Bihar Chief Minister
-
సీఎం నితీష్, మాజీ సీఎం లాలుపై అసభ్య పాటలు... గాయకుడు అరెస్ట్
పట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్లను అసభ్యకరంగా వర్ణిస్తూ పాటలు పాడిన భోజ్పురి గాయకుడు సూరజ్ సింగ్ను నవాడ పోలీసులు అరెస్టు చేశారు.నితీష్ కుమార్, లాలు ప్రసాద్ యాదవ్లపై సూరజ్ సింగ్ అభ్యంతరకరమైన రీతిలో పాటలు పాడిన విషయమై సీనియర్ అధికారులకు ఫిర్యాదు అందిన దరిమిలా వారి ఆదేశాల మేరకు పోలీసులు చర్యలు చేపట్టారు. భోజ్పురి పాటలు బీహార్లో ఎంతో ఆదరణ పొందుతుంటాయి. అయితే ఈ పాటలు అశ్లీలంగా ఉంటున్నాయనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. కాగా భోజ్పురి సింగర్ సూరజ్ సింగ్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్లపై అభ్యంతరకరంగా పాడిన పాటలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ వైరల్ వీడియోను పోలీసులు గుర్తించారు. ప్రముఖ నేతలను అవమానించిన ఆ గాయకునిపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ పాటపై జేడీయూ, ఆర్జేడీ పార్టీలు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ కేసు గురించి సైబర్ డీఎస్పీ ప్రియా జ్యోతి మాట్లాడుతూ ఈ కేసులో సూరజ్ సింగ్ అనే గాయకుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు అతనిని విచారిస్తున్నారు. ఇది కూడా చదవండి: అడవి మధ్యలో రహస్య గుహ.. లోపల కళ్లు బైర్లు కమ్మే దృశ్యం -
NITI Aayog: నితీశ్ అసంతృప్తి?
నీతిఆయోగ్ భేటీకి విపక్ష ఇండియా కూటమి సీఎంలతో పాటు పాలక ఎన్డీఏ సంకీర్ణంలో కీలక భాగస్వామి అయిన బిహార్ సీఎం నితీశ్కుమార్ కూడా డుమ్మా కొట్టడం విశేషం. ఆయన బదులు ఉప ముఖ్యమంత్రులు సమర్థ్ చౌదరి, విజయ్కుమార్ సిన్హా పాల్గొన్నారు. ఆయన కోరుతున్నట్టుగా బిహార్కు ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం ఇటీవలే స్పష్టం చేయడం తెలిసిందే. దీనిపై అసంతృప్తితోనే భేటీకి నితీశ్ దూరంగా ఉన్నట్టు భావిస్తున్నారు. అయితే ఆయన గైర్హాజరుకు పెద్ద ప్రాధాన్యమేమీ లేదని జేడీ(యూ) పేర్కొంది. గతంలో కూడా నితీశ్ పలుమార్లు నీతిఆయోగ్ భేటీకి గైర్హాజరయ్యారని గుర్తు చేసింది. కేంద్ర బడ్జెట్లో విపక్ష పాలిత రాష్ట్రాలపై వివక్ష చూపారని ఆరోపిస్తూ తెలంగాణ, కర్నాటక తమిళనాడు, కేరళ, పంజాబ్, హిమాచల్ప్రదేశ్, ఢిల్లీ, జార్ఖండ్, పాండిచ్చేరి సీఎంలు కూడా భేటీకి దూరంగా ఉన్నారు. ‘‘10 రాష్ట్రాల సీఎంలు భేటీకి రాలేదు. అది ఆయా రాష్ట్రాలకే నష్టం’’ అని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రమణ్యం అన్నారు. ‘‘మమత సమయం పూర్తవగానే రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ మైక్పై తట్టారు. వెంటనే ఆమె మాట్లాడటం ఆపేసి వాకౌట్ చేశారు’’ అని ఆయన వివరించారు. బిహార్ అసెంబ్లీ సమావేశాల కారణంగా నితీశ్ రాలేకపోయారన్నారు. -
బిహార్కు ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ ఇవ్వాలి
న్యూఢిల్లీ: కేంద్రంలో ప్రధాని మోదీ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా ఉన్న జనతాదళ్(యునైటెడ్) ఎగ్జిక్యూటివ్ సమావేశం శనివారం జరిగింది. పార్టీ చీఫ్, బిహార్ సీఎం నితీశ్ ‡ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన ఈ భేటీలో ఆ పార్టీ కీలక తీర్మానాలు చేసింది. బిహార్కు ప్రత్యేక హోదా లేదా స్పెషల్ ప్యాకేజీ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. పేపర్ లీకేజీ ఘటనల్లో బాధ్యులపై తీవ్ర చర్యలు తీసుకోవడం ద్వారా వీటిని పునరావృతం కాకుండా చేయవచ్చని పేర్కొంది. ఈ సమావేశం నితీశ్కి నమ్మకస్తుడిగా, బీజేపీతో మంచి సంబంధాలున్న రాజ్యసభ ఎంపీ సంజయ్ ఝాను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నుకుంది. -
Patna high court: రిజర్వేషన్ల పెంపు చెల్లదు
పాట్నా: బిహార్లో నితీశ్ కుమార్ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. విద్యా, ఉద్యోగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను 50 శాతం నుంచి 65 శాతానికి పెంచేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పట్నా హైకోర్టు కొట్టివేసింది. రిజర్వేషన్లు పెంచుతూ 2023 నవంబర్లో ప్రభుత్వం తీసుకొచి్చన చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె.వినోద్ చంద్రన్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. రిజర్వేషన్లు పెంచడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ సంచలన తీర్పు వెలువరించింది. రిజర్వేషన్లు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం చట్ట సవరణ చేయడం రాజ్యాంగంలోని ఆరి్టకల్ 14, 16ని ఉల్లంఘించడమే అవుతుందని పిటిషనర్ల తరఫు న్యాయవాది రితికా రాణి చెప్పారు. తమ పిటిషన్లపై హైకోర్టు ఈ ఏడాది మార్చి నెలలో తీర్పును రిజర్వ్ చేసిందని, గురువారం తుది తీర్పు ఇచి్చందని వెల్లడించారు. ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు పౌరులంతా సమానమే. ఆర్టికల్ 16 ప్రకారం ఉద్యోగం, ఉపాధి విషయంలో పౌరులందరికీ సమాన అవకాశాలు కలి్పంచాలి. కుల గణన ఆధారంగా బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు పెంచినట్లు బిహార్ ప్రభుత్వం న్యాయస్థానంలో వాదించిందని పిటిషనర్ల తరఫు మరో న్యాయవాది నిర్భయ్ ప్రశాంత్ తెలిపారు. ఇంద్ర సహానీ కేసుతోపాటు మరాఠా రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచి్చన తీర్పులను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. విద్యా, ఉద్యోగాల్లో కోటాను 50 శాతానికి మించి పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని సుప్రీంకోర్టు తేలి్చచెప్పిందని గుర్తుచేశారు. 75 శాతానికి చేరిన రిజర్వేషన్లు బిహార్ ప్రభుత్వం కుల గణన నిర్వహించింది. రాష్ట్ర జనాభాలో ఓబీసీలు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులు(ఈబీసీ) 63 శాతం ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది. ఎస్సీ, ఎస్టీలు కలిపి 21 శాతానిపైగా ఉన్నట్లు వెల్లడయ్యింది. ప్రభుత్వం గతంలోనే ఈబీసీలకు 10 రిజర్వేషన్లు కలి్పంచింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం రిజర్వేషన్లు 50 శాతానికి మించడానికి వీల్లేదు కాబట్టి రిజర్వేషన్ చట్టాల్లో సవరణలు చేసింది. ఈ మేరకు అసెంబ్లీలో బిల్లును ఆమోదించింది. 50 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీల కోటాను 65 శాతానికి పెంచేసింది. ఈ మేరకు గత ఏడాది నవంబర్ 21న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. బిహార్లో ఈబీసీ రిజర్వేషన్లతో కలిపి మొత్తం రిజర్వేషన్లు 75 శాతానికి చేరుకున్నాయి. సవరించిన రిజర్వేషన్ చట్టాలను రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి బిహార్ సర్కారు విజ్ఞప్తి చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చట్టాల జాబితా తొమ్మిదో షెడ్యూల్లో ఉంది. ఈ షెడ్యూల్లో చేర్చిన చట్టాలను కోర్టుల్లో సవాలు చేసేందుకు అవకాశం ఉండదు. సుప్రీంకోర్టు 1992లో రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి విధించిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా బిహార్ సర్కారు రిజర్వేషన్లు పెంచడాన్ని సవాలు చేస్తూ పలువురు పాట్నా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. -
సమన్వయ కమిటీ! నితీశ్ సారథ్యంలో సీఎంపీ: జేడీయూ
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్డీఏ సర్కారు మనుగడకు కీలకంగా మారిన భాగస్వామ్య పక్షాలు బీజేపీ ముందు పలు డిమాండ్లు పెడుతున్నాయి. అందులో భాగంగా ఎన్డీఏ సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని జేడీ(యూ) డిమాండ్ చేస్తోంది. దాని కనీ్వనర్గా పార్టీ చీఫ్, బిహార్ సీఎం నితీశ్కుమార్ ఉండాలని కోరుతోంది. అంతేగాక ఎన్డీఏకు కనీస ఉమ్మడి ప్రణాళిక (సీఎంపీ) ఉండాలని, దాని అమలు కమిటీ సారథ్యాన్ని కూడా నితీశ్కు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. దీనికి అదనంగా నాలుగు కేబినెట్ బెర్తులు, బిహార్కు ప్రత్యేక హోదా తదితరాలను నితీశ్ ఇప్పటికే బీజేపీ పెద్దల ముందుంచారు. టీడీపీ కూడా నాలుగైదు కేబినెట్, ఒక సహాయ మంత్రి, లోక్సభ స్పీకర్ పదవి డిమాండ్ చేస్తున్నట్టు వార్తలు రావడం తెలిసిందే. టీడీపీ, జేడీ(యూ) డిమాండ్లకు బీజేపీ అంగీకరించడం లేదని తెలుస్తోంది. టీడీపీకి ఒకకేబినెట్, ఒకట్రెండు సహాయ పదవులను ఆఫర్ చేసినట్టు చేసినట్టు సమాచారం. జేడీ(యూ), ఇతర మిత్రపక్షాల డిమాండ్లపై వాటితో చర్చలు సాగుతున్నట్టు తెలుస్తోంది. -
ఒకే వేదికపై పీఎం మోదీ, సీఎం నితీష్!
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం బీహార్లో పర్యటించనున్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధాని మోదీ ఇక్కడకు రావడం ఇదే తొలిసారి. బీహార్లోని ఔరంగాబాద్, బెగుసరాయ్ జిల్లాల ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ప్రధానికి స్వాగతం పలికేందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ విమానాశ్రయానికి వెళ్లనున్నారు. దాదాపు 18 నెలల తర్వాత ప్రధాని మోదీ, సీఎం నితీశ్ కుమార్ కలిసి వేదికపై కనిపించనున్నారు. ప్రధాని మోదీతో పాటు సీఎం నితీశ్ కుమార్ ఔరంగాబాద్, బెగుసరాయ్లకు వెళ్లనున్నారు. గయ విమానాశ్రయం నుంచి నితీశ్ కుమార్ ముందుగా ప్రధాని మోదీతో కలిసి హెలికాప్టర్లో ఔరంగాబాద్కు బయలుదేరుతారు. ఔరంగాబాద్లో రూ. 21,400 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం ప్రధానమంత్రి బెగుసరాయ్లో ర్యాలీలో ప్రసంగించనున్నారు. గ్యాస్కు సంబంధించిన రూ.1.48 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను మోదీ బెగుసరాయ్లో ప్రారంభించనున్నారు. ఈ ఇద్దరు ప్రముఖులు చివరిసారిగా 2022, జూలై 12న శాసనసభ శతాబ్ది ఉత్సవాల్లో ఒకే వేదికపై కనిపించారు. -
‘హీ నితీష్డ్ మీ’
న్యూఢిల్లీ: బిహార్ సీఎం నితీశ్ కుమార్ పదేపదే కూటములు మార్చడంపై సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మీమ్స్, జోకులు పేలుతున్నాయి. మోసానికి సిసలైన పేరు నితీశ్ అంటూ కొత్త విశేషణాన్ని ఖరారుచేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని మీమ్స్లో కొన్ని... ‘అతను నన్ను మోసం చేశాడు’ అనడానికి ‘హీ నితీష్డ్ మీ’ అంటూ పలువురు ట్యాగ్ చేస్తున్నారు. ‘‘బీసీసీఐ కొత్త తరహా క్రికెట్ టోర్నమెంట్ ఫార్మాట్ తేనుంది. అదేంటంటే మ్యాచ్ మధ్యలో కెప్టెన్లు మారిపోతారు. ప్రేక్షకుల్లో ఉత్కంఠ. ఆదాయానికి ఆదాయం. వరల్డ్ కప్ లాగా అది ‘నితీశ్ కప్’ అని ఒక పాత్రికేయుడు ‘ఎక్స్’లో ట్వీట్చేశారు. కార్పోరేట్ ప్రపంచంలో సీఈవోలకు నితీశ్ కుమార్ ఒక ఆదర్శనీయుడు. తొమ్మిదిసార్లు ‘కంపెనీ’ల విలీనాలు, టేకోవర్ల తర్వాత కూడా ఈయనే సీఈవోగా కొనసాగడం అద్భుతం’ అని మరో యూజర్ ట్వీట్చేశారు. కూటముల మధ్య తెగ ‘పల్టీలు కొట్టే పుత్రుడు’ని కన్నందుకు ‘పాటలీపుత్ర’కు ఆ పేరు వచ్చిందని మరొకరు కొత్త భాష్యమిచ్చారు. ‘‘జాతీయ రహదారులపై యూటర్న్ గుర్తు తీసేసి అక్కడ నితీశ్ ఫొటో పెట్టాలని కేంద్ర రహదారుల మంత్రి ఆదేశించారు’’ అని మరొకరు ట్వీట్చేశారు. బిహార్లో మహాఘట్బంధన్ కూటమికి చరమగీతం పాడి బీజేపీతో నితీశ్ జట్టు కట్టిన విధానాన్ని ఐదు అంశాల్లో నెటిజన్లు సరికొత్తగా నిర్వచించారు. 1. ఎటంటే అటు మారేలా అనువుగా ఉండాలి. 2. సరిగ్గా సరైన సమయం చూసి అటువైపు దూకేయాలి. 3. అదే సమయంలో పాత మిత్రులతో సత్సంబంధాలు కొనసాగించాలి. 4. చెడిపోయిన స్నేహాన్ని చిగురింపజేయాలి. 5. కొత్త అవకాశం చేతికొచ్చాకే పాత మిత్రుల చేయి వదిలేయాలి. గవర్నర్ బిత్తరపోయిన వేళ! ఆదివారం సాయంత్రం రాజ్భవన్లో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి వెళ్లిన నితీశ్, 15 నిమిషాల్లోపే తిరిగి రాజ్భవన్కు రావడం చూసి గవర్నర్ షాకయ్యారంటూ సరదా వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. అదేమంటే, రాజ్భవన్లో మర్చిపోయిన తన మఫ్లర్(స్కార్ఫ్)ను తీసుకోవడం కోసం నితీశ్ వెనుదిరిగి వస్తారు. అది చూసి గవర్నర్ బిత్తరపోతారు. ‘ఈసారి కూటమికి గుడ్బై చెప్పడానికి నితీశ్కు 18 నెలలు టైమ్ పట్టింది. ఇప్పుడేమిటి మరీ 15 నిమిషాల్లోపే మళ్లీ వచ్చారా?’ అని గవర్నర్ షాక్కు గురయ్యారంటూ కాంగ్రెస్ వ్యంగ్యంగా ట్వీట్చేసింది. ‘‘వెంటవెంటనే రాజీనామాలు, ప్రమాణాలతో నితీశ్ రాజకీయ రంగు మారుస్తున్నారు. ఈయనను చూసి ఊసరవెల్లి కూడా కొత్త రంగును వెతుక్కోవాల్సి వస్తోంది. ఆయారామ్ గయారామ్ బదులు ఇక ఆయా నితీశ్ గయా నితీశ్ అనుకోవాలి’’ అని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఎద్దేవా చేశారు. -
Bihar political crisis: మళ్లీ కూటమి మారిన నితీశ్
పట్నా: బిహార్ రాజకీయ రగడకు ఊహించిన విధంగానే తెర పడింది. గోడదూకుళ్లకు పెట్టింది పేరైన జేడీ(యూ) అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ మళ్లీ కూటమి మారారు. ఆదివారం ఇండియా కూటమికి గుడ్బై చెప్పి మరోసారి బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ గూటికి చేరారు. ఉదయం సీఎం పదవికి రాజీనామా చేసి జేడీ(యూ), ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహాఘట్బంధన్ సర్కారుకు చరమగీతం పాడారు. సాయంత్రానికల్లా బీజేపీ మద్దతుతో మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. తద్వారా 72 ఏళ్ల నితీశ్ బిహార్ ముఖ్యమంత్రిగా రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి పగ్గాలు చేపట్టారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరుల సమక్షంలో రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. బిహార్ బీజేపీ చీఫ్ సమ్రాట్ చౌధరి, పార్టీ నేత విజయ్కుమార్ సిన్హాలకు డిప్యూటీ సీఎం పదవులు దక్కాయి. నితీశ్ చర్యపై కాంగ్రెస్తో పాటు విపక్ష ఇండియా కూటమిలోని ఆర్జేడీ, డీఎంకే, జేఎంఎం, ఆప్ తదితర పారీ్టలు మండిపడ్డాయి. బిహార్ ప్రజలే ఆయనకు బుద్ధి చెబుతారన్నాయి. భాగస్వాములను మోసగించడంలో సిద్ధహస్తుడైన ఆయన మరోసారి ఊసరవెల్లి నైజాన్ని చాటుకున్నారంటూ కాంగ్రెస్ దుయ్యబట్టింది. నితీశ్ వంటి ఆయారాం, గయారాంల ని్రష్కమణతో ఇండియా కూటమికి నష్టమేమీ లేదని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ‘‘ఆయన ఇలా చేస్తారని నాకు ముందే తెలుసు. ఎన్డీఏలోకి వెళ్లడం ఖాయమని ఆర్జేడీ చీఫ్ లాలు, ఆయన కుమారుడు తేజస్వి కూడా నాకు చెప్పారు. కానీ ఇండియా కూటమి చెదిరిపోకుండా ఉండాలని నేను బయటికి చెప్పలేదు’’ అన్నారు. ఆట ఇప్పుడే ఆరంభమైందని తేజస్వి అన్నారు. లోక్సభ ఎన్నికల్లో జేడీ(యూ) మట్టి కరవడం ఖాయమంటూ శాపనార్థాలు పెట్టారు. నితీశ్ది ద్రోహమంటూ సీపీఐ (ఎంఎల్) దుయ్యబట్టింది. గోడ దూకుడుకు పర్యాయపదంగా ఆయన చరిత్రలో నిలిచిపోతారంటూ ఎన్సీపీ (శరద్ పవార్) ఎద్దేవా చేసింది. ‘‘స్నోలీగోస్టర్ (విలువల్లేని వ్యక్తి) పదం నితీశ్కు బాగా సరిపోతుంది. ఇదే వర్డ్ ఆఫ్ ద డే’’ అంటూ కాంగ్రెస్ నేత శశిథరూర్ చమత్కరించారు. పదేపదే కూటములు మార్చడం నితీశ్కు పరిపాటేనని తృణమూల్ కాంగ్రెస్ పేర్కొంది. జేడీ(యూ) మాత్రం కాంగ్రెస్ స్వార్థపూరిత వైఖరి వల్లే నితీశ్ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచి్చందని చెప్పుకొచి్చంది. కొత్త సర్కారుకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. బిహారీల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పాటుపడుతుందంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇక ఎటూ వెళ్లను: నితీశ్ అంతకుముందు ఆదివారం రోజంతా పట్నాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతూ వచ్చాయి. ఉదయమే జేడీ(యూ) శాసనసభా పక్షం నితీశ్ నివాసంలో భేటీ అయింది. ఏ నిర్ణయమైనా తీసుకునే హక్కును ఆయనకు కట్టుబెడుతూ తీర్మానించింది. వెంటనే నితీశ్ రాజ్భవన్కు వెళ్లి సీఎం పదవికి రాజీనామా సమరి్పంచారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. మహాఘట్బంధన్లో పరిస్థితులు సజావుగా లేకపోవడం వల్లే ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నట్టు చెప్పారు. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు నితీశ్కు మద్దతిస్తూ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు తీర్మానించారు. ఆ వెంటనే తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహా్వనించాల్సిందిగా గవర్నర్ను నితీశ్ కోరడం, సీఎంగా ప్రమాణం చేయడం చకచకా జరిగిపోయాయి. తర్వాత నితీశ్ మరోసారి మీడియాతో మాట్లాడారు. ఎన్డీఏను వీడి ఇకపై ఎటూ వెళ్లేది లేదని చెప్పుకొచ్చారు. ఆయన తమ సహజ భాగస్వామి అని బీజేపీ చీఫ్ నడ్డా అన్నారు. జేడీ(యూ)తో కలిసి లోక్సభ ఎన్నికల్లో బిహార్లో మొత్తం 40 సీట్లనూ స్వీప్ చేస్తామని అన్నారు ఇండియా కూటమికి చావుదెబ్బ! తృణమూల్ కాంగ్రెస్, ఆప్ ఇచి్చన ఇటీవలి షాక్లకు ఇప్పటికే మూలుగుతున్న కాంగ్రెస్ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి నితీశ్ తాజా ని్రష్కమణతో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇప్పటికే దూకుడు మీదున్న బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిని ఈ పరిణామం మరింత బలోపేతం చేసింది. లోక్సభ ఎన్నికల్లో పశి్చమబెంగాల్లో అన్ని స్థానాల్లోనూ తృణమూల్ ఒంటరిగానే పోటీ చేస్తుందని పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించడం తెలిసిందే. పంజాబ్లోనూ ఆప్ది ఒంటరిపోరేనని రాష్ట్ర సీఎం భగవంత్ మాన్ కూడా అదే రోజు స్పష్టం చేశారు. అధికారమే పరమావధి 2020లో ఏర్పాటైన ప్రస్తుత బిహార్ అసెంబ్లీ పదవీకాలంలో నితీశ్ సారథ్యంలో ఇది ఏకంగా మూడో ప్రభుత్వం కావడం విశేషం! అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ మద్దతుతో నితీశ్ సీఎం అయ్యారు. జేడీ(యూ)లో చీలికకు బీజేపీ కుట్ర చేస్తోందంటూ 2022లో ఆ ప్రభుత్వాన్ని కుప్పకూల్చి ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి మహాఘట్బంధన్ సర్కారును ఏర్పాటు చేశారు. 18 నెలలకే దాన్నీ పడదోసి తాజాగా మరోసారి ఎన్డీఏతో జట్టు కట్టి మళ్లీ సీఎంగా పీఠమెక్కారు. మొత్తమ్మీద కూటములు మారడం నితీశ్కు ఇది ఐదోసారి. ఆయన తొలిసారిగా 2000లో బిహార్ సీఎం పదవి చేపట్టారు. 2013లో ఎన్డీఏతో 17 ఏళ్ల బంధాన్ని తెంచుకుని కాంగ్రెస్, సీపీఐ మద్దతుతో ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నారు. 2014 లోక్సభ ఎన్నికల్లో జేడీ(యూ) ఘోర ఓటమికి బాధ్యత వహిస్తూ సీఎం పదవి నుంచి నితీశ్ కుమార్ తప్పుకున్నారు. కానీ 2015లో ఆర్జేడీ, కాంగ్రెస్తోకలిసి పోటీ చేసి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. 2017లో తిరిగి ఎన్డీఏ గూటికి చేరి 2022 దాకా అందులో కొనసాగారు. -
కూటమిని కాపాడుకుంటాం: ఖర్గే
కలబురిగి(కర్ణాటక): బిహార్లో సీఎం నితీశ్ కుమార్కు చెందిన జేడీ(యూ) ఇండియా కూటమిని వీడి బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏలో చేరనుందన్న వార్తలపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పందించారు. దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనే తపన ఉన్నవారు కచ్చితంగా ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోరని తమ పార్టీ భావిస్తోందని ఖర్గే పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలతో కూడిన ఇండియా కూటమిని ఐక్యంగా నిలిపి ఉంచేందుకు కాంగ్రెస్ శాయశక్తులా ప్రయత్నిస్తుందని ఆయన స్పష్టం చేశారు. -
Bihar Politics: రేపే ఎన్డీఏలోకి నితీశ్?
పట్నా/న్యూఢిల్లీ: బిహార్ రాజకీయం రసకందాయంలో పడింది. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన అధికార మహాఘట్బంధన్ సంకీర్ణానికి జేడీ(యూ) సారథి, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గుడ్బై చెప్పి ఎన్డీఏ కూటమిలో చేరడం దాదాపుగా ఖాయమైందని తెలుస్తోంది. పాత నేస్తం బీజేపీతో మళ్లీ జట్టు కట్టి ఆయన కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఆదివారమే నితీశ్ మరోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయవచ్చని జేడీ(యూ) వర్గాలంటున్నాయి. రాష్ట్ర బీజేపీ అగ్ర నేత సుశీల్కుమార్ మోదీకి ఉప ముఖ్యమంత్రి పదవి దక్కనుందని సమాచారం. ‘‘(నితీశ్కు ఇంతకాలంగా బీజేపీలోకి) మూసుకుపోయిన తలుపులు తెరుచుకోవచ్చు. రాజకీయాంటేనే అవకాశాల ఆటస్థలి. కనుక ఏదైనా సాధ్యమే’’ అంటూ శుక్రవారం సుశీల్ చేసిన నర్మగర్భ వ్యాఖ్యలు కూడా ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. బిహార్ తాజా పరిణామాలపై రాష్ట్ర బీజేపీ చీఫ్ సమర్థ్ చౌదరి, సుశీల్కుమార్ ఇప్పటికే ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షా తదితర బీజేపీ అగ్ర నేతలతో చర్చలు జరిపి వచ్చారు. ఈ నేపథ్యంలో జేడీ(యూ)ను ఎన్డీఏలోకి తీసుకోవడంపై శని, ఆదివారాల్లో బిహార్ బీజేపీ రెండు రోజుల రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో చర్చించనున్నారు. ఆదివారమే పొత్తు నిర్ణయం వెలువడవచ్చని తెలుస్తోంది. ఆ రోజు ఉదయమే జేడీ(యూ) ఎమ్మెల్యేలతో నితీశ్ సమావేశం కానుండటం విశేషం! మరోవైపు 10 మంది దాకా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా బీజేపీతో టచ్లో ఉన్నట్టు వస్తున్న వార్తలు అధికార సంకీర్ణంలో కలకలం రేపుతున్నాయి. నితీశ్ స్పష్టత ఇవ్వాలి: ఆర్జేడీ సంకీర్ణంలో ప్రధాన భాగస్వామి అయిన ఆర్జేడీతో నితీశ్కు విభేదాల నేపథ్యంలో బిహార్లో రెండు రోజులుగా రాజకీయ రగడ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆయన ఎన్డీఏలో చేరతారన్న వార్తలు గురువారం కలకలం రేపాయి. జేడీ(యూ) ని్రష్కమిస్తే సంకీర్ణ ప్రభుత్వం మైనారిటీలో పడుతుంది. దాన్ని కాపాడుకునేందుకు అవసరమైన 8 మంది ఎమ్మెల్యేల కోసం ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. నలుగురు ఎమ్మెల్యేలున్న ఎన్డీఏ భాగస్వామి హిందూస్తానీ అవామ్ మోర్చా చీఫ్ జితిన్రామ్ మాంఝీతో శుక్రవారం మంతనాలు జరిపారు. మాంఝీ మాత్రం నితీశ్ కూడా త్వరలో ఎన్డీఏలోకి వస్తారని మీడియాతో చెప్పుకొచ్చారు! ఘట్బంధన్ సర్కారు ఒకట్రెండు రోజుల్లోనే కుప్పకూలడం ఖాయమని ఆయన కుమారుడు సంతోష్ జోస్యం చెప్పారు. మొత్తం ఉదంతంపై నితీశ్ తక్షణం స్పష్టమైన ప్రకటన చేసి ఊహాగానాలకు తెర దించాలని ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా కోరడం విశేషం. -
Lok Sabha polls 2024: బీజేపీ వైపు... నితీశ్ చూపు!
