
సముద్రంలో ప్రమాదం: 40 మంది మృతి
రోమ్ : మెడిటేరియన్ సముద్రంలో ఓ నౌక శనివారం మునిగిపోయింది. ఈ ప్రమాదంలో కనీసం 40 మంది మరణించారని ఇటాలియన్ నేవికి చెందిన ఉన్నతాధికారులు రోమ్లో వెల్లడించారు. పలువురిని రక్షించినట్లు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. అయితే సదరు నౌక మునగ లేదు కానీ నౌకకు ప్రమాదం సంభవించిందని పేర్కొన్నారు. దాదాపు 400 మంది శరణార్థులతో వెళ్తున్న ఈ నౌకకు లిబియా తీరంలో ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు అందవలసి ఉంది.