూమర్స్ షికార్లు చేశాయి. ఈ రూమర్లను కన్ఫర్మ్ హార్దిక్ కన్ఫర్మ్ చేశాడు. గతంలో చాలామంది అమ్మాయిలతో హార్దిక్ ఎఫైర్లు కొనసాగించాడు. అవి డేటింగ్ వరకే పరిమితమైనా నటాషాతో ప్రేమను మాత్రం సీరియస్గా తీసుకున్నాడని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. గత ఏడాది మేలో నటాషాను తన ఇంటికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులందరికీ హార్దిక్ పరిచయం కూడా చేశాడని కథనాలు వచ్చాయి. నటాషాను హార్దిక్ పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నాడని, అందుకే వీరు చాలా సన్నిహితంగా మెలుగుతున్నారని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం ముంబైలో నివాసముంటున్న నటాషా తొలుత బాలీవుడ్లోకి ఐటమ్ గర్ల్గా అడుగుపెట్టింది. ఇటీవల షారుక్ ఖాన్, అనుష్క నటించిన ‘జీరో’ అనే మూవీలో నటాషా ఓ పాత్ర కూడా చేసింది. అన్నట్టు.. హిందీలో ప్రసారమవుతున్న డ్యాన్స్ రియాలిటీ టీవీ షో ‘నచ్ బలియే’లో పోటీపడుతోన్న నటాషాకు ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా హార్దిక్ గతంలో తన అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. -
ఇలాంటి వారిపై ఓ కన్నేసి ఉంచండి!
ఓ రిలేషన్షిప్ బలంగా ఉండాలంటే అన్ని ఏమోషన్స్ను బ్యాలెన్స్ చేస్తూ.. ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అని కాకుండా సమానత్వం పాటించటం ఎంతో ముఖ్యం. ఒక వేళ ప్రేమ పెళ్లికి దారి తీసినపుడు బ్యాలెన్స్, ఈక్వాలిటీ ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటాయి. అయితే అన్ని వేళలా ఇది సాధ్యం కాదు. ప్రతి జంట మరో జంట కంటే భిన్నంగా ఉండటమే కాక వారి మధ్య బంధంలో కూడా తేడాలుంటాయి. రిలేషన్లో ఉన్న జంటలో ఆడ,మగ అన్న తేడా లేకుండా కొంతమంది ఎదుటి వ్యక్తిపై పెత్తనం చెలాయించటానికి చూస్తుంటారు. అయితే ఇదే కొన్ని సార్లు ఇబ్బందులకు దారితీస్తుంది. బంధంలోకి అడుగుపెట్టిన కొత్తలో మామూలుగా ఉంటూ ఆ తర్వాతినుంచి తమ ఆధిపత్యాన్ని చూపించాలని చూసేవాళ్లపై ఓ కన్నేసి ఉంచటం మంచిది. వారితో ప్రేమను పెళ్లిగా మలుచుకోవాలనుకుంటే ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిందే. 1) నెగ్గాలనే తత్వం గొడవలు పడకుండా ఉండటం అన్నది ఏ జంటకూ సాధ్యంకాదు. అసలు గొడవలులేకపోతే అది బంధమే కాదు. ఈ గొడవల్ని దాటి జంట ఎలా ముందుకు సాగుతుందన్న దానిపైనే బంధం ఆధారపడి ఉంటుంది. అయితే గొడవ జరిగినపుడు ఎదుటి వ్యక్తి దాన్ని ఎలా నెగ్గాలన్న దానిపైనే దృష్టిపెడుతున్నట్లయితే కొంచెం జాగ్రత్తపడాలి. భవిష్యత్తులో వారు మనపై ఆధిపత్యం చెలాయించే అవకాశాలు ఉంటాయని గుర్తించాలి. 2) చేయి చేసుకోవటం జంటల మధ్య గొడవలు జరగటం, ఎవరో ఒకరు ఎదుటి వ్యక్తిపై చేయి చేసుకోవటం అన్నది అప్పుడప్పుడు జరుగుతుండేదే. అయితే ప్రతి చిన్న విషయానికి గొడవ పడుతూ.. తరచుగా చేయి చేసుకోవటానికి ప్రయత్నిస్తుంటే వారు కచ్చితంగా మనపై ఆధిపత్యం చెలాయించటానికి చూస్తున్నారని గుర్తించాలి. 3) నిర్ణయాధికారం రిలేషన్లో ఉన్నపుడు ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే అది ఇద్దరి అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. అయితే మన అభిప్రాయాలకు విలువ ఇవ్వకుండా ఎదుటివ్యక్తే ఏకాభిప్రాయంగా నిర్ణయాలు తీసుకోవటం అన్నది ఆధిపత్య ధోరణికి సూచన. ఇలా అయితే భవిష్యత్తులో వారు మన అభిప్రాయాలకు విలువివ్వరని గుర్తించాలి. పెళ్లైన తర్వాత కూడా వారు ఇదే ధోరణిని అవలంభించే అవకాశాలు ఎక్కువ. లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
పార్ట్నర్తో తరచూ గొడవలా? ఇలా చేయండి!
ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవలు జరగటం అన్నది సర్వసాధారణ విషయం. రిలేషన్లో ఉన్న ఇద్దరి వ్యక్తుల అభిప్రాయాలు, అభిరుచులు ఒకేలా ఉన్నా ఏదో ఒక విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవటం జరుగుతుంది. అలాంటి సమయంలో గొడవలు జరుగుతుంటాయి. అయితే గొడవను ఎలా సద్దు మనిగించాలని కాకుండా అహాలకు పోతే మాత్రం ఆ బంధం ఎక్కువ కాలం నిలబడదు. జంటలో ఎవరో ఒకరు కొద్దిగా వెనక్కు తగ్గటం వల్ల గొడవ సద్దు మనగటమే కాకుండా మానసిక ప్రశాంతత కలుగుతుంది. గొడవల సందర్భంలో మనం ఈ టిప్స్ పాటిస్తే తప్పకుండా ఎదుటి వ్యక్తిని ప్రేమతో జయించగలుగుతాము. 1) బ్రీత్ గొడవలు జరిగినపుడు మన మనసును ప్రశాంతంగా ఉంచుకోవటానికి గట్టిగా గాలి పీల్చటం అన్నది ఉపయోగపడుతుంది. మనం కోపంలో ఉన్నపుడు వీలైనన్ని ఎక్కువసార్లు గాలి పీల్చడం వల్ల మన హార్ట్బీట్ రేట్ పెరుగుతుంది. అంతేకాకుండా మెదడుకు ఆక్సిజన్ సరఫరా జరిగి మనసు కుదుట పడుతుంది. 2) మనసును మరల్చండి బాగా ఆలోచిస్తున్నపుడు లేదా కోపంగా, బాధగా ఉన్నపుడు మన మనసును వేరే ఆలోచనలపైకి మరల్చడం ఉత్తమం. బాధలో ఉన్నపుడు సమస్యలనుంచి దూరంగా పరిగెత్తాల్సిన అవసరం లేదు. పరిస్థితులు చేయి దాటిపోతున్నాయనిపించినపుడు మనసును కొద్దిగా వేరే ఆలోచనలపైకి మళ్లించటం మంచిది. 3) ఎదుటి వ్యక్తి స్థానంలోనుంచి.. గొడవలు ఎక్కువగా మనం మనవైపు నుంచి ఆలోచించినపుడు జరుగుతుంటాయి. అలాంటప్పుడు మనం వారివైపునుంచి ఆ సమస్యను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి. అప్పుడు వాళ్లు మనకు అర్థం అవుతారు. గొడవ చల్లారటమే కాకుండా మనకు కూడా కొంత ప్రశాంతత లభిస్తుంది. 4) క్షమించండి! మర్చిపోండి గొడవలు జరగటం అన్నది రిలేషన్షిప్లో ఉన్నపుడు సర్వసాధారణం. గొడవ ముగిసినా వాటి గురించే ఆలోచిస్తూ జీవితాన్ని, బంధాన్ని నరకం చేసుకోకుండా ఎదుటి వ్యక్తిని క్షమించడం నేర్చుకోవాలి. గొడవను పూర్తిగా మర్చిపోగలగాలి. లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
ఇలాంటి వారితో జీవితం సంతోషంగా..
జీవితం అనేది ఓ ఎమోషనల్ జర్నీ. ఇందులో మనం ఎంత ఎక్కువగా నేర్చుకుంటే అంత ఎక్కువగా లాభపడతాము. ఒంటిరిగా కంటే జంట ప్రయాణానికే జీవితంలో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా ఎదుటి వ్యక్తి ప్రవర్తన, ఆలోచనా విధానం ఇలా రకరకాల విషయాలపై మన 70 ఏళ్ల జీవితం! ఆధారపడి ఉంటుంది. ముందుగా ఓ రిలేషన్షిప్లోకి అడుగుపెట్టబోయే ముందు ఎదుటి వ్యక్తిలో ఈ ఐదు లక్షణాలు ఉన్నాయో లేదో చూసుకోండి. చివరిగా ‘నిజమైన ప్రేమ దొరకటం అంత సులభం కాదు’ అన్న షేక్స్పియర్ మాటల్ని గుర్తు తెచ్చుకోండి. 1) ముక్కుసూటి తనం మన జీవితంలోకి ఆహ్వానించబోయే వ్యక్తి కొద్దిగానైనా ముక్కుసూటి తనం కలిగి ఉండాలి. మనం చేస్తున్నది తప్పా.. ఒప్పా అన్నది ఇబ్బంది పడకుండా చెప్పగలగాలి. మనల్ని సరైన మార్గం వైపు నడిపించగలగాలి. 2) ఎమోషనల్లీ స్టేబుల్(భావోద్వేగాల నియంత్రణ) ఈ సృష్టిలో సమస్యలు లేని జీవి అంటూ ఏదీ ఉండదు. వారివారి జీవితాలకు తగ్గట్టు ఎవరి కష్టాలు వారికి ఉంటాయి. సమస్యలు వచ్చినపుడు తమ భావోద్వేగాలను నియంత్రించుకోగలగాలి. ముఖ్యంగా తమ సమస్యలను ఎదుటి వ్యక్తికి చెప్పి ఇబ్బంది పెట్టకుండా ఉండగలగాలి. అలాంటి వారితో జీవితం సంతోషంగా సాగుతుంది. 3) నమ్మకం మనం ఎమోషనల్గా ఎదుటివ్యక్తి మీద ఆధారపడి ఉండటం అన్నది సర్వసాధారణం. అలాంటి వ్యక్తి మనం అన్నిరకాలుగా నమ్మదగిన వాడా లేదా అన్నది గుర్తించాలి. మన బలహీనతలను ఆధారంగా చేసుకుని మనల్ని పీడించకుండా ఉండాలి. 4) గౌరవం మన జీవితంలోకి రాబోయే వ్యక్తి మనల్ని మనగా గౌరవించగలగాలి. ఒకరిపై ఒకరికి గౌరవం ఉండటం జంట మధ్య బంధాన్ని ధృడపరుస్తుంది. ఒకరిని ఒకరు పూర్తిగా అర్థం చేసుకోవటానికి సహకరిస్తుంది. 5) ధృడ సంకల్సం ఎదుటి వ్యక్తి మనపై ప్రేమను చూపించటంలో ఎటువంటి మొహమాటాలకు తావు ఉండకూడదు. పక్కవాళ్లు ఏమనుకుంటారోన్న ఆలోచన చేయకుండా మనపై ప్రేమ చూపించే వ్యక్తులు దొరకటం అదృష్టం. లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
బడిలో నేర్పని ప్రేమ పాఠాలు!..
ప్రేమ ఒక స్వార్థంలేని భావోద్వేగం. ప్రేమలో పడ్డ ఇద్దరు వ్యక్తులు తమ ప్రేమను కాపాడుకోవటానికి ఎలాంటి కష్టాన్నైనా భరిస్తారు. అయితే ప్రేమను సక్రమంగా ఉంచుకునే జ్ఞానం అందరికీ పుట్టుకతో రాదు. బాల్యం, యవ్వనం.. ఇలా అన్ని దశల్లో మనం సాధించుకున్న జ్ఞానం ఇందుకు సహకరిస్తుంది. ప్రతీ మనిషి జీవితంలో ఒక భాగమైన ప్రేమను పాఠాలుగా ఏ స్కూల్లోనూ చెప్పకపోవటం గమనార్హం. బడి నేర్పని ఎన్నో పాఠాలను అనుభవం మనకు నేర్పుతుంది. అది ప్రేమ విషయంలోనూ వర్తిస్తుంది. 1) షరతులు లేని నమ్మకం నిజమైన ప్రేమ అంటే షరతులు లేకుండా ఎదుటివ్యక్తిని మనస్ఫూర్తిగా నమ్మటమే. అయితే మనం తెలిసీతెలియని వయసులో ఆకర్షణకు గురై ప్రేమకు, నమ్మకానికి మధ్య ఉన్న సంబంధాన్ని మర్చిపోతాము. దీంతో ఆ బంధం ఎక్కువకాలం నిలబడకుండా వీగిపోతుంది. నమ్మకంతో కూడిన ప్రేమ బంధం మాత్రమే ఇద్దరు వ్యక్తులను కలిపి ఉంచగలుగుతుంది. 2) ప్రేమ ఓ బలం ప్రేమించిన వారితో సమయం గడుపుతున్నపుడు అది మనకు ఎంతో మానసిక బలానిస్తుంది. నిజమైన ప్రేమ బంధంలో ఉన్నట్లయితే ఎటువంటి కష్టనష్టాలనైనా ఎదుర్కునే శక్తిని ఇస్తుంది. మరో అద్భుతమైన పాఠం ఎంటంటే మన భాగస్వామిలోనే గైడ్ను వెతుక్కోవటం. మనం కష్టాల్లో ఉన్నపుడు మనకు తోడుగా ఉండేవారే మనవారు. 3) తియ్యటి మాటలు, పైపై మెరుగులు ఎదుటి వ్యక్తి తియ్యటి మాటలకు, పైపై మెరుగులకు ప్రాధాన్యతనిచ్చేది నిజమైన ప్రేమ కాదు. ప్రేమగా నాలుగు మాటలు మాట్లాడినంత మాత్రాన మనసు పారేసుకోకూడదు. ఎదుటి వ్యక్తి బలాలు, బలహీనతలు, లోపాలు తెలిసికూడా ఒక్కటయ్యే బంధమే కలకాలం నిలబడుతుంది. 4) మచ్చలేని చంద్రుడి కోసం వెతుకులాట ఈ సృష్టిలో లోపాలులేని వ్యక్తంటూ ఎవరూ ఉండరు. అలాంటి వ్యక్తుల కోసం వెతకటం మచ్చలేని చంద్రుడి కోసం వెతుకులాటలాంటిది. అదో దండగ పని. మన లోపాలు తెలిసి కూడా మనల్ని ప్రేమించే వ్యక్తులు దొరకటం నిజంగా మన అదృష్టం. మన భాగస్వామి ఓ అద్దంలా ఎల్లప్పుడూ మనల్ని ప్రతిబింబిస్తూ ఉండాలి. 5) గొడవలులేని బంధం? గొడవలు పడని ప్రేమ జంట అంటూ ఈ సృష్టిలో ఏదీ ఉండదు. ఎదుటి వ్యక్తిలో నచ్చని కొన్ని అలవాట్లు మనకు కోపం తెప్పించవచ్చు. ఆ కోపం ఇద్దరి మధ్యా గొడవకు దారి తీయవచ్చు. అయితే ఆ గొడవ ద్వారా ఇద్దరిమధ్యా బంధం మరింత బలపడాలేతప్ప బలహీనపడకూడదు. అంగీకరించటం లేదా అంగీకరించకపోవటం అన్నది బంధంలో సర్వసాధారణం. కాలం ఎప్పడూ నిజమైన ప్రేమకు పరీక్షలాంటిది. 6) వ్యక్తిగత స్పేస్ ఓ నిజమైన ప్రేమ సమయాన్ని, అలసటను ఎరుగదు! నిబంధనలు, హద్దులు అంటూ ఏవీ ఉండవు. అయితే ప్రపంచం మొత్తం మనమై ఎదుటివ్యక్తిని సంతృప్తిపరచటం కష్టమైన పని. వారికంటూ వ్యక్తిగత స్పేస్ ఇవ్వాలి. మనం మన స్నేహితులతో, కుటుంబసభ్యులతో గడపటానికి సమయాన్ని కేటాయించగలగాలి. ఒకరి వద్దే మన ప్రపంచం ఆగిపోవద్దు. లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
అది ఈ జనరేషన్కు బాగా అలవాటు!
కొత్త ఒక వింత అన్నది ప్రేమకు కూడా వర్తిస్తుంది. ప్రేమలో పడగానే హార్మోన్ల ప్రభావంతో గాలిలో తేలుతున్నట్లు అన్పించటం, ఇంతకముందు లేని కొత్త ఉత్సాహం, సంతోషం అంతా ఓ పిచ్చిలా ఉంటుంది. కొద్దిగా ఏదైనా తప్పు జరగగానే ఢీలా పడిపోవటమో లేదా భయపడిపోవటమో జరుగుతుంది. కొత్తగా ప్రేమ బంధంలోకి అడుగుపెట్టటం ఒక ఎత్తైతే, ఎదుటి వ్యక్తితో ఏ గొడవలు లేకుండా జీవించటం మరో ఎత్తు. కొత్త బంధంలోకి అడుగుపెట్టగానే ముఖ్యంగా రిలేషన్షిప్లోని ఈ మూడు విషయాలను మనం అర్థం చేసుకోవాలి. అట్లాగే కొన్ని విషయాలను అవాయిడ్ చేయటం ద్వారా ఇబ్బందికర పరిస్థితులకు స్వప్తి చెప్పవచ్చు. 1) సెటిల్ అవ్వటానికి సిద్దంగా ఉన్నా.. మీరు పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అవ్వటానికి సిద్ధంగా ఉండొచ్చు. అయితే కొత్తగా ప్రేమ బంధంలోకి అడుగుపెట్టినపుడు ఈ ఆలోచన రావటం ఒకరకంగా ప్రేమబంధానికి ఎండ్కార్డ్లాంటిది. రిలేషన్లోకి అడుగుపెట్టిన వెంటనే లైఫ్లో సెటిల్ అవ్వాలనే ఆలోచన జోలికి వెళ్లకుండా ఆలోచించి అడుగువేయాలి. 2) క్వాలిటీ టైం లేడికి లేచిందే పరుగు అన్నట్లు కొత్త బంధాన్ని పరుగులు పెట్టించటం మంచిది కాదు. గంటలు గంటలు చాటింగ్లు, ఫోన్లో టాకింగ్లు, సినిమాలు, షికార్లు, పబ్బులు, క్లబ్బులు అంటూ జెట్ స్పీడులో బంధంలో దూసుకుపోవటం ఈ జనరేషన్కు బాగా అలవాటు. అయితే భాగస్వామితో ఎంత సమయం గడిపామన్నది కాకుండా ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి ఎంత సమయం కేటాయిస్తున్నామన్నదే ముఖ్యం. పెరుగుట విరుగుట కొరకే అన్న సత్యం కొత్త బంధానికి సరిగ్గా సరిపోతుంది. ఎదుటి వ్యక్తితో మనం ఎంత తొందరగా కలిసిపోతామో అంతే తొందరగా గొడవలు పడి విడిపోయే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఏదైనా చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. 3) మాజీల మీద చర్చ మీ భాగస్వామితో కలిసి గడపటానికి సమయం దొరికినపుడు మాజీల గురించిన ప్రసక్తి తీసుకురావద్దు. భవిష్యత్తును గురించి ఆలోచించుకునే సమయంలో గతాన్ని గుర్తుచేసుకోవటం కొత్త బంధానికి మంచిది కాదు. మాజీల గురించి మాట్లాడుకోవటం మొదటికే మోసం తెస్తుంది. మాజీల గురించి చర్చించటానికి ఇది సరైన సమయం కాదని గుర్తించాలి. సరైన సమయం కోసం వేచిచూడాలి. లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
మీ భాగస్వామి నిజంగా ప్రత్యేకమే!
మనం రిలేషన్లో ఉన్నపుడు చాలా విషయాల్లో భాగస్వామి మిగితా వాళ్లకంటే ప్రత్యేకంగా అనిపిస్తారు. నిజం చెప్పాలంటే అది వాస్తవం కూడా! వ్యక్తుల మధ్య తేడాలున్నట్లే భాగస్వామికి భాగస్వామికి మధ్య చాలా వ్యత్యాసాలు ఉంటాయి. అదేవిధంగా మీరో వ్యక్తిని చూడగానే నా కోసమే పుట్టారనే భావన కలుగుతుంది. ఇది కొన్ని కొన్ని సందర్భాలలో కచ్చితంగా నిజం. ఎందుకంటే కొన్ని వందల మందిలో ఓ వ్యక్తిని మాత్రమే ఎంచుకుని వారితో ప్రేమలో పడటం మామాలు విషయం కాదు. ఆ తర్వాత ఇద్దరు ఒకరిని ఒకరు ఇష్టపడంగానే లోకాన్నే మర్చిపోతారు. ప్రేమలో మునిగితేలుతూ కాలాన్ని ఖాళీ చేస్తుంటారు. అయితే ప్రేమను, పనిని బ్యాలెన్స్ చేయటానికి మగవారు ఆలోచిస్తారని, కానీ! ఆడవారు మాత్రం పనిని, ప్రేమను రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ లైఫ్ను ఎంజాయ్ చేస్తారని ప్రముఖ జర్నలిస్ట్ బెన్నా బిర్చ్ తన పుస్తకంలో రాసుకున్నాడు. అదే విధంగా ఇద్దరికీ సంబంధించిన వాటి కారణంగా ప్రేమ బంధం గట్టిపుడుతుంది. కుక్క, ఇళ్లు ఏదైనా కావచ్చు.. ఇలాంటివి మీ జీవితంలో భాగం అయినపుడు విడిపోవటానికి ముఖ్యంగా గొడవపడటానికి తక్కువ అవకాశాలు ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు ఇతరులకు రిలేషన్ గురించి సలహాలు ఇచ్చేవారు కూడా తమ రిలేషన్లో కష్టాలు ఎదుర్కొంటుంటారు. ఎదుటి వ్యక్తికి నీతులు చెప్పినంత ఈజీగా ఫాలో అవ్వటం కుదరదు. అయితే ఒక వేళ గొడవపడితే దాన్ని తమ తెలివితేటలతో పరిష్కరించగలుగుతారు. మొత్తానికి ఎదుటి వ్యక్తిని మనం అర్థం చేసుకున్నపుడే బంధాలు కలకాలం కలతలు లేకుండా కొనసాగుతాయి. లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
అదోలా ఉంటే అయిపోతారు!
వాషింగ్టన్ : ప్రతికూల భావోద్వేగాలు, ఎప్పుడూ అదోలా ఉండటం మనిషిని మరింత ఒత్తిడికి గురిచేస్తాయని, తీవ్రమైన ఒత్తిడికి గురిచేసే ప్రతికూల భావోద్వేగాలు ఎదుటి వ్యక్తి మీద నమ్మకాలను సన్నగిల్లేలా చేస్తాయని తాజా సర్వేలో తేలింది. ఇవి ఎదుటి వ్యక్తితో మనం మసలుకునే తీరును కూడా దెబ్బతీస్తాయని వాషింగ్టన్కు చెందిన పరిశోధకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో మనం ప్రేమంచిన వ్యక్తులతో చిన్న చర్చ కూడా గొడవలకు దారి తీస్తుందని చెబుతున్నారు. ఎలక్ట్రిక్ షాక్ టెక్నిక్ ద్వారా కొంతమంది మనషులపై ప్రయోగాలు చేశారు. షాక్ ద్వారా వ్యక్తులలో ప్రతికూల భావోద్వేగాలను ప్రేరేపించారు. ఆ క్షణంలో వారు ఎదుటి వ్యక్తిని ఎంత మేరకు నమ్ముతున్నారో పరిగణలోకి తీసుకున్నారు. ఎలక్ట్రిక్ షాక్ ద్వారా వ్యక్తిలో ప్రేరేపించబడ్డ ప్రతికూల భావోద్వేగాలు కారణంగా ఎదుటి వ్యక్తిపై నమ్మకం సన్నగిల్లినట్లు తేల్చారు. ప్రతికూల భావోద్వేగాల ద్వారా మన ఎదుటి వారితో తత్సంబంధాలు దెబ్బతింటాయని, ముఖ్యంగా మనం ఎదుటి వ్యక్తులను నమ్మటంపై ప్రభావం ఉంటుందని, మెదడులో చోటుచేసుకున్న మార్పుల కారణంగా ఎదుటి వ్యక్తుల ప్రవర్తనలను అంచనా వేయటం కుదరదని అంటున్నారు. ముఖ్యంగా భార్యాభర్తలు, ప్రేమికుల మధ్య బంధాన్ని దెబ్బతీస్తాయని చెబుతున్నారు. అయితే మనతో సంబంధంలేని, సంఘటనల ఆధారంగా చోటు చేసుకునే ‘ఇన్సిడెంటల్’ భావోద్వేగాలకు వారు పరిశోధకులు అంతగా ప్రాధాన్యత నివ్వలేదు. లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
మీ పార్ట్నర్తో ఇవి చర్చించకండి
ఓ జంట మధ్య బంధం ధృడంగా ఉండాలంటే వారి మధ్య చక్కని కమ్యూనికేషన్ అవసరం ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రిలేషన్లో ఉన్నపుడు మనకు సంబంధించిన చిన్న చిన్న విషయాలను ఎదుటి వ్యక్తితో పంచుకోవాలనిపిస్తుంది. అయితే కొన్ని కొన్ని విషయాలను భాగస్వామితో చర్చింకపోవటమే మంచిదంటున్నారు సైకాలజిస్టులు. ఎదుటి వ్యక్తికి బాధ కలిగించే లేదా కోపం తెప్పించే విషయాలను చర్చించటం ద్వారా బంధం బలహీనపడుతుందంటున్నారు. నోటిలో ఫిల్టర్ లేకుండా.. ఏదీ దాచుకోకుండా మాట్లాడితే మొదటికే మోసం వస్తుందంటున్నారు. 1) కుటుంబసభ్యులు భాగస్వామి కొన్ని కొన్ని సార్లు మనకంటే ఎక్కువగా తన కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తున్నపుడు కొద్దిగా కోపం రావటం సహజం. రోజులు గడుస్తున్న కొద్ది అది మనలో ఏదో తెలియని అభద్రతా భావాన్ని కలిగిస్తుంది. ఆ ఫ్యామిలీ మనకు బొత్తిగా నచ్చకపోవచ్చు కూడా. అలాంటి సమయంలో పార్ట్నర్ కుటుంబసభ్యుల గురించి, వారిలో మీకు నచ్చని విషయాలను గురించి వారితో చర్చింకపోవటం మంచిది. ఒకవేళ వారి గురించి ఫిర్యాదు చేయాలనుకుంటే మటుకు ఒకటికి రెండు సార్లు ఆలోచించటం మంచిది. 2) బెస్ట్ ఫ్రెండ్ రహస్యాలు మనకో బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడంటే మన కష్టమైనా, సుఖమైనా వారితో పంచుకుంటాం. మన జీవితంలో చోటుచేసుకునే ప్రతి చిన్న విషయాలను వారికి చెబుతాం. ఆ విధంగానే మన ఫ్రెండ్ మనతో వారి జీవితానికి సంబంధించిన ఏవైనా రహస్యాలు మనతో పంచుకున్నపుడు వాటిని భాగస్వామితో చర్చింకపోవటం ఉత్తమం. ఎందుకంటే బంధం అనేది నమ్మకాల మీద ఆధారపడి ఉంటుంది. మనల్ని నమ్మిన వాళ్ల రహస్యాలను ఇతరులతో పంచుకోవటం అంటే ఒకరకంగా నమ్మక ద్రోహం చేయటమే. ఏదైనా సందర్భంలో మన బెస్ట్ ఫ్రెండ్ రహస్యాలను పార్ట్నర్తో షేర్ చేసుకుంటే. మన భాగస్వామికి మనపై నమ్మకం సన్నగిల్లుతుంది. ఎందుకంటే రేపటిరోజు తమ జీవితానికి సంబంధించిన విషయాలను కూడా పక్కవారితో చర్చిస్తారనే భావన వారికి కలుగుతుంది. 3) ఆర్థిక విషయాలు ఎదుటి వ్యక్తికి సంబంధించిన ఆర్థిక విషయాలు ముఖ్యంగా సంపాదన లేదా వారి ఖర్చుల గురించి చర్చించకండి. ఎందుకు ఖరీదైన వస్తువులు కొంటున్నారు? బయటికెళ్లినపుడు డబ్బును నీళ్లలా ఖర్చుపెడుతున్నారెందుకు? అంటూ క్లాసులు పీకి వారికి విసుగు తెప్పించకండి. పరిస్థితులను బట్టి ముందుకు సాగండి 4) మాజీలు గతం తాలూకూ చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ప్రస్తుతమనే తీపిని కోల్పోవద్దు. మీ పార్ట్నర్కు గతంలో ఓ లవర్ ఉండి ఉంటే మీకు కోపం వచ్చినపుడుల్లా వారిని గుర్తుచేస్తూ సూటిపోటి మాటలతో వేధించకండి. పదేపదే వారిని గుర్తు చేస్తూ విలువైన మీ ఇద్దరి సమయాన్ని వృధా చేసుకోకండి. లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
మగవారిని ఇబ్బంది పెట్టే అంశాలివే
ఆడ కావచ్చు, మగ కావచ్చు రిలేషన్లో ఉన్నపుడు కొన్ని కొన్ని సందర్భాల్లో అభద్రతా భావానికి గురవుతుండటం సహజం. కొన్ని అనుమానాలు, అహాలు, అభద్రతా భావాలు తమ భాగాస్వామితో బంధాన్ని ధృడపరుచుకోవటానికి అడ్డుపడుతుంటాయి. అయితే ఇవన్నీ మన తప్పులు కాకపోవచ్చు. నిజంగా ఆరోగ్యకరమైన బంధాన్ని కోరుకుంటున్నట్లయితే వీటన్నింటిని పక్కకు నెట్టి ముందుకు సాగిపోవాల్సి వస్తుంది. అయితే చాలా మంది మగవారు అభద్రతా భావంతో ఇబ్బందులు పడుతూ ఎదుటి వ్యక్తిని ఇబ్బందులు పెడుతూ ఉంటారు. అలాంటి వారు తమను తరచుగా ఇబ్బంది పెట్టే విషయాల గురించి సరైన అవగాహన కలిగి ఉంటే వాటిని అధిగమించటం సులభం. 1) పక్క వారిపై ప్రశంసలు పార్ట్నర్ తరచుగా ఇతరులపై(మగవారిపై) ప్రశంసలు కురిపించటం వల్ల మగవారు అభద్రతా భావానికి గురవుతారు. ఆ విషయాలు మెదడులోనుంచి అంత తొందరగా బయటకు వెళ్లిపోవు. ఇలాంటి సమయాల్లో ఆత్మన్యూనతా భావానికి లోనవుతారు. అయితే ఇలాంటి సమయాల్లో భాగస్వామిపై కోపం తెచ్చుకోకూడదు. ఇతరుల విజయాలను ప్రశంసించే ఆమె గుణాన్ని మనస్ఫూర్తిగా అభినందించాలి. 2) గతం తాలూకూ గాయం ఆడ,మగ తేడా లేకుండా అందరూ ఓ బ్రేకప్ తర్వాత మరో వ్యక్తిని నమ్మటానికి కొద్దిగా ఆలోచిస్తారు. గతం తాలూకూ గాయం వారిని వేధిస్తూనే ఉంటుంది. అందరినీ ఒకే దృష్టితో చూడటం మొదలుపెడతారు. ఇలాంటి వారు గతం తాలూకూ విషయాలను దూరంగా ఉంచటం మంచిది. పదే పదే గతాన్ని తలుచుకుంటూ బాధపడటం మానేయాలి. గతాన్ని తలుచుకుంటూ ప్రస్తుతాన్ని దుఃఖమయం చేసుకోకూడదు. 3) భాగస్వామి విజయాలు భాగస్వామి మనకంటే ఎక్కువ విజయాలను సొంతం చేసుకుంటున్న సమయంలో కొద్దిగా ఈర్శ్య పడటం మామూలే. ఆడవారు ఎక్కువగా తమకంటే ఆర్థికంగా మెరుగైన, సక్సెస్ ఫుల్ మగాడిని పెళ్లాడాలని భావిస్తారు. కానీ, మగవారు అలాకాదు. ఆడవారు తమకంటే ఎక్కువ విజయాలను సొంతం చేసుకుంటున్న కొద్ది మగవారిలో అభద్రతా భావం మొదలవుతుంది. తమను ఆటలో అరటిపండులా తీసిపడేస్తారేమో అన్న భయంతో కొట్టుమిట్టాడుతుంటారు. అలాంటి వారు లేని పోని భయాలను మాని ముందుకు సాగే ఆలోచనలు చేయాలి. బంధంలోకి ప్రేమను తప్ప! డబ్బును, హోదాలను తేకూడదు. ఎదుటి వ్యక్తిలో మార్పులు చోటుచేసుకుంటున్నట్లయితే అది ఎందుకని ఆలోచించండి. వీలైతే భాగస్వామితో మాట్లాడి సమస్యను పరిష్కరించటానికి ప్రయత్నించండి. 4) రహస్యాలు అంతర్ముఖులు ఎక్కువగా ఇతరులతో కలవటానికి ఇష్టపడరు. బంధంలో ఉన్నపుడు కూడా ఎదుటి వ్యక్తితో పూర్తిగా కలిసిపోవటానికి ఆలోచిస్తుంటారు. అది ఆడవాళ్లయితే ఎదుటి వ్యక్తిపై పూర్తి నమ్మకం కలిగినపుడు మాత్రమే వారితో అన్ని విషయాలు పంచుకుంటారు. అంతర్ముఖులైన ఆడవారితో బంధంలో ఉన్న మగవారు వారి ప్రవర్తనతో కొద్దిగా ఇబ్బందులకు గురవుతారు. ఏవో రహస్యాలను తమతో చెప్పకుండా దాస్తున్నారని భావిస్తారు. 5) మగ స్నేహితులు ఆడవారు మగవారితో స్నేహం చేయటంలో ఎటువంటి తప్పూలేదు. అయితే ఆ స్నేహం బంధంలో ఉన్నపుడు కూడా కొనసాగితే కొద్దిగా ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. తరచుగా మగ స్నేహితులతో మాట్లాడే వారి భాగస్వామి కొద్దిగా అభద్రతా భావానికి గురవుతారు. ఇలాంటి సమయంలో ఆడవారు తప్పని సరిగా నిజాయితీతో వ్యవహరించాలి. అబద్ధాలకు, దాపరికాలకు తావివ్వకూడదు. ఎదుటివ్యక్తి మానసిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నడుచుకోవటం మంచిది. లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
అలా చేస్తే మొదటికే మోసం
రిలేషన్షిప్లో ఉన్నపుడు మనకు ఏదైనా బాధ కలిగితే బాగా దగ్గరైన వారితో పంచుకుంటే మనసుకు కొంత ప్రశాంతత కలుగుతుంది. వారు చూపించే సానుభూతి, సమస్యనుంచి బయటపడటానికి ఇచ్చే సలహాలు మనకు బోనస్ లాంటివి. అయితే మన బాధల్ని ఇతరులతో పంచుకోవటంలో కూడా కొన్ని హద్దులు ఉంటాయి. మన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అన్ని విషయాలను ఇతరులకు చెప్పుకోవటం వల్ల మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. అయితే ఎలాంటి విషయాలను మనం ఎదుటి వ్యక్తితో పంచుకోవచ్చు, ఎలాంటివి కూడదు.. ఎవరితో పంచుకోవాలి అన్న దానిపై ఓ అవగాహన ఉండటం తప్పనిసరి. ఎదుటి వ్యక్తితో మన బంధంలోని బాధల్ని పంచుకునే ముందు అది ఎలాంటి బంధం అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. అది మనల్ని ఎంతగా ఇబ్బంది పెడుతోందన్నది కూడా ముఖ్యం. మన పార్ట్నర్తో చిన్న చిన్న స్పర్థలను, తరచుగా గొడవపడిన సంఘటనలను మీ సన్నిహిత మిత్రులు, సోదరి(వయసులో పెద్దవారు)తో పంచుకోవటం ఉత్తమం. రిలేషన్షిప్లోని పెద్దపెద్ద సమస్యలు, మానసిక, శారీరక, మోసాలకు సంబంధించిన విషయంలో సెకండ్ ఒపీనియన్ తప్పనిసరి. ఇలాంటి విషయాలను పక్కవారితో కాకుండా మీ పార్ట్నర్తో చర్చించటం మంచిది. పార్ట్నర్ ప్రవర్తన కారణంగా తరచుగా ఇబ్బందులు ఎదుర్కుంటున్నట్లయితే.. అది కూడా వారు క్షణికావేశంలో ఆ పనులు చేస్తున్నట్లు భావిస్తున్నట్లయితే ప్రొఫెసనల్ కౌన్సిలింగ్కు పార్ట్నర్ను తీసుకెళ్లండి. వారి సూచనల మేరకు మీ పార్ట్నర్తో బంధం కొనసాగించాలా వద్దా అన్నది నిర్ణయించుకోండి. ఇక బంధంలో నమ్మకానికి సంబంధించి పార్ట్నర్ అభిప్రాయాలకు విలువివ్వండి. చివరిగా మీ మనసుకు నచ్చింది మీరు చెయ్యండి. -
ఇలా ప్రపోజ్ చేస్తే...వెంటనే పడిపోతారంట!
ప్రేమలో తేలుతున్నప్పుడు ఆ ఫీలింగే వేరు. అయితే ఆ బంధం సజావుగా సాగాలన్నా...మరింత ధృడపడాలన్నా కొన్ని టిప్స్ పాటించాలి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రేమను వ్యక్తపరుస్తారు. కొందరు గొఫ్ట్లు ఇచ్చి ప్రేయసిని ఇంప్రెస్ చేస్తే..మరికొందరు పొగడ్తలతో ముంచెత్తుతూ ఆకాశినికెత్తేస్తారు. ఇవన్నీ చేస్తేనే ప్రేముందా అంటే...ప్రేమ బంధాన్ని మరింత ధృడపరచడంలో ఇవి ఎంతో సహాయపడతాయి అని చెప్పొచ్చు. ప్రేమికులు ఏ విషయాలను ఇష్టపడతారు? ప్రేమించే వ్యక్తిని ఇంప్రెస్ చేయడానికి ఏ విషయాలపై శ్రద్ద పెట్టాలి? ప్రేమిస్తున్నాను అని ఎంత ప్రేమగా వ్యక్తపరచవచ్చు ? లాంటి అంశాలపై సైకాలజీ నిపుణులు ఏం చెప్తున్నారో తెలియాలంటే కింది వీడియోని తెలుసుకోండి -
అలాంటి వారితో జాగ్రత్త!
ఓ మనిషిని చూడగానే అంచనా వేయటం చాలా కష్టం. ఎలాంటి సందర్భంలోనైనా ఇది వర్తిస్తుంది. ముఖ్యంగా మనం ఎంచుకునే బంధాల విషయంలో. ప్రేమించిన కొత్తలో అద్భుతంగా కనిపించిన వ్యక్తి రోజులు గడుస్తున్న కొద్ది సైకోలా కనిపిస్తాడు. అతడి మాట, ప్రవర్తన అన్ని విషయాలు మనకు తేడాగా అనిపించటం మొదలుపెడతాయి. ఎదుటి వ్యక్తి మీద ఉన్న ప్రేమకాస్తా భయంగా మారి మన కంటికి అతడో సైకోలా అతడి చర్యలు కాని పనుల్లా తోస్తాయి. అర్థం చేసుకోవటంలో లోపమో లేక ఎదుటి వ్యక్తి మనతో ప్రవర్తిస్తున్న తీరు మంచిది కాదో తెలుసుకోవటం కొన్నిసార్లు కష్టంగా మారుతుంది. మీ పార్ట్నర్లో లేదా బంధంలో ఈ క్రింది లక్షణాలు ఉంటే వారితో మీరు కొంచె జాగ్రత్తగా ఉండండి. మీ మాటలకు, భావాలకు ఎదుటి వ్యక్తి విలువివ్వకపోవటం తరుచుగా అబద్ధాలు చెప్పటం ఎల్లప్పుడు అందరి దృష్టి అతడిమీదే ఉండాలనుకోవటం మీరేం చేస్తున్నారో తెలుసుకోవటానికి మీపై ప్రతి క్షణం ఓ కన్నేసి ఉంచటం తప్పు చేసినపుడు క్షమాపణలు చెప్పకపోవటం తరుచుగా జంతువులను హింసించటం క్షణంకో రకంగా మాట్లాడటం, గడియకో విధంగా ప్రవర్తించటం మీ మీద మీకే జాలి కలిగేలా చేయటం మీ పార్ట్నర్తో కలిసున్నా ఒంటరిగా ఫీల్ అవ్వటం లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
బ్రేకప్ గురించి మాట్లాడను
‘‘యాక్టర్స్ జీవితాల్లో ఏం జరుగుతోందో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రేక్షకులకు కచ్చితంగా ఉంటుంది. నా గురించి ఏదైనా చెప్పగలను. కానీ, నా రిలేషన్షిప్ గురించి ఏం మాట్లాడలేను. రిలేషన్షిప్ అంటే నేను మాత్రమే కాదు.. నాతో పాటు ఇంకొకరు ఉంటారు. వాళ్ల గురించి నేను మాట్లాడలేను’’ అన్నారు ఇలియానా. ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్తో ఇలియానా కొన్నాళ్లు రిలేషన్షిప్లో ఉన్నారు. ఇటీవల వీళ్లిద్దరూ రిలేషన్షిప్కు ఫుల్స్టాప్ పెట్టారు. అయితే ఈ బ్రేకప్ గురించి ఇలియానా ఎక్కడా మాట్లాడలేదు. ఈ విషయం గురించి తాజాగా ఆమె స్పందిస్తూ– ‘‘రిలేషన్షిప్ ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన విషయం. దాని గురించి మనం ఏం మాట్లాడినా అది వాళ్ల గురించి కూడా మాట్లాడినట్టే. అది వాళ్ల్ల ప్రైవసీని (గోప్యత) గౌరవించనట్టే. రిలేషన్షిప్కి సంబంధించిన విషయాలు సరిగ్గా వ్యక్తపరచకపోయినా, ఆ టాపిక్లోని కొన్ని వ్యాఖ్యలు తీసుకొని హైలెట్ చే సినా వేరేవాళ్ల ప్రైవసీని ఇబ్బందుల్లో పెట్టినట్టే. వారి ప్రైవసీని గౌరవిస్తాను. నేను విమర్శలు తీసుకుంటున్నాను. వాళ్లను కూడా దీనికి బాధితులను చేయలేను. అందుకే నా రిలేషన్షిప్ గురించి మాట్లాడాలనుకోవడం లేదు’’ అన్నారు. -
చిన్న విషయాలే కదా అని నిర్లక్ష్యం చేస్తే!
కొన్ని సందర్బాల్లో చిన్న చిన్న విషయాలే మనల్ని తీవ్రంగా బాధిస్తాయి. ముఖ్యంగా ఓ రిలేషన్లో ఉన్నపుడు. మనకు సమస్యగా కనిపించని చిన్న విషయాలు ఎదుటి వ్యక్తిని మానసికంగా ఇబ్బందులకు గురి చేయవచ్చు. అప్పుడే ప్రేమ బంధంలోకి అడుగుపెట్టిన వారైనా.. పెళ్లై ఏళ్లు గడుస్తున్నా వీటి వల్ల బాధింపబడక తప్పదు. చిన్న విషయాలే కదా అని నిర్లక్ష్యం చేస్తే అవే జంట మధ్య నిత్యం గొడవలకు దారితీయవచ్చు లేదా ఇద్దరి జీవితాలను నాశనం చేసే అవకాశం ఉంది. 1) చిన్న చిన్న పనులు రిలేషన్లో ఉన్నపుడు ఎదుటి వ్యక్తి ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇవ్వటం తప్పని సరి. మీకంతగా పట్టింపులులేని వాటిపై ఎదుటి వ్యక్తికే నిర్ణయాధికారాన్ని వదిలేయటం మంచిది. హోటల్లో ఆర్డర్ చేసే ఐటమ్ కావచ్చు, కలిసి చూసే టీవీ షోలు కావచ్చు. వారి ఇష్టాలకు స్వేచ్ఛ నివ్వండి. ఇది మనం ఎదుటి వ్యక్తికి ఎంత ప్రాధాన్యత నిస్తున్నామో తెలియజేస్తుంది. 2) కాంప్లిమెంట్స్, విషింగ్స్ మనం ఎదుటివ్యక్తిని ఎంతగా ప్రేమిస్తున్నామో చేతల్లోనే కాదు కొన్ని కొన్ని సందర్భాల్లో మాటల్లో చెప్పటం కూడా అవసరం. ఉదయం లేవగానే ప్రేమగా పలకరించటం, ఆమె, అతడు మన కోసం ఏదైనా చేసినపుడు కాంప్లిమెంట్ ఇవ్వటం కూడా ఎదుటి వ్యక్తికి ఎంతో సంతోషాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. 3) శ్రద్ధ జంట అన్న తర్వాత ఒకరి విషయాలను ఒకరికి చెప్పుకోవటం, సమస్యలు ఎదురైనపుడు దానికి పరిష్కారాన్ని కోరటం పరిపాటి. అలాంటి సమయంలో ఎదుటి వ్యక్తి చెప్పే విషయాలను శ్రద్ధగా వినడానికి ప్రయత్నించాలి. సమస్య మీరు పరిష్కరించేది కాకపోయినా సానుభూతి తెలియజేయాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ ఎదుటి వ్యక్తి మనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేసే పనులు చేయకూడదు. 4) సహనం ఏ బంధమైనా అది కలకాలం నిలబడాలంటే జంటలోని వ్యక్తులకు సహసం చాలా అవసరం. ఇది వ్యక్తుల మధ్య ఉన్న వేరు వేరు ఆలోచనలను, వ్యక్తిత్వాలను మనకు తెలియజేస్తుంది. వారిని అర్థం చేసుకోవటానికి ఎంతగానో ఉపకరిస్తుంది. జంట మధ్య సంభాషణలు గొడవలతో కాకుండా చర్చలతో ముగియాలంటే సహనం అవసరం. 5) నమ్మకం మనతో ఉంటే సంతోషంగా ఉండగలమనే నమ్మకాన్ని ఎదుటి వ్యక్తికి కల్పించాలి. అది శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా. ఆపదలనుంచి పార్ట్నర్ను రక్షిస్తూ వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. ఎదుటి వ్యక్తి భావాలకు గౌరవాన్నివ్వాలి. అంతే కాకుండా నిజాయితీ, ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకునే గుణం బంధం సాఫీగా సాగిపోవటానికి ఎంతో అవసరం. లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
అంతకంటే బ్రేకప్ చెప్పటం మేలు!
అన్ని జంటల మధ్య బంధం ఒకేలా ఉండదు. ఓ జంట ప్రేమగా ఉంటే.. మరో జంట ఎప్పుడూ కీచులాడుకుంటూ ఉంటుంది. పూర్తిగా బంధంలోకి అడుగుపెట్టేంతవరకు గానీ, ఎదుటి వ్యక్తి ఎలాంటి వాడో తెలుసుకోలేము. పార్ట్నర్ మన జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత లైఫ్ హ్యాపీగా సాగిపోతుంటే పర్లేదు. అలా కాకుంటే మటుకు.. కాలం గడుస్తున్న కొద్ది ఎదుటి వ్యక్తి మీద విరక్తి పుట్టుకువస్తుంది. ఇలాంటి సమయంలో కొంతమంది మాత్రమే ధైర్యం చేసి బంధానికి బ్రేకప్ చెప్పేసి తమదారి చూసుకుంటారు. మరి కొంతమంది ఎన్ని కష్టాలు వచ్చినా ఓపికతో ఎదుటి వ్యక్తి తప్పులను పక్కన పెట్టి కాలం వెల్లదీస్తుంటారు. ఈ ఇద్దరూ కాకుండా మరికొందరు ఏది మంచో ఏది చెడో తెలియక కొట్టుమిట్టాడుతుంటారు. అలాంటి వారు ఈ క్రింది లక్షణాలను తమ ప్రేమ బంధంలో చూసినట్లయితే ఆ బంధానికి బ్రేకప్ చెప్పటం మేలు. 1) బ్యాడ్ కమ్యూనికేషన్ ఏ జంట సంతోషంగా ఉండాలన్నా వ్యక్తుల మధ్య ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఉండటం తప్పని సరి. సరైన కమ్యూనికేషన్ వల్లే బంధం గట్టిగా ఉంటుంది. అలా కాకుండా.. మీరు మీ భాగస్వామితో మాట్లాడటానికి భయపడుతున్నా! లేక, మీ భావాలను సరిగ్గా అతడితో పంచుకోలేకపోతున్నా తప్పని సరిగా ఆలోచించాల్సిన విషయమే. ఎదుటి వ్యక్తితో అరమరికలు లేకుండా మాట్లాడలేకపోతున్నట్లయితే మీరు కోరుకుంటున్న ప్రేమకు చాలా దూరంలో ఉన్నారని అర్థం చేసుకోవాలి. 2) చెడు ప్రవర్తన భాగస్వామి యెక్క చెడు ప్రవర్తన మంచి బంధానికి ఓ గొడ్డలిపెట్టులాంటిది. మీ పార్ట్నర్ మీ పట్ల తరచుగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నా లేక, చీటికిమాటికి తిడుతున్నా ఓ సారి ఆలోచించాల్సిన విషయమే. మన గౌరవానికి భంగం కలిగిస్తూ.. అమర్యాదగా నడుచుకునే వ్యక్తులతో బంధం మంచిది కాదని గుర్తించాలి. ప్రతిక్షణం వారి సూటి పోటి మాటలతో, చేష్టలతో మిమ్మల్ని మానసికంగా,శారీరకంగా బాధకు గురిచేస్తున్నట్లయితే అలాంటి వారితో తెగతెంపులు చేసుకోవటం మంచింది. 3) మిమ్మల్ని మీరు కోల్పోతున్నారా? గుడ్డికంటే మెల్ల నయం అన్న చందాన ఒంటరిగా ఉండటం ఇష్టం లేక బంధంలోకి అడుగుపెట్టే వారు చాలా మంది ఉంటారు. ఆ తర్వాత కూడా బంధంలో ఒంటరి తనాన్ని ఫీలవుతుంటారు. ఎదో సర్దుకుపోతూ ఎదుటి వ్యక్తితో కాలం వెల్లదీస్తుంటారు. వీళ్లు ఆనందంగా ఉండలేక, ఎదుటి వ్యక్తిని ఆనందపెట్టలేక నిత్యం బాధపడుతుంటారు. 4) మొదటి ప్రాధాన్యత మీ భాగస్వామి మీకు మొదటి ప్రాధాన్యత ఇవ్వకపోవటం అన్నది కచ్చితంగా దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయం. అన్ని విషయాల్లో కాకపోయిన ముఖ్యమైన విషయాల్లోనైనా మీకు ప్రాధాన్యత ఇవ్వటం ప్రధానం. అలా కాకుండా ఇతరులకు ప్రాధాన్యత ఇస్తూ మిమ్మల్ని మూడో వ్యక్తిగా చూడటం బాధకు గురిచేస్తుంది. గతంలో మీరు ఈ విషయంపై పార్ట్నర్తో చర్చించినా ఫలితం లేకుంటే మీ బంధం గురించి ఓసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
సౌదీతో సాన్నిహిత్యం
ఏ దేశంలోనైనా సంస్కరణలు ఊపందుకుని ఆర్థిక సామాజిక రంగాల్లో చలనం అధికంగా కనిపిం చినప్పుడు అది ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది. అక్కడకు వివిధ దేశాల అధినేతల రాకపోకలు పెరుగుతాయి. ఆ దేశంలో పెట్టుబడులపరంగా, వాణిజ్యపరంగా విస్తృతమైన అవకాశాలు ఏర్పడటం అందుకు కారణం. ఆ కోణంలో సౌదీ అరేబియా ఇప్పుడు చాలామందిని ఆకర్షిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకునే మంగళవారం ఆ దేశంలో రెండు రోజుల పర్యటన ప్రారంభించారు. సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ రూపొందించిన విజన్–2030 ఎనిమిది దేశాలతో సౌదీ అరేబియా వ్యూహాత్మక భాగస్వామ్యం నెలకొల్పుకొనాలని నిర్దేశిస్తోంది. అందులో అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, దక్షిణ కొరియా, జపాన్లతోపాటు మన దేశం కూడా ఉంది. సౌదీ అరేబియాకు ఇతరేతర దేశాలతో ఉన్న సంబంధాలు మాటెలా ఉన్నా మనతో అది సౌహార్ద సంబంధాలే కొనసాగిస్తూ వస్తోంది. ఈ ఏడాది మొదట్లో సౌదీ అరేబియా యువ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ మన దేశంలో పర్యటించారు. అప్పుడు భారత్లో ఇంధనం, ఖనిజాలు, మౌలిక సదుపాయాలు, పెట్రో కెమికల్స్, చమురుశుద్ధి, విద్య, తయారీరంగం తదితరాల్లో రూ. 10,000 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు అవగాహన కుదిరింది. దానికి కొనసాగింపుగా మోదీ పర్యటనలో ఒప్పందాలపై సంతకాలవుతాయి. దాంతోపాటు మంగళవారం రియాద్లో ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్షియేటివ్(ఎఫ్ఎఫ్ఐ) ఫోరం ఆధ్వర్యంలో ప్రారంభమైన వార్షిక సద స్సులో కూడా మోదీ పాల్గొన్నారు. 2024కల్లా అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా దేశాన్ని తీర్చిదిద్దేందుకు సంకల్పించిన విషయాన్ని గుర్తుచేశారు. సౌదీతో మన ద్వైపాక్షిక వాణిజ్యం విలువ దాదాపు 2,750 కోట్ల డాలర్లు. మన చమురు అవసరాల్లో 83 శాతం దిగుమతుల ద్వారానే తీరు తుండగా ఇరాక్ తర్వాత భారత్కు భారీగా ముడి చమురు సరఫరా చేసే దేశం సౌదీ అరేబియానే. 2018–19లో మన దేశం 20 కోట్ల 73 లక్షల టన్నుల ముడి చమురు దిగుమతి చేసుకోగా అందులో సౌదీ వాటా 4 కోట్ల టన్నులపైనే. సౌదీకి చెందిన ఆరామ్కో ప్రపంచంలోనే అత్యధిక లాభాలు గడిస్తున్న చమురు సంస్థ. ఆ దేశంలో 27,000 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు నిల్వలు నిక్షిప్తమై ఉన్నాయని అంచనా. కనుక చమురు రంగంలో సౌదీ అరేబియా స్థానం తిరుగులేనిది. అయితే భారత్–సౌదీ అరేబియాల మధ్య సహకారం కేవలం చమురు–ఇంధన రంగాలకు మాత్రమే పరిమితమై లేదు. ఇరు దేశాల అధినేతలూ తీసుకున్న చొరవ కారణంగా ఈ సహకారం బహుళరంగాలకు విస్తరించింది. ఉగ్రవాద వ్యతిరేక పోరాటం, రక్షణ, సాగర భద్రత, పెట్టుబడులు, పర్యాటకం తదితర అనేక రంగాలకు విస్తరించింది. ఇప్పుడు సౌదీ అరేబియాలో ఆర్థిక సంస్కరణల కార్యక్రమం భారీయెత్తున సాగుతోంది. అందులో గణనీయమైన భాగస్వామ్యం ఇవ్వడంతోపాటు మన దేశంలోని పెట్రోకెమికల్స్, మౌలిక సదుపాయాలు, మైనింగ్ తదితర రంగాల్లో సౌదీ సహకారం అందించాలని మన దేశం కోరుకుంటోంది. ప్రచ్ఛన్నయుద్ధ కాలంలో ఇటువంటి పరిస్థితి లేదు. మనకు అప్పటికి సోవియెట్ యూనియన్గా ఉన్న రష్యాతో మంచి సంబంధాలుండేవి. అటు సౌదీ అరేబియా అమెరికా అనుకూల వైఖరితో ఉండేది. దానికితోడు భారత్తో సంబంధాల విషయం వచ్చేసరికి అది పాకిస్తాన్ను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించేది. ఇప్పుడు అదంతా మారింది. రెండు దేశాలూ సకల రంగాల్లో సన్నిహితం కావాలని నిర్ణయించాయి. కశ్మీర్ భారత్ ఆంతరంగిక వ్యవహార మని, దాని జోలికి పోవద్దని సౌదీ నేతలు భావించారు. జమ్మూ–కశ్మీర్ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడం, 370 అధికరణను రద్దుచేయడం వంటి అంశాల్లో ఈ కారణం వల్లే సౌదీ ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. టర్కీ తరహాలో సౌదీ కూడా స్పందిస్తుందనుకున్న పాకిస్తాన్ ఈ పరిణామంతో ఖంగుతింది. పొరుగునున్న పాకిస్తాన్ నుంచి మనకు ఉగ్రవాద బెడద ఉన్నట్టే సౌదీ అరేబియాకు కూడా ఇరుగు పొరుగు నుంచి ముప్పు కలిగే ప్రమాదం ఉంది. ఇటీవలే అక్కడి ఆరామ్కో చమురుశుద్ధి కర్మా గారంపై ద్రోన్ దాడులు జరిగి భారీ నష్టం సంభవించింది. పశ్చిమాసియాలో సైనికపరంగా సౌదీ శక్తిమంత మైనదే అయినా, ఏటా అది ఆయుధాల కోసం వందలకోట్లు వెచ్చిస్తున్నా, ఉగ్రవాద వ్యతి రేక పోరులో దానికి అనుభవం తక్కువ. కనుకనే ఈ రంగంలో సహకరించుకోవాలని భారత్, సౌదీ అరేబియాలు నిర్ణయించుకున్నాయి. ఉమ్మడి సైనిక శిక్షణ కార్యక్రమాలు, విన్యాసాలు జరపడం ఇలాంటి లోటు పాట్లను తీరుస్తుంది. ఫిబ్రవరిలో బిన్ సల్మాన్ మన దేశంలో పర్యటించినప్పుడు ఈ విషయంలో ఒప్పందం కుదరింది. అనంతరం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సౌదీ వెళ్లి దానికి కొన సాగింపుగా చర్చలు జరిపారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఈ ఏడాది ఆఖరులో లేదా వచ్చే ఏడాది మొదట్లో రెండు దేశాల ఉమ్మడి నావికా దళ విన్యాసాలు జరుగుతాయి. అంతరిక్ష సాంకేతికతపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని సౌదీ నిర్ణయించింది. కనుక ఈ రంగంలో సైతం మన దేశానికి అవ కాశాలు బాగా పెరుగుతాయి. రిమోట్ సెన్సింగ్, ఉపగ్రహ కమ్యూనికేషన్లు, ఉపగ్రహ ఆధారిత సము ద్రయాన నిర్వహణ వగైరాల్లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో)కు అపారమైన అనుభవం ఉంది. వీటన్నిటా రెండు దేశాలూ కలిసి పనిచేస్తే ఉమ్మడిగా లాభపడటానికి అవకాశాలుంటాయి. గతంతో పోలిస్తే ఇరు దేశాలూ చాలా రంగాల్లో సన్నిహితమయ్యాయి గనుక ద్వైపాక్షిక సంబంధాలు మరింత ఉన్నత స్థాయికి వెళ్తాయి. అయితే రెండు దేశాల మధ్య ఏర్పడే ద్వైపాక్షిక సంబంధాలు పటిష్టంగా ఉండాలంటే అవి రెండూ తమ జాతీయ ప్రయోజనాలపైనే దృష్టిపెట్టాలి తప్ప మూడో దేశం ప్రయోజనాల గురించి ఆలోచించకూడదు. భారత్, సౌదీ అరేబియాలు రెండూ ఈ అంశాన్ని గమనంలోకి తీసుకుంటే అచిరకాలంలోనే ద్వైపాక్షిక సంబంధాలు కొత్త పుంతలు తొక్కుతాయి. -
అందుకే మగాళ్లు తరచు మోసాలకు..
తరచు మోసాలకు పాల్పడే భాగస్వామి కారణంగా బంధమే కాదు మన ఆత్మ గౌరవం, ఇతర వ్యక్తుల మీద నమ్మకాన్ని కూడా కోల్పోతాం. ఎదుటి వ్యక్తి మోసాల కారణంగా మనం తీవ్ర పరిణామాలను ఎదుర్కొవలసి వస్తుంది. భాగస్వామి మనస్తత్వాన్ని బట్టి వారు చిన్న విషయాలకు కూడా మనల్ని మోసం చేస్తుండొచ్చు. వారి ఆగడాలను పూర్తిగా అరికట్టడం అన్నది సాధ్యమమ్యేది కాదు! ముందు జాగ్రత్త పడటం తప్ప. ముఖ్యంగా బంధంలో ఆశించినంత సంతృప్తి లభించనప్పుడు మగవాళ్లు తరచూ మోసాలకు పాల్పడుతుంటారు. ఆడవాళ్లు కానీ, మగవాళ్లు కానీ, తమ చెడు చేష్టలకు తగిన కారణాలను జేబులో పెట్టుకుని తిరుగుతుంటారు. మోసాలకు కారణాలు అన్వేషించినపుడు ఈ క్రింది ఆరు ప్రధానమైనవిగా చెప్పుకోవచ్చు. 1) భాగస్వామి సరిగా పట్టించుకోనపుడు వారి ఆలోచనలను తమ వైపు తిప్పుకోవటం కోసం. 2) ప్రేమ మొదలైన కొత్తలో ఉన్నంత అందంగా, ఆకర్షణీయంగా భాగస్వామి లేకపోవటం. 3) ఇది వరకు ఒకరి చేతిలో మోసపోయిన కారణంగా ఆ కక్షతో ఇతరులను మోసం చేయాలనుకోవటం. 4) ప్రేమ అనే బంధాన్ని ఎదుటి వ్యక్తి తేలిగ్గా తీసుకోవటం లేదా భాగస్వామి మీద ప్రేమ తగ్గిపోవటం. 5) బంధంలోకి మూడో వ్యక్తి అడుగుపెట్టినపుడు. 6) మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉన్నపుడు. లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
అలాంటి వారినే తరుచు ప్రేమిస్తాం
ఓ సారి ప్రేమలో ఎదురుదెబ్బ తగిలిన తర్వాత ఏం చేస్తాం?.. ఇంకోసారి అలాంటి వ్యక్తి జోలికి వెళ్లకూడదని, ప్రేమించకూడదని అనుకుంటాం. కానీ, గతంలో మనం ఎదురుదెబ్బ తిన్న భాగస్వామి లాంటి వారినే మరల ప్రేమిస్తామని తాజాగా ‘‘ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్’’ చేపట్టిన అధ్యయనంలో తేలింది. మామూలుగా ఎదుటివ్యక్తితో తెగతెంపులు చేసుకున్న తర్వాత వారి వ్యక్తిత్వాన్ని తప్పుబట్టటమే కాకుండా అలాంటి వారిని అసలు ప్రేమించకుండా ఉండాల్సింది అనుకుంటాము. అయితే మనలో పాతుకుపోయిన ఓ బలమైన ధోరణి మాజీ భాగస్వామిలాంటి వ్యక్తులను ప్రేమించటానికే మొగ్గుచూపుతుందని యూబిన్ పార్క్ అనే పరిశోధకుడు పేర్కొన్నారు. యూబిన్ పార్క్, జెఫ్ మెక్డొనాల్డ్లు వివిధ వయస్సుల్లోని వ్యక్తులపై అధ్యయనం చేపట్టారు. వారి ప్రస్తుత, గతం తాలూకు వ్యక్తిత్వాలను సరిపోల్చారు. ఎక్కువమంది తమలాంటి భావాలు కల్గిన వ్యక్తులను ప్రేమించటానికే ఆసక్తి కనబరుస్తున్నారని వారి అధ్యయనంలో తేలింది. ప్రస్తుతం వారు ప్రేమలో ఉన్న, గతంలో విడిపోయిన వ్యక్తుల వ్యక్తిత్వాలు ఒకేలాగ ఉన్నాయని వారు వెల్లడించారు. రిలేషన్షిప్లు మారుతున్నా సమస్యలు ఉత్పన్న మవ్వటంలో మార్పులేకపోవటానికి ఇదే ప్రధాన కారణమని పేర్కొన్నారు. లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
అలా అయితేనే బంధాలు నిలబడతాయి
జంటల మధ్య గొడవలు చోటుచేసుకోవటం అన్నది సహజం. అయితే కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న గొడవలే గాలివానలా మారి బంధాలను తుడిచిపెట్టేస్తుంటాయి. కలిసుండలేక, అలాగని విడిపోలేక ప్రతి క్షణం మనస్పర్థలతో, గొడవలతో బంధాన్ని నిత్య నరకకూపం చేసుకుంటుంటారు కొందరు. చేతులు కాలాక ఆకులు పట్టుకోవటం అన్న పరిస్థితి బంధంలో ఎప్పుడూ రాకూడదు. ఏ ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఆలోచించరన్న సంగతిని గుర్తుంచుకోవాలి. బేషజాలకు పోకుండా జంట తమ గొడవలకు కారణాలను అన్వేషించాలి. ఒకరిని ఒకరు అర్థం చేసుకుని మసలుకోవాలి. ముఖ్యంగా ఈ క్రింది సూత్రాలను తప్పక పాటించాలి. 1) భూతద్దం పెట్టి వెతక్కండి ఎవరితోనైనా గొడవ పడినపుడు వారి లోపాలు మనకు త్రీడీలో కన్పిస్తుంటాయి. ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి వెతకటం ప్రారంభిస్తాము. ఇలాంటప్పుడే చిన్న చిన్న సమస్యలు కూడా పెద్దగా కన్పిస్తాయి. ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని బలహీనపరుస్తాయి. గొడవ ఎవరి వల్ల, ఎందుకు మొదలైందని ఆలోచించకుండా దాన్ని ప్రారంభంలోనే తుంచివేయటం ముఖ్యం. అహాలను సంతృప్తి పరుచుకునేందుకు గొడవ సరైన వేదిక కాదని గుర్తించాలి. 2) అంగీకరించటం నేర్చుకోండి గొడవ జరిగినపుడు ఆ గొడవకు కారణం మీరయితే తప్పకుండా దాన్ని అంగీకరించండి. మీ తప్పును ఎదుటి వారి మీదకు నెట్టుదామనే ఆలోచన చేయకుండా, గొడవను పెంచకుండా మీ తప్పును అంగీకరించి వీలైతే క్షమాపణ కోరండి. 3) ఓర్పుగా ఉండండి బంధాలను కలకాలం నిలుపుకోవాలంటే ఓర్పుగా ఉండటం ముఖ్యం. ఏదైనా ఓ నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. కోపం మనల్ని విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. కాబట్టి, గొడవల సమయంలో ఓర్పుగా ఉండటం ముఖ్యం. 4) అతిగా అంచనాలు వేయోద్దు జంటల మధ్య గొడవలకు ప్రధాన కారణం అతి అంచనాలే. మనం ఎదుటి వ్యక్తిపై పెట్టుకున్న అంచనాలను వారు చేరుకోలేనపుడే అసంతృప్తి మొదలవుతుంది. ఆ అసంతృప్తి కోపంగా మారి, ఆ కోపం గొడవలకు దారి తీస్తుంది. ఏ ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఆలోచించరన్న సంగతి మరోసారి గుర్తు చేసుకోవాలి. ఎవరికి వారి వ్యక్తిగత ఇష్టాలు ఉంటాయి. వాటిని మనం గౌరవించాలి. వారు ఏం కోరుకుంటున్నారో తెలుసుకోవటం మంచిది. 5) గెలవటం ముఖ్యం కాదు! జంటల మధ్య గెలుపు, ఓటముల ప్రసక్తి పనికిరాదు. ప్రతి విషయంలో మనదే పైచెయ్యి అవ్వాలన్న ధోరణి పనికిరాదు. ఎక్కడ నెగ్గాలో కాదు! ఎక్కడ తగ్గాలో తెలిసినపుడే బంధం కలకాలం నిలుస్తుంది. 6) సర్దుకుపోవద్దు.. అర్థం చేసుకోండి సర్దుకుపోవటమన్నది బంధాల విషయంలో అస్సలు పనికి రాదు. ఎదుటి వ్యక్తితో మనం సర్దుకు పోయినపుడు వారి వల్ల మనకు కలిగిన అసంతృప్తి మనసులో గుట్టలుగా పేరుకుపోతుంది. ఏ క్షణంలోనైనా ఎదుటి వారిపై తిరగబడేలా చేస్తుంది. భాగస్వామిని అర్ధం చేసుకోవటం వల్ల వారి మనసేంటో, ఏ క్షణంలో ఎలా ఉంటారో తెలుస్తుంది. వారి వల్ల మనకు అసంతృప్తి కలిగినా అది మనసుపై ఎలాంటి ప్రభావం చూపించదు. 7) జరిగిన దాని గురించి ఆలోచించవద్దు ముందు చెప్పినట్లుగానే జంటల మధ్య గొడవలు చోటుచేసుకోవటం సహజం. జరిగిన గొడవ గురించే ఆలోచిస్తూ బాధపడకుండా ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచించటం మంచిది. గొడవలకు కారణాలను అన్వేషించి, ఇక మీదట అలా జరగకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు అది మీకెంత ముఖ్యమో దాన్ని వల్ల ఎదుటి వారికి ఏదైనా సమస్య రావచ్చా అన్న దాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
స్నేహం, ప్రేమ, పెళ్లి.. ఈ మూడు..
స్నేహం, ప్రేమ, పెళ్లి.. ఈ మూడు బంధాలకు మనిషి జీవితంలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. మన జీవితంలో ఎక్కువ భాగం ఈ బంధాలతో పెనవేసుకుని ఉంటుంది. కొంతమంది వ్యక్తులతో ఈ బంధాలు తీపిని రుచిచూపిస్తే మరికొందరితో చేదు.. ఇలా ఒక్కోమనిషితో ఒక్కోరకమైన అనుభవాలు, అనుభూతులు కలుగుతుంటాయి. ఈ బంధాలు మనకు రెండు రూపాల్లో దగ్గరవుతాయి 1) సోల్మేట్ 2) లైఫ్ పార్టనర్. సోల్మేట్తో సాహచర్యం ఒకలా ఉంటే లైఫ్ పార్టనర్తో సాహచర్యం మరోలా ఉంటుంది. ఈ రెండింటి మధ్య తేడాలు మన మీద చాలా ప్రభావం చూపుతాయి. సోల్మేట్ : ఇదో ఆత్మ బంధం. ఇలాంటి వారు దొరకటం చాలా అరుదు. వీరితో జీవితం సంతోషంగా గడిచిపోతుందనటంలో ఎటువంటి సందేహం లేదు. మనల్ని పూర్తిగా అర్థం చేసుకోవటం వీరి లక్షణం. మనతో మనము కలిసి ఉన్నట్లుగా వీరి సాహచర్యం ఉంటుంది. మన సంతోషాలను రెట్టింపు చేస్తారు. కష్ట సమయాల్లో మన వెన్నంటే ఉండి ధైర్యం చెబుతారు. ఇటువంటి వారితో జీవితం ఎల్లప్పుడూ సాఫీగా సాగిపోతుంది. ఒక రకంగా ఇది పెద్దలు చెప్పిన జన్మజన్మల బంధంగా అనుకోవచ్చు. ఈ బంధం శాశ్వతం కాకపోవచ్చు. వీరి సాన్నిహిత్యంలో జీవితం కొన్ని కొత్త పాఠాలను నేర్చుకుంటుంది. మనల్ని మనం పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడే వీరు అర్థమవుతారు. లైఫ్ పార్టనర్ : వీరి సాహచర్యాన్ని కంఫర్టబుల్గా ఫీలవుతాం. మన మనసును, భావాలను వీరు పూర్తిగా అర్థం చేసుకుంటారని చెప్పలేము. అయితే అన్ని విషయాలలో మన వెన్నంటే ఉంటారు. ఆడ,మగ విషయంలో అందానికి, ఆకర్షణలకు ఇక్కడ ప్రాధాన్యత ఉంటుంది. వీరితో బంధం అంత బలమైనదిగా ఉండకపోవచ్చు. ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండటం, ఒకరిని ఒకరు గౌరవించుకోవటం జరుతుంది. వీరితో సుధీర్ఘమైన సంబంధాలను కలిగి ఉంటాము. -
మీ పార్టనర్తో బ్రేకప్ అయ్యారా ?
రిలేషన్షిప్లో అన్నీ అనుకున్నట్టే జరగవు. పరిస్థితులు సరిగా లేనవుడు సంయమనం కోల్పోవడం వల్ల రిలేషన్షిప్ కొన్ని సార్లు బ్రేకప్ అవుతుంది. అతడు/ఆమె మీకు సరైన జోడీనే అయినప్పటికీ చిన్న కారణాలకే మీరు బ్రేకప్ అయి ఉంటే కింది విషయాలు మీరు లోతుగా ఆలోచించుకొని బంధాన్ని తిరిగి నిర్మించుకోవడానికి ఉపయోగపడతాయి. మీ సమస్యకు పరిష్కారం లేదా ? మీరు విడిపోవడానికి అసలు బలమైన కారణం ఉందా? లేక భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోలేక జరిగిన గొడవ వల్ల విడిపోయారా? రిలేషన్షిప్లోని ప్రతీ సమస్యను ఏదో ఒక విధంగా పరిష్కరించవచ్చు. విడిపోవడం వల్ల మాత్రమే సమస్య పరిష్కారమవుతుందా అనే ప్రశ్నను వేసుకొని లోతుగా పరిశీలించుకోవాలి. సెన్సిటివ్ విషయాలను సరిగా డీల్ చేయడం నేర్చుకుంటే చాలా వరకు రిలేషన్షిప్ను కాపాడుకోవచ్చు. నిజంగా అతడు/ఆమె మీద కోపమేనా? కొన్నిసార్లు ఎవరి మీదనో ఉన్న కోపాన్ని మీ పార్టనర్ మీద చూపించి ఉంటారు. ఉదాహరణకు ఆఫీస్లో బాస్ మిమ్మల్ని తిడితే, మీరు అతన్ని ఏమీ అనలేక ఇంటికెళ్లాక మీ పార్టనర్ మీద చూపించి ఉండవచ్చు. లోతుగా పరిశీలించుకుంటే తప్ప ఆ విషయం మీకు తెలియకపోవచ్చు. అతడు/ఆమె మీకు కరెక్టేనా ? కొన్నిసార్లు పరిస్థితుల ప్రభావం వల్ల ఇద్దరి మధ్య సరైన కమ్యూనికేషన్ లేనపుడు ఇద్దరిలో ఎవరో ఒకరికి తమను పట్టించుకోవడం లేదనిపించడం సహజం. అలాంటి సమయంలో ఒకటికి రెండు సార్లు పరిస్థితిని క్షుణ్ణంగా వివరించడం ఉత్తమం. మీ పార్ట్నర్ను అడగకుండా మీకై మీరే ఓ అభిప్రాయానికి రావడం సరైనది కాదు. ఇద్దరూ ఒకరికి ఒకరు నమ్మకంగా ఉన్నంత కాలం విడిపోవడమనేది సరైన నిర్ణయం అనిపించుకోదు. ఇంకా ప్రేమిస్తున్నారేమో..! ఏదైనా కారణం వల్ల మీరు విడిపోయినప్పటికీ మీ పార్ట్నర్ మిమ్మల్ని ఇంకా ప్రేమిస్తూ ఉండొచ్చు. గతంలో మీరు మెలిగిన తీరును బట్టి మీరు చేసిన తప్పును మన్నించి రెండో అవకాశం ఇవ్వడానికి ఎదురుచూస్తూ ఉండవచ్చు. గొడవ జరిగి విడిపోయినప్పటికీ కొంత కాలానికి తిరిగి మిమ్మల్ని కోరుకుంటూ ఉండవచ్చు. కాబట్టి ఒకసారి మీ పార్ట్నర్తో మాట్లాడటానికి ప్రయత్నించండి. గతం గుర్తొస్తుందా..? మీరు గతంలో సంతోషంగా గడిపిన క్షణాలు మీకు చాలా సార్లు గుర్తొస్తూ ఉండవచ్చు. మీరు విడిపోయిన క్షణం చాలా బలహీనమైనదని, ఆ నిర్ణయం తీసుకున్నందుకు మీరు బాధపడుతున్నట్లయితే మీరు ఇంకా మీ పార్టనర్ పట్ల ప్రేమను కలిగివున్నారనే అర్థం. మరిక ఆలస్యం దేనికి.. వెంటనే మీ పార్టనర్కి కాల్ చేసేయండి. కాల్ చేసే ధైర్యం లేకపోతే మెసెజ్ చేయండి. ఫేస్బుక్, వాట్సాప్ లాంటివి ఇందుకే ఉన్నాయి మరి... -
శృంగారం గురించి బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా టుడే మైండ్ రాక్స్ సదస్సులో ఆమె మాట్లాడుతూ తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికరమైన విషయాలు షేర్ చేసుకున్నారు. తన ఫస్ట్ క్రష్ గురించి.. తన ఫస్ట్ రిలేషన్షిప్ గురించి కూడా ఆమె వివరించారు. శృంగారం పట్ల మన దేశంలో ఉన్న మూఢనమ్మకాలను ప్రస్తావించిన ఆమె.. శృంగారం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన అంశమని అన్నారు. ‘మీకు శృంగారం కావాల్సినప్పుడు దాన్ని ఆస్వాదించండి.. అంతేకానీ దానిని అతిగా కాంక్షించడం ఎందుకు? ఒకప్పుడు కేవలం శృంగారం కోసమే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని అతనికి కట్టుబడి ఉండాలని చెప్పేవారు. చరిత్రలో చోటుచేసుకున్న దండయాత్రల కారణంగా ఇప్పటికీ మన ఆలోచనలు అక్కడే ఉన్నాయి. మన పవిత్ర గ్రంథాలు కూడా శృంగారాన్ని అనుమతించవు. కానీ పిల్లలు శృంగారంలో పాల్గొనడంపట్ల తల్లిదండ్రులు ఆనందంగా ఉండాలి. పిల్లలు కూడా శృంగారం విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. నేను శృంగారపరంగా యాక్టివ్గా ఉన్నానని తెలుసుకొని నా తల్లిదండ్రులు షాక్కు గురయ్యారు. పిల్లలు శృంగారంలో పాల్గొనేలా తల్లిదండ్రులు ఎంకరేజ్ చేయాలి’ అని ఆమె చెప్పుకొచ్చారు. కంగనా రనౌత్ ప్రధానపాత్రలో నటించిన గత చిత్రం ‘మణికర్ణిక’ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఆమె ప్రస్తుతం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ సినిమాలో నటిస్తున్నారు. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు తలైవి అనే టైటిల్ అనుకుంటున్నారు. -
రాకుమారుడు ఉన్నాడు
ఒక కప్పను ఓ యువరాణి ముద్దాడితే ఆ కప్ప అందాల రాకుమారుడిగా మారిపోయింది. పట్టరానంత సంతోషంతో రాణి మైమరచిపోయింది. ఇది కథ అని చాలామందికి తెలుసు. అప్పటినుంచి కూడా ‘ఒక రాకుమారుడిని పొందాలంటే ఎన్నో కప్పలను ముద్దాడాలి’ అనేది వాడుకలోకి వచ్చింది. ఇప్పుడు ఇదే మాటను తాప్సీ చెబుతున్నారు. ‘‘నా రాకుమారుడు దొరకడానికి నేను ఎన్నో కప్పలను ముద్దాడాను’’ అంటూ తాను ప్రేమలో ఉన్న విషయాన్ని బయటపెట్టారీ బ్యూటీ. అయితే ఆ రాకుమారుడి పేరు మాత్రం చెప్పలేదు. దాదాపు నాలుగైదేళ్లుగా డెన్మార్క్కి చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోతో తాప్సీ రిలేషన్లో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాను ప్రేమలో ఉన్నట్లు చెప్పిన తాప్సీ, ‘‘చాలామంది ఊహిస్తున్నట్లు అతను ఆ వృత్తి (ఓ క్రికెటర్తో తాప్సీ లవ్లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది)కి సంబంధించినవాడు కాదు’’ అని పేర్కొన్నారు. ‘‘నా జీవితంలో ఎవరున్నారో తెలుసుకోవాలని చాలామందికి ఆసక్తిగా ఉంది. అతను నటుడు కాదు.. క్రికెటర్ కాదు. అసలు ఇక్కడివాడు కాదు’’ అన్నారు తాప్సీ. ‘‘నాకు పిల్లలు కావాలనుకున్నప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను. అయితే ఘనంగా పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఒకే రోజులో పెళ్లి వేడుక ముగించేయాలనుకుంటున్నాను. పెళ్లి పేరుతో రోజుల తరబడి వేడుకలు చేసుకోవడం నాకిష్టం లేదు’’ అని కూడా తెలిపారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘తప్పాడ్’ అనే హిందీ చిత్రంలో నటిస్తున్నారు. ‘షూటర్స్’ చంద్రో తోమర్, ప్రకాశీ తోమర్ జీవితాల ఆధారంగా తీసిన ‘సాండ్ కీ ఆంఖ్’లో ప్రకాశీ పాత్ర చేశారు తాప్సీ. ఈ చిత్రం వచ్చే నెల 25న విడుదల కానుంది. -
అది నిజమే కానీ, అతను యాక్టర్ కాదు
ముంబై: ప్రముఖ నటి తాప్సీ పన్ను తాజాగా ఓ విషయాన్ని అంగీకరించారు. తాను ఓ వ్యక్తితో రిలేషన్షిప్లో ఉన్నానని తొలిసారి ఒప్పుకున్నారు. అయితే, తాను ప్రేమిస్తున్న వ్యక్తి నటుడో, క్రికెటరో కాదని తెలిపారు. సోదరి షగున్తో కలిసి తాప్సీ తాజాగా పింక్విల్లా వెబ్సైట్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు. నన్ను నిజంగా ఇష్టపడేవారు నా గురించి వచ్చే గాసిప్స్ను పెద్దగా పట్టించుకోరు. నా జీవితంలో ఉన్న వ్యక్తి.. అందరూ ఆసక్తిబరిచే రంగానికి చెందినవారు కాదు. అతను నటుడో, క్రికెటరో కాదు. పైగా అతను ఇక్కడికి సమీపంలో ఉన్నవాడు కూడా కాదు’ అని తెలిపారు. ఈ విషయమై షగున్ మాట్లాడుతూ.. ఈ విషయంలో తాప్సీ తనకు కృతజ్ఞతలు తెలుపాలని, తనద్వారా ఆమెకు ఆ వ్యక్తి పరిచమయ్యాడని, ఇంతటి విచిత్రమైన వ్యక్తిని తాప్సీ ఎలా ఇష్టపడిందో అర్థం కావడం లేదని, ఇతను ఒకింత వికారమైన వ్యక్తి అంటూ సరదాగా పేర్కొంది. దీనికి తాప్సీ బదులిస్తూ.. ‘ నా రాకుమారుడిని కలిసేముందు నేను ఇంతకుముందు ఎన్నో కప్పలను ముద్దాడాను’ అంటూ చమత్కరించారు. ఇంట్లో పెళ్లి చర్చ వస్తూ ఉంటుందని, కానీ, దానిని దాటవేసే ప్రయత్నం చేస్తుంటామని తెలిపారు. పిల్లలను కనాలనుకున్నప్పుడే తాను పెళ్లి చేసుకుంటానని, పెళ్లిద్వారానే పిల్లలను పొందాలని తాను భావిస్తున్నట్టు తాప్సీ చెప్పారు. -
ఎవరూ లేకుండానే
అతనో ధనవంతుడు. బోలెడంత సంపద. దాంతో అతను బంధువులందరినీ కాదని కొందరు నౌకర్లతో ఉంటున్నాడు. ఏం కావాలన్నా పనివాళ్లున్నారనే ధీమాతో ఉన్నాడు. ఓరోజు ఓ జ్ఞాని అనుకోకుండా ఆయన వద్దకు వచ్చాడు. ధనికుడు సకల మర్యాదలతో ఆహ్వానించాడు.‘‘ఏరీ నీ భార్యా పిల్లలూ? ఇక్కడి వాతావరణం చూస్తుంటే బంధువులెవరూ కూడా వచ్చిపోతున్నట్లని పించడం లేదు? నీ బంధువులందరూ ఏమయ్యారు? ఎంతసేపూ నౌకర్లే కనిపిస్తున్నారు?’’ అని అడిగాడు జ్ఞాని. దానికి ధనికుడిలా జవాబిచ్చాడు.. ‘‘నాకు బోలెడంత డబ్బు ఉంది. నాకేం కావాలన్నా చేసిపెట్టడానికి నౌకర్లున్నారు. నేను గుమ్మం దాటక్కర్లేదు. అటువంటప్పుడు నాకు భార్యా బిడ్డల అవసరమేముంది. బంధువులెవరూ రాకున్నా నాకేమీ నష్టం లేదు. నాకు వాళ్లెవరితోనూ ఏ అవసరమూ లేదు’’ అని. ‘‘ఓహో.. అలాగా! కాస్సేపు నాతో అలా వస్తావా? అటూ ఇటూ తిరిగొద్దాం’’ అన్నాడు జ్ఞాని.‘‘సరే’’ అంటూనే ఎండలో రమ్మంటాడేమిటీ అని మనసులో అనుకుంటాడు. కానీ రాలేనని చెప్పడం ఇష్టంలేక అన్యమనస్కంగానే బయలుదేరుతాడు జ్ఞాని వెంట ధనికుడు. కొంచెం దూరం వెళ్లేసరికే ఎండకు తట్టుకోలేక నీడకోసం చుట్టూ చూశాడు.అది తెలిసి జ్ఞాని ఏమీ ఎరగనట్టే ‘‘ఎవరికోసం చూస్తున్నావు? నీకెవరి తోడూ అక్కర్లేదన్నావుగా? నీకేం కావాలన్నా చేసి పెట్టడానికి నౌకర్లు ఉన్నారుగా. అయినా నీ నీడే నీకుందిగా. అందులో సేదదీరవచ్చుగా?’’ అన్నాడు. ‘‘అదెలా కుదురుతుంది స్వామీ? నా నీడ నాకెలా నీడనిస్తుంది?’’ అని ప్రశ్నిస్తూనే తన తప్పు తెలుసుకుని మౌనంగా తలదించుకున్నాడు ధనికుడు.అందుకే అంటారు అనుభవజ్ఞులు.. డబ్బులెంత వరకు ఉపయోగపడతాయో తెలుసుకోవాలని. చుట్టాలూ పక్కాలూ స్నేహితులూ అంటూ బంధాలన్నీ పరస్పర తోడు నీడలకోసం అవసరమే. ఒంటికన్ను రాకాసిలా నాకెవరి తోడూ అవసరం లేదనుకునే బతుకు బతుకే కాదు. ఈ లోకంలో ఉన్నప్పుడే కాదు, పోయేటప్పుడూ నలుగురి అవసరం ఉందనే వాస్తవం గుర్తెరిగి నడచుకోవాలి.– సాత్యకి వై. -
నన్ను వెళ్లనివ్వండి
ఆ అన్నదమ్ములిద్దరి ఉమ్మడి వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయల్లా వర్ధిల్లుతోంది. వ్యాపారంలో వచ్చే లాభాలను పంచుకుని సంతోషంగా ఉండేవారు. ఒకరంటే ఒకరికి వల్లమాలిన ప్రేమాభిమానాలతో ముందుకు సాగేవారు. ఉన్నట్టుండి వ్యాపారం కుంటుపడింది. అప్పటిదాకా లాభాలబాట పట్టిన వ్యాపారం నష్టాల కూపంలోకి వెళ్లిపోయింది. ఇద్దరినీ ఆర్థిక ఇబ్బందులు కుంగదీశాయి, చిరాకు, నిరాశ, ఒత్తిడి పెరిగాయి. అప్పులు, నష్టాలు వారిద్దరి మధ్య దూరాలు పెంచాయి. నష్టాలను పంచుకొనే క్రమంలో అపార్థాలు పెరిగాయి. భాగస్వామ్యాన్ని తెగదెంపులు చేసుకున్నారు. ఇద్దరి బంగళాలు పక్కపక్కనే ఉన్నా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత శతృత్వం పెరిగింది. వ్యాపారంలో అ ఆ లు నేర్పిన తననే మోసం చేస్తాడా అని ఇద్దరి ఇళ్ల మధ్య ఎలాంటి రాకపోకలు ఉండకూడదనే ఉద్దేశంతో రగిలిపోతూ హుటాహుటిన పెద్ద క్రేన్ తో కాలువను తవ్వించి అందులో నీటిని నింపాడు అన్న. దీన్ని గమనించిన తమ్ముడు కోపంతో రగిలిపోయాడు. అన్న ఇంటిని చూడటానికి కూడా వీలులేదని భావించాడు. వెంటనే తన ఇంటి పక్కన తన అన్న ఇల్లు కనపడకుండా చెక్కతో గోడ నిర్మించాలని, రాత్రికి రాత్రే గోడ లేపాలని కార్పెంటర్కు పని పురమాయించాడు. రాత్రంతా ఆ వ్యక్తి కష్టపడి పని చేయనారంభించాడు. తెల్లారింది. తమ్ముడు నిద్రలేచి గోడను చూద్దామని కిటికీ దగ్గరకెళ్లి చూశాడు. అక్కడ గోడ జాడ లేదు. రాత్రంతా చెక్క గోడ నిర్మించే శబ్దం మాత్రం వినిపించింది కానీ ఇక్కడ ఎలాంటి గోడా లేదే అని ఆశ్చర్యపోయాడు. వెంటనే అసహనంతో ఊగిపోయాడు. ఇంటి బయటికొచ్చి చూస్తే కార్పెంటర్ తన సామానును సర్దుకుంటున్నాడు. గోడ కట్టలేదని కార్పెంటర్ ను తీవ్రంగా మందలిస్తుండగా.. అతను కనుసైగలతో అటు చూడమని చెప్పాడు. తలతిప్పి చూడగా అన్న తవ్విన కాలువపై చెక్క వంతెన వెలిసింది! ఆశ్చర్యంతో వంతెనపై అడుగులు వేశాడు. అంతలోనే అవతలివైపు అన్న. ఇద్దరిలో ప్రేమోద్వేగాలు ఉప్పొంగాయి. ఇద్దరూ ముందుకు కదిలారు. ఒకరినొకరు కౌగిలించుకున్నారు. కన్నీటి పొరలు తుడుచుకుంటుండగా కార్పెంటర్ వెళుతూ కనిపించాడు. వెంటనే హుటాహుటిన అతన్ని అడ్డుకుని ఇద్దరూ ‘‘నువ్వు మా దగ్గరే పనిచేయి’’ అని ప్రాధేయపడ్డారు. ‘‘ఇలాంటి వంతెనలు ఇంకా ఎన్నో కట్టాల్సి ఉంది.. నన్ను వెళ్లనివ్వండి’’ అని అక్కడి నుంచి నిష్ర్కమించాడు. మనం వంతెనలు కడుతున్నామో, అడ్డుగోడలను నిర్మిస్తున్నామో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. బంధాలను బలపర్చాలే కానీ విచ్ఛిన్నం చేయకూడదు.– ముహమ్మద్ ముజాహిద్ -
భార్యగారూ... ప్రేమించండి
ప్రేమించిన వాళ్లను మళ్లీ ప్రేమించాలి ఇంట్లో. అభిమానించే వాళ్లని అభిమానిస్తూనే ఉండాలి ఇంట్లో. అనుబంధాన్ని కుండీలో మొక్కలా నీరు పోసి కళకళలాడిస్తూనే ఉండాలి ఇంట్లో. ఎవరైనా ఎటైనా పోనీలే అనుకునే చోటు కాదు ఇల్లు.ఎవరైనా ఎలాగైనా ఉండచ్చులే అనుకునే చోటు కాదు ఇల్లు. మళ్లీ మళ్లీ దగ్గరగా హత్తుకుంటూనే ఉండాలి.మళ్ళీ మళ్లీ మన కుటుంబంతో ప్రేమలో పడుతూనే ఉండాలి. నాలుక పచ్చగా అయిపోయిందా అన్న భ్రాంతి. లోపల లివర్ పెరిగిపోయిందేమోనన్న భ్రాంతి. తల తిరగదుగాని తిరిగిపోతున్నదేమోన్న భ్రాంతి. ఇంట్లో ఉంటే ఆఫీసుకు వెళ్లబుద్ధవుతుంది. ఆఫీసుకు వెళితే ఇంటికి పారిపోమని మనసు చెబుతుంది. పొట్ట ఏమీ కదిలినట్టు అనిపించదు. లేదా ఎంతో కదిలిపోయినట్టు అనిపిస్తుంది. గతంలో టిఫెనుకు కూచుంటే మూడు రకాల ప్లేట్లు లేవాలి. నేడు ఒక ఇడ్లీ గతికితే పెద్ద విషయం. లోకం మీద ఏ ఆశా లేదు. అసలు ఏం కావాలో అర్థం కావడం లేదు. అతికష్టం మీద ఈ బడబాగ్నిని దాచుకుంటున్నాడు. భార్యకు తెలియకుండా. కూతురికి తెలియకుండా. కూతురు చాలా తెలివైనది. అది నాన్న పిల్ల.‘ఏంటి నాన్న అలా ఉంటున్నావు?’ అంది మొన్న చూసి.‘నాకేమైంది బాగున్నానే’ అన్నాడు హుషారు నటిస్తూ.‘బీరు తాగడం కూడా మానేశావు. ‘నా లగ్జరీ అదే... వారానికి ఒకసారి’ అంటే అమ్మా నేను పర్మిషన్ ఇచ్చాం కదా. మూడు వారాలుగా నువ్వు తాగట్లేదు. ఫ్రెండ్స్తో జోకులు వేయడం లేదు. ఎప్పుడూ లేనిది గుడికెళ్లి కూచుంటున్నావు. ఏమైంది నాన్నా?’ ఏం చెబుతాడు. ఏమీ చెప్పడు. ‘ఏం లేదమ్మా. ఫైనాన్షియల్గా ఎదుగుదల ఆగిపోయినట్టు అనిపిస్తుంది. ఫార్టీ ఫైవ్కు చేరుకున్నా కదా. కొత్త ఉద్యోగాలకు ఎవరూ పిలువరు. ఉన్న ఉద్యోగంలో ఎదుగుదల ఉండదు’ అన్నాడు. భార్య వచ్చి కూచుంది. ‘ఇప్పుడు ఏం కొంప మునిగిపోయిందనండీ. మనమ్మాయి జెమ్. ఒకటికి నాలుగు స్కాలర్షిప్లు వస్తున్నాయి. రేపోమాపో అమెరికా వెళ్లిపోతుంది. అందుకు కావలసిన ఏర్పాట్లు అమౌంట్ మనం ముందే చూసుకున్నాం. తను అమెరికా వెళ్లిపోతే మన ఖర్చెంతని. మీరు ఉద్యోగం మానేసినా ప్రధాని రోజ్గార్ యోజన కింద పప్పులు ఉప్పులు అయినా వస్తాయిగా’ అంది జోక్ చేస్తూ. తను కూడా నవ్వాడు. చాలా రోజుల తర్వాత ముగ్గురు కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. పట్టాల మీద నడుస్తూ ఉన్నాడు. కారు ఖైరతాబాద్ స్టేషన్ దగ్గర పెట్టేశాడు. తాళాలు జేబులో ఉన్నాయి. ఫోన్ కూడా జేబులోనే ఉంది. పర్స్, అందులో విజిటింగ్ కార్డులు కూడా ఉన్నాయి. గుర్తు పట్టడానికి ఆ మాత్రం ఆనవాలు చాలు. పట్టాలమీద అనుమానం రాకుండా ఉండేందుకు ఏదో క్యాజువల్గా నడుస్తున్నట్టు నడుస్తున్నాడు. కాని బ్రాండెడ్ ప్యాంట్ మీద బ్రాండెడ్ షర్ట్ ఇన్ చేసి పాయింట్ షూస్ వేసి ఎగ్జిక్యూటివ్లాగా వున్న వ్యక్తి అలా పట్టాల మీద నడవడం స్ట్రేంజ్గానే ఉంది. ఎంత స్ట్రేంజ్గా ఉన్నా ఇంకో ఐదు పది నిమిషాల సేపే. ఈలోపు ఏదో ఒక ట్రైన్ వస్తుంది. కథ కంచికి చేరుతుంది. దూరంగా అలజడి మొదలైంది. ఏదో ట్రైన్ చాలా వేగంగా వస్తున్నట్టు అర్థమైపోయింది. చాలా ధైర్యంగా గుండెలు కూడగట్టుకుంటూ నిలబడ్డాడు. ట్రైన్ సమీపిస్తూ ఉంది. ఇంతలో ఫోన్. రింగవుతూనే ఉన్న ఫోన్. బహుశా తాను మాట్లాడబోయే లాస్ట్ కాల్. తీసి చూశాడు. కూతురు. మాట్లాడాలా వద్దా... మాట్లాడాలా వద్దా? అప్రయత్నంగా ప్రెస్ చేశాడు. ‘నాన్నా... ఎక్కడున్నావ్?’ ఆ ప్రశ్న కూతురి గొంతు అప్రయత్నంగా అతడి కళ్లల్లో నీళ్లు చిప్పిల్లేలా చేశాయి. అప్రయత్నంగా పట్టాల మీద నుంచి తప్పుకున్నాడు. పెద్ద హోరు చేస్తూ రైలు వెళ్లిపోయింది. కాని ఎప్పుడూ లేనిది తండ్రి ఫోనులో రైలు చప్పుడు విని ఆ అమ్మాయి ఎంతో అప్రమత్తం అయ్యింది. ‘సాధారణంగా మీలాంటి పేషెంట్లను పెద్దవాళ్లు తీసుకొస్తూ ఉంటారు. మిమ్మల్ని మీ అమ్మాయి తీసుకురావడం బాగుంది. గుడ్. పిల్లలు ఇలా ఉండాలి’ అంది లేడీ సైకియాట్రిస్ట్ అతనివైపూ అతని కూతురి వైపూ చూస్తూ. ‘నువ్వెళ్లి బయట కూచోమ్మా’ అని అతని వైపు చూసి అడిగింది– ‘చెప్పండి.. ఎందుకంత డిప్రెషన్లోకి వెళ్లిపోయారు... బంగారంలాంటి జీవితం పెట్టుకొని’ అతడు తల వొంచుకొని జవాబు చెప్పడానికి మాటలు వెతుక్కుంటూ ఉన్నాడు. ఇద్దరూ నచ్చాక పెద్దలు పెళ్లి చేయడం ఆనవాయితీ. అయితే నచ్చాక కూడా నచ్చని విషయాలు ఉండొచ్చు. చాలా ఏళ్లు నచ్చాక ఆ తర్వాత నచ్చని పరిస్థితులు రావచ్చు. ఇప్పుడు అతని పరిస్థితి అదే. భార్యతో పెద్ద అగాథం వచ్చేసింది. అగాథం అంటే కొట్టుకోవడం తిట్టుకోవడం కాదు. రోజూ ఒకే ఇంట్లో ఉంటున్నా కలిసి జీవిస్తూ ఉన్నా మాట్లాడుకుంటున్నా ఏదో దూరం ఉంది అని అనిపిస్తూ ఉంటుందే అలాంటిది అది. భార్య ఏ తప్పూ చేయడం లేదు. కూతురు వయసులోకి వచ్చాక ఆ అమ్మాయి అన్ని అవసరాల కోసం ఉద్యోగం మానేసి మరీ ఇంట్లో కూచుంది. కొన్నేళ్ల క్రితం వరకూ భర్త సర్వస్వంగా ఉండేవాడు. ఇప్పుడు కూతురు సర్వస్వంగా ఉంది. ‘నేను ఈ లోకాన్ని నమ్మను. నా కూతురి మనసు అటూ ఇటూ వెళ్లనివ్వను. ఆ తర్వాత తీరిగ్గా బాధ పడను. దానికి ఫ్రెండ్గా ఉండి దాని జీవితం గట్టెక్కిస్తాను’ అని అతనితో ఒకరోజు వాదనలో అంది. ‘మీరు ఉద్యోగానికి వెళతారు. రేపు అది ప్రేమ గీమ అని ఎవరినో ఒకరిని తీసుకొస్తే లేనిపోని తలనొప్పి. అదొక్కటే కాదు సెక్యూరిటీ కూడా పెద్ద విషయం. అలాగని అవసరానికి ముందే పెళ్లి చేసి ఇంటి నుంచి సాగనంపాలని లేదు. దాని సంగతి నేను చూసుకుంటానుగా’ అంది. నిజమే కాని ఏదో వెలితి మొదలైనట్టు అనిపించసాగింది అతనికి. అప్పుడే తను హెడ్గా పని చేస్తున్న హెచ్ఆర్లో ఒక అమ్మాయి చేరింది. మొదట సార్.. సార్ అనేది. తర్వాత చనువుగా ‘ఏమిటిది సుభాష్జీ’ అనేది. ఆ తర్వాత ‘గుడ్మాణింగ్ సుభాష్’ అని మెసేజ్ పెట్టేది. ఆమె వయసుకు తనను దించడం మొదట అతనికి థ్రిల్లింగ్ అనిపించింది. ఆ తర్వాత ఏదో ఆకర్షణగా అనిపించింది. ఆ తర్వాత మాయ కమ్మేసింది. రోజూ ఆఫీసయ్యాక ఇంటి వరకూ దింపడం ఉదయాన్నే ఇంటి మీదుగా వస్తూ ఆఫీసుకు తేవడం... జోకులేస్తూ అప్పుడప్పుడు ఆ అమ్మాయి చేయి తట్టేది. నవ్వుతూ భుజాన్ని భుజంతో తాకించేది. మాయ ఎంతగా కమ్మేసిందంటే ఇంత వరకూ గడుపుతున్న జీవితం రస హీనమైనదని, ఇప్పుడే తన జీవితంలోకి సంతోషం వచ్చిందని అతనికి అనిపించింది. వీలైతే డివోర్స్ చేసుకొని ఈ అమ్మాయితో పెళ్లి చేసుకుందామా అని అనిపించేంత. నాలుగు నెలలు ఇలాగే గడిచాక ఆ అమ్మాయి ఢిల్లీ ఆఫీసుకు లెటర్ పెట్టుకొని షిఫ్ట్ అయిపోయింది. ‘ఈ ఉద్యోగం నాకు చాలా ముఖ్యం సార్. నా గోల్ ఢిల్లీ. అక్కడ నా బోయ్ఫ్రెండ్ ఉన్నాడు. తప్పులు చేసి పోగొట్టుకుంటే దెబ్బ తింటానని మీతో ఫ్రెండ్లీగా ఉన్నాను. మీరు కూడా చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్యూ’ అని ఒక కాడ్బరీ చాక్లెట్ ఇచ్చి వెళ్లిపోయింది.ఆ తర్వాత నుంచి ఇతనికి ఈ డిప్రెషన్. లేడీ సైకియాట్రిస్ట్ బెల్ నొక్కి కూతురుని పిలిచింది. అతను కంగారుగా ఆమెవైపు కూతురివైపు చూస్తున్నాడు ఏం చెబుతుందోనని. సైకియాట్రిస్ట్ కళ్లతోనే అభయం ఇస్తూ... ‘మీ నాన్న ప్రేమలో పడాలనుకుంటున్నాడమ్మా’ అంది. కూతురు కంగారు పడింది. ‘ఎవరితో డాక్టర్?’ ‘మీ అమ్మతోనే. మీ అమ్మను చాలా మిస్ అవుతున్నాడు. నువ్వూ మీ అమ్మా కలిసి మీ నాన్నను మిస్ కొడుతున్నారు. ఇక మీదట ఆయన రాసే లవ్ లెటర్కు నువ్వే పోస్ట్మేన్ అవ్వాలి. రోజూ లెటర్ రాసేలా చూడు. దానికి మీ అమ్మను రిప్లై ఇచ్చేలా చూడు. ఇదే నేను చెప్పే ట్రీట్మెంట్. ’ కూతురు ఫైనలియర్ బీటెక్ చదువుతోంది. చిన్నపిల్ల కాదు. తల్లిదండ్రులు మళ్లీ ప్రేయసీ ప్రియులుగా మారే విధంగా తల్లికి ఏం కౌన్సెలింగ్ చేయాలో మననం చేసుకుంటూ తండ్రి చేయి పట్టుకుని బయటకు నడిచింది. కారును ఒకచోట ఆపి ‘అమ్మకు ఏదైనా గిఫ్ట్ తీసుకో నాన్నా.. ఇద్దువుగానీ’ అంది నవ్వుతూ.ట్రీట్మెంట్ మొదలైనట్టే. – కథనం: సాక్షి ఫ్యామిలీ అగాథం అంటే కొట్టుకోవడం తిట్టుకోవడం కాదు. రోజూ ఒకే ఇంట్లో ఉంటున్నా కలిసి జీవిస్తూ ఉన్నా మాట్లాడుకుంటున్నా ఏదో దూరం ఉంది అని అనిపిస్తూ ఉంటుందే అలాంటిది అది. -
సహచరి
పూర్వం ఇశ్రాయేలు దేశంలో కరువు వచ్చింది. దాంతో అక్కడ నివసించే ఎలీమెలెకు అనే అతడు తన భార్య నయోమి, ఇద్దరు కుమారులతో కలిసి పొరుగు దేశమైన మోయాబు దేశానికి వలస వెళ్లాడు. వారు ఆ దేశంలో ఉన్న కొంత కాలానికి నయోమి భర్త చనిపోయాడు. తర్వాత తన ఇద్దరు కుమారులైన మహ్లోను, కిల్యోనుకు మోయాబు దేశపు యువతులైన ఓర్పా, రూతులతో వివాహం చేసిందామె. కొంతకాలానికి నయోమి ఇద్దరు కుమారులు మరణించారు. ఇలా అనేక బాధలు అనుభవిస్తున్న నయోమికి తన దేశమైన యూదా బెత్లెహేములో దేవుడు కరువు లేకుండా ఆహారాన్ని ప్రసాదించాడని తెలుసుకొని, ఇరువురి కోడళ్లను పిలిచి – మీరు మీ పుట్టింటికి వెళ్లి మరలా వివాహం చేసుకుని బిడ్డలతో సుఖసంతోషాలతో జీవించండని చెప్పింది. అందుకు తన పెద్ద కోడలు ఓర్పా దుఃఖంతో తన అత్తను ముద్దుపెట్టుకొని తిరిగి తన స్వజనుల వద్దకు వెళ్లిపోయింది. తన రెండవ కోడలు రూతు మాత్రం తన అత్తను హత్తుకొని ‘‘నా వెంబడి రావద్దని, నన్ను విడిచి పెట్టుమనీ నన్ను బతిమాలుకొనవద్దు. నీవు ళ్లే చోటికే నేనూ వస్తాను, నీవు నివసించు చోటే నేనూ ఉంటాను. నీ జనమే నా జనం. నీ దేవుడే నా దేవుడు... మరణం తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన యెడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయును గాక’’ (రూతు 1:16–17) అని తన దేశాన్ని, స్వజనులను విడిచి తన అత్తతో కలిసి వెళ్లింది.నయోమి వంటి మంచి మనస్తత్వం గల అత్తలు ఎందరుంటారు? సహచరులుగా వుంటూ మాట తప్పేవారు ఉన్న రోజుల్లో ‘సహచరి’ అంటే ఇలాంటి వారని నిరూపించిన రూతు వంటి ఉత్తమ స్త్రీలు ఎందరుంటారు? రూతు అంత మంచి మనస్తత్వం గలది కాబట్టే ఏసు తన పుట్టుకకు ఆమె వంశాన్నే ఎంచుకున్నారు.– బి.బి.చంద్రపాల్ కోట