చట్టాలను ఉల్లంఘించి తీర్పు | Brijesh Kumar Tribunal Verdict on Krishna Waters is violation of constitution: Chandra Babu Naidu | Sakshi
Sakshi News home page

చట్టాలను ఉల్లంఘించి తీర్పు

Published Sat, Nov 30 2013 1:13 AM | Last Updated on Wed, Aug 29 2018 9:29 PM

చట్టాలను ఉల్లంఘించి తీర్పు - Sakshi

చట్టాలను ఉల్లంఘించి తీర్పు

  • రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని పొలాలు ఎడారే: చంద్రబాబు 
  •  
     సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వివాదంపై కేంద్ర ప్రభుత్వం నియమించిన ట్రిబ్యునల్ చైర్మన్ బ్రిజేశ్ కుమార్ చట్టాలను ఉల్లంఘించి తీర్పును వెలువరించారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఎగువ రాష్ట్రాలకు నీటిని కేటాయించేందుకు అవసరమైన లెక్కలు మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారని చెప్పారు. ఈ తీర్పుపై ఏమి చేయాలో పార్టీలో చర్చించి చెప్తామన్నారు. శుక్రవారం చంద్రబాబు తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. వీరప్ప మొయిలీ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ట్రిబ్యునల్ చైర్మన్‌గా నియమితులైన బ్రిజేశ్‌కుమార్... కర్ణాటకకు మేలు కలిగేలా ఉత్తర్వులిచ్చారని చెప్పారు. 
     
     ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచుకోవటంతో పాటు కర్ణాటక అదనంగా ప్రాజెక్టులు నిర్మించేందుకు బ్రిజే్‌శ్‌కుమార్ ఏ అధికారంతో అనుమతిస్తారని ప్రశ్నించారు. గత ట్రిబ్యునళ్ల తీర్పులను తిరిగి తెరిచే అధికారం ఎవరికీ లేదన్న ఉత్తర్వులనూ ఉల్లంఘించారని ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా 2006లో మిగులు జలాలపై హక్కులు కోరబోమని కేంద్రానికి లేఖ రాశారని ఆరోపించారు. ఈ లేఖ వల్ల మనకు తీవ్రంగా నష్టం జరిగిందన్నారు. ట్రిబ్యునల్ ముందు రాష్ర్టం వాద నలను ప్రభుత్వం సక్రమంగా వినిపించలేకపోయిందని, ఇందుకు న్యాయవాదులు సమర్థులు కాకపోవటమే కారణమని చెప్పారు. మిగులు జలాలపై రాష్ట్రానికి హక్కు లేకపోవటం దారుణమన్నారు. ట్రిబ్యునల్ తీర్పు వల్ల 13 జిల్లాల్లో పొలాలు ఎడారిగా మారుతాయని అన్నారు. బలహీనమైన నాయకత్వం, ప్రభుత్వం రాష్ట్రానికి శనిగా మారాయని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం, ఓట్లు, సీట్లు తప్ప వేరే ఏమీ పట్టడం లేదని బాబు ధ్వజమెత్తారు. 
     
     ఈ ప్రశ్నలకు బదులుందా బాబూ?
    •  చంద్రబాబు విలేకరుల సమావేశానికి సాక్షిని అనుమతించలేదు. వివిధ మార్గాల నుంచి సమాచారం సేకరించి ఈ కథనం ఇచ్చింది. ఒకవేళ సాక్షిని అనుమతించి ఉంటే ఈ కింది ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టేది. 
    • {పాజెక్టులు పూర్తి చేస్తే మిగులు జలాలపై హక్కులు కోరవచ్చని ట్రిబ్యునల్ చెబుతోంది. మీ తొమ్మిదేళ్ల హయాంలో ఒక్క ప్రాజెక్టయినా పూర్తి చేయలేదు. అదే చేస్తే రాష్ట్రానికి ఈ రోజు ఈ దుస్థితి వచ్చేది కాదు కదా?
    • బచావత్ ట్రిబ్యునల్ మిగులు జలాలపై మన రాష్ట్రానికి ఉన్న హక్కును 2000 మే నెల వరకూ నిర్దేశించింది. మీరు 1995 సెప్టెంబర్‌లో సీఎం పదవి చేపట్టి 2004 వరకూ కొనసాగారు. అయినా మిగులు జలాల లభ్యత ఆధారంగా ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయకపోవడం వాస్తవం కాదా?
    • కర్ణాటక అసలు ఆల్మట్టి ప్రాజెక్టును చేపట్టిందే మీరు సీఎంగా ఉన్నప్పుడు. పైగా మీ పార్టీ నాయకుడికి చెందిన కాంట్రాక్ట్ సంస్థే దాని నిర్మాణం పూర్తి చేసింది. దాని ఎత్తు పెంచుకోవాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కూడా మీ హయాంలోనే... వాటన్నింటినీ మీరు అడ్డుకుని ఉంటే ఈరోజు ట్రిబ్యునల్ ఆల్మట్టి ఎత్తును పెంచుకోవడాన్ని సమర్థించేది కాదుకదా?
    • మిగులు జలాలపై ఆధారపడి కల్వకుర్తి, గాలేరు నగరి, నెట్టెంపాడు, ఏఎమ్మార్, హంద్రీనీవా, వెలుగొండ ప్రాజెక్టులకు టీడీపీ హయాంలో శంకుస్థాపన జరిగినా ఏ ఒక్కదాన్నీ పూర్తి చేయలేదు. మిగులు జలాలపై ఆధారపడి ప్రాజెక్టును కట్టడానికి వీలులేదని ట్రిబ్యునల్ అభ్యంతరపెట్టిన విషయం మీకు తెలియంది కాదు. ఆ సమయంలోనే ప్రాజెక్టులన్నింటినీ నిలిపివేయాల్సి వస్తుందన్న కారణంతో వైఎస్ మిగులు జలాలపై లేఖ రాశారన్న విషయం అసెంబ్లీలో కూడా చెప్పారు. ఆ ప్రాజెక్టులన్నీ మీ హయాంలో పూర్తయి ఉంటే ఈ సమస్యలే వచ్చేవి కాదుకదా?
    • మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు కూడా మీరు సీఎంగా ఉన్నప్పుడే మొదలుపెట్టిన విషయం మరిచిపోయారా? అప్పుడు సహకరించి ఇప్పుడు రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ ఆందోళన వ్యక్తం చేస్తుండటం అవకాశవాదం కాదా?  
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement