కుప్పకూలి కిందపడ్డారు | Chirag Paswan escapes unhurt in stage collapse | Sakshi
Sakshi News home page

కుప్పకూలి కిందపడ్డారు

Published Mon, Oct 12 2015 9:20 AM | Last Updated on Thu, Jul 18 2019 2:17 PM

కుప్పకూలి కిందపడ్డారు - Sakshi

కుప్పకూలి కిందపడ్డారు

పాట్నా: లోక్ జనశక్తి పార్టీ ఎంపీ చిరాగ్ పాశ్వాన్ కిందపడ్డారు. ఆయన ప్రసంగిస్తున్న వేదిక ఒక్కసారిగా కుప్పకూలడంతో ఆయన కిందపడిపోయారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం గయా జిల్లాలో ఆయన ప్రసంగిస్తుండగా స్టేజి కాసేపటికే కూలిపోయింది.

ఈ ఘటనలో చిరాగ్కు ఎలాంటి హాని జరగలేదని జిల్లా మేజిస్ట్రేట్ సంజయ్ కుమార్ అగర్వాల్ తెలిపారు. వేదిక సామర్ధ్యానికి మించిన గుంపు వేదికపైకి రావడం వల్లే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిపారు. ఈ ఫ్లాట్ ఫాం కూలిపోయినప్పుడు ఆయనతోపాటు లోక్ సమతా పార్టీ రాష్ట్ర విభాగ చీఫ్ ఎంపీ అరుణ్ కుమార్ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement