relationship
-
ఆన్లైన్ నుంచి అక్షింతల దాకా
ప్రేమను.. పెళ్లితో స్థిరపరచేది అదే! అయితే దానికి బాటలు వేసేవి మాత్రం పరస్పర నమ్మకం, గౌరవాలే! అలాంటి లవ్ స్టోరే ఇది! దాదాపు ఏడేళ్లపాటు ఒకరినొకరు చూసుకోకుండా పెళ్లితో ప్రేమను గెలిపించుకున్న ఆ జంటలోని అమ్మాయి.. రైతా, ఫిన్లండ్. అబ్బాయి .. ప్రదీప్, హైదరాబాద్. ప్రేమకథా కాలం.. 1997.. స్కూలింగ్ పూర్తి చేసుకున్న రైతా ఫారిన్ లాంగ్వేజ్ కేటగిరీలో ఇంగ్లిష్ భాషను నేర్చుకుంటోంది. ఫ్లూయెన్సీ కోసం యాహూ చాట్లో చాటింగ్ స్టార్ట్ చేసింది. ఆన్లైన్లో ఒకరోజు ప్రదీప్ పరిచయం అయ్యాడు. సంభాషణలో ఆధ్యాత్మికం, తాత్వికం, మతపరమైన అంశాల నుంచి సామాజిక, రాజకీయ, పర్యావరణ విషయాలు, ప్రపంచ పౌరుల బాధ్యతలు వంటి వాటి మీద ప్రదీప్కున్న అవగాహనకు రైతా ముచ్చటపడింది. ప్రదీప్కూ రైతా పట్ల అదే భావన. నెమ్మదిగా స్నేహం పెరిగింది. వ్యక్తిగత వివరాలను పంచుకున్నారు. ప్రదీప్కి రైతా మీద ప్రేమ మొదలైంది. అప్పటికీ ఆ ఆన్లైన్ స్నేహం వయసు నాలుగేళ్లు. అప్పట్లో వెబ్కామ్స్ లేవు.. కాబట్టి ఒరినొకరు చూసుకోలేదు. కనీసం ఫొటోలు కూడా ఎక్సే ్చంజ్ చేసుకోలేదు. ఒక రోజు ప్రదీప్ మెయిల్ పెట్టాడు ‘రకస్తాన్ సినువా (నువ్వంటే ఇష్టం).. నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని. సంభ్రమాశ్చర్యాలు రైతాకు. ఎందుకంటే ఫిన్లండ్ లో అంత త్వరగా ఎవరూ పెళ్లి ప్రపోజల్ తీసుకురారు. అలాంటిది అబ్బాయి కనీసం తనను చూడనైనా చూడకుండా పెళ్లికి ప్రపోజ్ చేశాడు అని! ఓకే చెప్పింది. ఇద్దరిళ్లల్లో విషయం చెప్పేశారు. ప్రదీప్ జాతకంలో విదేశీ పిల్లే రాసి ఉందని, అదే జరగబోతోందని అతని తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పలేదు. కానీ రైతా వాళ్లింట్లోనే ఒప్పుకోలేదు. కారణం అక్కడ మీడియా లో ఇండియా గురించి ఉన్న వ్యతిరేక ప్రచారమే! వాళ్లను ఒప్పించే ప్రయత్నంలో.. ప్రదీప్ను చూస్తే ఒప్పుకుంటారు అన్న ఆశతో‘ఫిన్లండ్ రండి’ అంది రైతా. వెంటనే వీసాకు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే వీసా‘రిజెక్టయ్యింది. దాంతో‘నేనే హైదరాబాద్ వస్తాను’ అంటూ అభయమిచ్చింది రైతా! ‘ఎయ్ (.. వద్దు)’ అన్నారు ఆమె తల్లిదండ్రులు. ‘మిక్సీ (ఎందుకు)?’ అడిగింది అమ్మాయి. ‘ఇండియా సేఫ్ కాదు’ స్పష్టం చేశారు. వాదించింది రైతా. అయినా ఒప్పుకోలేదు తల్లిదండ్రులు. ఈసారి ప్రదీప్ యూకేలో చదువును బహానా (సాకు)గా మలచుకున్నాడు. వీసా ఓకే అయింది. యూకే నుంచి తేలిగ్గానే ఫిన్లండ్కి వీసా దొరికింది. రైతా ఆనందానికి అవధుల్లేవు. పరిచయం అయిన ఏడేళ్లకు ఒకరినొకరు చూసుకోబోతున్నారు. ఆ క్షణం రానేవచ్చింది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నాక ఇంకా నచ్చారు! రైతా తల్లిదండ్రులకూ నచ్చాడు ప్రదీప్! కానీ అమ్మాయి అక్కడికి వెళ్లి ఉండగలదా? అప్పటికీ ఇండియా మీద ఇంకా సానుకూలమైన అభి్రపాయానికి రాలేదు వాళ్లు. ‘ఉంటాను’ ధైర్యం చెప్పింది. ట్రయల్ గా హైదరాబాద్ను విజిట్ చేసింది కూడా! ఇక్కడి సోషల్ లైఫ్ను ఇష్టపడింది. ప్రదీప్ తల్లిదండ్రులకూ రైతా చాలా నచ్చింది. రైతా కుటుంబం కూడా హైదరాబాద్ వచ్చి, ప్రదీప్ కుటుంబాన్ని కలిసింది. అలా ఏడేళ్ల వాళ్ల ప్రేమ ఇరు కుటుంబ సభ్యుల ఆమోదం, ఆశీర్వాదంతో ఏడడుగుల బంధమైంది. వాళ్ల పెళ్లికిప్పుడు ఇరవై ఏళ్లు. నలుగురు పిల్లలు. ప్రదీప్ కోసం రైతా శాకాహారిగా మారింది. తెలుగు నేర్చుకుంది. ప్రదీప్ జీవితంలోనే కాదు బిజినెస్లోనూ భాగస్వామైంది. ప్రదీప్ ఫీనిష్ నేర్చుకున్నాడు. తన కోసం ఆమె చేసుకున్న, చేసుకుంటున్న సర్దుబాట్లను అతను గుర్తిస్తాడు. అమె అభి్రపాయాలను గౌరవిస్తాడు. రైతా తల్లిదండ్రులు తన కూతురు చాలా అదృష్టవంతురాలని పొంగిపోతారు. ‘‘మేమొక మాట అనుకున్నాం.. పెళ్లనే గొప్ప బంధంలోకి అడుగుపెడుతున్నాం. మనమధ్య వచ్చే ఏ తగవైనా మన రిలేషన్షిప్ని మరింత స్ట్రాంగ్ చేయాలి తప్ప వీక్ చేయకూడదు అని. దాన్నే ఆచరిస్తున్నాం!’ అని చెబుతోంది రైతా. – సరస్వతి రమ -
కొత్త తరం ప్రేమలు.. జెన్జెడ్ ప్రేమలు
జమానా మారినా ప్రేమకు అర్థం మారదు! కానీ ఇప్పుడు ప్రేమ కూడా ఆన్లైన్కి చేరి.. ఆ బంధం కూడా ట్రెండింగ్ అయ్యి.. సాఫ్ట్వేర్ అప్డేట్స్లాగా రోజుకో కొత్త రిలేషన్షిప్ లాంచ్ అవుతోంది! బ్రెడ్క్రంబింగ్.. అవతలి వ్యక్తి పట్ల ఇంట్రెస్ట్.. ఫీలింగ్స్ ఉన్నట్లు, ఆ రిలేషన్షిప్ కోసం ఎంతో సమయం వెచ్చిస్తున్నట్లు నటించడమే బ్రెడ్క్రంబింగ్. అటెన్షన్ కోసం, అవతలి వాళ్ల మీద నియంత్రణ కోసం ఈ డ్రామా ఆడతారు. రోచింగ్.. ఒకరికి తెలియకుండా మరొకరితో ఏకకాలంలో అనేకమందితో రిలేషన్లో ఉండటం. అయితే దీన్ని జెన్ జీ చీటింగ్గా భావించడం లేదు. సీక్రసీ అంటోందంతే!బెంచింగ్.. అవతలి వ్యక్తిని మరోవైపు కదలనివ్వకుండా.. అలాగని తమ నుంచి కమిట్మెంట్ ఇవ్వకుండా, సీరియస్నెస్ చూపించకుండా అప్పడప్పుడు ఫోన్లు, మెసేజ్లు చేస్తూ అవతలివాళ్లను కట్టిపడేయడమే బెంచింగ్.కాన్షస్ డేటింగ్.. చుట్టూ తిరిగే వాళ్లలో ఒకరిని ఎంచుకోకుండా.. నీ వ్యక్తిత్వాన్ని గౌరవించి, నిన్ను నిన్నుగా ఇష్టపడుతూ జీవితాంతం తోడుగా, నమ్మకంగా ఉండే వ్యక్తిని వెదుక్కోవడమే కాన్షస్ డేటింగ్!కఫింగ్.. చలికాలం, సెలవులు, వాలంటైన్ వీక్.. ఇలా ప్రత్యేక సమయం, సందర్భాల్లో డేటింగ్ చేయడాన్ని కఫింగ్ అంటున్నారు. ïడ్రై డేటింగ్ .. ఆల్కహాల్ ఫ్రీ డేట్ అన్నమాట. అంటే డేటింగ్కి వెళ్లినప్పుడు ఆల్కహాల్ తీసుకోరు. సింగిల్స్, రిలేషన్షిప్లో ఉన్నవాళ్లు.. అందరూ ఈ డ్రై డేట్స్కి ప్రాధాన్యమిస్తున్నారు. సింగిల్స్ అయితే తమకు కాబోయే పార్టనర్ మందు ప్రభావానికి లోనుకాకుండా సహజంగా ఎలా ప్రవర్తిస్తాడు/ ప్రవర్తిస్తుంది అని తెలుసుకోవడానికి, అదివరకే రిలేషన్షిప్ లో ఉన్నవాళ్లయితే తమ అనుభవాలు, మంచి చెడులను చర్చించుకోవడానికి ఈ డ్రై డేట్స్ని ప్రిఫర్ చేస్తున్నారు. కిటెన్ఫిషింగ్ .. వ్యక్తిగత విషయాలకు సంబంధించి అబద్ధాలాడుతూ అవతలి వాళ్లను నమ్మించడం లేదా వశపరచుకోవడం. ఉదాహరణకు వయసును తగ్గించి, జీతాన్ని పెంచి చెప్పడం, సన్నగా ఉన్నప్పటి ఫొటోలు అప్లోడ్ చేయడం, ఇంజినీరింగ్ డిప్లమా చేసి, డిగ్రీ చేశానని నమ్మించడం లాంటివన్నమాట.లవ్ బాంబింగ్.. వ్యక్తిత్వంతో కాకుండా మాటలు, కానుకలు, అటెన్షన్తో అవతలి వ్యక్తిని గుక్క తిప్పుకోనివ్వకుండా చేయడం సిట్యుయేషన్షిప్.. ఇది ఫ్రెండ్షిప్కి ఎక్కువ.. రిలేషన్షిప్కి తక్కువ! అటాచ్మెంట్ ఉంటుంది. కానీ కమిట్మెంట్ ఉండదు.నానోషిప్.. పెళ్లిళ్లు, ఫంక్షన్లు, క్లబ్లు, పబ్లలో చూపులు కలిసి.. నవ్వులు విరిసి.. ఫ్లర్టింగ్ మొదలై.. అక్కడే ముగిసి అదొక తీయటి జ్ఞాపకంలా మిగిలిపోయేది!ఇంకా..ఒక బంధంలో ఉంటూనే మరొకరితో రిలేషన్ మెయిన్టెయిన్ చేసే ‘ఓపెన్ కాస్టింగ్’, సరిహద్దులకతీతంగా చేసే డిజిటల్ డేటింగ్ ‘వండర్ లవ్’ లేదా ‘డేటింగ్ నోమాడ్’, వాట్సాప్ మెసేజెస్ తో మాత్రమే రిలేషన్షిప్లో ఉండే ‘టెక్స్టేషన్షిప్’లాంటి బంధాలు, ఫోన్కాల్స్.. మెసేజెలను మెల్లగా తగ్గిస్తూ బంధం నుంచి వైదొలిగే ‘ఫేడింగ్’, ఏ సమాచారం లేకుండా హఠాత్తుగా భాగస్వామితో కమ్యూనికేషన్ను కట్ చేసుకోవడం, వాళ్ల జీవితంలోంచి అదృశ్యమైపోయే ‘ఘోస్టింగ్’ లాంటి అప్రకటిత బ్రేకప్లు, జీవితంలోంచి వెళ్లిపోయినా.. సోషల్ మీడియాలో పార్టనర్ చేసే పోస్ట్లను వెదుకుతూ లైక్స్ కొట్టే ‘హంటింగ్’ లాంటి గూఢచర్యాలూ ఉన్నాయి. ఇవన్నీ ఈ తరం ఫాలో అవుతున్న ‘లవ్షిప్స్!’పారదర్శకంగా ఉండాలిప్రేమించే వాళ్ల స్థాయిని కాకుండా మనస్తత్వాన్ని క్షుణ్ణంగా తెలుసుకుని, అన్ని విషయాలలో పారదర్శకంగా ఉండాలి. కుటుంబాలకు, కనీసం స్నేహితులకు కూడా చెప్పుకోలేని ప్రేమ బంధాలు చాలావరకు అబద్ధాల మీదే నిర్మితమై ఉంటాయి. నిజాయితీపరులైన ప్రేమికులను కులం, మతం వంటి కట్టుబాట్ల నుంచి రక్షించడానికి వివిధ చట్టాలు ఉన్నాయి. అలాగే ప్రేమ పేరుతో మోసం చేసే వారికీ కఠినమైన శిక్షలు ఉన్నాయి. ఆకర్షణకు లోనవకుండా భాగస్వామిని క్షుణ్ణంగా అర్థం చేసుకొని కమిట్ అవడం మంచిది. – సుధేష్ణ మామిడి, హైకోర్టు న్యాయవాది -
'అన్ని చెడులకు అదే కారణం'.. రిలేషన్స్పై సమంత కామెంట్స్
టాలీవుడ్ హీరోయిన్ సమంత ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. గతేడాది సిటాడెల్ ఇండియన్ వర్షన్ హనీ బన్నీ సిరీస్తో ప్రేక్షకుల ముందుకొచ్చిన సామ్ ప్రస్తుతం ఏ ప్రాజెక్ట్లోనూ నటించండ లేదు. మరోవైపు పికిల్ బాల్ టోర్నమెంట్లో బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించింది. ఇది చూసిన నెటిజన్స్ సమంత అతనితో రిలేషన్లో ఉందంటూ కామెంట్స్ చేశారు. దీంతో నెట్టింట మరోసారి డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి.ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రిలేషన్స్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. గతంలో ఉన్న సంబంధాలపై మాట్లాడింది. ఈ సందర్బంగా జీవితంలో చాలా కష్టాలు పడ్డానని తెలిపింది సామ్. అందుకే ప్రస్తుతం రిలేషన్ గురించి ఆలోచించట్లేదని వెల్లడించింది. అంతే కాకుండా గతంలో రిలేషన్షిప్లో ఉన్న వారిపట్ల తనకేలాంటి అసూయ, కోపం ఉండవని తెలిపింది. ఎందుకంటే అసూయ అన్నీ చెడులకు కారణమని చెబుతోంది సమంత.కాగా.. గతంలో టాలీవుడ్ నాగచైతన్యను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. 2017లో వివాహం చేసుకున్న చైతూ- సామ్ 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి సమంత ఒంటరిగానే ఉంటున్నారు.నాగచైతన్య రెండో పెళ్లి..నాగచైతన్య గతేడాది రెండో పెళ్లి చేసుకున్నారు. హీరోయిన్ శోభిత ధూళిపాలను ఆయన పెళ్లాడారు. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో వీరి వివాహం గ్రాండ్గా జరిగింది. ఈ వేడుకలో సన్నిహితులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. -
పెళ్లై పాతికేళ్లు : ఆంటీ కోసం అంకుల్ డ్యాన్స్! వైరల్ వీడియో
భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు (Husband And Wife Relationship) కాలం గడిచే కొద్దీ మరింత బలపడతాయి. పిల్లలు, బాధ్యతలు, కష్టాలు కన్నీళ్లు ఎన్ని ఉన్నా వారి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. సంసార సాగరాన్ని ఈదుతున్న క్రమంలో వారి సఖ్యత మరింత దృఢపడుతుంది. పది కాలాల పాటు పదిలంగా ఉంటుంది. కాపురం చేసే కళ కాలు తొక్కేనాడే తెలుస్తుందనేది సామెత. అలా ఒకరి పట్ల ఒకరు విశ్వాసంతో, ఒకరి ఇష్టా ఇష్టాలను గౌరవించుకుంటూ పోతే ఎలాంటి విభేదాలకు, పొరపచ్చాలకు తావుండదు. ఇద్దరిమధ్య ఆరోగ్యకరమైన బంధం ఏర్పడుతుది. అది భవిష్యత్తరాలకు పునాది అవుతుంది. ఇదంతా ఎందుకంటే 25వ వార్షికోత్సవం (25th Wedding Anniversary) సందర్భంగా భార్య కోసం ఒక భర్త చేసిన రొమాంటిక్ డ్యాన్స్ ఇంటర్నెట్లో హృదయాలను గెలుచుకుంటోంది. సతీపతుల బంధం కాలానికి లొంగేదికాదు, ఏ వయసులోనైనా అది మనోహరమైనదే,స్వచ్ఛమైనదే తేల్చి చెప్పిన ఈ వీడియో నెట్టింట విశేషంగా నిలుస్తోంది.మూడు ముళ్లు, ఏడు అడుగులతో మొదలైన ఆలుమగల అనుబంధం నూరేళ్లు చల్లగా ఉండాలని దీవిస్తారు పెద్దలు. అలా పాతికేళ్ల పాటు దంపతులుగా జీవించిన ఒక జంట తమ 25వ పెళ్లి రోజు వేడుకలను నిర్వహించుకుంటోంది. చుట్టూ కుటుంబ సభ్యులు, హితులు,సన్నిహితులు, అతిథులు అంతా ఉత్సాహంగా ఉన్నారు. దంపతులు అందంగా ముస్తాబయ్యారు. అందరి సమక్షంలో మరోసారి దండలు మార్చుకున్నారు. దీంతో ఆనందంగా శుభాకాంక్షలు అందిస్తున్నారు. ఇంతలో భర్త ఉత్సాహంగా డ్యాన్స్ వేయడం మొదలు పెట్టాడు. దీంతో పక్కనే భార్య సిగ్గుల మొగ్గైంది. అటు అతిథులు కూడా గొంతు కలిపారు. అక్కడే ఉన్న యువత చప్పట్లతో వారిని ఉత్సాహ పరిచారు. మరికొందరు ఈ ఆయన డ్యాన్స్ను తమ కెమెరాలలో బంధించారు. View this post on Instagram A post shared by Sakshi Bisht | Cabin Attendant (@sakshi__bisht1) బాలీవుడ్ మూవీ కభీ ఖుషీ కభీ గమ్ సినిమాలో షారుఖ్ ఖాన్ క్లాసిక్ సాంగ్ ‘ యే లడ్కా హై’ పాటు చక్కటి అభినయం చేస్తూ భార్యపై తన ప్రేమను బహిరంగంగా వ్యక్త పరిచడం నెటిజనులను బాగా ఆకట్టుకుంది. దీంతో ఈ రొమాంటిక్ డ్యాన్స్కు సోషల్ మీడియాలో వైరల్గామారింది. సాక్షి బిస్త్ అనే యూజర్ ఐడీలో గత ఏడాది అక్టోబరులో పోస్ట్ అయిన ఈ వీడియో దాదాపు 11.1 లక్షల వ్యూస్ సంపాదించింది. భార్యభర్తల ప్రేమ అనురాగం పటిష్టంగా ఉండాలంటే ఒకరిపై మరొకరికి నమ్మకం ఉండాలి. భాగస్వాముల మధ్య విశ్వసనీయత ముఖ్యం అంటూ పలువురు ఈ జంటకు అభినందనలు తెలిపారు. -
దుమ్ము దులిపేద్దాం.. జ్ఞాపకాలు సర్దేద్దాం!!
అంజలీ.. ఈరోజు ఎలాగూ కాలేజీ సెలవు కదా ఇల్లు సర్దేద్దాం నువ్వూ నాన్నా రెడీగా ఉండండి.. వంటింట్లోంచి కేకేసింది లావణ్య.. అమ్మా ఈరోజు వద్దమ్మా .. ఇంకోరోజు చేద్దాం.. తప్పించుకోబోయింది కూతురు.. లేదు.. లేదు.. పండగ వచ్చేస్తోంది.. ఎక్కడి వస్తువులు అక్కడే ఉన్నాయి.. అన్నీ రూములు.. సెల్ఫ్ లు.. పుస్తకాలు.. బట్టలు.. బుక్స్ ర్యాకులు అన్నీ తీసి పక్కన పెట్టండి.. అన్నీ దుమ్ము దులిపి అన్నీ మళ్ళా లోపల పెట్టాలి.. అర్థమైందా.. ఆర్డర్ వేసింది లావణ్య. సరే.. చేస్తే నాకేమిస్తావ్ అంది అంజలి.. నీకు బిర్యానీ చేసి.. సాయంత్రం బొబ్బట్లు చేస్తాను అని ఆఫర్ ఇచ్చింది.. మరి నాకూ అన్నాడు రాజేష్ కొంటెగా.. సిగ్గుండాలి మనిషికి అని మురిపెంతో కలిపిన చిరాకుతో వంటింట్లోకి వెళ్ళింది లావణ్య.బుక్స్ సర్దుతూ నాన్నా ఇదేంటి ఇలా మాసిపోయింది అంటూ ఓ కోతిబొమ్మను చూపించింది.. ఓ.. అదా.. ఇన్నేళ్లకు మళ్ళీ దొరికిందా అంటూ దాన్ని ముద్దుగా చేతిలోకి తీసుకున్న లావణ్య.. ఓహ్.. అదా.. నువ్వు నాలుగేళ్లు ఉన్నపుడు డాల్ఫిన్ హోటల్లో ఓ పుట్టినరోజుకు వెళ్ళాం గుర్తుందా అప్పుడు అక్కడ డెకరేషన్ కోసం పెట్టిన బొమ్మ కావాలని ఏడ్చావు.. ఎంత ఊరుకోబెట్టినా ఏడుపు ఆపలేదు.. చిరాకొచ్చి నాన్న నీకు టెంకిమీద రెండు పీకాడు గుర్తుందా.. అంది లావణ్య.. ఓహ్.. నాన్న నన్ను కొట్టారా.. అంటూ ఇప్పుడు ఏడుపు మొహం పెట్టింది అంజలి.. ఆ.. అలా కొట్టి మళ్ళీ నిన్ను ఎత్తుకుని జగదాంబ జంక్షన్లో చినుకులు పడుతున్నా వెతికి మరీ ఈ బొమ్మ కొన్నాం.. అదన్నమాట దీని కథ.. అని లావణ్య చెప్పగా.. ఓహ్.. అంటూ నాన్న తనను కొట్టారన్న కోపం స్థానే.. నాన్నను నేనంటే ఎంత ముద్దో అని ప్రేమగా నాన్నవైపు చూసింది అంజలి. నాన్నా చిన్న చిన్న గ్రీటింగ్స్ .. ఆకులు.. ఎండిపోయిన పూలు.. రంగుకాగితాలు దొరికాయ్.. అంది అంజలి.. అవునమ్మా చిన్నప్పుడు నువ్వు నా బర్త్ డేకు. న్యూ ఇయర్ కు కూడా నువ్వే సొంతగా గ్రీటింగ్ చేసి ఇచ్చేదానివి.. అవన్నీ ఇలా దాచిపెట్టాను.. ఇప్పుడు పెద్దయ్యాక ఇవ్వడం మానేసావులే.. అన్నాడు రాజేష్ నిష్టూరంగా. చిన్ననాటి తన క్రియేటివిటీకి మురిసిపోయిన అంజలి.. అయ్యో అదేంలేదునాన్న నువ్వు ఎప్పటికీ నాకు హీరోవి.. నీకు నేనే పెద్ద గ్రీటింగ్ కార్డు.. అంటూ కవర్ చేసేసింది.నాన్నా ఇవేంటి ఐస్ క్రీమ్ కప్పులు.. జడక్లిప్పులు.. అన్నీ ఒక్కో రంగులో ఒక్కో గాజు.. ఇవన్నీ ఒక్కో కవర్లో ఉన్నాయి.. బయటపడేయాలా అంది అంజలి.. వంటగదిలోంచి పరుగున వచ్చిన లావణ్య.. వెంటనే ఆ కవర్ అందుకుని తీసుకుంది.. ఎందుకమ్మా ఆ చెత్తంతా బయటేసేద్దాం అంది అంజలి.. అది చెత్త కాదమ్మా.. ప్రేమ జ్ఞాపకాలు చెప్పబోయాడు రాజేష్.. చాలు.. మీ దిక్కుమాలిన లవ్వు.. దానికో జ్ఞాపకం.. పిల్ల ఉందన్న జ్ఞానం కూడా లేదు.. కసురుకుంటూ.. జ్ఞాపకాలను తలచుకుంటూ కవర్ తీసుకుని ప్రేమగా వేరేచోట పెట్టింది.ర్యాక్ లోని కవర్ నుంచి ఓ పాత చీర తీసి సెల్ఫ్ మొత్తం తుడిచేయబోతుంటే రాజేష్ .. అంజూ ఆ చీర జాగ్రత్తగా ఉంచమ్మా అన్నాడు.. ఏంది దీనికి కూడా ఫ్లాష్ బ్యాక్ ఉందా అంది అంజలి.. ఉంది నాన్న.. నేను అమ్మను తొలిసారి చూసింది ఈ చీరలోనే.. ఆ తరువాతనే నేను అమ్మను ప్రపోజ్ చేయడం.. పెళ్లి చూపులు చూడడం ... నువ్వు మాకు దక్కడ అంటూ పరవశంతో చెబుతున్నాడు.. ఐతే నాన్న నేను ఈ చీర ఉంచుకుంటా.. అమ్మనువ్వు ఇద్దరూ నాతో ఉన్నట్లే ఉంటుంది కదా అంది అంజలి.. పాప ప్రేమను చూసి భార్యాభర్తలు ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు.. సరే సర్దింది చాలు.. బిర్యానీ అయిపొయింది.. రండి అంది లావణ్య. చూసారా ఇల్లు సర్దితే అటు సమన్లు పేర్చుకోవచ్చు.. ఇటు పాత జ్ఞాపకాలనూ పొడుపుకోవచ్చు అంది లావణ్య.. అవునవును అంటూ తండ్రీకూతుళ్ళు ఇద్దరూ తల్లిని అల్లుకుపోయారు.-సిమ్మాదిరప్పన్న. -
సందేహాలను నివృత్తి చేసే.. దుల్హా–దుల్హన్
గతంలో పెళ్లి జరగాలంటే వధూవరులను పెద్ద నాన్నలు, బాబాయ్లు, మామలు, పెద్దమ్మలు, మేనత్తలు అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూసి అబ్బాయి లేదా అమ్మాయి నచి్చతే వారి గుణగణాలు తెలుసుకొని కుటుంబ పరిస్థితి తెలుసుకొని పెళ్లి జరిపించేవారు. వివాహం జరిగిన తర్వాత భర్తతో ఎలా మసలుకోవాలి?, అత్తగారింట్లో ఎలా ఉండాలి? ఇలాంటివన్నీ అమ్మమ్మలు, తాతలు, నానమ్మలు కొత్తగా పెళ్లయిన వారికి చెప్పేవారు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు కరువై యాంత్రిక జీవనం కొత్తగా పెళ్లయిన వారినే కాకుండా పెళ్లికి ముందు కూడా వధూవరులను, పెళ్లి తర్వాత భార్యా, భర్తలను మనస్పర్థలకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టోలిచౌకిలో నివసించే ఇలియాస్ షంషి అనే వ్యక్తి ‘దుల్హా–దుల్హన్’ కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చాడు. దీని గురించిన మరిన్ని విశేషాలు..! టోలిచౌకి బాల్రెడ్డినగర్ కాలనీలో ఏర్పాటు చేసిన దుల్హా–దుల్హన్ ఫ్యామిలీ ఇన్స్టిట్యూట్కు మంచి స్పందన లభిస్తోంది. ఈ ఇన్స్టిట్యూట్లో కొత్తగా పెళ్లి చేసుకోబోయేవారు ఎలా ఉండాలి అనే దానిపై 15 అంశాల్లో నిర్వాహకుడు ఇలియాస్ షంషి శిక్షణ ఇస్తున్నారు. హైదరాబాద్లోనే కాకుండా బెంగళూరు, చెన్నై, గుజరాత్, ఢిల్లీ, కోల్కతాతో పాటు దుబాయ్, కెనడా, అమెరికాలో కూడా షంషి ప్రారంభించిన ఆన్లైన్ క్లాస్లకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. పెళ్లంటే ఏంటి?, పెళ్లిలో మంత్రాల అర్థం ఏంటి? వాటిని ఎలా అర్థం చేసుకోవాలి?, పెళ్లి ఎందుకు?, బాధ్యతలు, భర్తతో మనస్పర్థలు వస్తే వాటిని ఎలా పరిష్కరించుకోవాలి?, భార్య అంటే ఎలా ఉండాలి?, భర్త చేయాల్సినవి, చేయకూడనివి ఏంటి?, మీరు మంచి భర్తగా ఎలా ఉండొచ్చు తదితర అంశాలపై షంషి శిక్షణ ఇస్తున్నారు. సందేహాలను నివృత్తి చేస్తూ.. హోమ్ మేనేజ్మెంట్, భర్త మనసును ఎలా గెలుచుకోవాలి, భార్య మనసును ఎలా గెలుచుకోవాలి ఇలాంటివన్నీ ఈ ట్రైనింగ్లో భాగమయ్యాయి. పెళ్ళికి ముందు వధూవరులు వస్తే వారు అడిగే ప్రశ్నలకు సందేహాలను నివృత్తి చేస్తూనే పెళ్లి తర్వాత మంచి భర్తగా, లేదా మంచి భార్యగా ఎలా ఉండాలి అన్న అంశాలపై ఈ శిక్షణ కొనసాగుతున్నది.మంచి స్పందన మేం ఈ సంస్థను ఏర్పాటు చేసినప్పుడు స్పందన అంతంత మాత్రంగానే ఉండేది. రోజులు గడుస్తున్న కొద్దీ మా సంస్థకు రెస్పాన్స్ పెరుగుతోంది. అమెరికా, దుబాయ్, కెనడా తదితర ప్రాంతాల నుంచి కూడా మేం నిర్వహించే ఆన్లైన్ క్లాస్లకు అభ్యర్థులు హాజరవుతున్నారు. పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత భార్యా, భర్తల బంధం ఎంత బలంగా ఉండాలో ఈ శిక్షణ ద్వారా సూచిస్తున్నాం. ఇప్పటి వరకూ వేలాది మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. మూడు నెలల పాటు ఈ ఆన్లైన్ శిక్షణ ఉంటుంది. అంతే కాదు బెస్ట్ మదర్ అనిపించుకోవడం ఎలా అన్నదానిపై కూడా మా శిక్షణ కొనసాగుతున్నది. ఇటీవల పెళ్లికి ముందే చిన్న చిన్న విషయాల్లో వధూవరులకు మనస్పర్థలు వచ్చి పెళ్లిళ్లు ఆగిపోతున్న ఘటనలూ చూస్తున్నాం. దుల్హన్ కోర్సులో ఈ విషయాలన్నింటికీ సమాధానాలు లభిస్తున్నాయి. యువతీ, యువకులకు వేర్వేరుగా ఈ క్లాసులు ఉంటాయి. ముఖ్యంగా భార్య, భర్తల బంధం బలంగా ఉండాలంటే ఎలా ఉండాలో చూపిస్తున్నాం. – ఇలియాస్, షంషీ, ట్రైనర్ ఫ్యామిలీ ఇన్స్టిట్యూట్ 2019లో ఏర్పాటు.. ప్రతిరోజూ పాతిక మంది వరకూ ఆన్లైన్ క్లాసులకు హాజరయ్యే ఈ ఫ్యామిలీ ఇన్స్టిట్యూట్ 2019లో ఏర్పాటైంది. ఇప్పటి వరకూ వేల సంఖ్యలో యువతీ, యువకులకు శిక్షణతో పాటు తగిన సూచనలు జారీ చేశారు షంషి. భార్యా, భర్తల మధ్య ఏదైనా గొడవ వస్తే వాటిని పరిష్కరించే దిశలోనే ఆయన అడుగులు వేస్తున్నారు. ఎవరికైనా ఇలాంటి సలహాలు, సంప్రదింపులు కావాలంటే తమ ఇన్స్టిట్యూట్లో జాయిన్ కావొచ్చు అని కూడా పేర్కొంటునారు. పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత మేం చెప్పబోయే అంశాలు ఏమిటి అన్న దానిపై వివరిస్తూ స్పష్టంగా వెబ్సైట్లో పొందుపరిచారు. -
విడిపోవడం ఆత్మహత్యకు ప్రేరేపించడం కాదు
న్యూఢిల్లీ: ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న బంధం విచ్ఛిన్నమై వారిలో ఒకరు ఆత్మహత్యకు పాల్పడితే.. ఆ బంధం విడిపోవడమే ఆ ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు పరిగణించలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఇద్దరి మధ్య సంబంధం తెగిపోవడం అనేది నేరం కాదని, అందుకు శిక్ష విధించలేమని స్పష్టంచేసింది. సెక్షన్ ప్రకారం 306 ప్రకారం ఉద్దేశపూర్వకంగా ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు నిర్ధారణ అయితేనే శిక్ష విధించగలమని వెల్లడించింది. ఒక వ్యక్తికి ఐదేళ్ల జైలుశిక్ష విధిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. కర్ణాటకకు చెందిన కమ్రుద్దీన్ దస్తగిర్ సనాదీ, మరో మహిళ ఎనిమిదేళ్లపాటు సహజీవనం చేశారు. 2007 ఆగస్టులో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కమ్రుద్దీన్ అరెస్టయ్యాడు. అతడిౖపై ఐపీసీ సెక్షన్ 417(మోసం), సెక్షన్ 306(ఆత్మహత్యకు పురికొల్పడం), సెక్షన్ 376(అత్యాచారం) కింద కేసు నమోదు చేశారు. కమ్రుద్దీన్ నిర్దోషి అని గుర్తిస్తూ కింది కోర్టు తీర్పు ఇచ్చింది. సవాల్ చేస్తూ పోలీసులు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కమ్రుద్దీన్ను దోషిగా తేల్చింది. ఐదేళ్లపాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. రూ.25 వేల జరిమానా సైతం విధించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ అతడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఇది బంధం విడిపోయిన కేసు తప్ప నేరం కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. -
లవ్ లో ఉన్న మాట నిజమే.. ఓపనైపోయిన రౌడీస్టార్.. విజయ్
-
అతని కోసం చాలా విషయాల్లో రాజీపడ్డాను : అనన్యా పాండే!
‘మనం ఇష్టపడే వారి కోసం ఎంత మారినా పర్వాలేదనిపిస్తుంది’ అంటున్నారు హీరోయిన్ అనన్యా పాండే. విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘లైగర్’ సినిమాతో తెలుగుకి పరిచయమయ్యారీ నార్త్ బ్యూటీ. 2022 ఆగస్టు 25న ఈ చిత్రం విడుదలైంది. ‘లైగర్’ తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదామె. అయితే హిందీలో మాత్రం వరుసగా సినిమాలు చేస్తున్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో రిలేషన్షిప్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘గతంలో నేను రిలేషన్షిప్లో ఉన్నాను. ఎదుటి వ్యక్తి కోసం నేనెంతగానో మారాను. చాలా విషయాల్లో రాజీపడ్డాను. రిలేషన్షిప్ ప్రారంభమైనప్పుడు ఎదుటి వ్యక్తి మెప్పు పొందడం, వారి దృష్టిని ఆకర్షించడం కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది. మనం ఎంత మారినా ఫర్వాలేదనిపిస్తుంది. అయితే మనం మారుతున్నామనే విషయం ఆరంభంలో మనకు అర్థం కాదు. ఇది సహజంగానే ఉన్నట్లు అనిపిస్తుంది. ప్రేమలో ఉన్నప్పుడు లోపాలు తెలియవు. ఏదీ మనకు సమస్యగా అనిపించదు. ఆ బంధం నుంచి మనం బయటకు వచ్చినప్పుడే అన్నీ అర్థం అవుతాయి. రిలేషన్షిప్లో నేను నిజాయతీగా ఉంటాను. ఎదుటి వ్యక్తి నుంచీ అంతే నిజాయతీ లభిస్తే బాగుంటుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య నమ్మకం ఉంటేనే ఏ బంధమైనా బలపడుతుంది. నాకు కాబోయే వ్యక్తి సింప్లిసిటీగా, నన్ను అర్థం చేసుకునేవాడై ఉండాలి’’ అని తెలిపారు అనన్యా పాండే. ఇదిలా ఉంటే నటుడు ఆదిత్యరాయ్ కపూర్తో అనన్య ప్రేమలో ఉన్నట్లు గతంలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఇటీవల వీరిద్దరూ విడిపోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రిలేషన్ షిప్ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్లో వైరల్గా మారాయి. కాగా ప్రస్తుతం ‘శంకరా’ అనే సినిమాలో నటి స్తున్నారు అనన్యా పాండే. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నారు. -
ఇంట్లో ఇల్లాలు.. పీజీలో ప్రియురాలు
మైసూరు: వివాహమై భార్యతో కాపురం చేస్తున్నా మరొక మహిళతో ప్రేమాయణం నడిపి గర్భవతిని చేయడమే కాకుండా రూ.9 లక్షలను తీసుకుని మోసగించిన ఘటన మైసూరులోని వీవీ మొహల్లాలో వెలుగుచూసింది. మోసపోయిన మహిళ జయలక్ష్మిపురం పోలీసు స్టేషన్లో బెంగళూరు నివాసి భరత్గౌడ, అతని తల్లిదండ్రులు సురే‹Ù, అంకితలపై ఫిర్యాదు చేసింది. వయసులో పెద్దయినా.. వివరాలు..బాధితురాలు భాగ్యలక్ష్మి (32) గోకులంలో ప్రైవేటు హాస్టల్ (పీజీ) నడుపుతున్నారు. 2022లో భరత్గౌడ (29)తో ఇన్స్టా లో పరిచయం ఏర్పడింది. తనకన్నా ఆమె పెద్దదైనప్పటికీ, ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని వెంటపడ్డాడు. అప్పటికే అతనికి పెళ్లయింది. కానీ విడాకులు ఇచ్చానని బాధితురాలికి నమ్మబలికాడు. మోసగానికి అతని తల్లిదండ్రులు కూడా వంతపాడుతూ బాధిత మహిళను వలలోకి లాగారు. నమ్మిన మహిళ పెళ్లికి ఒప్పుకుంది. స్నేహితులు, బంధువులు, తల్లిదండ్రుల సమక్షంలో 2023లో ఫంక్షన్ హాల్లో పెళ్లి జరిగింది. ఆ సమయంలో వ్యాపారం కోసమంటూ రూ.10 లక్షలు, 100 గ్రాముల బంగారు ఆభరణాలను భరత్గౌడ వరకట్నంగా తీసుకున్నాడు. ఆ తర్వాత రూ.8 లక్షలు ఇచ్చి కార్ వాషింగ్ సెంటర్ని పెట్టించింది. అంతేగాకుండా ఆమె క్రెడిట్ కార్డు నుంచి భరత్గౌడ రూ.1.25 లక్షలను డ్రా చేసుకున్నాడు. మొదటి భార్యకు తెలిసి ఇలా ఉండగా మొదటి భార్య మోనిక ఈ విషయాన్ని తెలుసుకుని భాగ్యలక్ష్మికి భరత్గౌడ మోసగాడు, జాగ్రత్తగా ఉండాలని మెసేజ్ చేసింది. దీనిపై భాగ్యలక్ష్మి నిలదీయగా, ఆమె మాటలు నమ్మవద్దని చెప్పాడు. మొదటి భార్యతో కాపురం చేస్తూనే నాటకమాడి తనను మోసగించినట్లు అర్థమైంది. దీంతో నిలదీయగా చంపుతానని ఆమెను బెదిరించాడు. ఈ నేపథ్యంలో అతని మోసాల గురించి భాగ్యలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
ఏఆర్ రెహమాన్, ధనుష్ సహా రీసెంట్గా విడాకులు తీసుకున్న స్టార్స్ (ఫొటోలు)
-
‘పెళ్లాం చెబితే వినాలి'.. ఇది పుష్పగాడి మాటే కాదు..
‘శ్రీవల్లి నా పెళ్లాం. పెళ్లాం మాట మొగుడు వింటే ఎట్టా ఉంటుందో పెపంచకానికి చూపిస్తా’ అని తాజాగా విడుదలైన ‘పుష్ప2’ ట్రైలర్లో హీరో అంటాడు. సానుకూల వివాహ అనుబంధంలో భార్య మాటకు విలువ ఇవ్వడం కుటుంబానికి మంచిది అంటారు నిపుణులు. ‘భార్య మాట వినే భర్త’ను లొంగుబాటుగా చెప్పే పితృస్వామ్య పరంపర ఉన్నా దాని వల్ల లాభం కంటే నష్టాలే ఎక్కువ అంటున్నారు.కుటుంబ జీవనంలో కీలక నిర్ణయాలే కాదు మంచీ చెడూల్లో భార్య సలహా వినదగ్గది. కొన్ని పరిశీలనలు. ఒక వివాహబంధం విజయవంతం కావాలంటే ముందు వినడం నేర్చుకోవాలి’ అంటున్నారు ప్రవర్తనా నిపుణులు. ‘భార్యాభర్తలు మొదట ఎదుటి వారు ఏం చెప్తున్నారనేది ఓపిగ్గా వింటే చాలు ఆ బంధం సగం సఫలమైనట్టే’ అని వారు అంటున్నారు. మన సమాజంలో భార్య మాట వినే భర్త గురించి పరిహాసం ఆడటం ఉంది. ‘భార్యా విధేయుడు’ అంటూ గేలి చేసేవారు కూడా ఉంటారు. సమాజం ఇంత ముందడుగు వేసినా ‘భార్య మాట వినడంలో తప్పు ఏముంది’ అని ఆలోచించే పరిస్థితి లేదు. అమెరికాలో కొత్తగా పెళ్లయిన దాదాపు 130 జంటలను పరిశీలించిన ఒక జాన్ గోట్మ్యాన్ అనే సైకాలజిస్ట్ ‘భార్య చెప్పేది సానుకూలంగా వినే భర్త ఉన్న జంటలు సంతోషంగా గడపడం’ గమనించాడు. ‘అలాగని ఈ జంటల్లో భర్త మాట భార్య వినకపోవడం అంటూ లేదు. వారు ఎలాగూ వింటారు’ అంటాడు గోట్ మ్యాన్. భారతీయ సమాజంలో భర్తకు ఎదురు నిలవడం అందరు భార్యలు చేయరు. అయితే జోక్గానో, గొణుగుతున్నట్టుగానో, అనునయంగానో చెప్పే భార్యలు ఉంటారు. ‘అలాంటి భార్యలు చెప్పింది విని ముందుకు సాగే భర్త ఉన్న జంటలు కూడా ఇంచుమించు గొడవలు లేకుండా ఉంటున్నాయి’ అంటాడు గోట్మ్యాన్. భార్యాభర్తల్లో ‘అతను చెప్పేది ఏముందిలే’ అని భార్య అనుకున్నా ‘ఆమెకేం తెలుసు ఆమె ముఖం’ అని భర్త అనుకున్నా ఆ వివాహబంధం ప్రమాదంలో పడుతుంది. ఏ వివాహ బంధమైనా ఒకరి దృష్టికోణం నుంచి నడవదు. కాపురంలో తల్లి తరపు వాళ్లు, తండ్రి తరుపు వారు ఉంటారు. స్నేహితులు ఉంటారు. ఇద్దరి వేరు వేరు కెరీర్లు ఉంటాయి. అంటే ఒక సమస్యకు కచ్చితంగా కనీసం రెండు దృష్టికోణాలుంటాయి. భర్తలు కేవలం తమ దృష్టికోణమే సరైనది అనుకోకూడదు. ‘స్త్రీలు జాగ్రత్తగా అన్నీ గమనించి భర్తకు సూచనలు చేస్తారు. ఆ సూచనలను భర్త ఆమెతో చర్చించాలి. నా మాటే నెగ్గాలి అని తప్పు నిర్ణయం తీసుకోవడం వల్ల నష్టం ఇద్దరికీ వస్తుంది’ అంటాడు గోట్మ్యాన్.భర్త తన స్పందన, అప్పులు, ఇచ్చిన హామీలు, కొన్న/కొనబోయే ఆస్తులు, పిల్లల కోసం పొదుపు, ఆరోగ్య విషయాలు... ఇవన్నీ భార్యకు తెలియచేస్తూ ఆమె సలహాను వినాల్సి ఉంటుంది. అలాగే భర్త ఇంట్లో లేనప్పుడు పిల్లల ప్రవర్తన, వారి కదలికలు, బంధువుల రాకపోకలు వచ్చే డిమాండ్లు ఇవన్నీ భార్య తప్పకుండా భర్తకు చేరవేయాలి. ముఖ్యంగా పిల్లలను కరెక్ట్ చేయాల్సిన అంశాలు భార్య లేవనెత్తినప్పుడు భర్త నిర్లక్ష్యం చేయరాదు.అవి సమస్యలు తెస్తాయి. అందుకే గతంలో స్త్రీల మాట చెల్లుబాటయ్యే సందేశం ఇస్తూ ‘పెళ్లాం చెబితే వినాలి’ లాంటి సినిమాలు వచ్చాయి. ఇన్నేళ్ల తర్వాత ‘ఫైర్’లాంటి పుష్ప కూడా ‘పెళ్లాం మాట వినాలి’ అంటున్నాడు. భార్య సరైన సలహా ఇస్తే దానిని ఎందుకు వినకూడదు చెప్పండి? (చదవండి: హృతిక్ రోషన్ సోదరి సునైనా వెయిట్ లాస్ స్టోరీ: ఏకంగా 50 కిలోలు..!) -
‘ఇంతకీ నువ్వు కట్టుకుంది నన్నా? మీ అక్కనా?’
బాలీవుడ్లో కరీనా కపూర్ ఖాన్కి గాసిప్ క్వీన్ అనే పేరుంది. అక్క కరిశ్మా కపూర్తో ఫోన్లో గంటలు గంటలు కబుర్లు చెబుతూ ఉంటుందట. అందులో సగం గాసిప్సే ఉంటాయని ఆ ఇద్దరి సన్నిహితుల కామెంట్! అదటుంచితే.. ఈ అక్కాచెల్లెళ్ల ఎడతెగని ఫోన్ సంభాషణలతో కరీనా కపూర్ ఖాన్ హజ్బెండ్, నటుడు.. సైఫ్ అలీ ఖాన్ తెగ ఉడుక్కుంటాడట. ‘ఇంతకీ నువ్వు కట్టుకుంది నన్నా? మీ అక్కనా?’ అంటూ ఆ ఉడుకుమోత్తనాన్ని చూపిస్తాడట కూడా! -
పేరెంట్స్ కన్నా, ఫ్రెండ్స్ మాటలే ముఖ్యం
‘మావాడు మేం చెప్పేది అస్సలు వినడండీ. ఎప్పుడూ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ అంటుంటాడు. వాళ్లందరూ ఒక గ్యాంగయ్యారు. బైక్తో రిస్కీ ఫీట్స్ చేస్తుంటారు. ఎప్పుడేం తెచ్చుకుంటారోనని గుండె అదురుతుంటుంది..’‘మా పాప మేమేం చెప్పినా పట్టించుకోదండీ. ఫ్రెండ్స్ చెప్తే మాత్రం వెంటనే చేసేస్తుంది. తనకు నచ్చేలా ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు.’‘మా అబ్బాయి ఒకరోజు చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తాడు, మరుసటి రోజే డల్గా కనిపిస్తాడు. ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటాడు.’కౌన్సెలింగ్కు వచ్చే చాలామంది పేరెంట్స్ తమ టీనేజ్ పిల్లల గురించి చెప్పే మాటలవి. చిన్నప్పటి నుంచీ అమ్మ కూచిలా లేదా నాన్న బిడ్డలా ఉన్న పిల్లలు, అప్పటివరకు తమ అభిప్రాయలను గౌరవించి, తాము చెప్పే సూచనలు పాటించే పిల్లలు ఒక్కసారిగా మారేసరికి పేరెంట్స్ తట్టుకోలేరు. వారెక్కడ చేజారిపోతారోనని బాధపడుతుంటారు, ఆందోళన చెందుతుంటారు. కానీ, ఆ వయసుకు అది సహజం. టీనేజ్కు వచ్చేసరికి వారి ప్రపంచం కుటుంబాన్ని దాటి విస్తృతమవుతుంది. ఈ దశలో స్నేహితులు, ఆన్లైన్ కమ్యూనిటీల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పేరెంట్స్ కంటే ఫ్రెండ్స్ మాటలకే ఎక్కువ విలువిస్తారు. స్నేహితుల ఆమోదం, గుర్తింపు పొందడానికి ప్రయత్నిస్తారు. ఈ మార్పును అర్థం చేసుకోవడం ద్వారా తల్లిదండ్రులు.. సున్నితమైన ఈ దశలో పిల్లలకు సరైన మద్దతు అందించగలుగుతారు. పీర్ ప్రెజర్.. స్నేహితుల ఆమోదం పొందాలనే ఒత్తిడి అందరిపైనా ఉంటుంది. కానీ టీనేజ్లో ఎక్కువగా ఉంటుంది. టీనేజర్లు ఒక గ్యాంగ్లో చేరేందుకు ప్రయత్నిస్తారు. ఆ వయసులో అది అత్యవసరమనిపిస్తుంది. ఆ స్నేహితుల ఒత్తిడికి లోనైనప్పుడు తప్పులు చేసే అవకాశాలు పెరుగుతాయి. కొందరు టీనేజర్లు మితిమీరి ప్రవర్తించవచ్చు. మద్యం సేవించడం, ప్రమాదకరమైన ఫీట్స్ చేయడం, విచిత్రమైన వేషధారణలోనూ కనిపించవచ్చు. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి, తల్లిదండ్రులు సంయమనంతో ఉండటం ముఖ్యం. పీర్ ప్రెజర్ గురించి పెద్దలతో స్వేచ్ఛగా మాట్లాడగలిగే వాతావరణాన్ని కల్పించాలి. పిల్లలతో చర్చించి, వారి నిర్ణయాలపై గల ప్రభావాన్ని అర్థంచేయించేందుకు ప్రయత్నించాలి. స్నేహితులకు ‘నో’ చెప్పగలిగే ధైర్యాన్ని నేర్పాలి. సోషల్ మీడియా ప్రభావం.. స్నేహితుల ఒత్తిడి కేవలం పాఠశాల సమయంతో ఆగిపోదు. ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ వంటి సోషల్ మీడియా ద్వారా 24/7 కొనసాగుతుంది. ఇవి తమ వ్యక్తీకరణకు ఎంత ఉపయోగపడతాయో, అంతే నెగటివ్ ప్రభావాన్నీ చూపించే సామర్థ్యం గలవి. సోషల్ మీడియాలో ఇతరులను చూస్తూ, పోల్చుకోవడం వల్ల కొందరు టీనేజర్లు ఆత్మన్యూనతకు లోనవుతుంటారు. పోస్టులకు లైకులు, కామెంట్ల ద్వారా వెంటనే గౌరవాన్ని పొందాలనుకునే తీరు కూడా వారిని కుంగిపోయేలా చేయవచ్చు. సోషల్ మీడియా ద్వారా వచ్చే ఈ ఒత్తిడిని తల్లిదండ్రులు గ్రహించి, వారితో మాట్లాడాలి. వారు చూస్తున్న కంటెంట్ గురించి చర్చించాలి. అది నిజ జీవితాన్ని ప్రతిబింబించదని వారికి అర్థమయ్యేలా వివరించాలి. నిర్ణయాలు, ఆత్మగౌరవంస్నేహితులు, సోషల్ మీడియా ఒత్తిడికి లోనైనప్పుడు టీనేజర్లు ఏ మాత్రం ఆలోచించకుండా ఎమోషన్తో నిర్ణయాలు తీసుకుంటారు. లో సెల్ఫ్ ఎస్టీమ్తో ఉంటే వారు మరింతగా స్నేహితుల ఒత్తిడికి లోనవుతారు. పిల్లల్లో ఆత్మగౌరవాన్ని పెంపొందించడం అత్యంత కీలకం. తల్లిదండ్రులు ఆ బాధ్యతను తీసుకోవాలి. పిల్లలు తమ ప్రతిభను గుర్తించేలా చేయాలి, వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచాలి. ప్రతిరోజూ వారి అభిరుచులు, కష్టాలను గుర్తిస్తూ విజయం దిశగా వారిని ప్రోత్సహించాలి. తల్లిదండ్రులు చేయాల్సింది..యవ్వనంలో, స్నేహితుల ఒత్తిడి సహజమే. కానీ, మీరు సున్నితంగా, ప్రేమతో పిల్లలకు మార్గనిర్దేశం చేస్తే, వారు సంయమనం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. అందుకు మీరు చేయాల్సింది.. పిల్లలకు మీరెప్పుడూ అందుబాటులో ఉంటారని చెప్పాలి. వారు తమ సమస్యలు మీతో పంచుకునేలా నమ్మకాన్ని కలిగించాలి.ఆత్మవిశ్వాసంతో ప్రవర్తించడం, స్నేహితుల ఒత్తిడిని ఎదుర్కొనే నైపుణ్యాలను నేర్పాలి.సోషల్ మీడియా కంటెంట్ గురించి ఓపికగా చర్చించాలి.వారి కృషి, కష్టాలు, ప్రత్యేకతలను గుర్తించి ప్రశంసించాలి.వారు తీసుకునే నిర్ణయాల ఫలితాలను అర్థంచేసుకోవడంలో వారికి సహాయం చేయాలి. -
భార్యాభర్తల సంబంధాలు ఎలా ఉండాలి?
అల్లాహ్ స్త్రీలపై పురుషులకు కొంత ఆధిక్యత ప్రసాదించడం వల్ల, పురుషులు తమ సంపదను స్త్రీల కోసం ఖర్చు పెడుతున్నందువల్ల పురుషులు స్త్రీలపై వ్యవహార కర్తలవుతారు. కనుక సుగుణవతులైన స్త్రీలు తమ భర్తకు విధేయత చూపుతూ వారి కనుసన్నలలో నడుచుకుంటారు. పురుషులు (ఇంటిపట్టున) లేనప్పుడు దేవుని రక్షణలో వారి హక్కులు కాపాడుతుంటారు. మీ మాటలకు ఎదురు చెప్పి తిరగబడతారని భయం ఉన్న స్త్రీలకు (నయానా భయానా) నచ్చజెప్పండి. (అలా దారికి రాకపోతే) వారిని మీ పడకల నుండి వేరు చేయండి. ఆ తరువాత వారు మీకు విధేయులయిపోతే ఇక వారిని అనవసరంగా వేధించడానికి సాకులు వెతకకండి. పైన అందరికంటే అధికుడు, అత్యున్నతుడైన అల్లాహ్ ఉన్నాడని గుర్తుంచుకోండి.భార్యాభర్తల మధ్య సంబంధాలు చెడిపోతాయని భయం ఉంటే భర్త బంధువుల నుండి ఒక మధ్యవర్తిని భార్య బంధువుల నుండి ఒక మధ్యవర్తిని పెట్టుకోండి. వారిద్దరు కలిసి పరిస్థితిని చక్కదిద్దదలచుకుంటే అల్లాహ్ దంపతుల మధ్య సానుకూలత కలిగిస్తాడు. అల్లాహ్ సర్వజ్ఞాని. సమస్తమూ ఎరిగినవాడు. (దివ్య ఖుర్ఆన్: 4:34–35)వివరణ: భార్య విననప్పుడు నచ్చజెప్పడం, పడకగదికి దూరంగా ఉండటం, విధేయత కనబరిస్తే ఆమెను మనసారా స్వీకరించడం ఎంత దానశీలి అయినా, ఎన్నిసార్లు దైవపూజలు చేసే వారయినా, భార్యని కొట్టే వారిని ప్రవక్త అభిమానించేవారు కాదు. 35 ఆయత్ (వాక్యం)లో అల్లాహ్ ఎంతోమంచి పరిష్కారం చూపాడు. భార్యాభర్తల మధ్య పొసగనపుడు అటువైపు నుండి ఒక మధ్యవర్తి ఇటువైపు నుండి ఒకరు మధ్యవర్తిత్వం వహించి వారిద్దరి మధ్య సమాధానం కుదిరిస్తే ఆ దంపతులు కూడా సమాధాన పడితే ఇద్దరి మధ్య అల్లాహ్ సానుకూలత కలిగిస్తాడు. మనిషికి దేవుడు మంచి చెడుల విచక్షణ జ్ఞానం, స్వేచ్ఛ, స్వాతంత్రాలు ఇచ్చాడు. కాబట్టి వాటిని ఆయన అడ్డుకోకుండా స్వయంగా మనిషి సంకల్పించుకుంటే అల్లాహ్ దానిని పరిపూర్ణం చేస్తాడు. ఏ విషయంలోనూ ఎవరికీ బలవంతం పెట్టాడు. మనిషి విచక్షణను బట్టి అల్లాహ్ ఆ మనిషితో వ్యవహరిస్తాడు. కాబట్టి మనుషులమైన మనం మంచిని ఆలోచిస్తూ మంచినే కాంక్షిస్తూ మంచి చేస్తుంటే దేవుడు కూడా సహకరిస్తాడు. అంతా మంచే జరుగుతుంది. అల్లాహ్ మనందరికీ మంచి చేసే భాగ్యాన్ని కలుగజేయుగాక ఆమీన్ (తథాస్తు)ఆధారం: అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్ భావామృతం– మొహమ్మద్ అబ్దుల్ రషీద్ -
ఆకాశంలో సగానికి అన్యాయమా!
దేశం మొత్తాన్ని కుదిపేసిన ‘నిర్భయ’ ఉదంతం తర్వాత నాటి కేంద్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ వైవాహిక బంధంలో జరిగే అత్యాచారం (మారిటల్ రేప్) గురించి ప్రస్తావించి దాన్ని నేరంగా గుర్తించాలని సిఫార్సు చేసినప్పుడు ‘మర్యాదస్తులు’ నొచ్చుకున్నారు. ఆ చర్య వివాహ బంధాన్ని విచ్ఛిన్నం చేయదా... వారి పిల్లల భవిష్యత్తును అగమ్యగోచరంగా మార్చదా అని చాలామంది ప్రశ్నించారు. ఈ అంశంపై అంతకు చాన్నాళ్ల ముందే వివిధ స్థాయిల్లో చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా ఆ విషయమై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ముందు దాఖలు చేసిన అఫిడవిట్ మళ్లీ దాన్ని ఎజెండాలో తెచ్చింది. దాంపత్య జీవితంలో ఉండే లైంగిక సంబంధం పరస్పర అన్యోన్యత ఆధారంగా ఏర్పడుతుందనీ, దాన్ని కేవలం ‘సమ్మతి’ అనే పదంలో కుదించటం అసాధ్యమనీ అఫిడవిట్ అంటున్నది. గతంలోని భారత శిక్షాస్మృతి (ఐపీసీ) అయినా, దాని స్థానంలో అమల్లోకొచ్చిన భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్) అయినా దాంపత్య జీవితంలో జరిగే అత్యాచారానికి మినహాయింపునిచ్చాయి. అత్యాచారానికి ఎలాంటి శిక్ష విధించాలో ఐపీసీ సెక్షన్ 375 నిర్దేశిస్తూ ఈ నేరానికి పాల్పడే భర్తకు మినహాయింపునిచ్చింది. బీఎన్ఎస్ఎస్లో ఈ సెక్షన్ 63గా మారింది. మినహాయింపు కూడా యధాతథంగా కొనసాగింది. భార్య వయస్సు 18 యేళ్లు దాటిన పక్షంలో భర్త జరిపే అత్యాచారానికి మినహాయింపు ఉంటుందని చట్టం చెబుతోంది. ఈ మినహాయింపును రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటిస్తే మొత్తం వివాహ వ్యవస్థపైనే అది తీవ్ర ప్రభావం చూపగలదని కేంద్ర ప్రభుత్వ అఫిడవిట్ హెచ్చరిస్తోంది. చట్టంలో ఉన్న మినహాయింపు అత్యాచారం చేయటానికి భర్తకిచ్చే లైసెన్సు కాదంటూనే ఆ అంశాన్ని చట్టంవైపుగా కాక సామాజిక కోణం నుంచి చూడాలని అభిప్రాయపడింది. సంబంధిత పక్షాలన్నిటితో, రాష్ట్రాలతో చర్చించాక చట్టసభ తీసుకోవాల్సిన నిర్ణయం గనుక న్యాయస్థానం జోక్యం చేసుకోరాదని తెలిపింది. భార్య సమ్మతికి రక్షణ కల్పించేందుకు ఇప్పుడున్న చట్టాల్లో ఏర్పాట్లున్నాయనీ, గృహ హింస చట్టంవంటివి రక్షణగా నిలుస్తాయనీ చెప్పింది. నేరం ఒకటే అయినప్పుడు దాన్ని వేర్వేరు చోట్ల వేర్వేరు రకాలుగా ఎలా పరిగణిస్తారు? హత్య జరిగితే అది చోటుచేసుకున్న ప్రాంతాన్ని బట్టి దాన్ని హత్యాయత్నంగా అనుకోగలమా? పరిచితుడో, అపరిచితుడో మహిళపై అత్యాచారం చేస్తే దానికి శిక్ష ఉన్నప్పుడు... భర్త అదే పనిచేసినప్పుడు మినహాయింపు ఇవ్వటం ఏ రకంగా న్యాయం? 2022లో ఢిల్లీ హైకోర్టులో మారిటల్ రేప్పై పిటిషన్ దాఖలైనప్పుడు ఇద్దరు సభ్యుల ధర్మాసనంలో ఒకరు మారిటల్ రేప్ను నేరంగా పరిగణించాలని అభిప్రాయపడితే, అది సరికాదని మరో న్యాయమూర్తి తీర్పునిచ్చారు. అనంతరం కర్ణాటక, గుజరాత్ హైకోర్టులు రెండూ మారిటల్ రేప్ను నేరంగా గుర్తించాల్సిందేనని తీర్పులు వెలువరించాయి. మన పౌరులైనా, విదేశీ పౌరులైనా చట్టం ముందు అందరూ సమానులనీ, అందరికీ సమానమైన రక్షణ లభిస్తుందనీ రాజ్యాంగంలోని 14వ అధికరణ చెబుతోంది. భర్త చేసే అత్యాచారం నేరంగా పరిగణించకూడదని మినహాయింపునివ్వటం వివాహ బంధంలోని మహిళకు ఈ అధికరణ వర్తించబోదని చెప్పటం కాదా? కానీ కేంద్రం అలా అనుకోవటం లేదు. ఇది పెళ్లయితే స్త్రీ తన హక్కును కోల్పోతుందని పరోక్షంగా చెప్పటం కాదా? మన దేశంలో వివాహ వ్యవస్థను ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారన్న అఫిడవిట్ అభిప్రాయంతో విభేదించనవసరం లేదు. అలాగే వివాహ వ్యవస్థకుండే బహుముఖ పార్శా్వల్లో భార్యాభర్తల లైంగిక సంబంధం ఒకటి మాత్రమేనని చేసిన వాదననూ తప్పుబట్టనవసరం లేదు. కానీ సామాజిక విశ్వాసాలకూ, రాజ్యాంగ విలువలకూ మధ్య వైరుద్ధ్యం ఏర్పడినప్పుడు ఒక గణతంత్ర రాజ్యం రాజ్యాంగ విలువలకు మాత్రమే ప్రాధా న్యమివ్వాలి. దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి. దాదాపు అన్ని సమాజాల్లోనూ భిన్న ఆధిపత్య ధోరణులు అల్లుకుపోయి వుంటాయి. పితృస్వామిక సమాజాల్లో స్త్రీలపై ఆధిపత్యం సాధించటానికి పురుషుడి చేతిలో అత్యాచారం ఒక ఆయుధం. దీన్ని చాలా ముందుగా గుర్తించబట్టే సోవియెట్ యూనియన్ 1926లో మారిటల్ రేప్ను నేరంగా పరిగణిస్తూ చట్టం తీసుకొచ్చింది. ఆ తర్వాత 1950లో జెకోస్లోవేకియా, 1969లో పోలెండ్ ఈ మాదిరి చట్టాలు చేశాయి. ఇవన్నీ అప్పటికి సోషలిస్టు రాజ్యాలు. ప్రస్తుతం దాదాపు 150 దేశాలు మారిటల్ రేప్ను నేరంగా పరిగణిస్తున్నాయి. భార్య లైంగిక స్వయంప్రతిపత్తిని భర్త అయినా సరే దెబ్బతీయరాదనీ, అది నేరపూరిత చర్య అవుతుందనీ ఈ చట్టాలు భావిస్తున్నాయి. సకల ప్రజాస్వామ్య దేశాలకూ భారత్ తల్లిలాంటిదని చెప్పుకుంటున్న మనం మాత్రం మారిటల్ రేప్ విషయంలో ఇంకా తడబాటు ప్రదర్శించటం సబబేనా?దాంపత్య జీవనంలో భర్తలు సాగించే హింసను మన దగ్గర మహిళలు మౌనంగా భరిస్తున్నారు. భరించ శక్యం కాని స్థితి ఏర్పడినప్పుడు మాత్రమే బయటికొస్తున్నారు. భర్త లైంగిక నేరానికి పాల్పడుతున్నాడని వారిలో అతి కొద్దిమంది మాత్రమే వెల్లడిస్తున్నారు. స్నేహ అనే స్వచ్ఛంద సంస్థ డేటా ప్రకారం ముంబైలోని ధారవిలో ఈ సంస్థ ముందు 3,878 ఫిర్యాదులు దాఖలుకాగా అందులో 52.11 శాతం లైంగిక హింసకు సంబంధించినవే. 19.33 శాతంమంది తమ భర్త తమపై పదే పదే అత్యాచారానికి పాల్పడుతున్నాడని తెలిపారని ఆ సంస్థ అంటున్నది. భార్య అభీష్టాన్ని బేఖాతరు చేయటం నేరమన్న స్పృహ పురుషుడిలో కలగాలంటే మారిటల్ రేప్ను నేరంగా పరిగణించటం ఒక్కటే మార్గం. ఇందుకు భిన్నంగా ఆలోచించటం జనాభాలో సగానికి అన్యాయం చేయటమే. -
నటితో ప్రేమ.. బ్రేకప్ చెప్పేసి రోమితో పెళ్లి! కపిల్ దేవ్ సీక్రెట్ లవ్స్టోరీ! (ఫొటోలు)
-
అన్ని స్నేహాలూ గొప్పవి కావు
సారిక 28 ఏళ్ల మార్కెటింగ్ ప్రొఫెషనల్. లీల తన చిన్ననాటి స్నేహితురాలు. కలిసి చదువుకున్నారు. లీలపై సారికకు మంచి అభిప్రాయం ఉంది. కానీ ఇటీవలి కాలంలో లీలతో మాట్లాడిన ప్రతిసారీ సారిక తీవ్ర ఎమోషనల్ స్ట్రెస్ ను అనుభవిస్తోంది. ఆ విషయం లీలతో చెప్పలేక, తన స్నేహాన్ని వదల్లేక, తనలో తానే బాధపడుతోంది.సారిక తన ఆఫీసులో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినప్పుడు లీల ఆమెపై అసూయను వ్యక్తం చేసింది. ‘‘నువ్వెలా సక్సెసవుతున్నావో నాకు తెలియదా ఏంటి’’ అంటూ అనుచితమైన వ్యాఖ్యలు చేసింది. ఎప్పుడూ తన సమస్యల గురించే మాట్లాడుతూ ఉంటుంది. వాటిని పరిష్కరించుకునేందుకు సారికను ఉపయోగించుకుంటోంది. ఎప్పుడైనా పని ఒత్తిడిలో ఉంటి పట్టించుకోకపోతే ‘‘కాస్త సక్సెస్ రాగానే నీకు కళ్లు నెత్తికెక్కాయే. నన్నసలు పట్టించుకోవడం లేదు, నా మాటే వినడం లేదు’’ అంటూ సూటిపోటి మాటలు మాట్లాడుతోంది. తాను ఎంత చేసినా లీల అలా మాట్లాడుతుండటంతో సారిక బాధపడుతోంది. లీలతో స్నేహం కొనసాగించాలా, వదిలేసుకోవాలో అర్థం కావడంలేదు.ఈ నేపథ్యంలో ‘కనెక్షన్ కార్నర్’ కాలమ్ తన దృష్టికి వచ్చింది. అన్ని ఆర్టికల్స్ చదివాక, తన సమస్యకు ఇక్కడ పరిష్కారం దొరుకుతుందని అపాయింట్మెంట్ తీసుకుని ఆఫీసుకు వచ్చి, తన సమస్య మొత్తం వివరించింది.‘‘నేనెంత పాజిటివ్ గా ఉండాలని ప్రయత్నించినా నావల్ల కావడంలేదు సర్. లీలతో ఫ్రెండ్షిప్ టాక్సిక్ గా మారింది. నేను నిజంగానే తనతో సరిగా ఉండటంలేదేమోనని గిల్టీ ఫీలింగ్ వస్తోంది. నా మెంటల్ హెల్త్ దెబ్బతింటోంది’’ అని ఆవేదన వ్యక్తం చేసింది.సారిక కష్టాలివీ... ⇒ లీలను కలిసిన ప్రతిసారీ తన సమస్యల చిట్టా విప్పుతుంది. వాటిని వినీవినీ సారిక మానసికంగా అలసిపోతుంది.⇒ సారిక సలహాలు పాటించకపోగా అవసరానికి తనకు సహాయపడటంలేదంటూ లీల పదే పదే మాట్లాడటం వల్ల సారిక అపరాధభావానికి లోనవుతోంది. అందువల్ల ఆమె ఆత్మవిశ్వాసం దెబ్బతింటోంది. ⇒ సారిక తన ఆఫీసు విషయాలు లేదా తన సక్సెస్ గురించి చెప్పినప్పుడు ఏమాత్రం పట్టించుకోకపోగా, అది ఎవరైనా సాధిస్తారంటూ తక్కువ చేసి మాట్లాడుతోంది. ⇒ సారిక సక్సెస్ పట్ల లీల ఆనందపడకపోగా అసూయను వ్యక్తం చేస్తోంది. అది సారికను నిరుత్సాహపరుస్తోంది. మొత్తంగా చెప్పాలంటే లీల టాక్సిక్ ఫ్రెండ్షిప్ వల్ల సారిక మానసికంగా బాధపడుతోంది. అందుకే లీలతో స్నేహాన్ని కొనసాగించాలా, వద్దా అనే ఆలోచనలో పడింది.టాక్సిక్ స్నేహాలను వదిలించుకోవాలి... ఒక వ్యక్తి సంతోషంగా జీవించడంలో స్నేహాలది ప్రధాన పాత్ర. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ కొన్ని స్నేహాలు విషపూరితంగా ఉంటాయి. వాటివల్ల లాభం లేకపోగా తీవ్రమైన నష్టం జరుగుతుంది. అలాంటి స్నేహాలను వీలైనంత దూరంగా ఉండటం లేదా త్వరగా వదిలించుకోవడం మంచిది. కొనసాగించక తప్పనిసరి పరిస్థితులుంటే ఆ మేరకు మనసును సిద్ధం చేసుకోవాలి. సారిక సమస్యను అర్థం చేసుకున్నాక ఆమెకు కౌన్సెలింగ్ ప్రారంభించాను. ⇒ ఏరోజుకారోజు తన ఫీలింగ్స్ ను డైరీలో రాయడం ద్వారా తన స్నేహాల్లో ఏవి సంతోషాన్నిస్తున్నాయో, ఏవి బాధపెడుతున్నాయో సారిక తెలుసుకుంది. ⇒ లీల కాల్ చేసిన ప్రతిసారీ పనులు పక్కన పెట్టి మరీ వెళ్లాల్సిన అవసరం లేదని సారిక తెలుసుకుంది. వారానికి ఒకసారి, 15 నిమిషాలు మాత్రమే కలవాలని నిర్ణయించుకుంది. ⇒ తన గిల్టీ ఫీలింగ్ ను అధిగమించేందుకు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునేందుకు నిర్దేశించిన ఎక్సర్సైజ్ లను ప్రాక్టీస్ చేసింది. ⇒ మెడిటేషన్ ద్వారా తన మానసిక స్థితిని అదుపులో ఉంచుకొనడం ప్రారంభించింది. ⇒ రోజూ వ్యాయామం, యోగా చేయడం ద్వారా ఆందోళనకు పగ్గాలు వేయగలిగింది. ⇒ తనను సమర్థించే, ప్రోత్సహించే స్నేహితుల సంఖ్యను పెంచుకుంది. ⇒ లీల మాటల్లోని నెగెటివిటీని అధిగమించడం నేర్చుకుంది. ⇒ రోజూ పాజిటివ్ అఫర్మేషన్లు ప్రాక్టీస్ చేయడం ద్వారా భావోద్వేగాలపై అదుపు సాధించగలిగింది. అలా సారిక కేవలం నాలుగు సెషన్లలోనే తన సమస్యను అధిగమించింది. లీలతో స్నేహం తెంపేసుకోకుండానే, ఆమె మాటల్లోని నెగెటివిటీని పక్కన పెట్టేయడం నేర్చుకుంది. ఫలితంగా మానసికంగా ప్రశాంతంగా ఉండి, తన కెరీర్ పై మరింత దృష్టి సారించి, మరింత సక్సెస్ సాధించగలిగింది. మీకూ అలాంటి స్నేహాలుంటే వీలైనంత వరకూ తగ్గించుకోండి. అది మీ మానసిక ఆరోగ్యానికి ముఖ్యం.సైకాలజిస్ట్ విశేష్+91 8019 000066www.psyvisesh.com -
Allahabad High Court: సమ్మతి ఉన్నా, భయపెడితే అత్యాచారమే
ప్రయాగ్రాజ్: సమ్మతితో లైంగిక సంబంధం పెట్టుకున్నాసరే ఆ సంబంధం భయంతో కొనసాగితే అత్యాచారంగానే పరిగణించాలని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి లైంగిక సంబంధం పెట్టుకున్నాడని ఒక మహిళ వేసిన కేసు విచారణ సందర్భగా ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో విచారణ ఆపాలంటూ తమను ఆశ్రయించిన రాఘవ్ కుమార్ అనే వ్యక్తికి వ్యతిరేకంగా కోర్టు తీర్పు వెలువరించింది. బాధితురాలు సివిల్ సరీ్వసెస్ పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో రాఘవ్ పరిచయమయ్యాడు. ఆమెను అపస్మారక స్థితిలోకి వెళ్లేలా చేసి శారీరక సంబంధం పెట్టుకున్నాడు. తర్వాత పెళ్లిచేసుకుంటానని నమ్మించి బలవంతంగా ఆ బంధాన్ని కొనసాగించాడంటూ బాధితురాలు ఆగ్రా జిల్లా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు ఆగ్రా జిల్లా కోర్టులో పెండింగ్లో ఉంది. దీన్ని సవాలు చేస్తూ రాఘవ్ వేసిన పిటిషన్ను జస్టిస్ అనీస్ కుమార్ గుప్తా సారథ్యంలోని అలహాబాద్ హైకోర్టు బెంచ్ కొట్టేసింది. -
ఛీ.. ఇంట్లో రోజూ గొడవలే
ఏ బంధంలోనైనా విభేదాలు సహజం. రెండు వేర్వేరు కుటుంబాల్లో, నేపథ్యాల్లో పెరిగిన ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకున్నప్పుడు కూడా వారి మధ్య విభేదాలు సహజం. అయితే వాటిని ఎలా, ఎంత త్వరగా పరిష్కరించుకున్నానేదే వారి బంధంలోని సంతోషాన్ని నిర్ణయిస్తుంది. విభేదాలను పరిష్కరించుకోకుండా చిన్న చిన్న వాదనలను కూడా పెద్ద పెద్ద గొడవలుగా మార్చుకుంటే కుటుంబ జీవితాన్ని నరకంగా మారుతుంది. అలాంటి ఒక జంట గురించి ఈరోజు మాట్లాడుకుందాం.రవి (32) ప్రియ (30)లకు ఐదేళ్ల కిందట పెళ్లయింది. రవి ఐటీ కన్సల్టెంట్, ప్రియ హెచ్ ఆర్ మేనేజర్. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం, ప్రేమ. తమ బిడ్డ కీర్తన అంటే ప్రాణం. ఇంటి పనులతో సహా బాధ్యతలను సమానంగా పంచుకుంటారు. వారాంతాల్లో సినిమాలు, షికార్లు. అప్పుడప్పుడూ విహారయాత్రలు. సుఖంగా సంతోషంగా జరుగుతున్న కాపురం.కానీ గత కొద్ది నెలలుగా మారి మధ్య తరచూ గొడవలవుతున్నాయి. గత నెల జరిగిన గొడవ ఇద్దరూ కొట్టుకునేవరకూ వెళ్లింది. ఆ తర్వాత తమ ప్రవర్తనకు ఇద్దరూ సిగ్గుపడ్డారు. ఎలాంటి విభేదాలున్నా చర్చించుకుని పరిష్కరించుకోవాలే తప్ప గొడవ పడకూడదని నిర్ణయించుకున్నారు. కానీ మళ్లీ పెద్ద గొడవలయ్యాయి. ఇక తమ వల్ల కాదనుకుని కౌన్సెలింగ్ కు వచ్చారు. ఇద్దరితో విడివిడిగా, కలివిడిగా మాట్లాడాను.చిన్న చిన్న అసమ్మతులు, ఇంటి పనులు, బిడ్డ సంరక్షణ లేదా ఆర్థిక విషయాలు అతి త్వరగా తీవ్రమైన గొడవలుగా మారుతున్నాయని చెప్పారు. ఆ తర్వాత పశ్చాత్తాపం వ్యక్తం చేసినా, మళ్లీ గొడవలు ఆపలేకపోతున్నామన్నారు. దీంతో ఎమోషనల్ గా దూరమవుతున్నామని, ఇంటిమసీ కోల్పోతున్నామని చెప్పారు. ఇలా జరగడం చాలా బాధగా ఉందన్నారు.ఆఫీసులో ప్రాజెక్ట్ వర్క్ వల్ల ఒత్తిడి పెరిగిందని, మళ్లీ ఇంటికి వచ్చి పనిచేయాలంటే కష్టంగా ఉందని రవి చెప్పాడు. తనకు కూడా ఆఫీసులో చాలా వర్క్ ఉంటోందని, ఇంటికి వచ్చాక పాపతో సరిపోతుందని, మళ్లీ ఇంటి పని చేయాలంటే తన వల్ల కావట్లేదని ప్రియ చెప్పింది. అయినప్పటికీ తాను చేస్తున్నా ఎలాంటి గుర్తింపు లేకపోగా, కూరలో ఉప్పు ఎక్కువైనా గొడవ పడుతున్నాడని చెప్పింది.ఇలాంటి విషయాలన్నీ కలిసి కుటుంబం కోసం ఎవరు ఎక్కువ కష్టపడుతున్నారనే వాదనలుగా మారాయి. అవి వ్యక్తిగత దూషణలుగా మారాయి. పెళ్లికి ముందు జరిగిన విషయాలనుంచి, పెళ్లి రోజు జరిగిన గొడవల వరకూ తవ్విపోసుకున్నారు. ఒకరి తల్లిదండ్రులను మరొకరు విమర్శించారు. వాదనల తర్వాత రవి ఇంటినుంచి బయటకు వెళ్లిపోగా, ప్రియ ఒంటరిగా ఏడుస్తూ కూర్చుంటుంది.వాదనలు వర్సెస్ తగాదాలుమనం మొదట్లో చెప్పినట్లు ఏ బంధంలోనైనా విభేదాలు సహజం. ఆరోగ్యకరమైన వాదనలు పరిష్కారానికి దారితీస్తే, తగాదాలు భావోద్వేగ గాయాలను మిగుల్చుతాయి. అందుకే వాదనలకు, తగాదాలకు మధ్య తేడా తెలుసుకోవడం అవసరం. 👉 ఒక సమస్యను చర్చించడం, భావాలు, పరిష్కారాలను చర్చించడం, ఆరోపణలు చేయకపోవడం ఆరోగ్యకరమైన వాదనల లక్షణం. ఉదాహరణకు, రవి ఇంటి పనుల కారణంగా ఒత్తిడిగా అనిపిస్తే, ప్రియ వ్యక్తిత్వంపై దాడి చేయకుండా తన అభిప్రాయం చెప్తాడు. ఆరోగ్యకరమైన వాదనలు 👉 విభేదాల సమయంలో కూడా భాగస్వామి పట్ల గౌరవం తొలగిపోదు. భాగస్వామి వాదన వినడం, అది భిన్నమైనదైనా అంగీకరిస్తారు. 👉 ఇద్దరూ ఎమోషనల్ గా ఉన్నప్పుడు అది మరింత దిగజారకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. 👉 విధ్వంసకరమైన తగాదాల్లో సమస్యను గాలికి వదిలి వ్యక్తిగతంగా విమర్శిస్తారు. రవి, ప్రియల మధ్య జరుగుతున్నది ఇదే. 👉 తగాదాల్లో తరచుగా గతం నుండి సంబంధం లేని విషయాలను ప్రస్తావిస్తారు. 👉 ఇద్దరూ గొంతు పెంచి అరచుకోవడం, ఒకరినొకరు అడ్డుకోవడం జరుగుతుంది. రవి తరచుగా వాదన మధ్యలో బయటకు వెళ్లిపోవడం ప్రియకు తనను పట్టించుకోవడం లేదనే అనుభూతిని కలిగించింది. కౌన్సెలింగ్ తో పరిష్కారం... రవి, ప్రియల సమస్య వాదనలు తగాదాలుగా మారడమే. అందుకే వారి మధ్య హెల్తీ కమ్యూనికేషన్ పెంపొందించేలా కౌన్సెలింగ్ సెషన్లు ప్లాన్ చేశాను. 👉 ఏ బంధంలోనైనా యాక్టివ్ లిజనింగ్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. కౌన్సెలింగ్ సమయంలో వారు ఒకరినొకరు అడ్డుకోవడం లేదా వ్యక్తిగత దాడులు చేయకుండా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం నేర్చుకున్నారు.👉 ఉద్రిక్తత పెరిగినప్పుడు ఒక చిన్న విరామం తీసుకోవడానికి అంగీకరించారు. దీనివల్ల భావోద్వేగ నష్టం తగ్గుతుంది. వారి వాదనలు నిర్మాణాత్మకంగా మారాయి.👉 వాదనల్లో ఒకే సమస్యపై కేంద్రీకరించాలని, అనవసర విషయాలు తీసుకురాకూడదని తీర్మానించుకున్నారు. 👉 ఒకరి లవ్ లాంగ్వేజ్ ను మరొకరు అర్థం చేసుకున్నారు. తగాదా సమయంలో కూడా పరస్పర గౌరవంతో, ప్రేమతో వ్యవహరించడం నేర్చుకున్నారు. సైకాలజిస్ట్ విశేష్ +91 8019 000066www.psyvisesh.com -
ఏ బంధంలోనైనా గౌరవం ముఖ్యం
కనెక్షన్ లేదా రిలేషన్షిప్ అనగానే అందరికీ లవర్స్ లేదా కపుల్స్ గుర్తొస్తారు. వారి మధ్య వచ్చే సమస్యలే గుర్తొస్తాయి. కానీ స్నేహితులు, తోబుట్టువులు, కుటుంబ సభ్యులు, సహోద్యోగులతో సంబంధం కూడా ముఖ్యం. అందుకే మన ‘కనెక్షన్ కార్నర్’లో ఇవన్నీ చర్చించుకుందాం.అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘రేసుగుర్రం’ మూవీ చూశారా? అందులో అన్నాదమ్ములిద్దరూ రోజూ కొట్టుకుంటూ ఉంటారు. కానీ అన్నకు సమస్య వచ్చినప్పుడు తమ్ముడు అండగా నిలబడతాడు. అదే బంధాలకు ఉండే ప్రాధాన్యం. అయితే అన్ని సందర్భాల్లోనూ అలా సర్దుకుపోరు. కొన్నిసార్లు అన్నదమ్ముల మధ్య గొడవలు పెరిగి పెద్దవై పోలీస్ కేసుల వరకూ వెళ్లిన సందర్భాలు కూడా మనం వార్తల్లో చూస్తుంటాం. అలాంటి ఒక కేస్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం.రోహిత్, సిద్ధార్థ్ అన్నదమ్ములు. 32 ఏళ్ల రోహిత్ స్వంత వ్యాపారం పెట్టి సక్సెస్ అయ్యాడు. 28 ఏళ్ల సిద్ధార్థ్ లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. రెండేళ్లుగా వారి రిలేషన్షిప్ బాగా దెబ్బతింది. తరచుగా వాదనలు, అపార్థాలు, సెటైర్లు.తానెంతో కష్టపడి వ్యాపారం మొదలుపెట్టి 32 ఏళ్లకే సక్సెస్ సాధించినా, తనను ‘డబ్బు మనిషి’ అంటున్నాడని సిద్ధార్థ్ పై రోహిత్ కు కోపం. మరోవైపు తక్కువ సంపాదిస్తున్నాడని రోహిత్ కు తానంటే చిన్నచూపని సిద్ధార్థ్ కు బాధ. అలా ఇద్దరూ తరచూ ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటున్నారు. అవి చిలికిచిలికి గాలివానగా మారి ఇద్దరూ కొట్టుకునేవరకూ వెళ్లింది.ఆ వయసుకొచ్చిన పిల్లలు కొట్టుకోవడం చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఏం చేయాలో అర్థంకాక వారిద్దరినీ కౌన్సెలింగ్ కు వెళ్లమని అడిగారు. వాళ్లిద్దరూ అయిష్టంగానే వచ్చారు.పరస్పర గౌరవం లేకపోవడమే సమస్య... మొదటి సెషన్ లో వాళ్లిద్దరితో విడివిడిగా మాట్లాడాను. పరస్పర గౌరవం లేకపోవడమే వారి సంఘర్షణకు మూలమని అర్థమైంది. అందుకే వారి విభేదాలు నిర్మాణాత్మకంగా కాకుండా వ్యక్తిగత దాడులుగా మారాయి. 👉 సోదరులిద్దరూ వారి కెరీర్ ఛాయిస్, వ్యక్తిగత నిర్ణయాలను తప్పుగా అంచనా వేసుకుంటూ, వారి పరస్పర విశ్వాసాన్ని దెబ్బతీస్తూ ఉంటారు.👉 ఏ ఒక్కరూ మరొకరి దృక్పథాన్ని వినకపోగా ఒకరి ఐడియాకు మరొకరు అంతరాయం కలిగిస్తున్నారు లేదా తిరస్కరిస్తున్నారు. 👉వారి సంభాషణలు తరచుగా సర్కాస్టిక్ కామెంట్స్ (వ్యంగ్య వ్యాఖ్యలు), నెగెటివ్ జడ్జ్ మెంట్స్ (ప్రతికూల తీర్పులు) గా మారి విభేదాలకు మరింత ఆజ్యం పోశాయి.👉దీంతో వారిద్దరూ సరిగా కమ్యూనికేట్ చేసుకోలేకపోతున్నారు. తన సోదరుడు తప్పుగా అర్థం చేసుకుంటున్నాడని అపార్థం చేసుకుంటున్నాడు. అతని వైఖరిని అంగీకరించడానికి ఏమాత్రం ఇష్టపడలేదు.శ్రద్ధగా వినడమే తొలి అడుగు... ఇలాంటి సందర్భాల్లో చాలామంది ఎడమొహం పెడమొహంగా మారి విభేదాలను ఇంకా పెద్దవి చేసుకుంటారు. కానీ సోదరులిద్దరూ ఒకరి కెరీర్ ఛాయిస్, లైఫ్ స్టైల్, వాల్యూస్ ను అర్థం చేసుకోవడం, అభినందించడం అవసరం. ఆ మేరకు సెషన్స్ ప్లాన్ చేశాను. 👉ప్రారంభ సెషన్లలో ‘యాక్టివ్ లిజనింగ్’ అనే కాన్సెప్ట్ను పరిచయం చేసాను. అంటే సోదరుడు మాట్లాడేటప్పుడు ఎలాంటి అభ్యంతరం పెట్టకుండా వినాలి. అతని దృక్పథంతో విభేదించినప్పటికీ, అతని భావోద్వేగాలను అంగీకరించాలి. విమర్శలకు బదులుగా నిర్మాణాత్మక సూచనలివ్వాలి. 👉తర్వాత ‘ఐ ఫీల్‘ స్టేట్మెంట్ టెక్నిక్ని ఇచ్చాను. అంటే సోదరుడిని నిందించడానికి బదులుగా ‘నాకిలా అనిపించింది’, ‘నేను బాధపడ్డాను’ అని తన అభిప్రాయాన్ని, భావోద్వేగాన్ని మాత్రమే వ్యక్తపరచాలి. ఈ టెక్నిక్ వారు వాదించుకోకుండా కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగపడింది. 👉 ఫైనాన్షియల్ సక్సెస్ సాధించడమే రోహిత్ లక్ష్యమైతే, అకడమిక్ గా టాప్ లో ఉండటమే సిద్ధార్థ్ లక్ష్యం. ఒకరి ఎంపికను మరొకరు అర్థం చేసుకునేలా చర్చించుకునేలా ప్రోత్సహించాను. 👉 వారిద్దరూ ఒకరి ఛాయిస్ ను మరొకరు ఎలా చూశారో వివరిస్తూ మనసువిప్పి లెటర్లు రాసుకోమన్నాను. ఇది వారి అభిప్రాయాలను రీఫ్రేమ్ చేసి, ఒకరినొకరు అభినందించుకునేలా చేసింది.అలా పది సెషన్లలో రోహిత్, సిద్ధార్థ్ ఒకరినొకరు పూర్తిగా అర్థంచేసుకున్నారు. సర్కాజం, క్రిటిసిజం లేకుండా ఎలా కమ్యూనికేట్ చేయవచ్చో నేర్చుకున్నారు. ఒకరి ఛాయిస్ ఏదైనా దాన్ని గౌరవించాలని, నచ్చకపోతే తన అభిప్రాయాన్ని నిర్మాణాత్మంగా వివరించాలని అర్థం చేసుకున్నారు. చక్కగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. తమ కెరీర్ ఛాయిస్ ఏదైనా కుటుంబానికి అండగా నిలబడటం, తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడం ముఖ్యమని అర్థం చేసుకుని, ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అది చూసి వారి తల్లిదండ్రులు సంతోషించారు.సోదరులనే కాదు, టీనేజ్, కపుల్, వర్క్ రిలేషన్షిప్స్ లో పరస్పర గౌరవానికి కీలక పాత్ర. గౌరవం ఉండటమే కాదు, ఉన్నట్లు కనిపించాలి. లేదంటే రోహిత్, సిద్ధార్థ్ లా అపార్థాలు, గొడవలు తప్పవు. అందుకే తీర్పులివ్వకుండా వినడం, కమ్యూనికేషన్ ను మెరుగుపరచుకోవడం, గౌరవప్రదమైన సరిహద్దులను సెట్ చేసుకోవడం, తీర్పులను రీఫ్రేమ్ చేసుకోవడం అవసరం.సైకాలజిస్ట్ విశేష్ +91 8019 000066www.psyvisesh.com -
ది మానిప్యులేటివ్ పార్టనర్
ప్రచారం పిచ్చో... డబ్బులు సంపాదించుకోవచ్చు అన్న ఆశనో తెలియదు కానీ.. ఈ మధ్యకాలంలో చాలామందికి రీల్స్ పిచ్చి పట్టుకుంది. కొన్నిసార్లు ఇది కాస్తా శ్రుతిమించి పోయి వ్యవసనంగానూ మారిపోతోంది. ఆఖరుకు ఇది దాంపత్య జీవితంలోనూ చిచ్చు పెట్టే స్థితికి చేరుకుంది. అయితే కర్ణాటకలోని ఉడుపికి సమీపంలోని కార్కడలో ఈ రీల్స్ పిచ్చి కాస్తా ఓ నిండుప్రాణం పోయేందుకు కారణమైంది. పోలీసులు చెప్పిన దాని ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి...బీదర్లోని దోణగాపురకు చెందిన జయశ్రీ (31)కి రీల్స్ అంటే తెగ పిచ్చి. ఈమెకు కార్కడ సమీపంలోని గుండ్మిలో నివసించే కిరణ్ ఉపాధ్య (44)తో పెళ్లి అయ్యింది. కొంత కాలం సంసారం బాగానే నడిచింది కానీ.. జయశ్రీ నిత్యం రీల్స్ చేస్తూండటం కిరణ్కు ఏ మాత్రం నచ్చలేదు. అంతేకాదు... జయశ్రీ ఆన్లైన్ షాపింగ్ వ్యసనం విషయంలోనూ భార్య భర్తలిద్దరి మధ్య తరచూ గొడవలు అవుతూండేవి. తనకు పెద్ద ఇల్లు కావాలని... లగ్జరీ కారు.. నగదు కావాలని... గుడులలో వంటలకు సాయంగా పనిచేస్తున్న భర్త కిరణ్ను వేధించేది. ఇది కాస్తా వారిద్దరి మధ్య వివాదం మరింత ముదిరేందుకు కారణమైంది. ఇలాగే కొన్ని రోజుల క్రితం ఇద్దరి మధ్య రీల్స్ విషయమై వాదులాట మొదలైంది. ఈ క్రమంలోనే కిరణ్ కొడవలితో దాడి చేయడంతో జయశ్రీ మరణించింది. ఆ తరువాత బంధు మిత్రులకు ఫోన్ చేసి జయశ్రీ మొదటి అంతస్తులోంచి కిందకు పడిపోయిందని... స్పందన లేదని చెప్పాడు. వారి సలహాతో ఆంబులెన్స్కు ఫోన్ చేశాడు కూడా. అయితే జయశ్రీ ఆసుపత్రికి చేరే సమయానికి ప్రాణాలతో లేదని డాక్టర్లు ప్రకటించారు. అయితే... ఆసుపత్రి నుంచి తిరిగి వచ్చిన తరువాత కిరణ్ ప్రవర్తన తేడాగా ఉండటాన్ని చుట్టుపక్కల వాళ్లు గమనించారు. ఇంట్లో రక్తపు మరకల్ని తొలగించే ప్రయత్నం చేశాడు. అనుమానం కొద్దీ ఇరుగు పొరుగు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు కిరణ్ను అరెస్ట్ చేసి విచారణ చేయడంతో అసలు విషయం బయటపడింది. కిరణ్ ముందస్తు ప్రణాళికతోనే జయశ్రీని హత్య చేశాడని, గత గురువారమే మార్కెట్లో కొత్త కొడవలిని కొనుగోలు చేశాడని స్థానికులు చెబుతున్నారు. రజని హైదరాబాద్ లోని ఒక కార్పొరేట్ హాస్పిటల్లో డాక్టర్థగా పనిచేస్తోంది. గత కొద్దికాలంగా ఆమెకు అంతా గందరగోళంగా అనిపిస్తోంది. తాను చేస్తున్నది రైటా, తప్పా అనే సందేహం తరచూ వేధిస్తోంది. ఆమె ఆత్మవిశ్వాసం బాగా దెబ్బతింది. నిరంతరం ఒత్తిడి, ఆందోళన ఫీలవుతోంది. ఎవరితోనూ మాట్లాడాలనిపించడం లేదు. ఒంటరితనం, భయం, నిస్సహాయత. దాంతో పేషంట్లను ట్రీట్ చేయడంలో కూడా నిర్ణయాలు తీసుకోలేకపోతోంది. చిన్న చిన్న విషయాలకు కూడా సారీ చెప్తోంది. నిద్ర పట్టడంలేదు. తలనొప్పి, కడుపు నొప్పి, ఇతర శారీరక సమస్యలు. డాక్టర్ కాబట్టి తనకు తానే వైద్యం చేసుకుంది. కానీ తగ్గడంలేదు. దాంతో ఇది శారీరకం కాదని, మానసికమని అర్థమై కౌన్సెలింగ్ కోసం వచ్చింది. తన సమస్య చెప్పింది. ఆమె బ్యాక్ గ్రౌండ్ గురించి చెప్పమని అడిగాను.అపనమ్మకం...రజనికి పెళ్లయి ఐదేళ్లయ్యింది. తన కొలీగ్ డాక్టర్ ఆనంద్ ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. రజని కొంచెం కలుపుగోలు మనిషి. అది ఆనంద్ కు నచ్చదు. ‘‘నీ పని నువ్వు చూసుకోక అందరితో అలా మాట్లాడతావెందుకు?’’ అని అడిగేవాడు. తరచూ రజనిపై కోప్పడేవాడు. ‘‘అందరితో బాగా నవ్వుతూ మాట్లాడతావ్. నాతో మాట్లాడాలంటే మాత్రం మొహం ముడుచుకుంటావ్. నీకంటికి నేను చేతకాని వాడిలా కనిపిస్తున్నా’’ అని దెప్పేవాడు. ‘‘అలాంటిదేం లేదు’’ అని చెప్పినా వినేవాడు కాదు. ‘‘యు ఆర్ నాట్ రైట్. నీకేదో సైకలాజికల్ ప్రాబ్లమ్ ఉన్నట్టుంది, ఒకసారి సైకియాట్రిస్ట్ ను కలువు’’ అని తరచూ అనేవాడు. కొన్నాళ్లకు రజని కూడా తన మానసిక స్థితి గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. ‘‘నిజంగానే నాకేమైనా మానసిక సమస్య ఉందేమో, లేదంటే ఆనంద్ ఎందుకలా అంటాడు’’ అని అనుకునేది.గ్యాస్ లైటింగ్... డాక్టర్ రజని చెప్పిందంతా విన్నాక ఆమె గ్యాస్ లైటింగ్ కు గురవుతుందని అర్థమైంది. గ్యాస్ గురించి అందరికీ తెలుసు. కానీ గ్యాస్ లైటింగ్ అంటే ఇంట్లో ఉన్న గ్యాస్ స్టవ్ ను వెలిగించేది కాదు. మాటలు, ప్రవర్తన ద్వారా మరోవ్యక్తి భావోద్వేగాలను కంట్రోల్ లో పెట్టుకోవడానికి కొందరు చేసే మేనిప్యులేషన్ ను ‘గ్యాస్ లైటింగ్’ అంటారు. ఇతరులపై ఆధిపత్యం చెలాయించాలనే కోరిక నుండి పుడుతుంది. తమ మాటే నెగ్గేలా, తమ దారికి అడ్డులేకుండా చేసుకోవడానికి అబద్ధాలు చెప్తారు, నిందలు వేస్తారు. తమ తప్పును కూడా భాగస్వామిపై తోసేసి తమ ప్రయోజనాలను కాపాడుకుంటారు. తనపై తనకు నమ్మకం కోల్పోయేలా చేస్తారు, చివరకు భాగస్వామి ఎమోషన్స్ పై కంట్రోల్ సాధిస్తారు. ముఖ్యంగా నార్సిసిస్టిక్ పర్సనాలిటీ, యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్స్ ఉన్నవారిలో ఈ ప్రవర్తన ఎక్కువగా కనిపిస్తుంది. డాక్టర్ ఆనంద్ అందులో మాస్టర్స్ డిగ్రీ సాధించాడని అర్థమైంది. కానీ తాను గ్యాస్ లైటింగ్ కు గురవుతున్న విషయాన్ని రజని గుర్తించలేకపోతోంది. అదే ఈ సమస్యలో ఉండే అసలు సమస్య. తనను మేనిప్యులేట్ చేస్తున్నారనే విషయం బాధితులకు తెలియదు, అసలా దిశగా ఆలోచించలేరు. ఎవరైనా చెప్పినా నమ్మరు.థెరపీతో పరిష్కారం... అందుకే మొదట రజనికి కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ద్వారా తన ఆలోచనల్లోని లోపాలు గుర్తించేలా, వాటిని సవాల్ చేసేలా చేశాను. ఆ తర్వాత గ్యాస్ లైటింగ్ గురించి, గ్యాస్ లైటర్ వాడే స్ట్రాటజీస్ గురించి వివరించాను. ఆనంద్ అలాగే చేస్తాడని చెప్పింది. తాను గ్యాస్ లైటింగ్ కు గురవుతున్నానని అర్థం చేసుకుంది. ఆ తర్వాత తన భద్రతకు సంబంధించిన ప్రణాళికను రూపొందించాను. తన బలాలు, సానుకూల లక్షణాలను గుర్తించి ఆత్మగౌరవంతో ప్రవర్తించేందుకు ఎక్సర్ సైజ్ లు నేర్పించాను. గ్యాస్ లైటింగ్ ను ఎలా ఎదుర్కోవాలో, ఒత్తిడిని, ఆందోళనను ఎలా మేనేజ్ చేసుకోవాలో వివరించాను. స్నేహితులు, కుటుంబ సభ్యుల మద్దతు తీసుకోమని ప్రోత్సహించాను. క్రమేపీ రజని తన కెరీర్ పై దృష్టి పెట్టింది. ఆనంద్ మాటలను పట్టించుకోవడం మానేసింది. రజని ఇంతకు ముందులా లేదన్న విషయం అర్థం చేసుకున్న ఆనంద్ కూడా తన ప్రవర్తను మార్చుకున్నాడు. మూడు నెలల్లో సమస్య పరిష్కారమైంది.గ్యాస్ లైటర్లు తరచూ వాడే వాక్యాలు⇒నువ్వు ప్రతిదానికీ ఓవర్ రియాక్ట్ అవుతున్నావ్. ⇒అందుకే నీకెవ్వరూ ఫ్రెండ్స్ లేరు. ⇒నీకోసమే అలా చేశాను. ⇒నీకోసం అంత చేస్తే నన్నే అనుమానిస్తావా?⇒నేను నీకు చెప్పాను, గుర్తులేదా? ⇒అలా ఏం జరగలేదు, నువ్వే ఊహించుకుంటున్నావ్. ⇒ నీపట్ల నాకెప్పుడూ నెగెటివ్ ఒపీనియన్ లేదు. నువ్వే నన్ను నెగెటివ్ గా చూస్తున్నావ్.వాళ్ల మాటలు నమ్మొద్దు⇒గ్యాస్ లైటర్లతో వాదనలకు దూరంగా ఉండాలి. లేదంటే మీ మాటలే మీపై ప్రయోగిస్తారు. ⇒గ్యాస్ లైటర్లు చెప్పేదొకటి, చేసేదొకటి కాబట్టి వాళ్లు చెప్పేదానిపై కాకుండా చేసే పనులపై దృష్టి పెట్టాలి. ⇒‘‘నీకు పిచ్చి’’ అని మిమ్మల్ని మీరే అనుమానించుకునేలా చేసేవారి మాటలు పట్టించుకోకూడదు. ⇒‘‘నేను చెప్పాను, నీకే గుర్తులేదు’’ అనే మాటలు నమ్మకూడదు. మీకెంత వరకూ గుర్తుందే అదే నిజమని గుర్తించాలి. ⇒గ్యాస్ లైటర్లు ముందుగా మీ కుటుంబ సభ్యులను, స్నేహితులను బుట్టలో వేసుకుంటారు. కాబట్టి గ్యాస్ లైటర్ కు మద్దతుగా వాళ్లు చెప్పే మాటలు పట్టించుకోకూడదు. ⇒గ్యాస్ లైటర్ తో ఉండే బంధం కన్నా మీరు సురక్షితంగా ఉండటం ముఖ్యమని గుర్తించాలి. ⇒మీ భద్రతకు ప్రమాదమని భావిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ బంధం నుంచి బయటకు వచ్చేయాలి.సైకాలజిస్ట్ విశేష్8019 000066www.psyvisesh.com -
ఆయనకు విపరీతమైన అనుమానం!
మా పెళ్ళయి పదేళ్ళయింది. ఇద్దరు పిల్లలు. మొదట్లో కొంతకాలం బాగున్నాం కానీ, తర్వాత నుంచి నా భర్తకు అనుమానం జబ్బు పట్టుకుని నన్ను మానసికంగా వేధిస్తున్నాడు. ప్రతివాళ్లతోనూ నాకు సంబంధం అంటగట్టి అనరాని మాటలతో చిత్రవధ చేస్తున్నాడు. సినిమాలకు, ఫంక్షన్లకు వెళ్ళినపుడు ఈ బాధ మరీ ఎక్కువవుతోంది. ఏం చేయాలో అర్థం కావడంలేదు. దయచేసి సలహా ఇవ్వగలరు. – ఒక సోదరి, తెనాలిమీరనుభవిస్తున్న మానసిక క్షోభను అర్థం చేసుకోగలను. వాస్తవం గాకున్నా... ఎలాంటి ఆధారం లేకున్నా ఇలా భార్యాభర్తలు ఒకరినొకరి శీలాన్ని శంకించే మానసిక రుగ్మతను ‘డెల్యూజనల్ డిజాస్ట్టర్ లేదా కాంజుగల్ ΄ారనోయియా’ అంటారు. మిగతా అన్ని విషయాల్లో వీరు మామూలుగానే ఉంటారు. ఏవేవో ఊహించుకుని ఇలాంటి భ్రమలు– భ్రాంతులకు లోనవుతూ, కేవలం జీవిత భాగస్వామిని మాత్రమే ఇలా అనుమానిస్తూ, వేధిస్తూ ఉంటారు. మానసిక రుగ్మత ఉందంటే ఒప్పుకోరు. మీరు మీ బంధువులు, ఇతర పెద్దల సహకారంతో ఆయన్ని ఏదో ఒక విధంగా ఒప్పించి, వైద్యుల దగ్గరకు వెళ్లగలిగితే, ‘యాంటీ సైకోటిక్స్’అనే మందులు, కౌన్సెలింగ్ ద్వారా చికిత్స చేసి, ఈ అనుమానాల ఊబి నుంచి పూర్తిగా బయటపడేస్తారు. మళ్ళీ మీరు ప్రశాంతంగా, సంతోషంగా జీవితాన్ని గడపగలరు. మా చుట్టాలబ్బాయి చిన్నప్పటినుంచి చదువులో టాప్! రెండు పీహెచ్డీలు చేశాడు. ఒక పెద్ద కంపెనీలో మంచి జీతంతో ఆఫర్ కూడా వచ్చింది. అయితే ఇటీవల ఉన్నట్టుండి అతని ప్రవర్తనలో బాగా మార్పు వచ్చింది. ఎవ్వరితోనూ మాట్లాడడు. ఒక్కడూ గదిలో తలుపులు వేసుకుని కూచుంటాడు. రోజుల తరబడి స్నానం చేయడు. తన లో తాను నవ్వుకోవడం... మాట్లాడుకోవడం. మా బంధువులందరూ చదువు ఎక్కువ అవడం వల్ల ఈ పిచ్చి వచ్చిందంటున్నారు. నిజమేనా?– కుమార్, కర్నూలుచదువుకు, తెలివితేటలకు, మానసిక జబ్బు రావడానికీ ఎలాంటి సంబంధం లేదు. ఇది కేవలం అ΄ోహ మాత్రమే. ఎక్కువ చదివిన వారందరికీ మెంటల్ రావాలని లేదు. అలాగే తెలివితేటలు లేనివారికి, ఎక్కువ చదువుకోనివారికీ మానసిక జబ్బులు రావని ఏమీ లేదు. మానసిక వ్యాధులకు వారసత్వ కారణాలు కొన్నయితే, పరిస్థితుల ప్రభావం, దిగ్భ్రాంతి కలిగించే సంఘటనలు జరగడం, ఆల్కహాల్, డ్రగ్స్ తీసుకోవడం, తీవ్రమైన ఒత్తిడులకు గురికావడం వంటివి ఇతర కారణాలు. ఆలస్యం చేయకుండా అతణ్ణి ఒకసారి సైకియాట్రిస్ట్కు చూపించమని చెప్పండి. స్కిజోఫ్రినియా అనే మానసిక జబ్బుకు లోను కావడం వల్ల వారికి మీరు పేర్కొన్న లక్షణాలుండే అవకాశం ఉంది. తొలిదశలోనే గుర్తించి, సరయిన చికిత్స చేయిస్తే, తొందరగా కోలుకుని తిరిగి మంచి జీవితాన్ని గడపగలడు.– డా. ఇండ్ల విశాల్ రెడ్డి సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
‘డిజిటల్ డివైడ్’.. కాపురాలు కూలుతున్నాయి
రిషి, ప్రియ అందమైన జంట. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. రోజంతా పని చేయడం, సాయంత్రాలు కలిసి చాలా చాలా కబుర్లు చెప్పుకోవడం, వారాంతాల్లో సినిమాకో, షికారుకో వెళ్లడం, అక్కడే డిన్నర్ చేసి ఇంటికి రావడం.. ఎలాంటి సమస్యలూ లేకుండా పర్ఫెక్ట్ కపుల్ లా ఉండేవారు. అలాంటిది.. అనూహ్యంగా వాళ్ల కాపురంలో చిచ్చు రగిలింది. ఎలా అంటే..ప్రియ చురుకైన వ్యక్తి, ఫ్రెండ్స్ తో చాలా సరదాగా ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా వారితో నిత్యం కనెక్ట్ అవుతుంది. వాళ్ల జీవితంలో జరిగే విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంది. తన విషయాలన్నీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్ డేట్ చేస్తుంటుంది. అప్పుడప్పుడూ వాళ్లతో చాట్ చేస్తుంది. రిషికి సోషల్ మీడియా అంటే కొంచెం చిరాకు. అన్ని విషయాలూ సోషల్ మీడియాలో అప్ డేట్ చేయాల్సిన అవసరం లేదంటాడు. ఈ విషయం తరచూ ప్రియకు చెప్తుంటాడు. ఆమె ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో, ఆమెపై చిరాకు పడుతుంటాడు.కాలంతో పాటు అప్ డేట్ కావాలని, ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటంలో తప్పేమీ లేదని ప్రియ వాదిస్తుంటుంది. ఈ విషయమై అప్పుడప్పుడూ ఇద్దరిమధ్యా వాగ్వాదాలు జరుగుతుంటాయి. ఈ విధంగా వారి మధ్య "డిజిటల్ డివైడ్" ఏర్పడింది. వారి ఆన్ లైన్ అలవాట్లు, ఆఫ్ లైన్ జీవితంపై ప్రభావం చూపించడం మొదలైంది.అందమైన సినిమా...సోషల్ మీడియా అందమైన సినిమాలాంటిది. అందరూ తమ జీవితంలోని అందమైన, ఆకర్షణీయమైన భాగాన్ని మాత్రమే అక్కడ ప్రదర్శిస్తుంటారు. ప్రియ కూడా అంతే. తమ మధ్య ఎన్ని గొడవలున్నా, తాము సంతోషంగా గడిపిన ఫొటోలను చక్కగా ఎడిట్ చేసి పోస్ట్ చేస్తుంది. అప్పుడప్పుడూ రీల్స్ కూడా. అయితే విషయం అక్కడితో ఆగలేదు. సోషల్ మీడియాలో తన ఫ్రెండ్స్ పోస్టులు, ఫొటోలు చూసి, వారి జీవితంతో పోల్చుకుంటుంది. తాను వాళ్లంత ఆనందంగా లేనని బాధపడుతుంది. వారిపై అసూయ పడుతుంది. అది ఆమె జీవితంలో అసంతృప్తికి దారితీసింది. ఇవన్నీ అప్పుడప్పుడూ ఆన్ లైన్లో తన పాత స్నేహితుడితో పంచుకుంటోంది.విశ్వాస ఉల్లంఘనప్రియ తన స్నేహితుడితో సుదీర్ఘంగా చాట్ చేస్తున్న విషయం రిషికి తెలిసింది. ఇదేంటని అడిగాడు. సరదాగా చాట్ చేస్తున్నానే తప్ప మరేమీ లేదని ప్రియ చెప్పింది. ‘‘నీ జీవితం ఆనందంగా లేదని అతనితో చెప్తున్నావ్ కదా. నాతో జీవితం అంత బాధాకరంగా ఉందా?’’ అని నిలదీశాడు. అలాంటిదేం లేదని, అవన్నీ కాజువల్ కాన్వర్జేషన్స్ అని ప్రియ చెప్పినా సంతృప్తి చెందలేదు. అతనితో చాటింగ్ మానేయమన్నాడు. తమ మధ్య ఏమీ లేనప్పుడు మానేయాల్సిన అవసరమేముందని ప్రియ వాదించింది. ‘‘నన్ను అనుమానిస్తున్నావా?’’ అని ప్రశ్నించింది. అలాంటిదేం లేదని, అయినా సరే మానేయమని రిషి కోరాడు. అలా అలా ఆ గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది. విడాకులు తీసుకోవాలని అనుకునేంతవరకూ వెళ్లారు. ఈ విషయం ఒక క్లోజ్ ఫ్రెండ్ దృష్టికి వచ్చింది. చిన్న విషయాన్ని పెద్దది చేసుకున్నారంటూ ఆమె వారిద్దరికీ చీవాట్లు పెట్టింది. ఆమె సలహా మేరకు వారిద్దరూ కౌన్సెలింగ్ కు వచ్చారు.రెండువైపులా పదునున్న కత్తిసోషల్ మీడియా అనేది రెండువైపులా పదునున్న కత్తిలాంటిది. అందులో ప్లస్, మైనస్ రెండూ ఉంటాయి. సోషల్ మీడియా రాకతో మనం దేశ విదేశాల్లోని బంధువులతో, స్నేహితులతో కనెక్షన్ ను కొనసాగించడం సులువైంది. పాత స్నేహితులు, కొలీగ్స్ తో మళ్లీ కనెక్ట్ అవ్వగలుగుతున్నాం. మనం సాధించిన విజయాలను, అనుభవాలను అందరితో పంచుకోవచ్చు. జంటలు తమ జ్ఞాపకాలను పదిలపరచుకోవడం ద్వారా వారి బంధాన్ని బలోపేతం చేసుకోవచ్చు.ఆన్లైన్ కమ్యూనిటీలు, సపోర్ట్ గ్రూప్ల ద్వారా మన జీవితంలో ఎదురైన ఛాలెంజ్ లను ఎదుర్కునేందుకు సహాయం, సలహాలు పొందవచ్చు. పార్టనర్ పట్ల ప్రేమ, ఆప్యాయత, ప్రశంలను వ్యక్తం చేయడం ద్వారా బంధాన్ని బలోపేతం చేసుకోవచ్చు.మరోవైపు సోషల్ మీడియా వల్ల రిషి, ప్రియ జీవితాల్లో ఏర్పడినట్లే సవాళ్లు కూడా ఏర్పడవచ్చు. సోషల్ మీడియాలో పర్ఫెక్ట్ జీవితాలను మాత్రమే తరచూ చూడటం వల్ల అసూయ ఏర్పడుతుంది. తమ బంధం పట్ల అభద్రత, అసమర్థ భావాలకు దారితీస్తుంది. వ్యక్తిగత సమాచారాన్ని అతిగా పోస్ట్ చేయడం వల్ల ప్రైవసీ దెబ్బతింటుంది. తరచూ ఇతరులతో పోల్చుకోవడం వల్ల అవాస్తవిక అంచనాలకు దారితీస్తుంది. సున్నితమైన విషయాలను చర్చించేటప్పుడు మనం పంపే మెజేజెస్ ను తప్పుగా అర్థం చేసుకుంటే అపార్థాలకు దారితీస్తుంది. ఒక వ్యక్తితో రోజూ చాట్ చేయడం వల్ల, మీకు తెలియకుండానే వారితో ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడుతుంది. అది ఆఫ్ లైన్ జీవితంలోని భాగస్వామితో ఎమోషనల్ కనెక్షన్ ను తగ్గించవచ్చు.ఆన్ లైన్ ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడిన వ్యక్తితో తరచూ మాట్లాడటం ఎక్కడికైనా దారితీసే ప్రమాదం ఉంది.సోషల్ మీడియా బ్యాలెన్స్...రిషి, ప్రియలకు సోషల్ మీడియా వల్ల వచ్చే లాభనష్టాలను వివరించాక, దాన్నెలా బ్యాలెన్ చేసుకోవాలో నేర్పించాను. సోషల్ మీడియా అలవాట్లు, బౌండరీస్, భయాల గురించి ఒకరితో ఒకరి ఓపెన్ గా, నిజాయితీగా మాట్లాడుకునేలా ప్రోత్సహించాను. ఇద్దరూ కలిసి మాట్లాడుకుని ఏది పోస్ట్ చేయాలి, ఏది చేయకూడదనే విషయంపై ఒక అంగీకారానికి వచ్చేలా ఫెసిలిటేట్ చేశాను. తన ప్రయాణాలు లేదా అనుభవాల గురించి పోస్ట్ చేసేటప్పుడు రిషి భావాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని, అదెందుకు అవసరమో ప్రియకు అర్థమయ్యేలా వివరించాను. ఆన్లైన్ లో కనపడేదంతా నిజం కాదని, అందువల్ల పోల్చుకోవడం మానేసి, తమ బంధాన్ని బలపరచుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించాను. అందుకు కావాల్సిన ఎక్సర్ సైజ్ లు చేయించాను. అప్పడప్పుడూ సోషల్ మీడియానుంచి పూర్తిగా డిస్ కనెక్ట్ అయ్యి పార్టనర్ తో గడపడం అవసరమని ప్రియకు అర్థమయ్యేలా చెప్పాను. అలా ఐదు సెషన్లలో రిషి ప్రియల మధ్య ఉన్న డిజిటల్ డివైడ్ ను పూడ్చేసి, వారిద్దరూ తమ జీవితాలను సంతోషంగా సాగించేందుకు అవసరమైన స్ట్రాటజీలను అందించాను.-సైకాలజిస్ట్ విశేష్+91 8019 000066psy.vishesh@gmail.com -
ఏ బంధంలోనైనా హద్దులు అవసరం
ప్రియకు 28 ఏళ్లు. ఒక అంతర్జాతీయ సంస్థలో అకౌంటెంట్ గా పనిచేస్తుంది. రోహిత్తో రెండేళ్ల కిందట పెళ్లయ్యింది. మొదట్లో అంతా బానే ఉంది. కాలం గడిచేకొద్దీ వైవాహిక బంధంలో ఉక్కపోత మొదలైంది. తన డ్రెస్సింగ్ నుంచి ఫ్రెండ్స్ వరకూ అంతా తనకు నచ్చినట్లే ఉండాలంటాడు. అలా లేకుంటే ఏదో ఒక కారణంతో గొడవ పెట్టుకుంటున్నాడు. తన ప్రవర్తనను, స్నేహాలను కూడా నియంత్రించడం ప్రియకు నచ్చడంలేదు. క్రమంగా ఇద్దరి మధ్యా దూరం పెరిగింది. దాన్ని సరిచేసుకునేందుకు రోహిత్ ఎలాంటి ప్రయత్నమూ చేయడం లేదు. తానేం చేయాలో ప్రియకు అర్థంకాక కౌన్సెలింగ్ కు వచ్చింది.స్వేచ్ఛ వర్సెస్ సంప్రదాయంప్రేమంటే రెండు మనసుల కలయిక, పెళ్లంటే రెండు జీవితాల కలయిక. మనదేశంలో మాత్రం పెళ్లంటే రెండు కుటుంబాల కలయిక. ఇద్దరు వ్యక్తుల మధ్య ఎలాంటి పరిచయం లేకపోయినా, ప్రేమ లేకపోయినా, కనీస అవగాహన లేకపోయినా... కులం, మతం, జాతకం, ఆర్థిక స్థాయిలు కలిస్తే చాలు, పెళ్లి చేసేస్తారు. ఆ తర్వాత ఆ రెండు కుటుంబాల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఆ జంటపై ఉంటుంది. ఇప్పుడదే భారం ప్రియపై ఉంది. తన వ్యక్తిగత స్వేచ్ఛకు, ఆత్మగౌరవానికి.. కుటుంబ గౌరవానికి, సంప్రదాయానికి మధ్య పోరాటం నడుస్తోంది.కాలంతో పాటు మారని మనుషులు... సాంప్రదాయ పితృస్వామ్య వ్యవస్థ ఏర్పాటు చేసిన వివాహంలో.. భర్తంటే భరించేవాడు. కుటుంబంలో భర్తదే ప్రధానపాత్ర. అతని మార్గాన్నే భార్య అనుసరించాలి. కాలం మారినా, పురుషులతో సమానంగా మహిళలు ఉద్యోగాలు చేస్తున్న రోజులొచ్చినా చాలామంది పురుషులు తమ ఆధిపత్యమే నడవాలనే భావజాలంలోనే ఉంటారు, ఉంటున్నారు. రోహిత్ ది కూడా అదే బాట. అందుకే తన భార్య తనకు నచ్చినట్టుగా ఉండాలని కోరుకుంటున్నాడు, అలా కోరుకోవడంలో తప్పు లేదనుకుంటున్నాడు. ఆ క్రమంలో వారిద్దరి మధ్యా దూరం పెరిగింది. ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ప్రియ తన మనసులోని మాట చెప్పలేకపోతోంది. దాంతో మనసులో అసహనం, కోపం పెరిగిపోతున్నాయి. ఆ నేపథ్యంలోనే కౌన్సెలింగ్ కు వచ్చింది. ఆమె చెప్పినదంతా విన్నాక, వారికి ‘హెల్తీ బౌండరీస్’ గురించి అవగాహన లేదని అర్థమైంది.టాక్సిక్ రిలేషన్స్ లక్షణాలు...• జంటలో ఒకరి ఇష్టాయిష్టాలకే ప్రాధాన్యం• తరచుగా వ్యంగ్యం, నిందలు, అవమానాలు• ఫోన్ చెక్ చేయడం, ఫ్రెండ్స్, పేరెంట్స్కు దూరం చేయడం• పార్టనర్ ను సంప్రదించకుండానే ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవడం• పార్టనర్ ను కంట్రోల్ చేయడానికి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడం• పార్టనర్ తెలివిని, నిర్ణయాలనూ చులకన చేయడం• ఎవరితో క్లోజ్గా ఉన్నా అసూయ పడటం, దూరం చేయడానికి ప్రయత్నించడం• ప్రతీ చిన్న విషయానికీ గొడవపడుతుండటంసరిహద్దుల అవసరం... ఏ బంధంలోనైనా బౌండరీస్ అవసరం. భార్య అయినంత మాత్రాన తన మాట తప్పక వినాలనీ, భర్త అయినంత మాత్రాన తాను చెప్పినట్లే నడుచుకోవాలనీ అనుకోవడమే జంటల మధ్య చాలా సమస్యలకు కారణం. సరిహద్దులు అనేవి మన శారీరక, మానసిక వెల్ బీయింగ్ ను కాపాడుకోవడానికి మన చుట్టూ గీసుకునే అదృశ్య రేఖలు, మీ అవసరాలు, అంచనాలు, ఆమోదయోగ్యమైన ప్రవర్తన ఏమిటో తెలియజేసే చర్యలు. ప్రతీ జంటకూ హెల్తీ బౌండరీస్ గురించిన అవగాహన అవసరం. • ప్రతి వ్యక్తికీ తనకంటూ కొన్ని ఇష్టాయిష్టాలు, అభప్రాయాలు ఉంటాయి. వాటిని గుర్తించి, గౌరవించినప్పుడే బంధం బలపడుతుంది. అది సంప్రదాయాన్ని తిరస్కరించడం కాదు. బంధం మరింత బలపడటానికి మార్గం. • ‘‘నువ్వలా చేస్తున్నావు’’, ‘‘నువ్విలా అంటున్నావు’’ అని కాకుండా... ‘‘నేనిలా అనుకుంటున్నాను’’, ‘‘నేనిలా ఫీలవుతున్నాను’’ అని మాట్లాడటం వల్ల చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. ఉదాహరణకు, ‘‘నేనే డ్రెస్ వేసుకోవాలో నువ్వు చెప్పినప్పుడు నాకు అసౌకర్యంగా ఉంటుంది. ఇద్దరికీ నచ్చేదాని గురించి మాట్లాడుకుందామా?’’ అని చెప్పడం, ఇష్టంలేకుండా ఒప్పుకోవడం నుంచి మాట్లాడి పరిష్కరించుకోవడానికి దారితీస్తుంది. • ఒక వ్యక్తిని గౌరవించడమంటే వారి వ్యక్తిత్వాన్ని గౌరవించడం. వారి స్వేచ్ఛకు, స్నేహాలకు విలువనివ్వడం. భార్యకు లేదా భర్తకు కూడా పర్సనల్ స్పేస్ ఉంటుందని గుర్తించడం. అది వారిని నచ్చిన పాటలు వినడం కావచ్చు, తన ఫ్రెండ్స్ తో మాట్లాడటం కావచ్చు. • మారుతున్న కాలంతో పాటు సంప్రదాయాల్లోనూ మార్పు వస్తుందని గుర్తించాలి. సంప్రదాయానికి, స్వేచ్ఛకు మధ్య సమతుల్యత సాధించాలి. అది ఒకరి పట్ల మరొకరికి అవగాహనను, నమ్మకాన్ని పెంచుతుంది. • సరిహద్దులను సెట్ చేయడం సవాలే. మీ భాగస్వామి ఒప్పుకోకపోవచ్చు. అది మీ బాధ్యత కాదు. మీ అంచనాలకు అనుగుణంగా స్థిరంగా ఉండండి. • మీ హద్దులు దాటితే పరిణామాలు ఎలా ఉంటాయో నిర్ణయించుకోండి. పరస్పర చర్చల ద్వారా హద్దులను సర్దుబాటు చేసుకోండి.ప్రియ, రోహిత్ లకు మూడు సెషన్లలో వీటిని వివరించి, వారి మధ్య ఉన్న అపోహలను తొలగించి, ఓపెన్ కమ్యూనికేషన్ డెవలప్ అయ్యేలా కొన్ని ఎక్సర్ సైజ్ లు చేయించాను. ఇప్పుడిద్దరూ చిలకాగోరింకల్లా జీవిస్తున్నారు. అప్పుడప్పుడూ వాట్సప్ లో పలకరిస్తుంటారు.సైకాలజిస్ట్ విశేష్+91 8019 000066psy.vishesh@gmail.com -
సహజీవనంలో ఆమెకు ఆ హక్కుందా?
ప్రియ, భార్గవ్.. మూడేళ్లుగా లివ్ ఇన్ టుగెదర్ రిలేషన్ లో ఉంటున్నారు. ఇద్దరూ ఒకే కంపెనీలో పనిచేసేవాళ్లు. ఆరు నెలల కిందట ప్రియకు ఉద్యోగం పోయింది. దాంతో ఇంటి బాధ్యత అంతా భార్గవ్దే. అయితే ప్రియ ఇటీవల భార్గవ్ ఏం చేసినా తప్పు పడుతోంది. ఎవరితో మాట్లాడనివ్వకుండా.. తనతో తప్ప ఎవరితో ఎక్కడికీ వెళ్లనివ్వకుండా కట్టడి చేస్తోంది. ఆఫీస్ అవసరాల రీత్యా భార్గవ్ కొలీగ్స్కి ఫోన్ చేసినా, ఫోన్ ని అతను అటెండ్ అయినా పెద్ద యుద్ధమే! గొడవలే! భరించలేక భార్గవ్ ఒకరోజు ‘ఈ టార్చర్ తట్టుకోవడం నా వల్ల కాదు.. నీతో కలసి ఉండలేను’ అన్నాడు. దాంతో ప్రియ ‘నాతో బ్రేకప్ చేసుకుంటే నీ మీద రేప్ కేసు పెడతా’ అని బెదిరించింది. హడలిపోయాడు భార్గవ్. నిజంగానే ప్రియకు ఆ హక్కు ఉందా?కొత్తగా అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత, సెక్షన్ 69 ప్రకారం.. ఏ వ్యక్తి అయినా పెళ్లి చేసుకునే ఉద్దేశం లేక΄ోయినా.. మోసపూరితంగా, ఓ పథకం ప్రకారం.. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ స్త్రీతో శారీరక సంబంధం నెరపితే.. సదరు పురుషుడికి పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. రేప్ అయితే యావజ్జీవం కూడా పడవచ్చు. జూన్ 30 వరకు అమల్లో ఉన్న పాత శిక్షాస్మృతి ప్రకారం కూడా పెళ్లి చేసుకుంటానని చెప్పి, మోసపూరితంగా స్త్రీతో శారీరకసంబంధం నెరపిన పురుషుడిపై ఐపీసీ 376, ఐపీసీ 420 సెక్షన్ లను కలిపి కేసు నమోదు చేసేవారు. అయితే, ఆ పురుషుడు మొదటినుంచీ మోసం చేసే ఉద్దేశంతోనే ఉన్నాడు అని రుజువుకాకపోతే మాత్రం దాన్ని రేప్గా పరిగణించలేమని హైకోర్ట్, సుప్రీంకోర్టు పేర్కొన్న సందర్భాలు, తీర్పులూ ఉన్నాయి. ఇలాంటి కేసుల్లో ముఖ్యంగా చూడాల్సినదేంటంటే.. పెళ్లి చేసుకునే ఉద్దేశం లేక΄ోయినా చేసుకుంటానని నమ్మించి కేవలం శారీరక సంబంధం కోసమే అతను లివ్ ఇన్లో ఉన్నాడా అనే అంశం. మొదట బాగానే ఉన్నాడు.. పెళ్లి చేసుకోవాలనే అనుకున్నాడు.. కానీ తర్వాత మనస్పర్థలు, భేదాభి్రపాయాలు వచ్చి విడి΄ోవాలనుకుంటున్నాడు అని రుజువైతే శిక్ష పడదు. భారతీయ న్యాయ సంహిత, సెక్షన్ 69 ప్రకారం కూడా లివ్ ఇన్ రిలేషన్ లోని పురుషుడు ‘మోసపూరితమైన ఆలోచనతోనే రిలేషన్ మొదలు పెట్టాడు’ అని రుజువు చేయాలి. అయితే ఈ కేస్ స్టడీలో భార్గవ్ మీద ప్రియ కేసు పెట్టే అవకాశం కచ్చితంగా ఉంది. అతను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇన్నాళ్లు లివ్ ఇన్ లో ఉండి ఇప్పుడు వద్దు అంటున్నాడని ప్రియ రుజువు చేయగలిగితే భార్గవ్కి పదేళ్లవరకు శిక్ష పడే అవకాశం ఉంది. అయితే సెక్షన్ 69 వలన సహజీవనం, ప్రేమ అనే అంశాలు ఆది నుంచీ అనుమానంతో మొదలయ్యే ప్రమాదం ఉంది. సహజీవనానికి ముందు లేదా కలసి ఉంటున్న క్రమంలో ఒకరిపై ఒకరు స్పష్టత తెచ్చుకోవడం అవసరం. ఇలాంటి రిలేషన్స్ వ్యక్తిగతమైనప్పటికీ, వీలైనంత మేర అందరికీ తెలిసేలా ఉండడం లేదా కనీసం సన్నిహితులకైనా తెలిసుండటం వల్ల కొంతవరకు రక్షణ కలగవచ్చు. – శ్రీకాంత్ చింతల, హైకోర్ట్ అడ్వొకేట్ -
అన్ని బంధాలకూ మూలం బాల్యంలోనే!
హలో ఫ్రెండ్స్,గతవారం సారా గురించి మాట్లాడుకున్నాం కదా. బాల్యంలో పేరెంట్స్, గార్డియన్స్, కుటుంబ సభ్యులతో ఉన్న అనుబంధం జీవితానికి ఒక పునాదిలా పనిచేస్తుంది. ఆ తర్వాత వివిధ వ్యక్తులతో సాన్నిహిత్యం, భావోద్వేగాలను నియంత్రించే సామర్థ్యం, సంఘర్షణలను పరిష్కరించుకునే సామర్థ్యాకు బ్లూప్రింట్ లా ఉంటుంది. వీటినే అటాచ్మెంట్ స్టైల్స్ అంటారు. జీవితంలో బలమైన కనెక్షన్ లను నిర్మించుకోవాలంటే వీటిని అర్థం చేసుకోవడం అవసరం.నాలుగు రకాలు... Secure Attachment: బాల్యంలో అనేక అవసరాలు ఉంటాయి. అన్నీ పిల్లలు చేసుకోలేరు. తల్లిదండ్రులు లేదా సంరక్షకుల అవసరం ఉంటుంది. ఆ అవసరాలను వెంటనే గుర్తించి, స్పందించి, సంరక్షించే పేరెంట్స్ ఉన్నప్పుడు పిల్లల్లో భద్రంగా ఉన్నామనే ఫీలింగ్ ఏర్పడుతుంది. అలా సెక్యూర్ అటాచ్మెంట్ స్టైల్ ఏర్పడుతుంది. వయసుతో పాటు అదీ పెరుగుతూ ఇతరులతో బంధాలను ఏర్పరచుకోవడంలో దిక్సూచిలా పనిచేస్తుంది. ఈ అటాచ్మెంట్ స్టైల్ ఉన్నవారు తమకు ఏ కష్టం వచ్చినా తన జీవిత భాగస్వామి అందుబాటులో ఉంటారని నమ్ముతారు. తమ మనసులోని భావాలు ఎలాంటివైనా నేరుగా కమ్యూనికేట్ చేస్తారు. తన లైఫ్ పార్టనర్ తో సాన్నిహిత్యంగా, సుఖంగా ఉంటారు. అందరితోనూ సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు.Anxious Attachment: బాల్యంలో పేరెంట్స్ లేదా గార్డియన్స్ అందుబాటులో లేకపోవడం, ఉన్నా పట్టించుకోకపోవడం, అవసరాలను గుర్తించకపోవడంతో... తనను ఎవరూ పట్టించుకోవడంలేదు, వదిలేస్తారనే భయం, ఆతృత ఏర్పడుతుంది. ఆ భయం వారి జీవితాంతం ఉంటుంది. అందుకే మనసులోని భావాలను నేరుగా చెప్పలేరు. చెప్తే తమను వదిలివేస్తారనే భయం వారిని వెంటాడుతూ ఉంటుంది. పార్టనర్ మౌనంగా ఉంటే అది తిరస్కారంగా భావిస్తారు. ‘నేనంటే ఇష్టంలేదా?’ అని పదే పదే అడుగుతారు. చాలా ఇష్టమని చెప్పినా సంతృప్తి చెందరు. వదిలేస్తారేమోనని భయపడుతుంటారు. దాంతో మరింత దగ్గరగా అతుక్కుపోతారు. మరోవైపు పార్టనర్ చర్యలను తప్పుగా అర్థం చేసుకుంటారు. అసూయ, అభద్రత వంటి వారిని కంట్రోల్ చేసుకోవడానికి కష్టపడుతుంటారు. ఇలాంటివారికి భరోసా ఇవ్వడం పార్టనర్ కు తలకు మించిని భారమవుతుంది. సారా సమస్య ఇదేనని గుర్తొచ్చిందా?Avoidant Attachment: కొందరు పేరెంట్స్ పిల్లలను పట్టించుకోరు, దూరంగా పెడుతుంటారు. వాళ్లేం చేసినా నిరుత్సాహపరుస్తుంటారు. అందువల్ల పిల్లలు వారితో సాన్నిహిత్యంగా ఉండలేరు. ఎమోషన్స్ ను వ్యక్తం చేయలేరు. అలా వ్యక్తంచేయడం అసౌకర్యంగా భావిస్తారు. స్వతంత్రంగా ఉండలేరు. ఒంటరిగా ఫీలవుతుంటారు. అలా ఈ అటాచ్మెంట్ స్టైల్ అభివృద్ధి చెందుతుంది. ఇలాంటి అటాచ్మెంట్ స్టైల్ ఉన్నవారు ఏదీ ఓపెన్ గా మాట్లాడలేరు. మానసికంగా దూరంగా ఉంటారు. తరచూ పోట్లాడుతుంటారు. ఒంటరిగా ఫీలవుతుంటారు. వీరితో ఎలా వ్యవహరిస్తే ఏమవుతుందోనని పార్టనర్ గందరగోళానికి గురవుతారు.Disorganized Attachment: కొందరు పేరెంట్స్ లో తెలియని భయాలు ఉంటాయి. దాంతో వారి ప్రవర్తన ఎప్పడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఇలాంటి పేరెంట్స్ దగ్గర పెరిగిన పిల్లల్లో ఇలాంటి అటాచ్మెంట్ స్టైల్ అభివృద్ధి చెందుతుంది. వీరు ఇతరులతో సాన్నిహిత్యం కోరుకుంటారు. కానీ వాళ్లను విశ్వసించాలంటే తీవ్రమైన భయం. దాంతో వారి బంధాలు, అనుబంధాలు అస్థిరంగా ఉంటాయి. వారి భావోద్వేగ ప్రతిస్పందనలు అనూహ్యంగా ఉంటాయి. వీరికి ఎమోషనల్ సెక్యూరిటీ అందించడంలో పార్టనర్స్ ఇబ్బందులు పడుతుంటారు.మరేం చెయ్యాలి?సరే సర్. అటాచ్మెంట్ స్టైల్స్ రిలేషన్ షిప్ డైనమిక్స్ ను ప్రభావితం చేస్తాయంటున్నారు సరే, ఇప్పుడేం చెయ్యాలి? అని మీరు అనిపించవచ్చు. బాల్యంలో ఏర్పడిని అటాచ్మెంట్ స్టైల్స్ అలాగే శిలేసుకుని కూర్చోవు. వాటిపట్ల అవగాహన పెంచుకుని, మార్చుకునేందుకు ప్రయత్నం చేస్తే మారతాయి. సైకాలజిస్ట్ సహాయంతో సురక్షితమైన అటాచ్మెంట్ స్టైల్ ను అభివృద్ధి చేసుకోవచ్చు. గతవారం సారా కేసులో జరిగింది ఇదే. అందుకోసం ముందుగా మీరేం చేయాలో చెప్తా.• మీ అటాచ్మెంట్ శైలిని గుర్తించడం అనేది హెల్తీ కనెక్షన్లను నిర్మించుకోవడంలో తొలి అడుగు. మీ శైలిని అర్థం చేసుకోవడం వల్ల మీ ప్రవర్తనకు మూల కారణాలను గుర్తించవచ్చు. మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేసేందుకు సైకాలజిస్ట్ సహాయపడతారు. • మనం మొదటివారం చెప్పుకున్నట్లు అన్ని బంధాలూ మీ సెల్ఫ్ ఎస్టీమ్ పైనే ఆధారపడి ఉంటాయి. మీపై మీకు గౌరవం, విశ్వాసం ఉంటే ఇతరులపై ఆధారపడటం తగ్గిస్తుంది. సురక్షితమైన అనుబంధాన్ని సులభతరం చేస్తుంది• నిజాయితీతో కూడిన ఓపెన్ కమ్యూనికేషన్ స్కిల్స్ను పెంపొందించడం విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. రిలేషన్స్ లో వచ్చే సంఘర్షణలను సమర్థంగా పరిష్కరించుకునేందుకు, మీ అవసరాలను నేరుగా వ్యక్తీకరించేందుకు ఉపయోగపడుతుంది. • బంధాలలో ఏది ఓకేనో, ఏది నాట్ ఓకేనో స్పష్టమైన సరిహద్దులను సెట్ చేయడం మీ ఎమోషనల్ వెల్ బీయింగ్ ను కాపాడుతుంది. పరస్పరం గౌరవప్రదంగా ఉండేలా ప్రోత్సహిస్తుంది. • రిలాక్సేషన్ టెక్నిక్స్, మైండ్ఫుల్నెస్ ప్రాక్టీసెస్ వంటివి మీ భావోద్వేగ నియంత్రణను మెరుగుపరుస్తాయి. నెగెటివ్ ఎమోషన్స్ మీ సంబంధాలను దెబ్బతీయకుండా కాపాడతాయి. • బంధాలకు సంబంధించిన నెగెటివ్ ఆలోచనా విధానాలకు గుర్తించడానికి, వాటిని మార్చుకోవడానికి కాగ్నిటివ్-బిహేవియరల్ థెరపీ (CBT) ఉపయోగపడుతుంది. మీ ఎమోషనల్ రెగ్యులేషన్ కు, సెల్ఫ్ కంపాషన్ పెంపొందించడానికి కోపింగ్ మెకానిజమ్లను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది.సైకాలజిస్ట్ విశేష్+91 8019 000066psy.vishesh@gmail.com -
‘డిజైన్డ్’ సంసారం! సిటీలో స్థిరపడుతున్న సహజీవన సంస్కృతి!!
కలిసి జీవనం ప్రారంభించడం, బాధ్యతలు, వ్యయాలు సమానంగా పంచుకోవడం, పరస్పర వ్యక్తిగత ఇష్టాయిష్టాలను గౌరవించుకోవడం, ఒకరిపై ఒకరు ఆధిపత్యం చలాయించకపోవడం, ఇష్టమున్నంత కాలం కలిసి ఉండడం, ఇద్దరిలో ఎవరు వద్దనుకున్నా సింపుల్గా ‘బై..బై’ చెప్పేయడం.. ఇదే ‘లివిన్’. సహజీవనంతో మరింత బలపడిన అనుబంధాన్ని పెళ్లితో చట్టబద్దం చేసుకుంటున్నవారూ లేకపోలే దు.. అయితే కొంతకాలం అనుబంధం తర్వాత విడిపోయి కూడా ఫ్రెండ్స్గా కొనసాగే వారూ ఉన్నారు.ఇటీవల యువ అనుబంధాలపై లయన్స్ గేట్ ప్లే అనే సంస్థ స్వతంత్ర అధ్యయనం నిర్వహించింది. ‘లయన్స్గేట్ ప్లే రిలేషన్ షిప్ మీటర్’ పేరిట విడుదల చేసిన అధ్యయన ఫలితాల్లో అత్యధికులు లివిన్ రిలేషన్ షిప్స్కి జై కొడుతున్నారు. ఆ అధ్యయనం వెల్లడించిన విశేషాలను పరిశీలిస్తే... – సాక్షి, సిటీబ్యూరోశాశ్వత సంబంధాలను ఏర్పరచుకోవడానికి బదులు వారు లివిన్ రిలేషన్ షిప్ వంటి ప్రత్యామ్నాయ మార్గాలనే ఆధునికులు ఎంచుకుంటున్నారు. భాగస్వామిని అర్థం చేసుకోవడానికి పెళ్లికన్నా లివిన్ రిలేషన్ షిప్లో ఉండటం మేలని 50 శాతం మంది అంటున్నారు. ఈ రిలేషన్ షిప్లో ఉండటానికి తల్లిదండ్రులు అంగీకరిస్తారని 34% మంది భావిస్తున్నారు.భార్య, భర్త కాదు.. ఓన్లీ ఫ్రెండ్స్..ప్రేమను కొనసాగించడానికి స్నేహమే మూలమని నవతరం నమ్ముతున్నారు. ఆ మధ్య ప్రేమ అంటే స్నేహం అని అర్థం చెప్పిన బాలీవుడ్ హీరో షారుఖ్ఖాన్ అభిప్రాయం సరైనదేనని 87 శాతం మంది పురుషులు 92 శాతం మహిళలు భావిస్తున్నారు. విడిపోయిన తర్వాత కూడా స్నేహితులుగా కొనసాగొచ్చు అంటూ ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు తమ మాజీ ప్రియుడితో స్నేహం చేయడం మంచిదంటున్నారు. కేవలం 30% మంది భారతీయులు మాత్రమే తమ భాగస్వామి అపోజిట్ సెక్స్కి చెందిన క్లోజ్ ఫ్రెండ్ని కలిగి ఉండటం పట్ల అసౌకర్యంగా ఉన్నారు.ఎంపికలో కీలకం ఇవే..భాగస్వామి ఎంపికలో భావోద్వేగ సంబంధం కన్నా అందానికే 50 శాతం మంది పురుషులు ప్రాధాన్యత ఇస్తుండగా మహిళలు 35 శాతం మంది మాత్రమే లుక్స్కి విలువ ఇస్తున్నారు. ఆర్థికంగా సురక్షితంగా ఉండే రిలేషన్ షిప్లోకి మాత్రమే ప్రవేశించాలని 72 శాతం మంది భావిస్తున్నారు. ఇంటి ఖర్చులను జంటగా పంచుకోవాలని 50 శాతం మంది మహిళలు అంటుంటే 37 మంది పురుషులు మాత్రమే దీనిని అంగీకరిస్తున్నారు.బ్రేకప్.. వాట్ నెక్ట్స్?అనుబంధాలు ముక్కలయ్యాక ఏమిటి పరిస్థితి? హృదయం ముక్కలైపోతుందేమోనని, ఒంటరిగా ఉండడం కష్టమని, మళ్లీ ప్రేమ దొరకదేమోననే భయాల్లో 60 శాతం మంది ఉన్నారు. అయితే ఈ విషయంలో పురుషులు ఎమోషనల్గా కనిపిస్తుండగా, మహిళలు ఆచరణాత్మకమైన విధానాన్ని ఎంచుకుంటున్నారు. 53% మంది మహిళలు ‘మాజీని మరచిపోయి ముందుకు సాగుదాం’ అనే వైఖరిని కలిగి ఉన్నారు. కానీ 66% మంది పురుషులు తమ మొదటి ప్రేమకు తిరిగి వెళ్లడానికి ఇష్టపడుతున్నారు.అలాగే 37% మంది విడిపోయిన తర్వాత కూడా భాగస్వామితో కలిసి ఒకే ఇంట్లో నివసించడంలో తప్పు లేదని అభిప్రాయపడ్డారు. అయితే రిలేషన్ను తిరిగి నిర్మించుకోవడం కంటే ముగించుకోవడమే సులభమని 33 నుంచి 38 సంవత్సరాల వయస్సు గల వారిలో 72% మంది 27 నుంచి 32 సంవత్సరాల వయస్సు గల వారిలో 67% మంది అంగీకరిస్తున్నారు. అలాగే అనుబంధం ముగిశాక ముందుకు సాగడానికి కొత్త బంధాన్ని ప్రారంభించడం ఉత్తమమని 48% మంది భావిస్తున్నారు.తారా పథంలో..ఫ్యాషన్ల నుంచి ఎమోషన్ల వరకూ దేనికైనా సరే అపరిమితమైన ఫాలోయింగ్ రావాలంటే.. దాన్ని సెలబ్రిటీ ఆదరించాలి. ఈ లివిన్ రిలేషన్íÙప్ విషయంలో కూడా అదే జరిగింది. చాలామంది నటీనటులు ఇలా ‘కలిసి జీవించడం’ కనిపిస్తోంది. దాన్ని అనుసరిస్తూ కార్పొరేట్, ఐటీ కంపెనీలు అధికంగా ఉన్న బెంగుళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో పెళ్లికి ప్రత్యామ్నాయంగా యువత ఈ అనుబంధం ఏర్పరచుకుంటున్నారు. అప్పట్లో హాలీవుడ్లో బ్రాడ్పిట్, ఏంజెలినా జోలి నుంచీ ప్రీతిజింతా, సుస్మితాసేన్, సంజయ్దత్లతో పాటు కరీనా–సైఫ్ అలీఖాన్ ఇంకా ఎందరెందరో ఈ కల్చర్ని కలర్ఫుల్గా మార్చారు.నగరంలో స్థిరపడిన సంస్కృతి..వుయ్ ఆర్ మ్యారీడ్ అన్నంత సహజంగా వుయ్ ఆర్ ఇన్ రిలేషన్ షిప్ అంటున్నాయి జంటలు. ఆ అనుబంధం పేరే లివిన్. ‘లివింగ్ టు గెదర్’ తెలుగీకరిస్తే ‘సహజీవనం’. వివాహంతో పనిలేకుండా, జీవితాంతం కలిసి జీవిస్తామని ప్రమాణాలు చేసుకోకుండా, స్త్రీ–పురుషుడు కలిసి ఉండడమే ‘లివిన్ రిలేషన్íÙప్’. భిన్న సంస్కృతుల నిలయమైన నగర జీవనంలో వైవాహిక బంధానికి ప్రత్యామ్నాయంగా ఈ సరికొత్త సంస్కృతి స్థిరపడిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది.పెరుగుతున్న మోసాలు.. గతంలో మహిళా కమిషన్ వర్గాలు వెల్లడించిన డేటా ప్రకారం.. లివ్ ఇన్కు సంబంధించిన మోసాలు తెలుగు రాష్ట్రాల్లో పెరిగినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి, తెలంగాణలోని రంగారెడ్డి ఈ విషయంలో పోటీ పడుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో అగ్రగామిగా హైదరాబాద్ నిలిచింది. లివిన్ చీటింగ్ కేసుల్లో 47 శాతం ఒక్క హైదరాబాద్ నగరంలోనే చోటు చేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని మహిళా కౌన్సిలింగ్ కేంద్రాలకు ఒక్క ఏడాదిలోనే 2వేలకు పైగా ఫిర్యాదులు వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు.జాగ్రత్తలు తప్పనిసరి..ఏదేమైనా తప్పుకాదనుకునో, తప్పనిసరిగానో ఈ అనుబంధంలోకి అడుగుపెడుతున్నవారు పలు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. భాగస్వామి మరణించినా, మరే కారణం చేత దూరమైనా చట్టపరమైన ఇబ్బందులు రాకుండా ఉండాలంటే.. ‘లివిన్’ కొనసాగుతున్నప్పుడు అర్జించిన ఉమ్మడి ఆదాయాలకి సంబంధించిన ఒప్పందాలు, స్థిర, చరాస్తుల పంపకాలకు సంబంధించిన ఒప్పందాలను ముందుగానే రాసుకోవడం మంచిదని న్యాయనిపుణులు సూచిస్తున్నారు.పుట్టిన పిల్లలకు కూడా మున్ముందు సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడాల్సి ఉంది. అనూహ్యమైన ప్రమాదాలతో భాగస్వామి ఆస్పత్రి పాలైతే అవసరమైన సేవలు అందించడానికి, చికిత్సకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి బాధితవ్యక్తి తల్లిదండ్రులు, బంధువుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాలి. మెడికల్ పవర్ ఆఫ్ అటారీ్నని ముందుగా రాయడం ద్వారా అధిగమించవచ్చు.‘లివిన్’కు కారణాలెన్నో..నగరం ఈ తరహా బంధాలకు నెలవుగా మారుతోంది. సినిమా, మోడలింగ్, ఎంటర్టైన్మెంట్, టీవీ, మీడియా, ఐటీ, సాఫ్ట్వేర్.. రంగాలకు చెందిన యువతీ యువకులు ఈ అనుబంధంవైపు తేలికగా ఆకర్షితులవుతున్నారు.మహిళలు, పురుషులు ఎవరికి వారు వ్యక్తిగత కెరీర్ను, విజయాలను కోరుకోవడం, కెరీర్ను కొనసాగిస్తూనే భావోద్వేగపూరిత బలమైన అనుబంధాన్ని కోరుకుంటున్నారు.వ్యక్తిగత ఖర్చులు భరించలేక రూమ్ షేర్ చేసుకోవడంతో మొదలై ‘లివిన్’గా మారుతోంది.పబ్స్ నుంచి క్లబ్స్ వరకూ ‘స్టాగ్స్ నాట్ అలవ్డ్’ అని బోర్డు పెడతారు. దీంతో రోజుకొకర్ని వెంటేసుకుని వెళ్లేకన్నా.. స్థిరంగా ఉండే బాయ్ఫ్రెండ్/గరల్ ఫ్రెండ్ మిన్న అని భావించడం.పెళ్లిద్వారా పరస్పరం సంక్రమించే హక్కుల పట్ల భయం.చట్టబద్దమైన బంధంలోకి వెళ్లే ముందుగా తమ భాగస్వామిని అర్థం చేసుకోవాలనుకోవడం.ఈ కొత్త తరహా జీవనశైలి మానసిక సంఘర్షణకు, తీవ్ర ఒత్తిడికీ దారి తీస్తాయి. అద్దె ఇంటి దగ్గర్నుంచి ఆఫీసు వ్యవహారాల వరకూ పెళ్లికాని కాపురం చేయాలనుకునే యువత చాలా సమస్యలే ఎదుర్కోవాల్సి వస్తుంది. ‘వివాహం కంటే బలమైన అనుబంధం తమ మధ్య ఉందనుకున్నప్పుడు మిగిలిన విషయాలకు అంతగా ప్రాముఖ్యత ఇవ్వకూడదు. అలాగే ఆవేశంలోనో, ఫ్యాషన్గానో, సహజీవనంలోని లోతుపాతులు తెలియకుండా అడుగుపెట్టడం సహజీవనంలోకి అడుగుపెట్టడం మంచిది కాదు’ అంటారు రచయిత్రి ఓల్గా. ఫిర్యాదులు ఇలా..నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో గత ఫిబ్రవరి 18న ఈవెంట్ ఆర్గనైజర్ సేవలు అందించే 30ఏళ్ల మహిళ తన భాగస్వామి ఖాలిద్ చిత్రహింసలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది.గత ఏప్రిల్ 1న గచ్చి»ౌలిలోని ఓ ఆపార్ట్మెంట్లో నివసిస్తున్న లివ్ ఇన్ కపుల్ మధ్య వ్యక్తిగత విబేధాలు తారాస్థాయికి చేరడంతో ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో ఆ అమ్మాయిది చత్తీస్గఢ్ కాగా అబ్బాయిది బీహార్ కావడం గమనార్హం.అనురాథారెడ్డి అనే మహిళ తనకన్నా వయసులో చిన్నవాడైన చంద్రమోహన్ అనే వ్యాపారితో రిలేషన్ షిప్లో ఉంటూ హత్యకు గురయ్యారు. ముక్కలైన ఈమె మృతదేహాన్ని గతేడాది మే 25న పోలీసులు కనుగొన్నారు.లివిన్ రిలేషన్ షిప్లో ఉంటూ తమ జల్సాలు తీర్చుకోవడం కోసం మ్యాట్రిమోనియల్ పేరిట అబ్బాయిలకు వలవేస్తున్న యువతిని, ఆమె లివిన్ పార్ట్నర్ని రాచకొండ పోలీసులు 2022 డిసెంబరు 18న అరెస్ట్ చేశారు.గతేడాది జూలై 23న ఫిలింనగర్కు చెందిన సెక్యూరిటీ గార్డ్ శివకుమార్ తన లివిన్ పార్ట్నర్తో వచి్చన విబేధాల కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.మహిళల పక్షపాతిగా మారిన కొన్ని చట్టాలు అబ్బాయిల్ని పెళ్లికి విముఖులుగా మార్చి, ఈ బంధం వైపు ప్రేరేపిస్తున్నట్టు తెలుస్తోంది.ఆడవాళ్లకే నష్టం ఎక్కువ..ఏదేమైనా, ఇందులో పార్ట్నర్స్ ఇద్దరికీ ఎటువంటి హక్కులూ ఉండవు. ‘సహజీవనం’ విఫలమై మా వద్దకు వస్తున్న మహిళలు కొంత కాలం కలిసి జీవించాక విడిపోతే మనోవర్తి వస్తుందా? అని అడుగుతున్నారు. ఈ బంధానికి చట్టపరమైన రక్షణ లేకపోవడం వల్ల ఆడవాళ్లకే నష్టం ఎక్కువ జరుగుతోంది. – నిశ్చలసిద్ధారెడ్డి, హైకోర్టు అడ్వకేట్ఇవి చదవండి: స్పేస్–టెక్ స్టార్టప్ ‘దిగంతర’ రూపంలో సాకారం.. -
వదిలేస్తారనే భయంతో పెళ్లికి దూరం..
సారా 28 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఇంజినీర్. ఇంకా పెళ్లి కాలేదు. ఇప్సటికైనా పెళ్లి చేసుకోమని పేరెంట్స్ నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తోంది. పెళ్లంటే సారాకేం వ్యతిరేకత లేదు. కానీ భయం. ఎందుకంటే ఇప్పటివరకూ తాను ఐదుగురితో డేటింగ్ చేసింది. మొదట్లో అతను చూపించే కేర్, లవ్, అఫెక్షన్ అంతా బాగానే ఉంటుంది. అతని సాన్నిహిత్యంలో జీవితం భద్రంగా ఉంటుందని ఫీలవుతుంది. కానీ బంధం బలపడేకొద్దీ సారా ప్రవర్తన మారుతుంది. అతను తనను వదిలేస్తాడేమోననే భయం మొదలవుతుంది. దాంతో పొసెసివ్ గా మారుతుంది. అతని బిహేవియర్ మొత్తం తన కంట్రోల్ లో ఉండాలనుకుంటుంది. అలా లేకపోతే ఏమాత్రం ఆలోచించకుండా అతనికి దూరమవుతుంది. మళ్లీ అతను బ్రతిమలాడినా వెనక్కు వెళ్లదు. ఇలాగా ఐదుగురితో డేటింగ్ చేసి, పెళ్లి చేసుకుందామనుకుని, చివరకు వదిలేసింది. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి పెరగడంతో, అసలు తన బిహేవియర్ లో ఏమైనా సమస్య ఉందేమో తెలుసుకునేందుకు కౌన్సెలింగ్ కు వచ్చింది.అప్పటి బాధ.. ఇప్పుడు భయం..సారా చెప్పింది విన్నాక, ఆమె బాల్యం, పెరిగిన వాతావరణం గురించి అడిగాను. పేరెంట్స్ ఇద్దరూ ఇంజినీర్లేనని, ఎప్పుడూ బిజీగా ఉంటేవారని, ముగ్గురం ఇంట్లోనే ఉన్నా ఒకరికొకరం దూరంగా ఉన్నట్లు ఉండేదని చెప్పింది. ఎమోషనల్ గా పేరెంట్స్ అందుబాటులో లేకపోవడం సారాలో అభద్రతా భావాన్ని కలిగించింది. ఆప్యాయత కోసం ఆమె మనసు ఆరాటపడేది. బాల్యంలో సారా తల్లిదండ్రులతో అనుభవించిన ఎమోషనల్ డిస్టెన్స్ ఆమెతో పెరిగి పెద్దదయ్యింది. ఇప్పుడు డేటింగ్ చేసినవాడు తనను వదిలివేస్తాడనే భయంగా మారింది. ఆ భయం పుష్-పుల్ డైనమిక్స్ గా వ్యక్తమవుతోంది. అంటే ఆప్యాయత కోసం దగ్గరవ్వడం, దూరమవుతారనే ఆందోళనతో దూరమవ్వడం. దీన్నే యాంగ్జయిటీ అటాచ్మెంట్ స్టైల్ అంటారు.బాల్యంలో పేరెంట్స్ వల్ల ఏర్పడే అటాచ్మెంట్ స్టైల్ కు ఆ తర్వాత జీవితంలో ఏర్పడే రిలేషన్షిప్స్ లో సంతృప్తికి సంబంధం ఉందని పరిశోధనల్లో తేలింది. సారా వంటి అటాచ్మెంట్ స్టైల్ ఉన్న వ్యక్తులు నమ్మకం, సాన్నిహిత్యం పోరాడతారు. వదిలివేస్తారనే భయం ఎమోషనల్ రోలర్ కోస్టర్ కు దారితీస్తుంది. చివరకు సారాలా ఏ బంధంలోనూ నిలబడలేరు. ఆరు నెలల్లో ఆందోళన దూరం... కాగ్నిటివ్-బిహేవియరల్ థెరపీ (CBT): సారాతో మాట్లాడి ఆమె సమస్యను అర్థం చేసుకున్నాక థెరపీ ప్రారంభించాను. తనను వదిలివేస్తారనే నెగెటివ్ థాట్స్ ను గుర్తించడానికి, సవాలు చేయడానికి సీబీటీ పద్ధతులు ఆమెకు సహాయపడ్డాయి. ఉదాహరణకు ‘‘అతను నన్ను విడిచిపెడతాడు’’ అని ఆలోచించే బదులు, దాన్ని రీఫ్రేమ్ చేసి ‘‘ఈ రిలేషన్షిప్ పనిచేయకపోవచ్చు, అలాగని నేనేం ఒంటరిగా ఉండిపోను, హేండిల్ చేయగలను’’ అని ఆలోచించడం. ఎమోషనల్ రెగ్యులేషన్ స్కిల్స్: సారా తన ఎమోషన్స్ ను, ముఖ్యంగా వదిలివేస్తారనే యాంగ్జయిటీని మేనేజ్ చేసుకోవడానికి మైండ్ఫుల్నెస్ వంటి టెక్నిక్స్ నేర్పించాను. భయాన్ని హడావుడిగా డీల్ చేయకుండా, మాట్లాడి పరిష్కరించుకోవడం నేర్చుకుంది.ఆత్మగౌరవాన్ని పెంపొందించడం: సెల్ఫ్ వర్త్, సెల్ఫ్ ఎస్టీమ్ పెంపొందించే కార్యకలాపాలు ప్రోత్సహించాను. తన విలువ తాను తెలుసుకోవడం ద్వారా ఇతరుల అప్రూవల్ పై ఆధారపడటం తగ్గింది. సురక్షిత బంధానికి మార్గం: థెరపీ సాగేకొద్దీ సారా ప్రవర్తనలో మార్పులు వచ్చాయి. తన అవసరాలను స్పష్టంగా కమ్యూనికేట్ చేయడం, ఆందోళనను సమర్థంగా నిర్వహించడం నేర్చుకుంది. సెల్ప్ అవేర్నెస్, ఎమెషనల్ కంట్రోల్ రావడం ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. ఆరు నెలల తర్వాత సారా డేవిడ్ను కలుసుకుంది. క్రమక్రమంగా వారి బంధం బలపడింది. డేవిడ్ పర్సనల్ స్పేస్ ను గౌరవిస్తూ సారా తన అవసరాలను స్పష్టంగా చెప్పింది. తనను వదిలివేస్తాడనే యాంగ్జయిటీని అధిగమించగలిగింది. మూణ్నెళ్ల కిందట పెళ్లి కూడా చేసుకుంది. అఫ్కోర్స్, ఇద్దరూ వచ్చి పెళ్లికి పిలిచారు, వెళ్లి ఆశీర్వదించి వచ్చాను.సారా బాల్యంలో ఏర్పడిన అటాచ్మెంట్ స్టైల్, దానివల్లనే రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ వచ్చాయని అర్థం చేసుకోవడం ఈ కేసులో కీలకం. ఆ తర్వాతే థెరపీ. అందుకే వచ్చేవారం అటాచ్మెంట్ స్టైల్స్ గురించి, వాటి ప్రభావం గురించి మరితం వివరంగా తెలుసుకుందాం. అప్పటివరకూ హ్యాపీ వీకెండ్.సైకాలజిస్ట్ విశేష్8019 000066psy.vishesh@gmail.com -
బంధాలే నిజమైన బలం
హాయ్ ఫ్రెండ్స్.. వెల్కమ్ టూ "కనెక్షన్ కార్నర్". ఇది మనం కలిసి ఒక కప్పు కాఫీ తాగుతూ మనసువిప్పి మాట్లాడుకునే ప్రాంతం. కాఫీ తాగుతూ ఏం మాట్లాడుకుంటాం? లైఫ్ గురించి మాట్లాడుకుంటాం. దాన్లోని కష్టసుఖాలను పంచుకుంటాం. అలా మాట్లాడుతూ మాట్లాడుతూ, భావాలను పంచుకుంటూ అనుబంధాన్ని పెంచుకుంటాం. ఇక్కడ కూడా అదే పని చేద్దాం. మన జీవితంలో అతి ముఖ్యమైన పాత్ర పోషించే రకరకాల మానవ సంబంధాల గురించి మాట్లాడుకుందాం.మానవ సంబంధాలు మనం పీల్చే ఆక్సిజన్ లాంటివి. గాలి పీల్చుకోవడానికి మనం ప్రత్యేకంగా ఎలాంటి ప్రయత్నమూ చేయం, కానీ ఆ గాలి మనం జీవించడానికి అత్యవసరం. బంధాలు కూడా అలాంటివే. మన శారీరక, మానసిక, భావోద్వేగ ఆరోగ్యం బాగుండాలంటే రిలేషన్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయని అనేక అధ్యయనాల్లో రుజువైంది.బంధాలే జీవితం..జీవితాన్ని విశాలమైన సముద్రంలా ఊహించుకోండి. సవాళ్లు, సంతోషాల కెరటాల మధ్య మనల్ని నిలబెట్టే లైఫ్ బోట్లే మన బంధాలు, బాంధవ్యాలు. మనం పుట్టిన క్షణంలో ఏడ్చే మొదటి ఏడుపు కనెక్షన్ కోసం తొలి పిలుపు. వెంటనే అమ్మ పాలు ఇస్తుంది, మన కడుపు నింపుతుంది. ఆ తర్వాత నాన్న మన అవసరాలన్నీ కనిపెట్టి తీరుస్తాడు. వయసు పెరిగే కొద్దీ ఈ కనెక్షన్ అవసరం తగ్గదు, కేవలం పరిణామం చెందుతుంది. ఆహారం, భద్రత వంటి ప్రాథమిక అంశాల తర్వాత వచ్చే ఆకలి ప్రేమ. ఇక్కడే బంధాలు, అనుబంధాలు మన జీవితాన్ని వెచ్చదనంతో నింపుతాయి.మానసిక ఆరోగ్యానికి కూడా కీలకం..మీ ఫ్రెండ్ తో మనసువిప్పి మాట్లాడితే మీ మనసెంత తేలికవుతుందో, మీ గుండెల్లో భారం ఎలా తగ్గిపోతుందో ఎప్పుడైనా గమనించారా? నేనేదో కవిత్వం చెప్తున్నా అనుకోకండి. డబ్బు లేదా కీర్తికంటే సన్నిహిత సంబంధాలే ప్రజలను జీవితకాలం సంతోషంగా ఉంచుతాయని... ఒకటికాదు రెండు కాదు 75 సంవత్సరాల పాటు జరిపిన ‘హార్వర్డ్ స్టడీ ఆఫ్ అడల్ట్ డెవలప్మెంట్’లో కనుగొన్నారు. జీవితంలో అసంతృప్తుల నుంచి మానవ బంధాలే రక్షిస్తాయి.మనం స్నేహితులతో మాట్లాడినప్పుడు, మన మెదడు ఆక్సిటోసిన్ను విడుదల చేస్తుంది, ఈ మాయా రసాయనం మన ఒత్తిడిని తగ్గించడమే కాదు, మనం ప్రేమించేలా చేస్తుంది. అందుకే దీన్ని "కడ్ల్ హార్మోన్" అని పిలుస్తారు. అమెరికన్ జర్నల్ ఆఫ్ సైకియాట్రీలో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం, బలమైన సోషల్ నెట్వర్క్లు ఉన్న వ్యక్తులు నిరాశ, ఆందోళనతో బాధపడే అవకాశం తక్కువ. మన సంబంధాలు మానసిక ఆరోగ్యానికి విటమిన్ల లాంటివి, జీవితంలో ఎదురయ్యే తుఫానులను తట్టుకునేలా తయారుచేస్తాయి. ఆరోగ్యానికి బూస్టర్లు..మీ శరీరాన్ని తోటలా భావించండి. ఆ తోట పుష్పించడానికి సహాయపడే కాంతి, నీరే బంధాలు. బలమైన సామాజిక సంబంధాలు ఉన్న వ్యక్తులు ఆరోగ్యంగా మరియు ఎక్కువ కాలం జీవిస్తారని పరిశోధనలు చెబుతున్నాయి. ధూమపానం, ఊబకాయంలానే ఒంటరితనం కూడా ప్రాణాంతకం కావచ్చని ఒక అధ్యయనం కనుగొంది. తోటలో రకరకాల మొక్కలు, పువ్వులు ఉన్నట్లే... జీవితంలోనూ వివిధ రకాల సంబంధాలతో వర్ధిల్లుతాయి. స్నేహితులు రంగురంగుల పువ్వుల్లా ఆనందాన్నిస్తారు. కుటుంబసభ్యులు మర్రిచెట్లులా చల్లని నీడను అందిస్తారు. వృత్తిపరమైన కనెక్షన్ లు పొద్దుతిరుగుడు పువ్వుల్లా దిశను అందిస్తాయి. శృంగార బంధాలు గులాబీల్లా జీవితానికి అందాన్ని, ఆనందాన్ని, సుఖాన్ని అందిస్తాయి.బంధాల తోటను సాగుచేద్దాం.. జీవితంలో కనెక్షన్లు ఎంత ముఖ్యమైనవో అర్థమైంది కదా. వాటిని ఎలా పెంచుకోవాలి? తోటను పెంచడానికి సంరక్షణ ఎంత అవసరమో బంధాన్ని కాపాడుకోవడానికి కూడా అంతే అవసరం. మట్టిని తేమగా ఉంచే నీరులాంటిది కమ్యూనికేషన్. సూర్యకాంతి లాంటిది సహానుభూతి. వివాదాలను పరిష్కరించుకోవడమంటే కలుపు మొక్కలను తీసివేయడం లాంటిది. ఆరోగ్యకరమైన తోటలాంటి బంధాలు పెరగాలంటే ఇవన్నీ అవసరం. కానీ బంధాలు, అనుబంధాలు కరువైన కుటుంబాల్లో పెరిగిన పిల్లలు బాల్యంలో బాధపడటమే కాదు, పెరిగి పెద్దయ్యాక కూడా ఆ సమస్యలను మోసుకెళ్తారు. విద్య, ఉద్యోగ, వైవాహిక జీవితాలను బాధామయం చేసుకుంటారు.అందుకే మనం "కనెక్షన్ కార్నర్"లో అన్ని రకాల బంధాల గురించి మాట్లాడుకుందాం. వాటిలో వచ్చే తప్పులను తెలుసుకుందాం, సరిదిద్దుకుందాం, జీవితాన్ని ఆనందమయం చేసుకుందాం. మీరు ఆనందమయమైన కనెక్షన్ లను పెంపొందించుకోవడానికి మీకు సహాయపడే చిట్కాలు, సలహాలు, శాస్త్రీయ సమాచారం అందించేందుకు నేను ఎదురుచూస్తుంటాను. వచ్చేవారం కలుసుకుందాం.మీ.. సైకాలజిస్ట్ విశేష్8019 000066psy.vishesh@gmail.com -
రీల్ విలన్తో టాలీవుడ్ హీరోయిన్ రిలేషన్.. ఇక మిగిలింది పెళ్లే?
టాలీవుడ్ హీరోయిన్ రిలేషన్ గురించి మరోసారి బయటపడిపోయింది. ప్రియుడితో రొమాంటిక్ పోజులిచ్చింది. వాటిని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. గత కొన్నాళ్ల నుంచి వీళ్ల బంధంపై రూమర్స్ వస్తున్నప్పటికీ.. లేటెస్ట్ స్టిల్స్ చూస్తుంటే మాత్రం త్వరలో పెళ్లి పక్కా అనిపిస్తుంది. ఇంతకీ రీల్ విలన్-హీరోయిన్ జోడీ సంగతేంటి? అనేది ఇప్పుడు చూద్దాం.ఆస్ట్రేలియాలో భారతి సంతతికి చెందిన కుటుంబంలో పుట్టి పెరిగిన విమలా రామన్.. 2006లో తమిళ మూవీతో నటిగా మారింది. ఎవరైనా ఎప్పుడైనా, గాయం 2, రంగా ది దొంగ, రాజ్, చట్టం, నువ్వా నేనా తదితర తెలుగు సినిమాల్లో హీరోయిన్గా చేసింది. గతేడాది రిలీజైన 'గాండీవధారి అర్జున' చిత్రంలో చివరగా కనిపించింది.(ఇదీ చదవండి: స్టార్ హీరోయిన్కి హైకోర్టు నుంచి నోటీసులు.. కారణం ఏంటంటే?)విమలా రామన్ ప్రస్తుత వయసు 42 ఏళ్లు. అయితే ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది. కానీ గత కొన్నాళ్ల నుంచి నటుడు వినయ్ రాయ్తో కనిపిస్తోంది. బయటకు చెప్పకనప్పటికీ వీళ్ల బంధం గురించి ఇప్పటికే చాలాసార్లు రూమర్స్ వచ్చాయి. కానీ తాజాగా VV (వీవీ) పేరుతో ఫొటోషూట్ చేస్తున్నారు. ఈ ఫొటోల్ని విడతల వారీగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.ఇదంతా చూస్తుంటే లేటు వయసులో వినయ్ రాయ్ -విమలా రామన్ పెళ్లికి రెడీ అయిపోతున్నారా? అనే సందేహం వస్తోంది. ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలోని చాలామంది పెళ్లి బంధంలోకి అడుగుపెడుతున్నారు. మరి ఆ లిస్టులోకి హీరోయిన్ విమలా రామన్ కూడా చేరుతుందా లేదా చూడాలి.(ఇదీ చదవండి: నెల రోజులకే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్ మూవీ) View this post on Instagram A post shared by Prashun Prashanth Sridhar (@prachuprashanth) -
‘ఫ్రెండ్షిప్ మ్యారేజ్’ ఏంటి? ఫిజికల్ రిలేషన్ షిప్కు ఎందుకు తావులేదు?
వివాహం అంటే రెండు ఆత్మల కలయిక అని చెబుతుంటారు. వివాహానికి ఇచ్చే వివరణల్లో కాలనుగుణంగా అనేక మార్పులు వచ్చాయి. లివ్ ఇన్ రిలేషన్ షిప్ కూడా ఇలాంటివాటిలో ఒకటి. దీనిలో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ భార్యాభర్తలుగానే కలసి జీవిస్తుంటారు.ఇప్పుడు పెళ్లి విషయంలో మరో కొత్త ప్రయోగం జరుగుతోంది. ఇది జపాన్లో ప్రారంభమయ్యింది. అక్కడి యువతలో ‘ఫ్రెండ్షిప్ మ్యారేజ్’ ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇది వివాహాల్లో మరో నూతన విధానం. ఇందులో యువతీయువకులు భాగస్వాములుగా మారుతారు. అయితే ‘ఫ్రెండ్షిప్ మ్యారేజ్’లో ప్రేమ లేదా శారీరక సంబంధానికి అవకాశం ఉండదు. జపాన్లోని మొత్తం జనాభాలో ఒక శాతం మంది ఈ రకమైన వివాహాన్ని ఇష్టపడుతున్నారు.‘ఫ్రెండ్షిప్ మ్యారేజ్’లో చట్టబద్ధంగా వివాహం చేసుకుంటారు. కానీ ఫిజికల్ రిలేషన్ షిప్కి అవకాశం ఉండదు. అయితే కృత్రిమ గర్భధారణ ద్వారా పిల్లలను కనేందుకు అవకాశం ఉంటుంది. ఇటువంటి వివాహంలో ఇద్దరు భాగస్వాములూ విడివిడిగా వారికి నచ్చిన మరో మరొక భాగస్వామితో సంబంధం పెట్టుకునే స్వేచ్ఛను పొందుతారు. ఇలాంటి వివాహం చేసుకున్న ఒక జంట మీడియాతో మాట్లాడుతూ ‘ఫ్రెండ్షిప్ మ్యారేజ్’అంటే మనకు నచ్చిన రూమ్మేట్ని ఎంచుకోవడం లాంటిదని అన్నారు. ఈ విధంగా ఒకచోటు చేరిన భాగస్వాములు ఇంటి ఖర్చులను, ఇతర ఖర్చులను సమానంగా పంచుకుంటారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం 32 ఏళ్లుదాటిన యువతీ యువకులు ఇటువంటి వివాహలపై మక్కువ చూపిస్తున్నారు. పెళ్లయిన తర్వాత కూడా స్వేచ్ఛగా ఉండాలనుకునే వారు ఇటువంటి ‘ఫ్రెండ్షిప్ మ్యారేజ్’కు ప్రాధాన్యతనిస్తున్నారు. 2015 మార్చి తరువాత నుండి జపాన్లో వంద మందికి పైగా యువతీ యువకులు ఈ విధమైన వివాహం చేసుకున్నారని సమాచారం. -
పండంటి కాపురానికి ఏడడుగులు!
పెళ్లంటే.. రెండు మనసుల కలయిక మాత్రమే కాదు.. రెండు కుటుంబాల కలయిక. కాపురం చక్కగా సాగాలని కోరుతూ పెళ్లిలో ఏడు అడుగులు నడిపిస్తారు. ఇందులో ఒక్కో అడుగుకు ఒక్కో అర్థం ఉంది. మొత్తంగా కాపురం సుఖంగా సాగేందుకు దేవతలందరూ కరుణించాలని ప్రార్థన. స్నేహంగా, పరస్పరం గౌరవించుకుంటూ, కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ అన్యోన్యంగా జీవించాలని ప్రమాణాలు చేస్తారు. ఆ ప్రమాణాలను త్రికరణ శుద్ధిగా ఆచరించిన దంపతుల సంసారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది. లేదంటే మూడు వాదనలు, ఆరు గొడవలుగా రచ్చకెక్కుతుంది. పెద్దల పంచాయతీకి చేరుతుంది. చివరకు విడాకులుగా తేలుతుంది. వైవాహిక బంధాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలనే విషయంపై సైకాలజిస్టులు విస్తృతంగా పరిశోధనలు, అధ్యయనాలు చేశారు. వైవాహిక జీవితాలను నాలుగు దశాబ్దాల పాటు అధ్యయనం చేసిన డాక్టర్ జాన్ గాట్మన్, నాన్ సిల్వర్.. వైవాహిక బంధం బలపడటానికి ఏడు సూత్రాలను చెప్పారు. అవేమిటో ఈరోజు తెలుసుకుందాం. 1. పరస్పర అవగాహనే ప్రేమకు మూలం పెళ్లంటే వేర్వేరు ప్రపంచాల్లో పెరిగిన ఇద్దరు వ్యక్తులు ఒకటిగా జీవించడం. ఆ జీవితం సుఖంగా సాగాలంటే ఒకరి అనుభవాలను మరొకరు తెలుసుకోవాలి. వారి జీవితంలో ముఖ్యమైన సంఘటనలను పంచుకోవాలి, గుర్తుంచుకోవాలి. పరస్పర అవగాహన ఒకరి పట్ల మరొకరికి శ్రద్ధను కలిగిస్తుంది, బంధాన్ని పెంచుతుంది. మీ భాగస్వామికి ఇష్టమైన మూడు పాటలేవి? ఎందుకిష్టం? వారి అతిపెద్ద భయం ఏమిటి? భవిష్యత్తు కోసం వారు కంటున్న కలలు ఏమిటి? వారు దేనికి ఒత్తిడి చెందుతారు? వారి జీవితంలో జరిగిన కొన్ని ప్రధాన సంఘటనలు ఏమిటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఉంటే మీకు పరస్పర అవగాహన ఉందని అర్థం. లేదంటే, పెంచుకోవడానికి ప్రయత్నించాలి. 2. మీ అభిమానాన్ని పంచుకోండి, పెంచుకోండి వైవాహిక బంధం బలపడటంలో ప్రేమ, అభిమానాలది ప్రధానపాత్ర. అవి లోపించినప్పుడు ఆ బంధం నిలిచే అవకాశాలు తక్కువ. మీ వైవాహిక బంధంలో అభిమానం ఉందో లేదో అంచనా వేయడానికి మీ తొలి పరిచయం రోజులను వివరించడం మంచి మార్గం. బంధాన్ని బలపరచుకోవడానికి చేయాల్సిన పనులు.. కలసి గడపడానికి ప్లాన్ చేయలి ఇద్దరూ కలసి కొత్త హాబీ నేర్చుకోవాలి భాగస్వామికి కృతజ్ఞతలు తెలపాలి భాగస్వామిని అభినందించాలి అభిమానాన్ని పెంపొందించుకోవడంలో సమస్యలుంటే కపుల్ థెరపీకి వెళ్లాలి 3. కలసి మెలసి నడవండి ఆరోగ్యకరమైన సంబంధంలో భాగస్వాములు తరచుగా ఒకరినొకరు చూసుకుంటారు. ఒకరినొకరు చూసుకోవడం వారి ప్రేమ ట్యాంక్ను నింపుతుంది. ఇరువురి మధ్య ఎమోషనల్ కనెక్షన్ పెరిగేందుకు తోడ్పడుతుంది. లైంగిక జీవితాన్ని ప్రోత్సహిస్తుంది. దీర్ఘకాలం మాట్లాడుకోకపోవడం, చూసుకోకపోవడం జంటను దూరం చేస్తుంది. 4. భాగస్వామి మాటకు విలువనివ్వండి దంపతులు జట్టుగా పనిచేసినప్పుడు కలసి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు, అభిప్రాయాలను పంచుకునేటప్పుడు లేదా ఆలోచనా విధానంలో జీవిత భాగస్వామి అభిప్రాయాలకు విలువనివ్వాలి. ఏకీభవించనప్పుడు గౌరవంగా, ప్రశాంతంగా, హేతుబద్ధమైన చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. 5. పరిష్కరించగల సమస్యలను పరిష్కరించుకోండి వివాహంలో రెండు రకాల సమస్యలు ఉత్పన్నమవుతాయి: శాశ్వతమైనవి, పరిష్కరించదగినవి. పరిష్కరించగల సమస్యల్లో వైరుధ్యం, ఆగ్రహం ఉండవు. కేవలం సవాలు మాత్రమే ఉంటుంది. ఐదు దశల్లో వాటిని పరిష్కరించుకోవచ్చు. ఇద్దరూ ప్రశాంతంగా ఉన్న సమయంలో చర్చ ప్రారంభించాలి · మాటలు, చేతల వల్ల సంఘర్షణ పెరగకుండా చూసుకోవాలి అవసరమనిపించినప్పుడు 20 నిమిషాల విరామం తీసుకోవాలి· ఇద్దరూ కలసి బతికేందుకు అవసరమైతే రాజీ పడాలి ఒకరి తప్పులను ఒకరు సహించాలి 6. పీటముడిని అధిగమించండి నిరంతర విభేదాలు సంఘర్షణకు కారణమైనప్పుడు పీటముడి పడుతుంది. మాటలు ఆగిపోతాయి. ఒకరినొకరు ద్వేషించుకోవడం మొదలవుతుంది. దీన్ని అధిగమించడానికి.. సమస్య మూలాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి ప్రశాంతంగా కమ్యూనికేట్ చేయాలి · చర్చించలేని వివాదాలను అంచనా వేయడానికి మార్గాన్ని కనుగొనాలి భాగస్వామికి కృతజ్ఞతలు, ప్రశంసలు తెలుపుతూ ప్రశాంతంగా చర్చను ముగించాలి 7. భాగస్వామ్యానికి సరైన అర్థాన్ని సృష్టించాలి జీవన భాగస్వామ్యమంటే.. కేవలం పెళ్లి చేసుకోవడం మాత్రమే కాదు. మీ లక్ష్యాలు, పాత్రలు, ఆచారాలను కలపడం పరస్పర అవసరాలు, కోరికలు, కలలను గుర్తించడానికి అనుమతించడం అన్ని రకాల సాన్నిహిత్యాన్ని పంచుకోవడం అర్థవంతమైన అనుభవాలను సృష్టించుకోవడం --సైకాలజిస్ట్ విశేష్ psy.vishesh@gmail.com (చదవండి: భూమికే గొడుగు పట్టనున్న శాస్త్రేవత్తలు! ఏకంగా లక్షల కోట్లు..) -
మీరు ప్రేమిస్తున్న వ్యక్తి నిజంగా ప్రేమిస్తున్నారో లేదో తెలుసుకోవాలంటే..!
‘మీరు ప్రేమిస్తున్న వ్యక్తి మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తుంది లేదా ప్రేమిస్తున్నాడు అనేది క్షణాల్లో తెలుసుకోవాలనుకుంటున్నారా? దీనికి ఒక మార్గం ఉంది. అదే ఆరెంజ్ పీల్ థియరీ’ అంటూ ఇంటర్నెట్లో మొదలైన సందడి వైరల్ కావడానికి ఎంతో టైమ్ పట్టలేదు. లవ్ లిట్మస్ టెస్ట్గా భావించే ‘ఆరెంజ్–పీల్–థియరీ’ సోషల్ మీడియా వైరల్ ట్రెండ్గా మారింది. ఈ ట్రెండ్లో భాగంగా ఎన్నో మీమ్స్ వస్తున్నాయి. తాజాగా కమేడియన్ అంచల్ అగర్వాల్ ‘ఆరెంజ్ పీల్ థియరీ’పై తన తల్లితో కలిసి చేసిన వీడియో వైరల్ అయింది. 7 మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది. ఇంతకీ ఏమిటి ఆరెంజ్ పీల్ థియరీ? సింపుల్గా చెప్పాలంటే ఒక ఆరెంజ్ను లవర్కు చూపిస్తూ....‘నా కోసం ఈ ఆరెంజ్ తొక్క తీయగలవా?’ అని అడగాలి.లవర్ వెంటనే ‘ఓకే’ అంటే మనది నిజమైన ప్రేమ! ఇది సిల్లీ టెస్ట్గా అనిపిస్తున్నప్పటికీ ఇంటర్నెట్ లోకవాసులలో చాలామంది దీన్ని స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు. ఈ వైరల్ ట్రెండ్ పుణ్యమా అని ఆరేంజ్ ఫలాలు తెగ అమ్ముడవుతున్నాయట! View this post on Instagram A post shared by Aanchal Agrawal (@awwwnchal) (చదవండి: షాకింగ్ ఘటన అసలు కంటి భాగమే ఏర్పడకుండా పుట్టిన చిన్నారి) -
చాలా ఏళ్ల నుంచి అతనితో డేటింగ్ లో ఉన్నాను..
-
'సహజీవనం' అంటే సులువుగా 'సెపరేట్ అయ్యే బంధమా?
సహజీవనం పేరుతో సాగించి బంధాలు చివరికి సన్నగిల్లి అంతం చేసుకునే స్థాయికి వెళ్లిపోతున్నాయి. ఏ ఉద్దేశ్యంతో కలిసి ఉండాలనుకున్నారో ఆ బంధమే వెక్కిరింపుగా మిగిలిపోతుంది. 'సహజీవనం' కాస్త సెపరేట్ అవ్వుతోంది. చివరికి మోసానికి కేరాఫ్ అడ్రస్గా మారి జీవితాలు అల్లకల్లోలంగా మారిపోతున్నాయి. ఇదెంత వరకు కరెక్ట్? పెళ్లి కంటే సహజీవనమే బెటర్ అనేది కొందరి యువత అభిప్రాయం. పైగా ఇరువురి అండర్స్టాండింగ్తో కలిసుంటాం కాబట్టి సమస్యలొస్తే సెపరేట్ అయిపోతాం. సులవుగా రిలేషన్ నుంచి బయటపడిపోవచ్చు అనుకుంటున్నారు. అలాంటప్పుడూ ఆ సహజీవనం ఎందుకు నేరాలకు తావిస్తోంది. చివరికి ఎందుకు విషాదాంతంగా మిగిలి అసహ్యమైన బంధాలుగా మిగిలిపోతున్నాయి అనేదాని గురించే ఈ కథనం!. సమాజంలో ఈ 'సహజీవనం' పేరుతో మోసపోతున్న యువతీయువకుల ఉదంతాలు రోజుకొకటి చొప్పున తెరమీదకు వస్తునే ఉన్నా వాటి ఉచ్చులోనే పడుతునే ఉంటున్నారు. కన్నవాళ్లకి, వారిని నమ్ముకున్న వాళ్లకి తీరని వ్యథని, ఓ కళంకాన్ని మిగిల్చి కటకటాల పాలవ్వడం లేదా చనిపోవడం జరుగుతోంది. అలాంటి ఉందంతమే మహారాష్ట్రలో ప్రియాసింగ్ అనే మహిళ విషయంలో చోటు చేసుకుంది. ఆమె సమాజంలో అత్యున్నత హోదాలో ఉన్న ఓ సీనియర్ బ్యూరోక్రాట్ కుమారుడు అశ్వజిత్ గైక్వాడ్తో ఒకటి, రెండు కాదు ఏకంగా నాలుగన్నరేళ్లు సహజీవనం సాగించింది. పూర్తిగా నమ్మింది. కానీ అతడు తనకు పెళ్లి అయ్యిందనే విషయాన్ని బయటపెట్ట లేదు. పోనీ ఆ విషయం ఆమె ఎలాగో తెలుసుకున్నాక అయినా కాస్త తెలివిగా బయటకొచ్చే యత్నం చేయక అతడిని మళ్లీ గుడ్డిగా నమ్మింది. ఎందుకిలా చేశావ్? అని అమాయకంగా ప్రశ్నించింది. వెంటనే అతడు మాటదాటేసి..తన భార్యతో విడిపోయనన్నాడు. త్వరలో విడాకులు తీసుకున్నాం. నేను నీతోనే ఉంటానని ప్రియాసింగ్కి కల్లబొల్లి మాటలు చెప్పాడు. ఇక్కడ అశ్వజిత్ తనకు పెళ్లై అయ్యిందనేది దాచేసినవాడు. తర్వాత చెప్పే ప్రతి మాట ఎంత వరకు నిజం అనేది ప్రియాసింగ్ ఆలోచించలేదా, అతడి మీద ఉన్న ప్రేమ లేదా వ్యామోహం ఆ స్థాయిలో ఆలోచించనివ్వ లేదో తెలియదు. కానీ ప్రియాసింగ్ మాత్రం అతడే ఏం చెప్పిన గుడ్డిగా నమ్మింది. ఉన్నటుండి తెల్లవారుఝామున ఫోన్ చేసి కలుద్దామని ప్రియాసింగ్ని ఫోన్ చేసి పిలిపించాడు అశ్వజిత్. లోకేషన్ కూడా షేర్ చేశాడు. తీరా ప్రియాసింగ్ అక్కడికి వెళ్లితే తన బాయ్ఫ్రెండ్ తన భార్య, దగ్గరి స్నేహితులతో కనిపించాడు. ఒక్కసారిగా షాక్కి గురైన ప్రియాసింగ్ ఏం అర్థంకాక కాసేపు నీతో వ్యక్తిగతంగా మాట్లాడాలని భయంభయంగా అడిగింది. అందుకు నిరాకరించిన ఆ వ్యక్తి ఆమె ఎవరో తెలియనట్లు అరిచి, గొడవకు దిగాడు. పైగా తన స్నేహితులతో దుర్భాషలాడించాడు. చివరికి ఆమెపై దాడికి కూడా దిగాడు. ఏకంగా తన డ్రైవర్ చేత కారుని ఆమెపై పోనిచ్చి దారుణంగా గాయపరిచి అక్కడ నుంచి పరారయ్యాడు. చివరికి ఆమె తీవ్రగాయలపాలై ఆస్పత్రిపాలయ్యింది. పైగా తన బాయ్ఫ్రెండ్ మోసం చేశాడంటూ కేసు పెట్టింది. ఇక్కడ ఆమె బాయ్ఫ్రెండ్ మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ గైక్వాడ్ కొడుకు. చాలా పరపతి, అధికారం ఉన్న ఓ వ్యక్తి కొడుకు. ఇక్కడ ఆమెకు ఎంత వరకు న్యాయం జరగుతుందనేది కూడా తెలియదు. అస్సలు ఈ కేసు సవ్యంగా నడుస్తుందా? అన్నది కూడా అనుమానమే!. ఇరువురిలో ఎవరిది మోసం అనేది కూడా పోలీసులు విచారణలో పూర్తి స్థాయిలో తెలియాల్సి కూడా ఉంది. ఈ రిలేషన్లు చివరికి సుఖాంతమేనా..? సహజీవనం అనే అక్రమసంబంధాలు ఎప్పటికీ పూర్తి స్థాయిలో కడవరకు సవ్యంగా జరగవు. పెద్దలు కుదర్చిన పెళ్లి సంబంధాల్లోనే ఎన్నో సమస్యలు వచ్చి విడిపోతున్న ఘటనలు జరుగుతున్నాయి. ఇంకా అక్కడ.. ఇరువైపుల బంధువుల సమక్షంలో పెళ్లి జరగుతుంది కాబట్టి కొద్దోగొప్పో న్యాయం జరిగే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి సహజీవనం లాంటి సంబంధాల్లో తమకు ఎవరి మద్దతు, అండదండ లభిస్తుందో యువత ఆలోచించాలి. ఆ తర్వాత ఎదురయ్యే ఏ సమస్య అయినా అధిగమించగలం అనుకుంటేనే వీటి జోలికి వెళ్లండి. అలాగే ఇరువురికి ఒకరి నేపథ్యం గురించి ఒకరికి పూర్తి స్థాయిలో తెలుసుండాలి. మొదట్లో ఇద్దరి మధ్య ఏ చిన్న చోట మాట తేడావస్తున్నా.. ఒకరిమీద ఒకరికి ఉన్న మోజులో అది చిన్న విషయంగా కనపడుతుంది. ఎప్పుడైతే ఇరువురి మధ్య గొడవలొస్తోయే అప్పుడే ప్రతి విషయం పెద్ద పెద్ద సమస్యలుగా కనిపిస్తాయి. ఒక్కటి మాత్రం గుర్తించుకోండి ఏ బంధంలో అయినా దాపరికాలు ఉండకూడదు. అప్పుడే ఆ బంధం స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంకొకటి ఇలాంటి (సహజీవనం)బంధాల వల్ల కచ్చితంగా మానసిక ప్రశాంతతకు దూరం అయ్యి మిమ్మల్ని మీరే కోల్పోతారు. సహజీవనం చేయాలనుకుంటే అవతలి వ్యక్తిపై పూర్తి నమ్మకం ఉందంటేనే సాగించండి. అది కూడా హద్దుల్లోనే మీ స్నేహితులు లేదా కుంటుంబ సభ్యులకు కూడా ఆ వ్యక్తి గురించి తెలియజేయండి. ఆ తర్వాత ఎప్పుడైనా ఆ రిలేషన్లో ఎలాంటి సమస్య వచ్చినా..మీ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు మొదట్లో మీకు మద్దతు ఇవ్వకపోయినా, కనీసం మనకు ముందుగా తెలియజేసింది కదా! అన్న ఫీల్తో మనసు మార్చుకుని మీకు సపోర్ట్ లేదా సాయం చేసే అవకాశం ఉంటుంది. పెళ్లి పీటల వరకు తీసుకువెళ్లగలం అనే నమ్మకం ఉంటే వాటి జోలికి వెళ్లండి. లేదంటే ఇంట్లో తల్లిదండ్రుల మాట విని వారు కుదిర్చిన పెళ్లి చేసుకోండి. ఎందులోనైనా సమస్యలు వస్తాయి. దీన్ని కాదనలేం. కానీ పెద్దల సమక్షంలో జరిగితే.. అన్యాయమైతే ఇంట్లో వాళ్లు ఆదుకుంటారు లేదా స్నేహితులైనా సాయం చేయగలుగుతారు. సమాజం నుంచి కూడా కొద్దోగొప్పో మద్దతు లభిస్తుంది. బహుజాగ్రత్తగా ఆలోచించి రిలేషన్స్ విషయంలో మంచిగా అడుగులు వేయండి. జీవితం గజిబిజి అయ్యి, నరకంగా మారదు. ఏదైనా మన చేతిలోనే ఉందనేది మరచిపోకండి. (చదవండి: పుట్టింటికి భారమై.. మెట్టింటికి దూరమై.. జీవితాన్ని యోగవంతం చేసుకుంది!) -
కోడలి గురించి 'సుధామూర్తి' మనసులో మాట - ఏం చెప్పిందంటే?
ప్రముఖ రచయిత్రి, విద్యావేత్త, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ 'సుధామార్తి' (Sudha Muthy) ఇటీవల తన కోడలు 'అపర్ణ కృష్ణన్' (Aparna Krishnan)తో ఎలా ఉంటుంది. కోడలి వల్ల ఏమైనా సమస్యలు ఉన్నాయా? అనే విషయాలను బయటపెట్టింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సూధామూర్తి కొడుకు రోహన్ మూర్తి మొదట్లో 'లక్ష్మీ వేణు'ను వివాహం చేసుకున్నాడు. కానీ వీరు ఎక్కువ రోజులు కలిసి ఉండలేక విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత రోహన్ 'అపర్ణ క్రష్ణన్' అనే యువతిని రెండో వివాహం చేసుకున్నాడు కొడుకు పెళ్లిని చాలా సింపుల్గా చేసినప్పటికీ.. కోడలిని మాత్రం బాగా చూసుకుంటుందని.. అపర్ణ క్రష్ణన్ గతంలో స్వయంగా వెల్లడించింది. తన అత్తగారి గురించి ఎవరైనా అడిగితే.. నాకు ఆమె రోల్ మోడల్ అని, అంతే కాకుండా ప్రతి అత్తకు రోల్ మోడల్ అని చెబుతానని చెప్పింది. సుధామూర్తిని తన కోడలితో సంబంధం ఎలా ఉంటుంది అని అడిగితే, ఏ సమస్య లేదని చెబుతూ.. ఒకరినొకరు అపార్థం చేసుకోవడానికి చాలా సమయం కావాలని. నేను ఎప్పుడూ నా పనిలో బిజీగా ఉంటాను, ఆమె పనిలో ఆమె బిజీగా ఉంటుంది. అపర్ణ చాలా మంచిది, సమర్థవంతమైందిని స్పష్టం చేసింది. ఇదీ చదవండి: సెలవు తీసుకోకుండా పనిచేస్తా.. దిగ్గజాలను భయపెడుతున్న కొత్త 'సీఈఓ' సుధా మూర్తి ఇటీవల యూట్యూబ్లో 'సుధా అమ్మ' పేరుతో పిల్లల కోసం ఓ కొత్త యానిమేషన్ సిరీస్ ప్రారంభించింది. ఈ సందర్భంగా సుధామూర్తి 'కంటెంట్ నాదే కానీ ఇది అపర్ణ బేబీ'ది అని చెప్పింది. ఈ సిరీస్ ప్రారంభించడానికి కోడలి ఆలోచనే కారణమని కూడా వెల్లడించింది. -
ప్రభాకర్రెడ్డిపై జరిగిన దాడితో నాకు సంబంధం లేదు
పాలమూరు: దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డిపై జరిగిన దాడితో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఈ విషయంలో తనపై బురదజల్లడం సరికాదని దుబ్బాక ఎమ్మెల్యే, బీజేపీ నేత రఘునందన్రావు అన్నారు. సోమవారం మహబూబ్నగర్ వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ప్రభాకర్రెడ్డిపై దాడి జరగడం దురదృష్టకరమని, దీన్ని ఖండిస్తున్నానని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ వారైనా ప్రచారం చేసుకోవచ్చన్నారు. ఈ ఘటనతో రఘునందన్రావుకు సంబంధం ఉందని ప్రచారం చేయడం సరికాదని పేర్కొన్నారు. 20 ఏళ్ల రాజకీయ జీవితంలో హింసకు ఎప్పుడూ పాల్పడలేదని, అలాంటి ఘటనలు ప్రోత్సహించే వ్యక్తిని తాను కాదన్నారు. దాడి చేసిన గటాని రాజు అనే వ్యక్తికి దళితబంధు రాలేదని ఉద్దేశంతోనే దాడి చేసినట్లు వార్తలు వస్తున్నాయని రఘునందన్రావు చెప్పారు. రాజు ఫేస్బుక్ ఖాతాను పరిశీలిస్తే అతను కాంగ్రెస్ నేతలతో ఉన్న ఫొటోలు, ఇతర వివరాలు లభ్యమవుతాయని, అతని దగ్గర ఓ చానల్ ఐడీ కార్డు కూడా దొరికిందని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని, ఎవరెంత బురద చల్లినా దుబ్బాకలో తన గెలుపు ఖాయం అని ధీమా వ్యక్తంచేశారు. సిద్దిపేట సీపీ కేసు పరిశీలించి, అతని ఇతర అకౌంట్లు పరిశీలించి మాట్లాడాలి కానీ, మీరే బీజేపీ సానుభూతిపరుడని అని చెప్పడం సరికాదన్నారు. సీపీ మాట్లాడిన మాటలతో బీజేపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని రఘునందన్రావు ఆందోళన చెందారు. పాలమూరు నుంచి నేరుగా ఆస్పత్రి దగ్గరకు వెళ్లి చికిత్స పొందుతున్న ప్రభాకర్రెడ్డిని పరామర్శిస్తానని చెప్పారు. -
ఎలాన్ మస్క్పై పిటిషన్.. ఆ రైట్స్ కల్పించాలంటున్న మాజీ భార్య!
ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్పై మాజీ భార్య గ్రిమ్స్ పిటిషన్ వేస్తూ శాన్ఫ్రాన్సిస్కోలోని సుపీరియర్ కోర్టుని ఆశ్రయించింది. ఇందులో తమ ముగ్గురి పిల్లల సంరక్షణను చూసుకోవాలని డిమాండ్ చేస్తూ దావా వేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కెనడాకు చెందిన మ్యుజిషియన్ గ్రిమ్స్తో ఎలాన్ మస్క్ 2018 నుంచి 2021 వరకు డేటింగ్ చేసాడు. ఈ ఇద్దరికీ ముగ్గురు పిల్లలున్నట్లు ఇటీవలే వెలుగులోకి వచ్చింది. మస్క్ బయోగ్రఫీ బుక్తో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 2021 నాటికి వీరు విడిపోయారు. అప్పటి వరకు వీరికి ఓ కొడుకు, కూతురు ఉన్న విషయం మాత్రమే చాలామందికి తెలుసు. కానీ వారిద్దరికీ మూడో బిడ్డ ఉన్నట్లు, అతని పేరు టెక్నో మెక్నానికస్ అని స్వయంగా ఎలన్ మస్క్ వెల్లడించాడు. ముగ్గురు పిల్లల్లో ఒకరిపై తనకు ఎటువంటి అధికారాలు లేవని మస్క్ ఆరోపిస్తున్నట్లు గ్రిమ్స్ తెలిపింది. అంతే కాకుండా అతన్ని చూడటానికి కూడా నన్ను అనుమతించడం లేదని, తనకు కూడా ప్యారంటల్ రైట్స్ కల్పించాలని కోరింది. మస్క్తో డేటింగ్ చేసిన రోజుల్ని మరిచిపోలేనని చెప్పింది. ఇదీ చదవండి: రెండు రోజుల్లో రూ. 345 కోట్లు.. టిమ్ కుక్ అంటే అట్లుంటది! నిజానికి ఎలాన్ మస్క్కు ముగ్గురు భార్యలు, 11 మంది పిల్లలు. ప్రస్తుతం ముగ్గురికి విడాకులిచ్చాడు. ప్రస్తుతం గ్రిమ్స్ వేసిన ఓపిటిషన్ మీద మస్క్ స్పందించలేదు. కాగా ఇటీవల మస్క్ టర్కీ అధ్యక్షుడు 'తయ్యిప్ ఎర్డోగాన్' అమెరికా పర్యటనకు వచ్చినప్పుడు మస్క్ అతనితో సమావేశమయ్యారు. ఆప్పుడు అతనితో తన కొడుకుని కూడా తీసుకెళ్లాడు. ఇది చూసి ఎర్డోగాన్ మీ భార్య ఎక్కడ అని ప్రశ్నించగా.. ఆమె శాన్ఫ్రాన్సిస్కోలోని ఉందని, ప్రస్తుతం విడిపోయామని తెలిపాడు. -
ఆ ఫీలింగ్స్ గురించి ఆడవారిని మాట్లాడనివ్వరు: బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్!
హారర్ వెబ్ సిరీస్ రాగిణి ఎంఎంఎస్: రిటర్న్స్ 2తో తన కెరీర్ ప్రారంభించిన బ్యూటీ దివ్య అగర్వాల్. పలు రియాలిటీ షోల్లో భామ బిగ్బాస్ ఓటీటీ సీజన్ -1 విన్నర్గా నిలిచింది. ప్రస్తుతం ఆమె కింక్(కిస్ ఇష్క్ ఎన్ కనెక్షన్స్) రియాలిటీ షో హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. అంతేకాకుండా సమాజంలో భార్య, భర్తల మధ్య రిలేషన్పై మాట్లాడింది. ఆమె హోస్ట్గా వ్యవహరిస్తున్న కింక్ షో గురించి ప్రస్తావించింది. (ఇది చదవండి: జవాన్ డైరెక్టర్పై నయన్ అసంతృప్తి.. కారణం అదేనా..!!) ఇంటర్వ్యూలో దివ్య మాట్లాడుతూ.. 'నా ప్రయాణం అద్భుతంగా సాగింది. వాస్తవానికి, నేను యుక్తవయస్సులో అమాయకంగా ఉన్నా. కానీ నా ఒరిజినాలిటీయే నన్ను ముందు నడిపిస్తుందని నమ్ముతున్నా. నేనెప్పుడూ కూడా అలా మాట్లాడటానికి భయపడను. భార్య, భర్తల మధ్య రిలేషన్ గురించి ఒపెన్గానే ఉంటాను. కానీ నాకు బాగా అర్థం చేసుకునే భర్త దొరికాడు.' అని చెప్పుకొచ్చింది. భార్య, భర్తల మధ్య రిలేషన్పై మాట్లాడుతూ.. 'మన సమాజంలో ఉన్న ఇబ్బంది ఏంటంటే మహిళలు తమ లైంగిక కోరికలను బయటకు చెప్పడాన్ని ప్రోత్సహించరు. ఎందుకంటే మన సమాజం ఇలాంటి వాటిపై మాట్లాడదు కూడా. ఈ అంశానికి సంబంధించి చాలా మందికి సందేహాలు ఉంటాయి. ఒక స్త్రీ తనకు, భర్తకు మధ్య ఏదో మిస్సయిందని భావించినప్పుడు.. తప్పనిసరిగా సాయం కోరుతుంది. భార్య భర్తల మధ్య సాన్నిహిత్యం, అనుకూలత మాత్రమే బంధానికి నిదర్శనం. మీరు మీ జీవితాంతం ఎవరితోనైనా ఉండాలని కోరుకుంటే ఇలాంటి సంభాషణలు చేయడం చాలా ముఖ్యం. అలాంటి పరిస్థితుల్లో తరచుగా తలెత్తే కమ్యూనికేషన్ గ్యాప్ను తగ్గించడానికి ఈ షో ద్వారా ప్రయత్నించడం నాకు సంతోషంగా ఉంది. ఇక్కడ భాగస్వాములిద్దరూ తమ భావాలను వ్యక్తపరచడం చాలా ముఖ్యం.' అని అన్నారు. (ఇది చదవండి: ఓటీటీలో ఎంట్రీ ఇచ్చేసిన హీరోయిన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) -
పెళ్లికి ముందు అలాంటి రిలేషన్ ఓకేనా?.. హీరోయిన్ కామెంట్స్ వైరల్!
కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫేమ్ తెచ్చుకున్న హీరోయిన్ అతుల్య. 2017లో కాదల్ కన్ కట్టుడే అనే తమిళ సినిమాతో కోలీవుడ్లోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ.. ఆ తర్వాత అదే ఏడాదిలోనే కథానాయకన్ చిత్రంలో నటించారు. అంతేకాకుండా కిరణ్ అబ్బవరం నటించిన మీటర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. సినిమాల్లోకి రాకముందు అతుల్య పలు షార్ట్ ఫిల్మ్స్లో నటించింది. ప్రస్తుతం కోలీవుడ్లో సినిమాలతో బిజీగా ఉన్న ముద్దుగుమ్మ ఏడాదికి మూడు నాలుగు సినిమాల్లో నటిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతుల్యకు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. అదేంటో తెలుసుకుందాం. (ఇది చదవండి: ఓ ఇంటివాడు కాబోతున్న మానస్.. హల్దీ వేడుకలు షురూ) ఇంటర్వ్యూలో పాల్గొన్న అతుల్య రవికి కన్యత్వంపై ప్రశ్న ఎదురైంది. వర్జినీటి కోల్పోవడానికి సరైన వయస్సు ఏదని మీరు అనుకుంటున్నారు? అని ప్రశ్నించారు. దీనికి ఆమె బదులిస్తూ.. 'ఈ విషయంలో నా అభిప్రాయం ప్రకారం 21 నుంచి 25 ఏళ్లు వయస్సు కరెక్ట్ అనిపిస్తోంది.' అని చెప్పింది. ఆ తర్వాత పెళ్లికి ముందు లైంగిక చర్యలో పాల్గొనడం సరైందేనా? లేక పెళ్లి తర్వాత మంచిదా? అని ప్రశ్నించగా.. దీనికి కూడా నటి సూటిగానే స్పందించింది. అతుల్య రవి మాట్లాడుతూ.. "నా అభిప్రాయం ప్రకారమైతే పెళ్లి తర్వాతే లైంగికపరమైన రిలేషన్షిప్ ఉత్తమం. ఇది మన ఆచార వ్యవహారాలు, సంస్కృతికి అద్దం పడుతోంది. అయితే ప్రస్తుతం లివ్ ఇన్ రిలేషన్ షిప్స్(సహజీవనం) వల్ల ఈ మధ్య కాలంలో చాలా మార్పులు వచ్చాయి. ఈ జనరేషన్లో రిలేషన్స్ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఒకరితో రిలేషన్లో ఉండడమనేది అది వారి వ్యక్తిగత నిర్ణయం. దీనిపై ఎవరికీ అధికారం లేదు. అయితే వివాహమే అన్నింటికంటే ఉత్తమమైన రిలేషన్ " అని అన్నారు. (ఇది చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న హిట్ మూవీ, మరో థ్రిల్లర్ సిరీస్ కూడా!) View this post on Instagram A post shared by Athulyaa Ravi (@athulyaofficial) -
నా భర్త సంసారానికి పనికిరాడు.. పెళ్లయి రెండేళ్లయినా..
కర్ణాటక: స్వలింగ సంపర్కానికి అలవాటుపడిన భర్తతో వేగలేనంటూ అతని భార్య పోలీస్స్టేషన్ మెట్లెక్కింది. బాధితురాలు నగరంలోని జ్ఞానభారతి పోలీస్స్టేషన్ పరిధిలో నివసిస్తోంది. ఫిర్యాదులో పేర్కొన్న మేరకు... 2020 ఆగస్టు 30 తేదీన మల్లత్తహళ్లి బాలాజీ లేఔట్కి చెందిన ఐటీ ఇంజినీరుతో ఆమెకు పెళ్లయింది. ఎంబీఏ చదివి న ఆమె పెళ్లికి ముందు, తరువాత రెండేళ్లు ఇన్ఫోసిస్లో ఉద్యోగం చేసింది. ఉద్యోగానికి వెళ్లరాదని అత్తమామ ఒత్తిడి చేయడంతో రాజీనామా చేసి ఇంట్లో కూర్చుంది. పెళ్లయి రెండేళ్లయినా ఇద్దరి మధ్య లైంగిక సంబంధం లేదు. సంతానం లేకపోవడం పట్ల ఇరుగుపొరుగు, బంధువులు ఆమెను ప్రశ్నించారు. భర్త తమ్మునికి పెళ్లయి ఏడాదిలో పిల్లలు పుట్టారు, మీకేమిటి సమస్య అని అడిగేవారు. దీనిపట్ల మహిళ భర్తతో చర్చించగా అతడు పట్టించుకోలేదు, కృత్రిమ గర్భధారణకు ప్రయత్నించగా అది విఫలమైంది. మొబైల్లో గుట్టు రట్టు భర్త మొబైల్ను పరిశీలించగా అందులో పురుషునితో శారీరక సంబంధం ఉన్న ఫోటోలు, వీడియోలు కనబడ్డాయి. దీనిపై ప్రశ్నించగా భర్త వేధింపులు మొదలుపెట్టాడు. భర్త స్వలింగ సంపర్కంతో విరక్తి చెందిన భార్య పుట్టింటికి చేరుకుంది. భర్త ఆమెకు నిత్యం ఫోన్ చేసి ఇలాంటి తప్పు చేయనని, ఇంటికి రావాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగాడు. పెద్దలు కూడా రాజీ యత్నాలు చేసినా గే తో సంసారం చేయలేనని ఆమె తేల్చిచెప్పింది. దీంతో వేధింపులు పెరిగిపోవడంతో బాధితురాలు భర్త, అత్తమామలపై జ్ఞానభారతి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. -
'రానా నాయుడు' బ్యూటీ రిలేషన్ కన్ఫర్మ్.. పెళ్లి అప్పుడే!
కొన్నాళ్ల ముందు 'రానా నాయుడు' వెబ్ సిరీస్ రిలీజైంది. ఇందులో రానాని టెంప్ట్ చేసే పాత్రలో నటించిన ఓ అమ్మాయి.. బాగా హైలెట్ అయింది. ఈమెని ఇంతకుముందు ఎక్కడో చూశామే అని తెలుగు ప్రేక్షకులు అనుకున్నారు. అవును ఓ పదేళ్ల క్రితం కిస్, జోరు, అసుర తదితర సినిమాలు చేసిన ప్రియా బెనర్జీకి ఇక్కడ పెద్దగా కలిసి రాలేదు. దీంతో బాలీవుడ్కి చెక్కేసింది. ప్రస్తుతం ఓటీటీల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ భామ.. ఓ యంగ్ హీరోతో లవ్ కన్ఫర్మ్ చేసింది. (ఇదీ చదవండి: ఓటీటీల్లోకి ఈ శుక్రవారం 18 మూవీస్) మూడేళ్లుగా కలిసే 'ప్రతీక్ నేను గత మూడేళ్లుగా కలిసున్నాం. మా బంధంపై పెద్దగా డిస్కషన్ జరగకూడదని.. రిలేషన్ గురించి బయటకు చెప్పలేదు. ఈ ఏడాది ప్రేమికుల దినోత్సవం రోజున అఫీషియల్గా మా లవ్ని ప్రకటించాం. మాకు అనవసరమైన ప్రచారం అక్కర్లేదని భావించి ఇన్నాళ్లు ఊరుకున్నాం. ప్రతీక్ నేను ప్రస్తుతం కెరీర్పై దృష్టి పెట్టాం. తనకు పనిమీద ఫోకస్ ఎక్కువ. తానేంటో ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు' త్వరలో పెళ్లి 'రిలేషన్లో ఉన్నాం కదా మా పెళ్లి జరుగుతుంది. అయితే అది ఎప్పుడనేది మేం టైమ్ చూసుకుని ప్రకటిస్తాం. ప్రస్తుతానికైతే ప్రేమలో చాలా సీరియస్ గా ఉన్నాం. ఈ ఏడాది మాత్రం పెళ్లి చేసుకోం' అని నటి ప్రియా బెనర్జీ చెప్పుకొచ్చింది. పలు సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ తరహా పాత్రలు చేస్తున్న ప్రతీక్.. గతంలో హీరోయిన్ అమీ జాకన్స్తో డేటింగ్ చేసినట్లు టాక్. 2019లో సన్యా సాగర్ అనే నిర్మాతని పెళ్లి చేసుకున్నాడు కానీ ఏడాదిలోనే విడిపోయారు. View this post on Instagram A post shared by prateik patil babbar (@_prat) (ఇదీ చదవండి: 'జైలర్'.. ఆ హాలీవుడ్ సినిమాకు కాపీనా?) -
బంధం నిలబడాలంటే అదొక్కటే సరిపోదు!
సునీత, సురేష్ అందమైన జంట.. వాళ్లకొక పాప. ఇద్దరూ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. వారాంతంలో పార్టీలు, నెలకోసారి విహారయాత్రలు, ఏడాదికోసారి విదేశీ యాత్రలు.. అంతా బాగానే ఉంది. కానీ నెలకో, రెణ్నెల్లకో గొడవ గ్యారంటీ. కారణాలు చాలా చిన్నవి..గొడవలు మాత్రం పెద్దవి. చివరకు విడిపోదామని నిర్ణయించుకున్నారు. లాయర్నూ సంప్రదించారు. చివర్లో మిత్రుడి సలహా మేరకు మ్యారిటల్ కౌన్సెలింగ్కు వచ్చారు. సునీత, సురేష్లతో రెండు గంటలపాటు మాట్లాడాక.. వారి మధ్య శారీరక సాన్నిహిత్యం తప్ప మరెలాంటి బంధమూ లేదని అర్థమైంది. సునీత శాలరీ ఎంతో కూడా సురేష్కు తెలియదు. అడిగినా చెప్పదు. అది నీకు సంబంధంలేని విషయం అంటుంది. ఏ మాటంటే సురేష్కు కోపం వస్తుందో సునీతకు తెలియదు. ఏం చేస్తే సునీత సంతోషపడుతుందో సురేష్కు తెలియదు. పగలు ఎన్ని గొడవలున్నా.. రాత్రికి ఒకటైతే.. అన్ని గొడవలూ సర్దుకుంటాయని వారు బలంగా భావిస్తున్నారు. కానీ బంధం బలపడటానికి, నిలబడటానికి ఇతర సాన్నిహిత్యాలు కూడా అవసరమని వారికి తెలియదు. అందువల్ల వారెలాంటి ప్రయత్నమూ చేయడం లేదు. ఫలితమే చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు.. తిట్టుకోవడాలు.. కొట్టుకోవడాలు.. విడాకుల ప్రయత్నాలు. జీవితంలో మనకు స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులు.. ఇలా అనేక మందితో సాన్నిహిత్యం లేదా ఆత్మీయత ఉంటుంది. వైవాహిక బంధంలో ఇది మరింత అవసరం. అయితే సాన్నిహిత్యం అనగానే చాలామంది సునీత, సురేష్లలా శారీరక సాన్నిహిత్యం గురించి మాత్రమే ఆలోచిస్తారు. కానీ బంధాలు బలపడాలంటే ఇతర సాన్నిహిత్యాలు కూడా అవసరం. అవేంటో ఈరోజు తెలుసుకుందాం. శారీరక సాన్నిహిత్యం: చేయి పట్టుకోవడం, ముద్దులు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం, తాకడం.. శారీరక సాన్నిహిత్యానికి ఉదాహరణలు. అయితే దీన్ని బహిరంగంగా ప్రదర్శించడం కొందరికి ఇబ్బందిగా అనిపిస్తుంది. సురేష్కు కూడా. భావోద్వేగ సాన్నిహిత్యం: భవిష్యత్తులో దంపతులిద్దరూ ఏం కోరుకుంటున్నారు, మీరు ఆందోళన చెందుతున్న విషయాలు, పని ఒత్తిడితో కూడిన సంఘటనల గురించి మాట్లాడుకోవడం ఎమోషనల్ ఇంటిమసీకి ఉదాహరణలు. సునీత, సురేష్ల మధ్య ఇది శూన్యం. మేధా సాన్నిహిత్యం: చదివిన పుస్తకం గురించి మాట్లాడటం, ఆలోచనలు, అనుభవాలు, ప్రశ్నలు పంచుకోవడం లాంటివి ఇంటలెక్చువల్ ఇంటిమసీకి ఉదాహరణలు. సురేష్కు నాన్ ఫిక్షన్ ఇష్టమైతే, సునీతకు ఫిక్షన్ అంటే ప్రాణం. అనుభవ సాన్నిహిత్యం: ఆరోగ్యకరమైన సంబంధాల్లో కలసి పంచుకునే అనుభవాలు ముఖ్యం. కలసి సమయాన్ని గడపడం, పనులు చేసుకోవడం వంటివి ఎక్స్పీరియెన్షియల్ ఇంటిమసీకి ఉదాహరణలు. సురేష్, సునీతల మధ్య ఇది ఫర్వాలేదు. ఆధ్యాత్మిక సాన్నిహిత్యం: విలువలు, విశ్వాసాలు, మతపరమైన ఆచారాలలో పాల్గొనడం, ఆధ్యాత్మిక విషయాలను జీవిత భాగస్వామితో చర్చించడం స్పిరిచ్యువల్ ఇంటిమసీ. సునీత భక్తురాలు. సురేష్ నాస్తికుడు. నిరంతరం ప్రయత్నించాలి.. ఎంతకాలం కలసి ఉన్నా, సాన్నిహిత్యాన్ని ఎప్పటికప్పుడు పెంచుకోవడం అవసరం. సునీత, సురేష్లకు వారి మధ్య విభేదాలను వివరించడంతో పాటు, వారి సాన్నిహిత్యాన్ని పెంచుకోవడానికి కౌన్సెలింగ్ చేశాను. అలాగే మీ జీవితంలో సాన్నిహిత్యాలను బలోపేతం చేయడానికి కొన్ని సులువైన మార్గాలున్నాయి. శారీరక సాన్నిహిత్యమంటే కేవలం సెక్స్ మాత్రమే కాదు. ఇద్దరూ ఇష్టాయిష్టాలను పంచుకోవడం, చేతులు పట్టుకోవడం, కౌగిలించుకోవడం శారీరక సాన్నిహిత్యాన్ని పెంపొందిస్తాయి· భాగస్వామి చెప్పే మాటలు వినడానికి, భావాలను పంచుకోవడానికి ప్రతిరోజూ కొంత సమాయాన్ని కేటాయించడం భావోద్వేగ సాన్నిహిత్యాన్ని పెంచుతుంది· భోజనం చేస్తున్నప్పుడు లేదా జీవిత భాగస్వామితో కలసి ప్రదర్శనను చూస్తున్నప్పుడు మొబైల్ ఫోన్, గాడ్జెట్స్ను దూరంగా పెట్టండి · ఇద్దరూ కలసి కొత్త విషయాలను ఆస్వాదించడం సరదాగా ఉంటుంది. అందుకే ఇద్దరూ వెళ్లని ప్రదేశానికి ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి· కొత్త విషయాల గురించి మాట్లాడుకోవడం, ఆర్టికల్స్ పంచుకోవడం మేధో సాన్నిహిత్యాన్ని పెంపొందిస్తుంది· భాగస్వామి నమ్మకాల మేరకు ఆధ్యాత్మిక సందర్శనలు ప్లాన్ చేసుకోవాలి. ఆత్మీయతకు ఆటంకాలు ప్రతి బంధంలోనూ విభేదాలు, హెచ్చు తగ్గులు ఉంటాయి. వాటిని అర్థం చేసుకుని ఆనందించాలి. కానీ కొన్ని అడ్డంకులు ఇంటిమసీని దెబ్బతీస్తాయి. వాటిని గుర్తించి సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అవేంటో తెలుసుకుందాం. కోపం, చిరాకు, అపనమ్మకంతో భాగస్వామితో నిత్యం వాదిస్తూ ఉంటే అది ఇద్దరిమధ్య ఆత్మీయతను దెబ్బతీస్తుంది పని, అనారోగ్యం, ఆర్థిక, పిల్లలు, ఇతర సమస్యల వల్ల కలిసి ఒత్తిడి కూడా దంపతుల సాన్నిహిత్యాన్ని దూరం చేస్తుంది · భాగస్వామితో మాట్లాడటం, వారు చెప్పేది వినడం ఆత్మీయత పెంపొం దించడానికి అవసరం. మీరు మీ భావాలను, అవసరాలను సరిగా వ్యక్తీకరించలేకపోతే అది సాన్నిహిత్యంపై ప్రభావం చూపుతుంది· కొన్నిసార్లు, కొంతమంది గత అనుభవాలు, గాయాల వల్ల భాగస్వామితో సన్నిహితంగా ఉండటానికి భయపడతారు. దీన్నే ఫియర్ ఆఫ్ ఇంటిమసీ అంటారు. సునీతలో ఇది కనిపించింది. (చదవండి: ఈ సరస్సు ఎంత ప్రమాదకరమంటే.. ఒడ్డున నిలుచున్న ప్రమాదమే..!) -
చికిత్స కోసం వచ్చిన బాధితునితో నర్సు రిలేషన్.. ఆసుపత్రి బయట కూడా!
ఆ విషయం తెలియగానే ఆసుపత్రి యాజమాన్యంలో కలకలం చెలరేగింది. పోలీసులు ఆ నర్సుపై కేసు నమోదు చేయడంతో, యాజమాన్యం ఆమెను ఉద్యోగం నుంచి తొలగించింది. దర్యాప్తులో ఆమె ఆ బాధితుడు డయాలసిస్ కోసం వస్తుంటాడని చెప్పింది. ఆసుపత్రి యాజమాన్యం కంటపడకుండా.. చికిత్స కోసం వచ్చిన బాధితునితో ఒక నర్సు రిలేషన్షిప్ పెట్టుకుంది. ఆసుపత్రి బయట కూడా ఆ బాధితుడిని కలుస్తూ వచ్చింది. ఈ వ్యవహారం ఆసుపత్రి యాజమాన్యం కంటపడకుండా గుట్టుగా సాగింది. అయితే ఒక రోజు ఆ బాధితుడు చికిత్సలో నిర్లక్ష్యం కారణంగా కన్నుమూశాడు. అతనికి హార్ట్ ఎటాక్ వచ్చింది. విషయం పోలీసుల వరకూ చేరింది. పోలీసులు ఆ నర్సుపై కేసు నమోదు చేశారు. సోషల్ మీడియా సాయంతో.. డెయిలీ స్టార్ రిపోర్టులోని కథనం ప్రకారం ఈ ఉదంతం ఇంగ్లాండ్లో చోటుచేసుకుంది. పెనెలోప్ విలియం అనే మహిళ 2019 నుంచి నేషనల్ హెల్త్ సర్వీస్లో నర్సుగా పనిచేస్తోంది.ఈ నేపధ్యంలో ఆమెకు ఒక పేషెంట్తో సంబంధం ఏర్పడింది. వారు రహస్యంగా కాల్ చేసుకోవడం, కలుసుకోవడం చేస్తూ వచ్చారు. సోషల్ మీడియా సాయంతో ఇద్దరూ చాటింగ్ చేసుకునేవారు. ఆసుపత్రి బయట తరచూ కలుసుకునేవారు. అయితే ఒక రోజు అనుకోని ప్రమాదం చోటుచేసుకుంది. కారులో వారిద్దరూ రహస్యంగా కలుసుకున్న సమయంలో ఆ పేషెంట్కు గుండెపోటు వచ్చింది. సహోద్యోగికి ఫోను చేసి.. వెంటనే పెనెలోప్ అంబులెన్స్కు కాల్ చేసింది. ఇంతలో వారుంటున్న కారులోనే ఆ బాధితుడు మృతి చెందాడు. అయితే పెనెలోప్ తన సహోద్యోగినికి ఫోను చేసి, సీపీఆర్ అందించేందుకు పిలిచింది. అయితే అప్పటికే సమయం మించిపోయింది. విషయం ఆసుపత్రివర్గాలకు తెలియగానే కలకలం చెలరేగింది. ఈ ఉదంతంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆసుపత్రి యాజమాన్యం పెనెలోప్ను విధుల నుంచి తొలగించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా ఆమెను ప్రశ్నించగా, అతను ఆరోజు డయాలసిస్ కోసం ఆసుపత్రికి వచ్చాడని తెలిపింది. అయితే ఆమె ఫేస్బుక్లోని ఒక మెసేజ్లో అతనికి చెస్ట్ పెయిన్ వచ్చినట్లు ఉంది. దీంతో పెనెలోప్ అబద్దం చెబుతున్నదని యాజమాన్యానికి స్పష్టమైంది. ఉద్దేశ పూర్వకంగానే పిలిచిందంటూ.. ఆమె అతనికి ఫోను చేసి, ఉద్దేశ పూర్వకంగానే పిలిచిందని దర్యాప్తులో తేలింది. అతను రాగానే వారిద్దరూ కారులో సరససల్లాపాల్లో తేలారు. సరిగ్గా అదే సమయంలో ఆ బాధితునికి గుండెపోటు వచ్చి, మృతి చెందాడు. ఆ నర్సు, బాధితునికి మధ్య గత రెండేళ్లుగా ఈ ఎఫైర్ ఉందని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు ఆ బాధితుని పేరు వెల్లడించలేదు. ఈ విషయమై ఆసుపత్రి దర్యాప్తు కమిటీ సభ్యుడు ఒకరు మాట్లాడుతూ పెనెలోప్ విలియమ్స్ ఆ బాధితునితో తనకు ఎటువంటి సంబంధం లేదని, బాధితునికి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి, మృతి చెందాడని తెలిపిందన్నారు. ఇది కూడా చదవండి: తండ్రి మృతుని తట్టుకోలేని చిన్నారి.. సమాధి దగ్గరకు వెళ్లి.. -
ప్రేమలో ప్రతిసారీ నేనే మోసపోయాను: యంగ్ హీరోయిన్
దాదాపు హీరోయిన్లు ఎవరైనా సరే తమ జీవితంలోని ప్రేమ, రిలేషన్షిప్ గురించి మాట్లాడటానికి పెద్దగా ఇష్టపడరు. కొన్నిసార్లు మాత్రం సందర్భాన్ని బట్టి బయటపడుతుంటారు. అలా ఇప్పుడు బాలీవుడ్ నటి షెహనాజ్ గిల్.. తన ప్రేమ, బ్రేకప్స్ గురించి రివీల్ చేసింది. తను ఎవరినీ మోసం చేయలేదని, ప్రతిసారీ తనే మోసపోయాననే విషయాన్ని బయటపెట్టింది. పంజాబీ నటి అయిన షెహనాజ్ గిల్.. సొంత భాషలో పలు సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ శుక్లాతో రిలేషన్లో ఉంది. బిగ్బాస్లో ఈ జోడీ అప్పట్లో చాలా పాపులర్. కానీ సిద్ధార్థ్ అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో చనిపోయాడు. దీంతో షెహనాజ్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. కొన్నాళ్లకు కుదుటపడి సినిమాలు, ఆల్బమ్ సాంగ్స్ చేస్తూ కాస్త బిజీగా ఉంది. తాజాగా షెహనాజ్ నటించిన ఓ ఆల్బమ్ సాంగ్ విడుదలైంది. ఈ సందర్భంగానే తన బ్రేకప్స్ గురించి మాట్లాడింది. 'నేను ఎవరినీ ప్రేమ విషయమై మోసం చేయలేదు. కానీ నన్నే చాలాసార్లు మోసం చేశారు. ఈ రోజుల్లో నేను నమ్మేది ఒక్కటే. బ్రేకప్ చెప్పి, దూరంగా వెళ్లిపోవాలనుకుంటే వెళ్లిపోండి' అని నటి షెహనాజ్ గిల్ ఆవేదన వ్యక్తం చేసింది. అయితే తాను పూర్తిగా రిలేషన్షిప్కు దూరం కాలేదని, నిజమైన ప్రేమ దొరికితే మాత్రం అస్సలు విడిచిపెట్టనని క్లారిటీ ఇచ్చింది. (ఇదీ చదవండి: మహేశ్నే మించిపోయిన సితార.. ఆ ఒక్క విషయంలో) -
బాలీవుడ్ నటుడితో ప్రేమ.. ట్రెండింగ్లో తమన్నా.. (ఫొటోలు)
-
వావివరుసలు మరచిన వదిన,మరిది..చివరికి జరిగిందిదే!
రాజస్థాన్లో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. తనకన్నా 8 ఏళ్లు చిన్నవాడైన మరిదిపై వదిన మనసు పారేసుకుంది. కొన్ని రోజులుగా తనను పెళ్లిచేసుకోవాలంటూ అతనిపై ఒత్తిడి తీసుకువచ్చింది. ఫలితంగా ఊహించని పరిణామం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే రాజస్థాన్లోని భీల్వాడాలో ఒక మహిళ హత్య కేసును పోలీసులు చేధించారు. ఈ కేసులో వదినతో అక్రమ సంబంధం పెట్టుకున్న మరిదిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ వదినతో ఇతనికి సంబంధం ఏర్పడిన దరిమిలా ఆమె అతనిని వివాహం కోసం ఒత్తిడి చేసింది. ఈ నేపధ్యంలో ఆమె పోరుపడలేని మరిది ఆమెను హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతురాలు రాయ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మదన్పురా గ్రామంలో తన అత్త కూతురి వివాహానికి హాజరయ్యింది. అయితే మే 23న ఉన్నట్టుండి ఆమె మాయమయ్యింది. అయితే మర్నాడు రోడ్డు పక్కన పొదల్లో ఆమె మృతదేహం కనిపించింది. ఈ ఉదంతం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తమ దర్యాప్తులో ప్రాధమికంగా ఆమె నుంచి నగలు లాక్కొని ఎవరో హత్య చేశారని భావించారు. అయితే వీరి దర్యాప్తు ముమ్మరమైన తరుణంలో పలు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి. మృతురాలు నైనా కన్వర్కు ఇద్దరు పిల్లలు ఉన్నారని, భర్త ముంబైలో ఉద్యోగం చేస్తున్నాడని తెలిసింది. పోలీసు అధికారి కన్నయ్యాలాల్ మాట్లాడుతూ మే 24న మదన్పురా గ్రామశివారులోని పొదల్లో 28 ఏళ్ల వివాహిత మృతదేహం రక్తపు మడుగులో కనిపించిందన్నారు. ఆమెపై దాడిచేసి, గొంతునులిమి హత్య చేశారన్నారు. వెంటనే మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించామన్నారు. అయితే పోలీసుల దర్యాప్తులో మృతురాలు మే 23న రాత్రి పోనులో ఎవరితోనో మాట్లాడుతూ ఇంటి నుంచి బయటకు వెళ్లిందన్నారు. ఉదయానికి కూడా ఆమె తిరిగిరాలేదన్నారు. పోను కాల్ డిటైల్స్ ఆధారంగా పోలీసులు ఆ మహిళ మరిదిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారన్నారు. కాగా నైనా భర్త ముంబైలో ఉంటుండగా, వారి ఇద్దరు పిల్లలు చదువుల కోసం ననిహాల్లో ఉంటున్నారు. ఈ సమయంలో ఆమెకు మరిదితో సాన్నిహిత్యం ఏర్పడింది. మూడేళ్లుగా వారి సంబంధం కొనసాగుతూనే ఉంది. నైనా మరిది దీపక్ ఆమెన్నా 8 ఏళ్లు చిన్నవాడు. అయినా ఆమె చాలాకాలంగా తనను పెళ్లిచేసుకోవాలంటూ దీపక్ను అడుగుతూ వస్తోంది. ఈ విషయమై మే 23న రాత్రి వీరిద్దరి మధ్య వివాదం జరిగింది. ఈ నేపధ్యంలో దీపక్ ఆమపై దాడి చేసి, గొంతు నులిమి హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని పొదల్లో పారేసి అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు దీపక్ను అరెస్టు చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆస్తి కోసమే పవిత్రా లోకేష్ నరేష్తో ప్రేమాయణం నడుపుతుందా? ఆమె చెప్పిందిదే..
టాలీవుడ్లో నరేష్, పవిత్రా లోకేష్ ఎంత ఫేమస్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో ఈ జంట గురించి పలు ట్రోల్స్, మీమ్స్ వచ్చినా సరే డోంట్ కేర్ అంటూ ఇద్దరూ కలిసే ఉంటున్నారు,త్వరలోనే తమ బంధాన్ని పెళ్లిగా మార్చుకుంటామని ప్రకటించారు. అయితే ఇప్పటికే మూడు పెళ్లిళ్లు పెటాకులు చేసుకున్న నరేష్తో పవిత్రా లోకేశ్ కేవలం డబ్బు కోసమే కలిసుంటుందని, అందుకే ప్రేమాయణం సాగిస్తుందంటూ రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. తాజాగా నరేష్ తన ఆస్తుల గురించి క్లారిటీ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'అవును, నేను బిలినియర్ని. నాకు వెయ్యికోట్ల కంటే ఎక్కువగానే ఆస్తి ఉంది. అందులో వారసత్వంగా వచ్చింది కొంత ఉంటే, నేను కష్టపడి సంపాదించుకుంది కూడా ఉంది. భూముల ధరలు బాగా పెరగడంతో నా ఆస్తుల విలువ రూ. 1000కోట్లు కాదు అంతకు మించి కూడా ఉండొచ్చు. నేనెప్పుడూ ఆ లెక్క చూసుకోలేదు. అందులో బ్లాక్ మనీ లేదు. మొత్తం వైట్ మనీనే. ఎక్కడైనా, ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. చాలా గౌరవప్రదంగా నేను నా రాజ్యాన్ని స్థాపించుకున్నాను. నేను నమ్మేది ఒక్కటే.. దేవుడు ఇచ్చిన దాంట్లో మనం సంతోషంగా ఉండాలి. చుట్టూ ఉన్న వాళ్లని సంతోషంగా చూసుకోవాలి. ఇక నా డబ్బు చూసి పవిత్ర నాతో ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి నాతో డబ్బు లేదని వెళ్లిపోయినవాళ్లు ఉన్నారు. ఆస్తి కోసమే నా జీవితంలో వచ్చినవాళ్లూ ఉన్నారు.. కానీ మాది పవిత్రబంధం' అంటూ చెప్పుకొచ్చారు. ఇక నరేష్తో రిలేషన్పై పవిత్ర కూడా.. 'అసలు ఆయన బ్యాక్గ్రౌండ్ గురించి చాలారోజుల వరకు నాకు తెలియదు. ఇప్పటికే మాకు పెళ్లి అయిపోయిందనే ఫీలింగ్ ఉంది. ఆయన నన్ను కాకుండా ఇంకెవరినీ చూడరు. చివరి వరకు మా బంధం ఇలాగే నిలుస్తుంది' అంటూ పేర్కొన్నారు. -
మా బంధానికి మహేశ్ ఫ్యామిలీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు : నరేష్
సీనియర్ నటుడు వీకే నరేశ్, పవిత్రా లోకేశ్ ప్రేమాయణం గురించి అందరికి తెలిసిందే. కొన్నాళ్లుగా వీరి వ్యవహారం టాలీవుడ్లోనే కాదు, సోషల్ మీడియాలోనూ హాట్టాపిక్గా మారింది. ఇప్పటికే నరేష్కు మూడు పెళ్లిళ్లు అయ్యాయి. దీనికి తోడు పవిత్రతో సుమారు 20 ఏళ్ల తేడా ఉంటుంది. మొన్నటిదాకా మేం స్నేహితులమే అని చెప్పిన నరేష్-పవిత్రా లోకేశ్ ఇప్పుడు మాత్రం త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చారు. పైకి మాత్రం అది మా స్టోరీ కాదంటూనే వారి నిజజీవితంలో జరిగిన సంఘటను ఆధారంగా చేసుకొని 'మళ్లీ పెళ్లి' అనే సినిమాను రూపొందించారు. ట్రైలర్తో సినిమాపై అంచనాలను పెంచేసిన నరేష్-పవిత్ర ప్రమోషన్స్ కోసంరెచ్చిపోయారు. ఆకాశం విరిగిపడినా.. భూమి బద్దలైనా మేమిద్దరం కలిసే ఉంటాం అంటూ స్టేట్మెంట్లు ఇచ్చేశారు. ఈనెల 26న సినిమా రిలీజ్ కానుండటంతో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సోషల్ మీడియాకు కావాల్సినంత కంటెంట్,పుటేజీ ఇచ్చేస్తున్నారు. తాజాగా ఓ యాంకర్.. మీ ప్రేమని మహేశ్ బాబు కుటుంబం ఒప్పుకుందా అని నరేష్ని అడగ్గా.. తమ బంధం గురించి మహేశ్బాబుతో పాటు కృష్ణగారికి ముందే తెలుసని పేర్కొన్నారు. 'కృష్ణ గారు, విజయ నిర్మల గారు, మహేశ్ కుటుంబం మేమంతా ఒక్కటే. మేం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అందరం కలిసే తీసుకుంటాం. మా రిలేషన్ గురించి వాళ్లకు ఎప్పట్నుంచో తెలుసు. ఫ్యామిలీ నుంచి మాకు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం కాలేదు. మా ప్రేమని ఇంట్లో అందరూ ఒప్పుకున్నారు. మహేశ్కు పవిత్ర అంటే కూడా గౌరవం. ఆమె వంటను కూడా ఎంతో ఇష్టపడతారు' అంటూ నరేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి. -
నవ్యస్వామితో డేటింగ్పై క్లారిటీ ఇచ్చిన 'విరూపాక్ష' నటుడు
బుల్లితెర నటుడు రవికృష్ణ-నవ్య స్వామి జోడీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓ సీరియల్లో జంటగా నటించిన వీరిద్దరు అప్పట్నుంచి ఎక్కడ చూసిన జంటగా కనిపిస్తున్నారు. పలు ఎంటర్టైన్మెంట్ షోలకి జంటగా వెళ్తున్నారు. ఈ క్రమంలో వీరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. ఇద్దరూ ప్రేమలో ఉన్నారని అందుకే కలిసి ఇన్ని ప్రాజెక్టులు చేస్తున్నారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై అలాంటిదేమీ లేదు, మేం జస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఎప్పట్నుంచో సమాధానం ధాటేస్తున్న రవికృష్ణకు తాజాగా మరోసారి ఇలాంటి ప్రశ్నే ఎదురైంది. మీకు, నవ్యస్వామికి ఉన్న రిలేషన్ ఏంటని యాంకర్ ప్రశ్నించగా.. సీరియల్లోనే తాము మొదటిసారి కలుసుకున్నామని, అప్పట్నుంచి తమ మధ్య మంచి స్నేహం ఉందని తెలిపాడు. అయితే ఒకవేళ నవ్యస్వామి వచ్చి ప్రపోజ్ చేస్తే మాత్రం ఆలోచిస్తాను అంటూ ఆమెతో రిలేషన్షిప్పై ఇండైరెక్ట్ హింట్ ఇచ్చాడు. ప్రస్తుతం రవికృష్ణ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి. ఇక రీసెంట్గా విరూపాక్ష సినిమాలో రవికృష్ణ కీలక పాత్రలో కనిపించి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. -
ఆ జంటలు ఎందుకు విడిపోతున్నాయి?.. సమయం దొరకడం లేదా?
లలిత ఒక ఇండియన్ కంపెనీలో పనిచేస్తుండగా, ఆనంద్ ఒక అమెరికన్ కంపెనీలో పనిచేస్తున్నాడు. లలిత ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదారు గంటల వరకు పనిచేయాల్సి ఉండగా, ఆనంద్ పని సాయంత్రం ఆరుగంటలకు మొదలవుతుంది. ప్రస్తుతం ఇద్దరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా కనీసం మాట్లాడుకోవడానికి కూడా సమయం దొరకడం లేదు. దీనివల్ల వారి కుటుంబ జీవితం సజావుగా సాగడంలేదు. సత్యది చలాకీ మనస్తత్వం. ఎవరితోనైనా ఇట్టే అల్లుకుపోతుంది. మాట కలిపిందంటే ఆపదు. ఆమె భర్త కుమార్ భిన్న ధ్రువం. తన పని, పుస్తకాలు, సినిమాలతో గడిపేస్తుంటాడు. వంద మాటలకు ఒక్కమాటతో సమాధానం చెప్తాడు. దీంతో తన మాటలు వినడంలేదని సత్య.. వింటూనే ఉన్నా కదా, ఇంకేం చేయాలని కుమార్.. రోజూ గొడవ పడుతూనే ఉన్నారు. రష్మి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి. అమెరికాలో పనిచేసే అవకాశం రావడంతో వెళ్లేందుకు సిద్ధమైంది. అది ఆమె భర్త రాజేష్కి ఇష్టంలేదు. ఇద్దరం ఇక్కడే పనిచేసుకుంటూ ఉందామన్నాడు. తనకు వచ్చిన అవకాశాన్ని వదులుకోలేనని, తన కెరీర్కి అడ్డు రావద్దని తేల్చి చెప్పింది రష్మి. ఈ విషయమై మొదలైన వాగ్వాదం చిలికి చిలికి గాలివానై విడాకుల వరకూ వెళ్లింది. మారుతున్నకాలంతో పాటు ఉద్యోగాలూ మారుతున్నాయి. భిన్నమైన టైమింగ్స్, విభిన్నమైన వాతావరణాల్లో పని చేయాల్సి వస్తోంది. దీనివల్ల దంపతుల మధ్య సమస్యలు రావడంతో పాటు వారి శారీరక, మానసిక ఆరోగ్యాలపై ప్రభావం చూపుతున్నాయి. కొన్నిసార్లు అవి విడాకులకు దారితీస్తున్నాయి. ఇటీవల కాలంలో ఇలాంటి కేసుల సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలో వేర్వేరు టైమ్ జోన్స్లో పనిచేస్తున్న జంటలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని, వాటికి పరిష్కారాలు అన్వేషించాల్సిన అవసరం ఉంది. పనివేళల్లో తేడాల వల్ల వచ్చే సమస్యలు ♦వేర్వేరు పని షెడ్యూళ్ల కారణంగా జంటలు ఎదుర్కొనే ముఖ్యమైన సమస్యల్లో ఒకటి కలసి గడిపేందుకు సరిపడా సమయం లేకపోవడం. దీనివల్ల దంపతుల్లో ఒకరి పై ఒకరికి నిర్లక్ష్యభావం ఏర్పడుతుంది. ఇది ఆ బంధంలో ఒత్తిడిని పెంచుతుంది. విరుద్ధమైన పని షెడ్యూళ్లలో పనిచేసే జంటలు తామిద్దరూ మాట్లాడుకోవడానికి ఇద్దరికీ అనుకూలమైన సమయాన్ని సర్దుబాటు చేసుకోలేకపోవడం. ఇది సవాలుగా మారి ఆ దాంపత్యంలో అపార్థాలు, ఉద్రిక్తతలకు దారి తీస్తుంది. ఫలితంగా సంఘర్షణ, మానసిక క్షోభను అనుభవించాల్సి వస్తుంది. ఒక భాగస్వామికి పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువ పని ఒత్తిడి ఉన్న భాగస్వామే ఇంటి పనులను ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ఇది కోపానికి, వాగ్వావాదానికి కారణమవుతుంది. ∙ఒక భాగస్వామికి ఎక్కువ పని గంటలు.. అంతే ఎక్కువ పని ఒత్తిడీ ఉన్నప్పుడు ఆ అలసట, బర్న్ అవుట్.. భావోద్వేగ సమస్యలకు దారితీయవచ్చు. దీనివల్ల దంపతుల మధ్య మానసిక దూరం ఏర్పడుతుంది. వేర్వేరు పని షెడ్యూళ్లు మానసిక ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఆందోళన, నిరాశ, ఇతర మానసిక ఆరోగ్య సమస్యలతో సతమతమవ్వొచ్చు. అలాంటి సమస్యలున్న భాగస్వామికి మద్దతునివ్వడం మరొక భాగస్వామికి కష్టం కావచ్చు. ఇలా సర్దుబాటు చేసుకోవచ్చు ♦విభిన్నమైన పని షెడ్యూళ్లను నిర్వహించడంలో మొదటి, అతిముఖ్యమైన దశ.. మీ భాగస్వామితో నిజాయితీగా మీ ఆందోళనలు, అవసరాలు, అంచనాలను పంచుకోవడం. మీ భాగస్వామి అభిప్రాయాన్ని జాగ్రత్తగా వినడం. ♦మీ పని షెడ్యూళ్లు, బాధ్యతల చుట్టూ స్పష్టమైన సరిహద్దులను సెట్ చేసుకోండి. వీలైనంత వరకూ అవి ఇద్దరికీ అనుకూలంగా ఉండేలా అడ్జస్ట్ చేసుకోండి. ∙మీకెంత బిజీ షెడ్యూళ్లు ఉన్నప్పటికీ మీ పార్టనర్తో బంధానికి ప్రాధాన్యం ఇవ్వండి. ఇద్దరికీ సమయం కుదిరినప్పుడు మీ యాక్టివిటీస్ షెడ్యూల్ చేసుకోండి. అలా కుదరనప్పుడు మెసేజెస్, కాల్స్, ఇ మెయిల్స్ ద్వారా కనెక్ట్ అయ్యేలా చూసుకోండి. ♦మీ భాగస్వామి పని డిమాండ్లను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వారి అవసరాలకు అనుగుణంగా మీ సొంత షెడ్యూల్స్ను మార్చుకోవడానికీ సిద్ధంగా ఉండండి. అవసరమైతే ఇంట్లో అదనపు బాధ్యతలు తీసుకోండి. పిల్లలు ఉంటే, వీలైనంతవరకు వారిని మీ కార్యకలాపాల్లో కలుపుకోండి. ఇది మీరు కుటుంబంగా కలసి ఉండటంలో, జ్ఞాపకాలను క్రియేట్ చేయడంలో తోడ్పడుతుంది. మీ భాగస్వామితో కలసి చేయగల పనుల కోసం చూడండి. అది భాగస్వామి అభిరుచి, ఫిట్నెస్ రొటీన్ లేదా ఇష్టమైన టీవీ షో కూడా కావచ్చు. ♦అన్నింటికంటే ముఖ్యంగా మీకు తగినంత నిద్ర, వ్యాయామం, విశ్రాంతి, తదితర కార్యకలాపాల కోసం సమయాన్ని వెచ్చించండి. ∙ఇవన్నీ చేసినా మీ ఒత్తిడి, ఆందోళన తగ్గకపోతే ఏమాత్రం మొహమాటపడకుండా సైకాలజిస్ట్ని సంప్రదించండి. మీ ఇద్దరి మధ్య గొడవలు తగ్గకపోతే ఫ్యామిలీ కౌన్సెలింగ్ తీసుకోండి. చదవండి👉 ఐటీ ఉద్యోగులకు బంపరాఫర్.. డబుల్ శాలరీలను ఆఫర్ చేస్తున్న కంపెనీలు! -
ప్రభాస్ను అనుష్క ముద్దుగా ఏమని పిలుస్తుందో తెలుసా?
టాలీవుడ్లో ప్రభాస్-అనుష్కల జోడీకి సెపరేట్ ఫ్యాన్బేస్ ఉంది. ఆన్స్క్రీన్లోనే కాకుండా, ఆఫ్స్క్రీన్లోనూ వీరి కెమిస్ట్రీకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఇక ఎప్పటినుంచో ప్రభాస్-అనుష్కలు ప్రేమలో ఉన్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారనే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. చదవండి: 'విమానం'లో అనసూయ లుక్ అదిరిందిగా.. రంగమ్మత్తలా ఉందే! కానీ అందరూ అనుకున్నట్టు తమ మధ్య ఏమీ లేదని, కేవలం ఫ్రెండ్స్ అని అనుష్క, ప్రభాస్లో క్లారిటీ ఇచ్చినా ఫ్యాన్స్ మాత్రం వీళ్లు రియల్ లైఫ్ కపుల్ అయితే బాగుండని కోరుకుంటారు. ఇక తాజాగా మరోసారి ప్రభాస్-అనుష్కల రిలేషన్షిప్పై సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఏమైందంటే.. అనుష్క, నవీన్ పొలిశెట్టి జంటగా నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి టీజర్ రీసెంట్గా విడుదలైన సంగతి తెలిసిందే. దీన్ని ప్రభాస్ తన ఇన్స్టా స్టోరీలో షేర్ చేస్తూ.. టీజర్ చాలా బావుందంటూ ప్రశంసలు కురిపించాడు. దీనిపై అనుష్క స్పందిస్తూ.. థ్యాంక్యూ 'పప్సు' అంటూ కామెంట్ చేసింది. ఈ స్టోరీని స్క్రీన్ షాట్ చేసిన పలువురు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. చదవండి: వారికి ఇష్టమైనప్పుడు.. మనం ఏం చేయగలం: కంగనా -
తన రిలేషన్ షిప్ స్టేటస్ బయటపెట్టేసిన అఖిల్ అక్కినేని
అఖిల్ అక్కినేని నటిస్తున్న తాజా చిత్రం ఏజెంట్.సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినమా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. అఖిల్ కెరీర్లో తొలిసారి పాన్ ఇండియా చిత్రంగా వస్తుండటంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ జోరు పెంచారు మేకర్స్. ఇందులో భాగంగా తాజాగా కాకినాడలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను గ్రాండ్గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అఖిల్ మాట్లాడుతూ పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. కొంతకాలంగా అఖిల్ పెళ్లిపై పలు వార్తలు వస్తున్నాయి. తాజాగా పెళ్లెప్పుడు అని అభిమాని అడిగిన ప్రశ్నకు అఖిల్ సమాధానిమిస్తూ..“అప్పుడే పెళ్లి చేసుకోమంటారా?” అంటూ ఫన్నీగా బదులిచ్చాడు. ప్రస్తుతం సింగిల్గానే ఉన్నానంటూ తన రిలేషన్షిప్పై క్లారిటీ ఇచ్చాడు. -
త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్న రకుల్ ప్రీత్ సింగ్
నటి రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు యమ ఖుషీగా ఉన్నారు. ఈ ఉత్తరాది బ్యూటీ తొలుత కన్నడంలో ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత కెరటం చిత్రంతో టాలీవుడ్కు, తడయార తాక్క చిత్రంతో కోలీవుడ్కు పరిచయం అయ్యారు. తొలి రోజుల్లో సరైన సక్సెస్లు లేక నిరాశ పడినా ఆ తరువాత దక్షిణాదిలో వరుస విజయాలతో క్రేజీ కథానాయకిగా రాణిస్తున్నారు. ప్రస్తుతం పెద్ద క్రేజ్ లేకపోయినా హిందీ, తెలుగు, తమిళం భాషల్లో అవకాశాలు వస్తనే ఉన్నాయి. తమిళంలో శివకార్తికేయన్కు జంటగా నటిస్తున్న అయలాన్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం కమలహాసన్ సరసన ఇండియన్ 2 చిత్రంలో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే మూడు పదుల వయసు దాటిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు తన బాయ్ ఫ్రెండ్ బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ బద్నానితో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఇటీవలే తన బాయ్ ఫ్రెండ్ గురించి బహిరంగంగా వెల్లడించారు. అంతేకాదు బాయ్ ఫ్రెండ్తో చెట్టా పెట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఇటీవల తన పుట్టిన రోజును కూడా జాకీ బద్నానితో ఖుషీ ఖుషీగా జరుపుకున్నారు. ఆ ఫొటోలు సామాజిక వధ్యమాల్లో వైరల్ అయ్యాయి. తాజాగా తన బాయ్ ఫ్రెండ్తో కలిసి దిగిన ఫొటోను ఇన్ స్ట్రాగామ్లో పోస్ట్ చేసి తనకు శాంతా ఇచ్చిన గిఫ్ట్ జాకీ అని పేర్కొన్నారు. కాగా వచ్చే ఏడాది ఈ ప్రేమ జంట పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
బాయ్ఫ్రెండ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన శ్రుతిహాసన్
డూడుల్ ఆర్టిస్ట్ శంతనుతో తాను రిలేషన్లో ఉన్న విషయాన్ని శ్రుతీహాసన్ ఎప్పుడూ సీక్రెట్గా ఉంచలేదు. సోషల్ మీడియాలో అతనితో క్లోజ్గా ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ, కామెంట్లు పెడుతుంటారీ బ్యూటీ. తాజాగా శంతను వల్ల తనలో వచ్చిన మార్పు గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘‘నేను, శంతను బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరం కలిసి ఉంటాం. ఇద్దరం కలిసి కామెంట్లు చదువుతుంటాం. ఎందుకంటే ఆ కామెంట్స్ కామెడీగా ఉంటాయి. ఇక తన వల్ల నేను ప్రశాంతంగా మారిపోయాను. అలాగే దయగల వ్యక్తిగా వరాను. శంతను చాలా ప్రశాంతంగా, దయగా ఉంటాడు. అందుకే తనంటే నాకు ఇష్టం. ఈ రెండు లక్షణాలను నేను అలవాటు చేసుకున్నాను’’ అని ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు శ్రుతీహాసన్. ఇక సినివల విషయానికి వస్తే.. ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ చిత్రాలతో ఈ సంక్రాంతికి థియేటర్లలో కనిపించనున్నారు శ్రుతీహాసన్. ప్రస్తుతం ప్రభాస్ సరసన ‘సలార్’ చిత్రంలో నటిస్తున్నారు. -
హీరో సందీప్ కిషన్తో రెజీనా డేటింగ్? వైరల్గా మారిన పోస్ట్
తమిళసినిమా: ప్రస్తుతం వార్తల్లో ఉన్న నటి రెజీనా కసాండ్రా. ఈ చెన్నై అమ్మాయి బహుభాషా కథానాయికగా రాణిస్తోంది. తమిళంలో కండనాళ్ ముదల్ చిత్రంతో 2017లో కథానాయకిగా పరిచయమైంది. మొదటి చిత్రంతోనే మంచి పేరు తెచ్చుకున్న రెజీనా కేడి బిల్లా కిలాడి రంగ చిత్రంతో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఆ తర్వాత టాలీవుడ్కు పరిచయమైంది. తమిళంలో కంటే తెలుగులోనే ఈ బ్యూటీ ఎక్కువ చిత్రాలు చేయడం, కథానాయకిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడం విశేషం. అదేవిధంగా ఈ 32 ఏళ్ల అమ్మాయి ఇప్పటికి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాలర్గానే ఉంది. అయితే ఈ అమ్మడి ప్రేమ గురిం రకరకాలుగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఆ మధ్య ఒక టాలీవుడ్ యువ నటుడి ప్రేమలో గాఢంగా మునిగిపోయిందని ప్రచారం హోరెత్తింది. తాజాగా మరో యువ నటుడితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిందని ప్రచారం జరుగుతోంది. ఈ బ్యూటీ ఇటీవల తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంది. ఆ సందర్భంగా నటుడు సందీప్ కిషన్ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేశారు. ఆయన ట్విట్టర్లో పుట్టినరోజు శుభాకాంక్షలు పాప. ఐ లవ్ యూ. ఎప్పుడూ నీకు మంచే జరగాలి అని ట్విట్టర్లో పేర్కొని నటి రెజీనాతో తను సన్నిహితంగా ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇలాంటి వార్తలపై నటి రెజీనా, సందీప్ కిషన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. Happpyyyy Birthdayyyy Papa… Love you and Wishing you only the best of everything,always ♥️ Stay Happy..Stay Blessed ♥️@ReginaCassandra pic.twitter.com/pZGd9d5ibn — Sundeep MICHAEL Kishan (@sundeepkishan) December 13, 2022 -
ప్రభాస్తో కృతి ప్రేమలో ఉందా? లీక్ చేసిన బాలీవుడ్ హీరో
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్-కృతిసనన్ డేటింగ్లో ఉన్నారంటూ కొంతకాలంగా వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆదిపురుష్ సినిమాలో జంటగా నటించిన వీరిద్దరు షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డట్లు ప్రచారం జరుగుతుంది. ఇక ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ను పెళ్లి చేసుకుంటా అని కృతి చెప్పడం ఈ రూమర్స్కి మరింత బలాన్ని చేకూర్చింది. తాజాగా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ సైతం ప్రభాస్-కృతిసనన్ల రిలేషన్షిప్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బేఢియా సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఓ రియాలిటీ షోకు వరుణ్, కృతిసనన్ గెస్టులుగా వెళ్లారు. ఈ క్రమంలో కృతి మనసులో ఎవరున్నారు అన్న ప్రశ్నకు వరుణ్ ధావన్ సమాధానమిస్తూ.. కృతి మనసులో ఒక హీరో ఉన్నాడు. అతను ఇప్పుడు ముంబైలో లేడు కానీ దీపికా పదుకోణెతో షూటింగ్లో ఉన్నాడు అంటూ హింట్ ఇచ్చేశాడు. ఇతడి మాటలకు కృతి కూడా సిగ్గుపుడతూ నవ్వేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కాగా గతంలో ఓ షోలో కృతి ప్రభాస్కు కాల్ చేయడం, ఆదిపరుష్ టీజర్ ప్రమోషన్స్లో ప్రభాస్తో క్లోజ్గా ఉండటం వంటివి చూసి వీళ్లిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ బీటౌన్లో జోరుగా టాక్ వినిపిస్తుంది. Whaaaaaaattt 😯😁🥰💖...... Joo meyy soch raha hoo, voo aap log bii?!😌😹🤔🤔. #KritiSanon #Prabhas𓃵 !! #ProjectK 🪐 pic.twitter.com/F3s91EyFwe — Jai Kiran💕Adipurush🏹 (@Kiran2Jai) November 27, 2022 -
జపాన్ కంపనీ నైడెక్తో హీరో ఎలక్ట్రిక్ జోడీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ మోటార్స్ తయారీలో ఉన్న జపాన్ దిగ్గజం నైడెక్ కార్పొరేషన్తో హీరో ఎలక్ట్రిక్ ప్రాధాన్య భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా హీరో తయారీ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల్లో నైడెక్ రూపొందించిన ఎలక్ట్రిక్ మోటార్స్ను వినియోగిస్తారు. 2023 ఫిబ్రవరిలో ఈ ఎలక్ట్రిక్ బైక్స్ మార్కెట్లోకి రానున్నాయి. ఎలక్ట్రిక్ టూ వీలర్స్కు కావాల్సిన మోటార్స్ను సంయుక్తంగా అభివృద్ధి చేసేందుకు నైడెక్తో రెండేళ్ల క్రితమే చేతులు కలిపినట్టు హీరో ఎలక్ట్రిక్ వెల్లడించింది. తమ సరఫరా గొలుసు సమస్యలను తగ్గించడంలో జపాన్ నైడెక్తో భాగస్వామ్యం తోడ్పడుతుందని, ఉత్పత్తుల శ్రేణిలో పవర్ట్రెయిన్ భాగాలను క్రమంగా అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుందని హీరో ఎలక్ట్రిక్సీఈవో సోహిందర్గిల్ అన్నారు. అలాగే భారతీయ పరిస్థితులకు తగినఆధునిక అధునాతన సాంకేతికతతో కూడిన హబ్ మోటార్ అభివృద్ధికి హీరో ఎలక్ట్రిక్తో భాగస్వామ్యం ఉపయోగపడనుందని నైడెక్ ప్రతినిధి సంతోషం వ్యక్తం చేశారు. -
సహజీవనం చేసి పెళ్లాడకుంటే...మోసగించినట్టు కాదు
బెంగళూరు: సహజీవనం చేసి పెళ్లాడకపోతే అది మోసగించడం కిందకు రాదని కర్నాటక హైకోర్టు పేర్కొంది. సదరు వ్యక్తిపై ఐపీసీ సెక్షన్ 420 కింద కేసు పెట్టలేమని న్యాయమూర్తి జస్టిస్ కె.నటరాజన్ స్పష్టం చేశారు. తన బోయ్ఫ్రెండ్ ఎనిమిదేళ్లు సహజీవనం చేసి చివరికి పెళ్లికి నిరాకరించాడంటూ ఓ మహిళ చేసిన ఫిర్యాదును కొట్టేస్తూ ఆయన తీర్పు వెలువరించారు. ఇద్దరి మధ్య ఉన్న సహజీవన ఒప్పందాన్ని అతను మోసపూరిత ఉద్దేశంతో ఉల్లంఘించాడని చెప్పలేమని ఈ సందర్భంగా న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఇంట్లోవాళ్లు ఇంకో అమ్మాయితో పెళ్లి కుదిర్చిన కారణంగా సహజీవనాన్ని వైవాహిక బంధంగా మార్చుకునేందుకు సదరు అబ్బాయి నిరాకరించాడు. -
49ఏళ్ల వయసులో నటుడితో మలైకా రెండో పెళ్లి!.. పోస్ట్ వైరల్
బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్, మలైకా అరోరా ప్రేమలో మునిగితేలుతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని వారు ఎప్పుడూ దాచలేదు. వెకేషన్స్, పార్టీ, ఫంక్షన్స్ ఇలా ప్రతీ వేడుకకు కలిసే హాజరవుతుంటారు. బీటౌన్లో మలైకా-అర్జున్ల జోడికి ప్రత్యేక స్థానం ఉంది. ఇక సినిమాల కంటే డేటింగ్ వార్తలతో టాక్ ఆఫ్ ది టౌన్గా మారిన ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అవుతున్నారట. ఈ మేరకు మలైకా తన ఇన్స్టాగ్రామ్లో ఓ ఫోటోను షేర్ చేస్తూ.. అవును నేను, అంగీకరించాను అంటూ లవ్ ఎమోజీని షేర్ చేసింది. దీంతో అర్జున్-మలైకాలు ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి డిసైడ్ అయ్యారంటూ బీటౌన్ మీడియా కోడై కూస్తుంది. మరి నిజంగానే వీళ్లు పెళ్లిపీటలు ఎక్కనున్నారా? లేదా ఏదైనా మూవీ ప్రమోషన్స్ కోసం చేసిన స్టంటా? అన్నది త్వరలోనే తేలనుంది. కాగా మలైకా ఆరోరాకు ఇదివరకే అర్భాజ్ ఖాన్తో పెళ్లయింది. 17ఏళ్ల వివాహ బంధం తర్వాత వీరు విడిపోయారు. ప్రస్తుతం మలైకా తనకంటే 12 ఏళ్లు చిన్నవాడైన అర్జున్ కపూర్తో ప్రేమలో ఉంది. View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) -
Gautham Karthik-Manjima Mohan: అవును మేము ప్రేమలో ఉన్నాం!
చిత్ర పరిశ్రమకు చెందిన హీరో హీరోయిన్లు ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం కొత్తేమీ కాదు. అలా తాజాగా కోలీవుడ్, మాలీవుడ్కు చెందిన మరో జంట ప్రేమలో పడ్డారు. ఆ జంటలో హీరో గౌతమ్ కార్తీక్. సీనియర్ నటుడు కార్తీక్ వారసుడు ఈయన. మణిరత్నం దర్శకత్వం వహించిన కడల్ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం అయిన గౌతమ్ కార్తీక్ ఆ తరువాత వరుసగా చిత్రాలు చేస్తున్నారు. ఇకపోతే నటి మంజిమా మోహన్ గురించి చెప్పాలంటే మలయాళం చిత్రం ప్రేమమ్ ద్వారా పరిచయం అయిన ముగ్గురు హీరోయిన్లలో ఈ బ్యూటీ ఒకరు. అచ్చం యన్బదు మడమయడ చిత్రం ద్వారా దర్శకుడు గౌతమ్ మీనన్ ఈ అమ్మడిని కోలీవుడ్కు దిగుమతి చేశారు. ఆ చిత్రం హిట్తో ఇక్కడ అవకాశాలను అందుకుంటున్నారు. అలా గౌతమ్ కార్తీక్, మంజిమా మోహన్ కలిసి దేవరాట్టం చిత్రంలో నటించారు. ఆ పరిచయం ప్రేమగా మారింది. వీరి ప్రేమ గురించి ప్రచారం చాలా కాలంగానే జరుగుతోంది. అయితే ఆ వార్తలపై నటుడు గౌతమ్ కార్తీక్ గానీ, నటి మంజిమా మోహన్ స్పందించలేదు. అలాంటిది ఇన్నాళ్లకు నటుడు కార్తీక్ తమ ప్రేమ గురించి బ్లో అప్ అయ్యారు. అవును మేము ప్రేమించుకున్నాం అని ఇన్ స్ట్రాగామ్ లో మంజిమామోహన్ కలిసున్న ఫొటోను పోస్ట్ చేశారు. అయితే పెళ్లికి ముహూర్తం ఎప్పుడు అన్నది వెల్లడించలేదు. -
భర్త నుంచి విడిపోయాక ఇప్పుడు మరింత సంతోషంగా ఉన్నా: నటి
భర్త అర్బాజ్ఖాన్తో 18 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికిన బాలీవుడ్ సీనియర్ నటి మలైకా అరోరా ఇప్పుడు మరింత ఆనందంగా ఉన్నానని చెప్పుకొచ్చింది. పెళ్లి బంధం నుంచి విడిపోయాక తమ ఇద్దరికీ జీవితం పట్ల అవగాహన పెరిగిందని, మెరుగ్గా ఆలోచిస్తున్నామని పేర్కొంది. కాగా, 1998 డిసెంబర్లో పెళ్లి చేసుకున్న మలైక, అర్బాజ్ఖాన్ 2017లో పెళ్లి బంధానికి స్వస్తి పలికారు. ఆ తర్వాత ఆమె నటుడు అర్జున్ కపూర్తో, అతను జార్జియా యాండ్రియానితో రిలేషన్షిప్లో ఉన్నారు. 19 ఏళ్ల కుమారుడు అర్హాన్ ఖాన్కు తల్లిదండ్రులుగా బాధ్యతలు నెరవేరుస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో.. మాజీ భర్తతో మీరు టచ్లో ఉన్నారా? అని ప్రశ్నించగా మలైకా మాట్లాడుతూ.. నచ్చినట్టు బతకడమే జీవితమని ఆమె వ్యాఖ్యానించింది. జీవితంలో సంతోషం వెతుక్కోవాలని.. తన మాజీ భర్త, తాను అదే పని చేశామని చెప్పింది. అర్బాజ్ఖాన్ మంచి వ్యక్తి అని, అతను బాగుండాలని ఎప్పుడూ కోరుకుంటానని తెలిపింది. ఇద్దరు వ్యక్తులు చాలా అంశాల్లో మంచివారై ఉండినప్పటికీ.. కలిసి బతికే విషయాల్లో ఆ రకంగా ఉండకపోవచ్చని.. తమ దాంపత్య జీవితంలో అదే జరిగిందని వెల్లడించింది. కుమారుడితో తనకు మంచి అనుబంధం ఉందని పేర్కొంది. తన నిర్ణయాలను అతను గౌరవిస్తాడని, తాను సంతోషంగా ఉంటే అర్హాన్ ఆనందిస్తాడని చెప్పింది. ‘విడాకుల విషయమై ముందుగా నేనే నిర్ణయం తీసుకున్నా. నాకు ఏది సరైంది అనిపించిందో అదే చేశా. మనసుకి నచ్చిన నిర్ణయాలు తీసుకోవాడానికి భయపడొద్దు. ఇబ్బందులు సహజం.. వాటిని దాటుకుని ముందుకెళ్లాలి. అందరినీ సంతోషపెట్టాలనుకోవడం కుదరదు’ అని మలైకా పేర్కొంది. ఇండియన్ బెస్ట్ డాన్సర్ షోకు ఆమె గతంలో జడ్జిగా వ్యవహరించింది. ఇక అర్బాజ్ సోని లివ్ షో ప్రసారం చేయనున్న పొలిటికల్ డ్రామా తానావ్లో నటిస్తున్నాడు. -
ఎవర్నీ ఫూల్ చేయాలనుకుంటున్నారు!.. విదేశాంగ మంత్రి ఫైర్
వాషింగ్టన్: పాక్ అమెరికాల బంధం అంత తేలిగ్గా ముగిసిపోయేది కాదని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చమత్కరించారు. పాక్కి అమెరికా సేవలందించడం లేదా అమెరికా తన ప్రయోజనాల కోసం పాక్ సేవలు అందించడం వంటి విడదీయరాని బంధం అని వ్యగ్యంగా అన్నారు. ఈ మేరకు జై శంకర్ వాషింగ్టన్లోని ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్కి అమెరికా 450 మిలయన్ డాలర్ల వ్యయంతో ఎఫ్-16 ఫైటర్ జెట్ సస్టైన్మెంట్ ప్రోగ్రామ్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంతో భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అంతేగాదు భారత్ ఆందోళనలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెంటనే అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్కు తెలియజేశారు కూడా. ఐతే అమెరికా మాత్రం అది విక్రయమే తప్ప భద్రతా సాయం కాదని చెప్పుకొచ్చింది. ఈ విషయమై భారత విదేశాంగ మంత్రి మాట్లాడుతూ..ఇలాంటి మాటలతో ఎవర్నీ మోసం చేయాలనుకుంటున్నారంటూ మండిపడ్డారు. అలాగే పాక్ ప్రభుత్వంతో ఈ ఎఫ్ 16 జెట్ విమానాల విక్రయాలతో అమెరికాకు ఒనగగురే ప్రయోజనం ఏమిటో తనకు తెలుసునని అన్నారు. అదీగాక ఎఫ్ 16 జెట్ విమానం ఎంత సామర్థ్యం గలవో వాటి ఉపయోగం ఏమిటో మనందరికి తెలుసునని నొక్కి చెప్పారు. (చదవండి: విక్రయమే తప్ప సాయం కాదన్న అమెరికా... టెన్షన్లో అమెరికా) -
ఆ నటుడితో సహజీవనం.. అవకాశాలు కోల్పోయిన హీరోయిన్!
తమిళసినిమా: కోలీవుడ్లో కథానాయికగా ఎదుగుతున్న నటి వాణి భోజన్. యాంకర్గా జీవితాన్ని ప్రారంభించి ఆ తరువాత బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చి ఇక్కడ మంచి గుర్తింపును తెచ్చుకుని ఆపై సినీ రంగప్రవేశం చేసిన నటి ఈ బ్యటీ..ఓ మై కడవులే చిత్రంలో రెండో హీరోయిన్గా పరిచయమై తొలి చిత్రంతోనే మంచి పేరు తెచ్చుకుంది. ఆ తరువాత పలు చిత్రాల్లో నటించే అవకాశాలను అందుకుంటూ వస్తోంది. ఇటీవల తమిళ్ రాకర్స్ అనే వెబ్సిరీస్లోనూ నటించింది. అయితే ఇప్పటీకి సోలో హీరోయిన్గా నటనకు అవకాశం ఉన్న మంచి పాత్రలో నటించిన దాఖలాలు లేవనే చెప్పాలి. అయినా వార్తల్లో మాత్రం బాగానే నానుతోంది. నటుడు జైతో సహజీవనం చేస్తున్నట్లు ఇప్పటికే ప్రచారం గొల్లుమంటోంది. ఇవాళ రేపు సహజీవనం అనేది సహజంగా మారిపోయింది. అలాంటివారు నయనతార విఘ్నేష్ శివన్ మాదిరి కాస్త ఆలస్యమైనా పెళ్లి పీటలు ఎక్కితే స్వాగతించవచ్చు. అలాకాకుండా కొన్నాళ్లు కలిసి జీవించి ఆ తరువాత బ్రేకప్ అంటేనే సమస్య. ఇప్పుడు వాణి భోజన్ పరిస్థితి ఇదేననే టాక్ స్ప్రెడ్ అవుతోంది. ఈ అమ్మడు నటుడు జైతో సహజీవనం చేయడం వలన ఆమె జీవితం మొత్తం ఆయన చేతిలోకి వెళ్లిపోయిందని, దర్శక, నిర్మాతలు ఆమెను కలిసే పరిస్థితి లేదని, ఆమెకు సంబంధించిన ఏ విషయాన్ని అయినా జైతోనే సంప్రదించాల్సిన పరిస్థితి నెలకొందనే ప్రచారం సామాజిక మాద్యమాలలో హోరెత్తుతోంది. దీంతో వాణిభోజన్ పలు అవకాశాలను కోల్పోతున్నట్లు సమాచారం. ఇదంతా సహించలేక ఆమె జైకు బైబై చెప్పినట్లు కూడా ప్రచారం వైరల్ అవుతోంది. అయితే ఇందులో నిజం ఎంత అన్నది వాణి భోజన్నిగాని, జై గాని స్పందించే వరకు తెలిసే అవకాశం లేదు. అయితే నటుడు జై, నటి అంజలిలో విషయంలో కూడా ఇంతకుముందు ఇలాంటి ప్రచారమే జరిగిందన్నది గమనార్హం. -
2024 ఎన్నికల్లో పోటీ చేస్తా
న్యూజెర్సీ: అగ్రరాజ్యం అమెరికాలో 2024లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీచేస్తానన్న సంకేతాలను మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చారు. తాను పోటీలో ఉండాలని ప్రజలంతా కోరుకుంటున్నారని, ఎన్నికల్లో కచ్చితంగా ముందంజలో నిలుస్తానని అన్నారు. ఆయన తాజాగా ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్భుతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. తన పాలనలో భారత్తో దృఢమైన సంబంధాలు ఏర్పాటు చేసుకున్నామని వివరించారు. భారత్కు తనకంటే అమెరికా అధ్యక్షుడిగా గొప్ప మిత్రుడు గతంలో ఎన్నడూ దొరకలేదని వ్యాఖ్యానించారు. ఈ విషయం ప్రధాని మోదీని అడిగితే బాగా తెలుస్తుందని అన్నారు. ఇండియాతో, నరేంద్ర మోదీతో తనకు చక్కటి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయని చెప్పారు. మోదీతో తనకు చాలాకాలంగా పరిచయం ఉందని.. మోదీ, తాను మంచి స్నేహితులమని పేర్కొన్నారు. ఆయన గొప్ప వ్యక్తి, ప్రధానిగా అద్భుతమైన సేవలు అందిస్తున్నారని కొనియాడారు. నిజానికి ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడం అంత సులభం కాదని పేర్కొన్నారు. అమెరికాలోని భారతీయ సమాజం తనకు అండగా నిలుస్తోందని డొనాల్డ్ ట్రంప్ ఆనందం వ్యక్తం చేశారు. -
హీరోయిన్తో రహస్యంగా దేవీశ్రీ ప్రసాద్ పెళ్లి? ఆమె ఏమందంటే..
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్తో రహస్యంగా పెళ్లి జరిగింది అంటూ వస్తున్న వార్తలపై హీరోయిన్ పూజిత పొన్నాడ స్పందించింది. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె దేవీశ్రీతో తనకు సీక్రెట్ మ్యారేజ్ అంటూ వస్తున్న కథనాలపై క్లారిటీ ఇచ్చింది. అక్కినేని నాగార్జున, కార్తీ హీరోలుగా నటించిన ఊపిరి చిత్రంతో వెండితెరకు పరిచయం అయిన పూజిత అచ్చమైన తెలుగింటి అమ్మాయే. విశాఖపట్నానికి చెందిన ఈ బ్యూటీ రంగస్థలం, హ్యాపీ వెడ్డింగ్, ఓదెల రైల్వే స్టేషన్ వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె నటించిన 'ఆకాశ వీధుల్లో' అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో ప్రమోషన్లో పాల్గొన్న పూజిత తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'దేవీశ్రీ ప్రసాద్తో రిలేషన్లో ఉన్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం. ఇలాంటి పుకార్లు ఎలా పుట్టుకొచ్చాయో నాకు అర్థం కావడం లేదు. మేమిద్దరం రహస్యంగా పెళ్లి చేసుకున్నామని వార్తలు రాస్తున్నారు. ఇందులో నిజం లేదు. నేను ఎవరితోనూ రిలేషన్లో లేను.. ప్రస్తుతానికి నేను సింగిల్' అంటూ చెప్పుకొచ్చింది. -
ఛార్మితో రిలేషన్ బయటపెట్టిన పూరి జగన్నాథ్
పంజాబీ ముద్దుగుమ్మ ఛార్మి కౌర్ తెలుగులో ఎన్నో హిట్ సినిమాల్లో నటించి ఇప్పుడు నిర్మాతగా కొనసాగుతుంది. పూరి జగన్నాథ్తో కలిసి పూరి కనెక్ట్స్ పేరుతో సినిమాలు చేస్తుంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా 'లైగర్' సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎప్పటి నుంచో పూరి-ఛార్మిల మధ్య ఏదో ఉందన్న ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కారణంగానే ఛార్మి ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిందని వార్తలు వస్తున్నాయి. చదవండి: చేతిలో రూపాయి లేకపోయినా ఆఫర్ను రిజెక్ట్ చేశా : ఛార్మి తాజాగా ఛార్మితో తనకున్న రిలేషన్ షిప్ను బయటపెట్టారు పూరి జగన్నాథ్. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. 'ఛార్మీ 13 ఏళ్ల వయసప్పటి నుండి తనకు తెలుసని, దశాబ్దాలుగా ఆమెతో కలిసి పనిచేస్తున్నానని తెలిపారు. ఛార్మీకి నాకు ఏదో అఫైర్ ఉందని ఏదేదో మాట్లాడుకుంటారు. ఆమె ఇంకా యంగ్గా ఉండటం వల్లే ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. అదే అదే ఛార్మికి 50ఏళ్లు ఉంటే ఇలా మాట్లాడేవారు కాదు. ఆమెకు వేరేవాళ్లతో పెళ్లి జరిగినా పట్టించుకునేవారు కాదు. చదవండి: రాజకీయాల్లోకి హీరోయిన్ త్రిష? ఎంజీఆర్, జయలలిత దారిలో.. కానీ తామిద్దరం ఒకే ఇండస్ట్రీలో ఉండటం, ఎన్నో సంవత్సరాలుగా ట్రావెల్ అవుతుండటంతో ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటున్నారు. ఒకేవళ అఫైర్ ఉన్నా అది ఎక్కువరోజులు నిలబడదు. ఆకర్షణ అనేది కొన్నిరోజుల్లోనే చచ్చిపోతుంది. స్నేహమే శాశ్వతం. తామిద్దరం మంచి ఫ్రెండ్స్' అంటూ పుకార్లకు పూరి ఫుల్ స్టాప్ పెట్టారు. -
విజయ్తో డేటింగ్?.. ఎట్టకేలకు బయటపెట్టిన రష్మిక మందన్నా
రష్మిక మందన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో తీరిక లేకుండా గడిపేస్తుంది. రష్మిక కెరీర్ ఆరంభం నుంచి ఆమె వ్యక్తిగత జీవితంపై అనేక రూమర్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా విజయ్ దేవరకొండ- రష్మికలు చాలాకాలంగా డేటింగ్లో ఉన్నట్లు ఫిల్మీ దునియాలో జోరుగా ప్రచారం జరుగుంది. ఇప్పటికే విజయ్ ఈ రూమర్స్పై క్లారిటీ ఇచ్చాడు. అయినప్పటికీ వీరి రిలేషన్పై గాసిప్స్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ రూమర్స్పై రష్మిక మందన్నా స్పందించింది. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ.. ప్రస్తుతం నేను ఐదు సినిమాలు చేస్తున్నా. వాటి గురించి అడిగితే ఎంతసేపైనా మాట్లాడతా. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాన్ని తెలుసుకోవాలన్ని ఆసక్తి ఉండటం సహజమే. కానీ పదేపదే అవే ప్రశ్నలు అడగటం ఇబ్బందిగా అనిపిస్తుంది. ప్రేమ, పెళ్లి విషయాల్లో పుకార్లను అస్సలు నమ్మొద్దు. నేను చెప్పేందవరకు ఒక నిర్ణయానికి రాకండి. నా గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు అంటూ చెప్పుకొచ్చింది ఈ నేషనల్ క్రష్. -
మలైకాతో పెళ్లికి రెడీగా లేను.. అర్జున్ కపూర్ షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్, మలైకా అరోరా ప్రేమలో మునిగితేలుతున్న విషయం తెలిసిందే. సినిమాల కంటే డేటింగ్ వార్తలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు ఈ జంట. ఇదిలా ఉండగా త్వరలోనే ఈ ప్రేమపక్షలు పెళ్లి పీటలు ఎక్కనున్నారంటూ బీటౌన్ మీడియా కోడై కూస్తుంది. ఈ వార్తలపై అర్జున్ కపూర్ ఆసక్తికర రీతిలో స్పందించారు. పాపులర్ షో కాఫీ విత్ కరణ్ షోకి గెస్ట్గా వచ్చిన అర్జున్ కపూర్ మలైకాతో ప్రేమ, పెళ్లి విషయాలపై స్పందించాడు. 'నేను మలైకాను ఇప్పుడే పెళ్లి చేసుకునేందుకు రెడీగా లేను. కోవిడ్ లాక్డౌన్ కారణంగా రెండేళ్లు సినిమాలు లేక అలా సమయం గడిచిపోయింది. ఇప్పుడు నేను నా కెరీర్ మీద దృష్టిపెట్టాలని అనుకుంటున్నా. నా పని నాకు సంతోషాన్ని కలిగిస్తుంది. నేను సంతోషంగా ఉంటేనే నా భాగస్వామిని సంతోషపెట్టగలను. ప్రస్తుతానికి పెళ్లి ఆలోచనలేమీ లేవు' అంటూ పేర్కొన్నాడు. ప్రస్తుతం అర్జున్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
నా రిలేషన్ గురించి దాచాలనుకోవట్లేదు: శ్రుతి హాసన్
Shruthi Haasan About Relationship With Shanthanu Says He Is Amazing: 'గతంలో నాకు రిలేషన్షిప్స్ ఉండేవి. కానీ వాటి గురించి నేను బహిరంగంగా మాట్లాడలేదు. ఎందుకంటే నాతో రిలేషన్లో ఉన్న వ్యక్తి అలా బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడలేదు. కానీ ప్రస్తుతం రిలేషన్షిప్ గురించి దాచాల్సిన అవసరం నాకు లేదనిపించింది. ఎందుకంటే నేనొక అద్భుతమైన వ్యక్తి (శంతను)తో రిలేషన్లో ఉన్నాను.' అని తెలిపింది శ్రుతి హాసన్. డూడుల్ ఆర్టిస్ట్ శంతనుతో శ్రుతి రిలేషనల్లో ఉందన్న వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. శంతను గురించి శ్రుతి హాసన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నా జీవితంలో ఒక ముఖ్యమైన భాగం (శంతను)తో గడపాలనుకుంటున్నాను. తనతో ఉంటున్నందుకు నాకు గర్వంగా ఉంది. ఇక మేం ఎక్కడికి వెళ్లినా ఫొటోగ్రాఫర్లు ఫొటోలు తీస్తుంటారు. సో.. మేం దాచాలన్న దాగదు. అయినా ఇప్పుడు తనతో నా అనుబంధం గురించి నేను కూడా దాచాలనుకోవడం లేదు. ఎందుకంటే నా లైఫ్లో ఆ అనుబంధానిది చాలా పెద్ద భాగం. నేనెంతో కష్టపడి పని చేసి, ఇంటికెళతాను. ఆ తర్వాత నా జీవితంలో ఇంపార్టెంట్ పార్ట్ అయిన ఓ అద్భుతమైన పార్ట్నర్తో ఉంటాను. అందుకే నాకు దాచాలని అనిపించడంలేదు. మా ఇద్దరి ఈక్వేషన్ నాకు చాలా ఇష్టం' అని పేర్కొంది. చదవండి: స్కూల్ డేస్ను గుర్తు చేసే 'టెన్త్ క్లాస్ డైరీస్'.. -
ముస్లిం యువతిని ప్రేమించడమే ఆ యువకుడికి శాపమైందా?
బెంగళూరు: వేరే మతానికి చెందిన అమ్మాయిని ప్రేమించడమే ఆ యువకుడి పాపమైంది. ప్రేమించిన అమ్మాయితో జీవితాంతం సంతోషంగా ఉండాలనుకున్న అతని ఆశాలు అడియాశాలయ్యాయి. ఎంతో అందంగా ఊహించుకున్న భవిష్యత్తును మధ్యలోనే సమాధి చేశారు. ఎదిగి వచ్చిన కొడుకును దూరం చేసి కన్నతల్లికి కడుపుకోత మిగిల్చారు. ముస్లిం యువతితో సన్నిహితంగా ఉంటున్నాడని దళిత యువకుడిని హత్య చేశారు. ఈ అమానుష ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. కాలబురాగి(గుల్బర్గా) వాడిటౌన్లోని భీమా నగర్లో లేఅవుట్లో నివిస్తున్న 25 ఏళ్ల విజయ్ కాంబ్లే, ముస్లిం యువతిని ప్రాణంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ ప్రేమ విషయం యువతి కుటుంబ సభ్యులకు నచ్చలేదు. తన సోదరితో దూరంగా ఉండాలని యువతి సోదరులు విజయ్ను పలుమార్లు హెచ్చరించారు. అయినా యువకుడి ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో ఎలాగైనా విజయ్ను అంతమొందించాలని ముస్లిం యువతి కుటుంబ సభ్యులు పథకం పన్నారు. ఈ క్రమంలో శుక్రవారం విజయ్ను అడ్డగించి కత్తితో పొడిచి చంపి అక్కడి నుంచి పరారయ్యారు. చదవండి: Hyderabad: ప్రియురాలిపై మాజీ ప్రియుడి ఘాతుకం.. నడిరోడ్డుపై తన కుమారుడిని ముస్లిం యువతి సోదరులే హత్య చేశారని మృతుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులు షాహుద్దీన్, నవాజ్ అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరితోపాటు ఇరు కుటుంబ సభ్యులను కూడా విచారిస్తున్నారు. అయితే యువతి సోదరులు తమ కొడుకును పలుమార్లు బెదిరించారని మృతుడి తల్లి పేర్కొంది. తన చెల్లెలితో రిలేషన్షిప్ను వదులుకోవాలని లేకుంటే చంపేస్తామని బెదిరించినట్లు తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ‘విజయ్కు ఫోన్ కాల్ రావడంతో ఇంటినుంచి బయటకు వెళ్లిపోయాడు. తను ఎవరితో మాట్లాడాడో కూడా నాకు తెలీదు. తరువాత విజయ్ను ఎవరో కొట్టారని మాకు కాల్ వచ్చింది. వెంటనే తన వద్దకు పరిగెత్తాము. అప్పటికే మా అబ్బాయి మెడపై కత్తితో పొడిచి చంపారు. ఈ సంఘటనకు ముందు ఎలాంటి గొడవలు జరగలేదు. యువతి సోదరుడు మాత్రం ఒకసారి ఇంటికొచ్చి.. ‘నీ కొడుక్కి మంచి బుద్ధులు నేర్పించు. లేకపోతే తన తల నరికి నీకు అప్పగిస్తాం’ అని బెదిరించి వెళ్లాడు’ అని విజయ్ తల్లి చెబుతూ కన్నీటి పర్యంతమైంది. చదవండి: లైంగిక ఆరోపణలు.. మనస్తాపంతో మాజీ మంత్రి ఆత్మహత్య -
జాకీతో ప్రేమ.. అది నాకిష్టం లేదు: రకుల్ ప్రీత్ సింగ్
టాలీవుడ్లో అతికొద్ది సమయంలోనే స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది కూల్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ఈ ఫిట్నెస్ బ్యూటీ ఇటీవల 'రన్ వే 24', జాన్ అబ్రహం అటాక్ చిత్రాలతో బాలీవుడ్ ప్రేక్షకుల్ని అలరించింది. 'రన్ వే 24' మూవీలో బిగ్బీ అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగణ్ వంటి స్టార్స్తో కలిసి నటించింది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో కెరీర్, ప్రేమపై పలు ఆసక్తికర విషయాలు తెలిపింది. ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత జీవితం ఉంటుందని, అది చాలా సహజం అని చెప్పుకొచ్చింది. 'జాకీ భగ్నానీ నేను మంచి స్నేహితులం. మా అభిరుచులు కలవడంతో ప్రేమలో పడ్డాం. మా రిలేషన్షిప్ గురించి ఓకే అనుకున్నప్పుడే వీలైనంత త్వరగా ప్రపంచానికి తెలియజేయాలనుకున్నాం. ఎందుకంటే రిలేషన్ను బయటకు చెప్పకపోతే మా గురించే వచ్చే వార్తలు, పుకార్లతో ప్రశాంతంగా ఉండలేం. నిజానికి మా వ్యక్తిగత జీవితం గురించి కాదు, మేము చేసే వర్క్ గురించి అందరూ మాట్లాడుకోవాలి. ప్రతి ఒక్కరికీ పర్సనల్ లైఫ్ ఉంటుంది. ఒక రిలేషన్షిప్లో ఉండటం చాలా సహజం. మన లైఫ్లో పేరెంట్స్, బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్ ఎలా ఉంటారో అలాగే మనకోసం ఒకరు ఉంటారు. సెలబ్రిటీలు కావడంతో మాపై అందరి దృష్టి ఎక్కువగానే ఉంటుంది. అది మాకిష్టం లేదు. అందుకే మేము బహిరంగంగా చెప్పేశాం.' అని రకుల్ తెలిపింది. చదవండి: ఆ మాటే నాకు నచ్చదు: రకుల్ ప్రీత్ సింగ్ వెబ్ సిరీస్గా మారిన అక్షయ్, రకుల్ చిత్రం.. -
టెన్నిస్ స్టార్తో త్వరలోనే ఖడ్గం బ్యూటీ వివాహం!
బాలీవుడ్ నటి, ఖడ్గం బ్యూటీ కిమ్ శర్మ టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్తో గత కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ లవ్బర్డ్స్ తమ ప్రేమను నెక్ట్స్ లెవల్కి తీసుకెళ్లాలని భావిస్తున్నారట. త్వరలోనే ఈ ప్రేమజంట పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు బీటౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కిమ్ శర్మ, పేస్ల తల్లిదండ్రులు కూడా ఇటీవలె ముంబైకి చేరుకున్నారని, పెళ్లికి సంబంధించి ఇరు కుటుంసభ్యులు చర్చలు జరుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరి పేరెంట్స్ కిమ్, పేస్ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, దీంతో అతి త్వరలోనే అతి త్వరలోనే వీరిద్దరూ కోర్టు మ్యారేజ్ చేసుకోనున్నట్లు సమాచారం. కిమ్-పేస్ల తల్లిదండ్రులు ఇలా కలుసుకోవడం ఇదేమీ మొదటిసారి కాదు. గతేడాది డిసెంబర్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ను వీరంతా కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. కాగా కిమ్ కిమ్.. ఖడ్గం,మగధీరలో 'ఏం పిల్లడో' పాటల ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది.అయితే ఆమె సినిమాల కంటే లవ్ ఎఫైర్స్తోనే బాగా పాపులర్ అయ్యింది. 2010లో కెన్యా వ్యాపారవేత్తను వివాహం చేసుకున్న కిమ్ కొన్నాళ్లకే విడాకులు తీసుకుంది. అనంతరం నటుడు హర్షవర్ధన్ రాణేతో ఎఫైర్ సాగించిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం లియాండర్ పేస్తో రిలేషన్షిప్లో ఉంది. -
భర్తను పరస్త్రీతో పంచుకోవడం కంటే.. చావే మేలు అనుకుంది!
భర్త విషయంలో భారతీయ స్త్రీలు విపరీతమైన ఆలోచనా ధోరణితో ఉంటారని, తన భర్త తనకు మాత్రమే సొంతం అనుకుంటారని, పరాయి స్త్రీతో బంధాన్ని పంచుకోవడానికి ఏమాత్రం సహించబోరని అలహాబాద్(ఉత్తర ప్రదేశ్) హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. భారతీయ వివాహిత మహిళలు భర్త తమకు మాత్రమే సొంతం అనుకుంటారు. వాళ్ల గురించి విపరీతంగా ఆలోచిస్తుంటారు. ఒకవేళ అతను గనుక వేరే మహిళతో సంబంధం పెట్టుకున్నా, వివాహం చేసుకోవాలనుకునే ప్రయత్నం.. చివరికి ఆలోచనా చేసినా అది ఆ భార్యను కుదిపేసే అంశమే. అలాంటి విపత్కర పరిస్థితుల్లో తీవ్ర నిర్ణయాలే తీసుకుంటారు. ఈ కేసులోనూ అదే జరిగింది అంటూ జస్టిస్ రాహుల్ చతేర్వేది నేతృత్వంలో ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు.. తన భర్త రహస్యంగా మరో మహిళను వివాహం చేసుకోబోతున్నాడని, లేదంటే వివాహం చేసుకున్నాడనే ఒక్క కారణం చాలూ.. ఆమె తన ప్రాణం తీసుకునేందుకు అంటూ కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కేసు వివరాలు.. వారణాసి మాండువాది చెందిన సుశీల్ కుమార్ అనే వ్యక్తి, అతని కుటుంబం మీద అతని భార్య చనిపోయే ముందు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు అయిన వెంటనే ఆమె విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో వాళ్ల మీద కేసు నమోదు అయ్యింది. అయితే భార్య ఆత్మహత్యకు తామేమీ కారణం కాదని, కేసుల నుంచి ఉపశమనం ఇప్పించాలని సుశీల్ కోర్టులను ఆశ్రయించాడు. అయితే సుశీల్ కుమార్కు ఇదివరకే రెండు వివాహాలు అయ్యాయని, మరో వివాహం చేసుకోవడంతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడింది ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు ధృవీకరించినట్లయ్యింది. -
ఈ లవ్ బర్డ్స్ బ్రేకప్ చెప్పుకున్నారా? అసలేం జరిగిందంటే..
Is Sidharth Malhotra, Kiara Advani Broken Up: బాలీవుడ్ లవ్బర్డ్స్ కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రాల బ్రేకప్ బి-టౌన్లో హాట్టాపిక్ నిలిచింది. కొంతకాలంగా సీక్రెట్గా డేటింగ్ చేస్తున్న ఈ జంట క్యూటెస్ట్ కపుల్గా పేరు తెచ్చుకున్నారు. అలాంటి వీరు విడిపోయారంటూ వార్తలు రావడంతో ఈ జంట ఫ్యాన్స్ షాక్కు గురవుతున్నారు. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కుతారనుకుంటే ఇలా ఎవరి దారి వారదే అని విడిపోవటం ఏంటని చర్చించుకుంటున్నారు. అయితే ఈ వార్తల్లో నిజమెంత అనేది స్పష్టత లేదు. చదవండి: అందుకే ‘జెర్సీ’లో నటించనని చెప్పా: రష్మిక వివరణ కానీ, బ్రేకప్ రూమర్స్పై ఈ జంట ఇంతవరకు స్పందించకపోవడంతో అభిమానులంతా ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో వారందరికి ఊరటనిస్తూ ఈ జంట విడిపోలేదని వారి సన్నిహిత వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం కియారా, సిద్ధార్థ్లు కలిసి లేరనేది వాస్తవమే కానీ, అది గొడవల వల్ల కాదని చెబుతున్నారు. షూటింగ్లతో బిజీగా ఉండటం కారణంగా కొద్ది రోజులు ఈ జంట విడిగా ఉంటున్నారని వారు స్పష్టం చేశారు. ప్రస్తుతం సిద్ధార్థ్ షూటింగ్లో భాగంగా టర్కిలో ఉండగా.. కియారా తన తాజా చిత్రం ‘భూల్ భులయ్యా-2’ మూవీ ప్రమోషన్తో బిజీగా ఉందట. చదవండి: పిల్లలతో వెకేషన్లో శ్రీజ కొణిదెల.. ఫోటోలు వైరల్ అందువల్లే వీరిద్దరు కలుసుకోవడం లేదని, సిద్ధార్థ్ టర్కి నుంచి రాగానే మీకే క్లారిటీ వస్తుందని కియారా, సిద్ధార్థ్ల మ్యూచువల్ ఫ్రెండ్స్ నుంచి సమాచారం. కాగా వీరిద్దరు తొలిసారి జంటగా నటించిన షేర్షా మూవీ షూటింగ్ సమయంలో కియారా, సిద్ధార్థ్లు ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి పార్టీలు, వెకేషన్స్ అంటూ తెగ చక్కర్లు కొట్టారు. ఆలియా-రణ్బీర్ల తర్వాత పెళ్లి చేసుకునే కపుల్ వీళ్లేనంటూ బీటౌన్లో ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. కానీ అందరికి షాక్ ఇస్తూ కియారా- సిద్దార్థ్లు విడిపోయినట్లు ఒక్కసారిగా బాలీవుడ్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. -
బాలీవుడ్లో మరో బ్రేకప్.. పెళ్లిదాకా వచ్చి విడిపోయిన స్టార్ కపుల్
బాలీవుడ్లో మరో జంట బ్రేకప్ చెప్పేసుకున్నారు. కొన్ని రోజుల క్రితమే లైగర్ బ్యూటీ అనన్య ప్రియుడు ఇషాన్ ఖట్టర్తో విడిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో బ్యూటీఫుల్ కపుల్ తమ రిలేషన్కి ఎండ్ కార్డ్ వేసేశారు. బాలీవుడ్ మోస్ట్ క్యూటెస్ట్ కపుల్గా పేరు తెచ్చుకున్న కియారా అద్వానీ- సిద్దార్థ్ మల్హ్రోత్రా బ్రేకప్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. గత కొంతకాలంగా డేటింగ్లో ఉన్న ఈ జంట త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు కూడా వినిపించాయి. కానీ సడెన్గా ఏం జరిగిందో తెలియదు.. వీరు తమ బంధానికి ఫుల్స్టాప్ పెట్టేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. దీనికి తోడు కియారా బ్రేకప్ వార్తలు నిజమే అంటూ ఆమె సన్నిహితులు క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు షాక్ అవుతున్నారు. కాగా షేర్షా మూవీతో కలిసి తొలిసారి కలిసి నటించిన కియారా- సిద్దార్థ్లు ఈ సినిమా సమయంలోనే ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి పార్టీలు, వెకేషన్స్ అంటూ తెగ చక్కర్లు కొట్టారు. ఆలియా-రణ్బీర్ల తర్వాత పెళ్లి చేసుకునే కపుల్ వీళ్లేనంటూ బీటౌన్లో జోరుగా ప్రచారం జరిగింది. కానీ అందరికి షాక్ ఇస్తూ కియారా- సిద్దార్థ్లు విడిపోయినట్లు బాలీవుడ్ మీడియా వెల్లడించింది. -
ఎన్టీఆర్ నాగశౌర్యకు ఏమవుతాడు? క్లారిటీ ఇచ్చిన శౌర్య తల్లి
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఊహలు గుసగుసలాడే సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైన శౌర్య ఛలో సినిమాతో మంచి హిట్ కొట్టారు. అందంతో పాటు టాలెంట్ కూడా ఈ యంగ్ హీరోకి ఇప్పటివరకు అనుకున్నంతగా సక్సెస్ రాలేదు. తాజాగా కృష్ణ వ్రింద విహారి సినిమాతో త్వరలోనే ప్రేక్షకులను పలకరించనున్నారు.చదవండి: ఎన్టీఆర్ను డామినేట్ చేశారా? చరణ్ ఆన్సర్ అదిరిందిగా ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్లో భాగంగా నాగశౌర్య తల్లి ఉషా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇక ఇండస్ట్రీకి అడుగుపెట్టినప్పటి నుంచి శౌర్యకి ఎన్టీఆర్ కుటుంబంతో బంధుత్వం ఉందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై నాగశౌర్య తల్లి ఉషా క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..శౌర్యకు ఎన్టీఆర్ అంటే అభిమానం. ఇక తారక్ భార్య లక్ష్మీ ప్రణతి కజిన్కు శౌర్య మంచి ఫ్రెండ్. ఆ విధంగా రూమర్స్ వచ్చి ఉండొచ్చు. కానీ వాళ్లు కుటుంబంతో బంధుత్వం లేదు కానీ ఫ్యామిలీ ఫ్రెండ్లా ఉంటారు అంటూ చెప్పుకొచ్చింది. దీంతో నాగ శౌర్యకి ఎన్టీఆర్ బంధువు అవుతారన్న వార్తల్లో నిజం లేదని స్పష్టమైపోయింది. చదవండి: ఇదెక్కడి మాస్ మేనియా.. ఎగ్జామ్ పేపర్లో 'పుష్ప' డైలాగులు -
ఏడాదిగా వివాహేతర సంబంధం.. పిక్నిక్ పేరుతో ఆమెను అక్కడికి పిలిచి..
భోపాల్: సమాజంలో యువతులు, మహిళలపై రోజురోజుకు లైంగిక దాడులు పెరుగుతున్నాయి. కొందరు మృగాలు నమ్మించి మహిళలను లొంగదీసుకుంటున్నారు. పిక్నిక్ పేరుతో ఓ మహిళను వంచించి చివరకు ఆమెకు విషం తాగించి.. బాధితురాలు చావుకు ముగ్గురు కారణమయ్యారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసకుంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మహిళ(28)తో షాదబ్ ఉస్మాన్ అనే వ్యక్తి పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఏడాదిగా వారి మధ్య వివాహేతర సంబంధం నడుస్తోంది. కాగా, పిక్నిక్ పేరుతో ఆమెను.. నిందితుడు షాదోల్ జిల్లాలోని క్షీర్సాగర్ తీసుకెళ్లాడు. అక్కడికి ఉస్మాన్ స్నేహితులు రాజేష్ సింగ్, సోనూ జార్జ్ సైతం వచ్చారు. ఈ క్రమంలో వారు ఫుల్గా మద్యం సేవించి ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా పైశాచికత్వంతో బలవంతంగా ఆమెకు విషం తాగించారు. దీంతో ఆమె ఘటనా స్థలంలోనే మృతి చెందింది. ఆమె చనిపోవడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నివేదికలో ఆమెపై లైంగిక దాడి చేసి, విష ప్రయోగం జరిగినట్టు వైద్యులు తేల్చారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితులను గుర్తించి అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నట్టు వెల్లడించారు. -
నెంబర్ వన్ పాయే.. 15 ఏళ్ల బంధానికి ముగింపు
సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్.. తన కోచ్ మరియన్ వాజ్దాతో ఉన్న 15 ఏళ్ల బంధానికి ముగింపు పలికాడు. జొకోవిచ్ 20 గ్రాండ్స్లామ్ టైటిల్స్ సాధించడంలో అతని పాత్ర మరువలేనిది. దాదాపు 15 ఏళ్ల పాటు టెన్నిస్లో రారాజుగా వెలిగిన జొకోవిచ్ వెనకాల మరియన్ వాజ్దా కృషి ఉందంటే అతిశయోక్తి కాదు. గతేడాది ట్యురిన్ వేదికగా జరిగిన ఏటీపీ టూర్ వరల్డ్ ఫైనల్స్ సందర్భంగా జొకోవిచ్.. మరియన్తో బంధం ముగుస్తున్నట్లు పేర్కొన్నాడు. తాజాగా జొకోవిచ్ పర్సనల్ వెబ్సైట్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించాడు. కష్టాల్లో తన వెన్నంటి నిలిచిన మరిమన్కు జొకోవిచ్ ఘనమైన వీడ్కోలు పలుకుతూ వెబ్సైట్లో సుధీర్ఘ సందేశాన్ని రాసుకొచ్చాడు. చదవండి: Russia-Ukraine Crisis: దేశం కోసం కీలక మ్యాచ్ను వదిలేసుకున్న టెన్నిస్ స్టార్ ''నా కెరీర్లో కోచ్గా మరియన్ వాజ్దా పాత్ర మరువలేనిది. 15 సంవత్సరాల మా బంధంలో అతను చూపెట్టిన స్నేహం, అంకితభావానికి కృతజ్ఞత తెలుపుకుంటున్నా. నేను సాధించిన అద్భుత విజయాలలో అతను భాగస్వామిగా ఉన్నాడు. కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలబడ్డాడు. ఇప్పుడు మా బంధానికి ముగింపు పలకడం బాధిస్తున్నా తప్పని పరిస్థితి. మరియన్ కేవలం వృత్తిపరంగానే నాకు దూరమవుతున్నాడు.. వ్యక్తిగత జీవితంలో మాత్రం నాకు.. నా కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటాడని ఆశిస్తున్నా. ఈ 15 ఏళ్లలో అతను నాకు చేసిన సహాయాన్ని కృతజ్ఞతతో సరిపెట్టుకోలేను.. అంతకుమించి ఏదైనా చేయాలి'' అంటూ రాసుకొచ్చాడు. జొకోవిచ్ సందేశానికి ముగ్దుడైన మరియన్ వాజ్దా స్పందిస్తూ.. '' జొకోవిచ్.. వృతిపరంగా మాత్రమే నీకు దూరమవుతున్నా. కోర్టు లోపల.. బయట నీకు ఎప్పుడు నా మద్దతు ఉంటుంది. ఈ 15 ఏళ్ల మన బంధంలో ఎన్నో మధురానుభూతులు సంపాదించుకున్నా. మనిద్దరం కలిసి వెనుకకు తిరిగి చూస్తే అద్భుతమైన విజయాలు ఎన్నో ఉన్నాయి. ఆ విజయాలకు నేను కృతజ్ఞతుడిని. కొత్త సవాళ్ల కోసం ఎప్పుడు ఎదురుచూస్తూనే ఉంటా.'' అంటూ తెలిపాడు. కాగా జొకొవిచ్ ఇటీవలే తన నెంబర్వన్ ర్యాంక్ను రష్యా టెన్నిస్ స్టార్ డానిల్ మెద్వెదెవ్కు కోల్పోయాడు. దాదాపు 361 వారాల పాటు జొకోవిచ్ నెంబర్వన్గా కొనసాగాడు. వ్యాక్సిన్ వేసుకోని కారణంగా ఆస్ట్రేలియా ప్రభుత్వం జొకోవిచ్ను ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఎంత చెప్పినా తన పట్టు వదలని జొకోవిచ్.. కోర్టు మెట్లు ఎక్కినప్పటికి నిరాశే ఎదురైంది. మూడు సంవత్సరాల పాటు ఆస్ట్రేలియాలో అడుగుపెట్టకుండా ఆ దేశ ప్రభుత్వం జొకోవిచ్పై వేటు వేసింది. ఇక 20 గ్రాండ్స్లామ్ టైటిళ్లతో జొకోవిచ్ ప్రస్తుతం రోజర్ ఫెదరర్తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. జొకో ఖాతాలో 9 ఆస్ట్రేలియన్ ఓపెన్, ఆరు వింబుల్డన్, మూడు యూఎస్ ఓపెన్, రెండు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ ఉన్నాయి. ఇక స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్ 21 గ్రాండ్స్లామ్ టైటిళ్లతో తొలి స్థానంలో ఉన్నాడు. చదవండి: Ravichandran Ashwin: 'సోయి లేకుండా మాట్లాడొద్దు'.. జర్నలిస్ట్ను ఉతికారేసిన అశ్విన్ Kohli-BCCI: 'కోహ్లిపై కోపం తగ్గలేదా'.. బీసీసీఐని ఏకిపారేసిన క్రికెట్ ఫ్యాన్స్