పట్నా/న్యూఢిల్లీ: కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష ఇండియా కూటమికి రెండు రోజుల్లోనే మూడో భారీ ఎదురుదెబ్బ! కీలక భాగస్వామి అయిన జేడీ(యూ) అధ్యక్షుడు, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ కూటమికి కటీఫ్ చెప్పేలా కని్పస్తున్నారు. అవసరార్థపు గోడ దూకుళ్లకు పెట్టింది పేరైన ఆయన 2024 లోక్సభ ఎన్నికల ముంగిట యూ టర్న్ తీసుకుని మళ్లీ బీజేపీతో జట్టు కట్టే దిశగా సాగుతున్నారు. ఈ దిశగా బుధవారం నుంచీ జరుగుతున్న వరుస పరిణామాలతో బిహార్లో ఆర్జేడీ, జేడీ(యూ), కాంగ్రెస్, వామపక్షాల మహాఘట్బంధన్ సంకీర్ణ సర్కారు కూడా కుప్పకూలేలా కన్పిస్తోంది. ఘట్బంధన్తో 18 నెలల కలహాల కాపురానికి ఫుల్స్టాప్ పెట్టి బీజేపీ మద్దతుతో మరోసారి సీఎం పీఠం కాపాడుకునే ప్రయత్నాలకు నితీశ్ పదును పెట్టారంటూ వార్తలు వస్తున్నాయి. ప్రతిగా ఆర్జేడీ కూడా జేడీ(యూ)తో నిమిత్తం లేకుండా మెజారిటీ సాధనకు ప్రయత్నాలకు పదును పెట్టింది. ఈ దిశగా జేడీ(యూ) సీనియర్ నేతలతో నితీశ్ ఇంట్లో, ఘట్బంధన్లోని ఇతర పక్షాలతో ఆర్జేడీ చీఫ్ లాలుప్రసాద్ నివాసంలో పోటాపోటీ సమావేశాలతో గురువారం బిహార్ రాజధాని పట్నాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. నితీశ్ నివాసంలో భేటీలో జేడీ(యూ) ఎమ్మెల్యేలంతా పాల్గొన్నారు. ఇక లాలు ఒకవైపు తన నివాసంలో భేటీ జరుగుండగానే మరోవైపు ఆర్జేడీకే చెందిన అసెంబ్లీ స్పీకర్ అవధ్ బిహారీ చౌధరితో కూడా ఫోన్లో మంతనాలు జరిపారు. దాంతో నితీశ్ మరింత అప్రమత్తయ్యారు. ఆర్జేడీకి ప్రభుత్వ ఏర్పాటుకు చాన్సివ్వకుండా అవసరమైతే అసెంబ్లీని రద్దు చేయాలని కూడా ఆయన యోచిస్తున్నట్టు చెబుతున్నారు! లోక్సభ ఎన్నికల్లో పశి్చమ బెంగాల్లో కాంగ్రెస్తో పొత్తుండబోదని, ఒంటరిగానే పోటీ చేస్తామని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, పంజాబ్లో ఆప్దీ ఒంటరి పోరేనని ఆ రాష్ట్ర సీఎం భగవంత్ మాన్ బుధవారం ప్రకటించడం తెలిసిందే. దాంతో ఒక్కసారిగా డీలా పడ్డ ఇండియా కూటమిలో బిహార్ తాజా పరిణామాలు మరింత కలవరం రేపుతున్నాయి. నితీశ్ బీజేపీ గూటికి చేరితే విపక్ష కూటమి దాదాపుగా విచి్ఛన్నమైనట్టేనని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ జోడో న్యాయ్ యాత్రకు రెండు రోజుల విరామమిచ్చి ఢిల్లీ చేరిన కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీ ఈ పరిణామాలన్నింటిపై పార్టీ నేతలతో మంతనాల్లో మునిగిపోయారు. మరోవైపు బిహార్ బీజేపీ చీఫ్ సమర్థ్ చౌదరి, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి అశ్వినీ చౌబేతో పాటు జేడీ(యూ) రాజకీయ సలహాదారు కేసీ త్యాగి కూడా ఒకే విమానంలో హుటాహుటిన ఢిల్లీ చేరుకున్నారు. దాంతో హస్తినలోనూ రాజకీయ వేడి తారస్థాయికి చేరుతోంది. ఆదినుంచీ కలహాల కాపురమే... బిహార్లో 2020లో ఏర్పాటైన మహాఘట్బంధన్ సంకీర్ణ సర్కారు నిత్యం కలహాలమయంగానే సాగుతూ వస్తోంది. ముఖ్యంగా తేజస్విని సీఎం చేసి తప్పుకోవాలని లాలు కొంతకాలంగా పట్టుబడుతుండటంపై నితీశ్ గుర్రుగా ఉన్నారు. జేడీ(యూ) తాజా మాజీ అధ్యక్షుడు లలన్ సింగ్ సాయంతో ఆ పార్టీ నుంచి డజను మంది ఎమ్మెల్యేలను లాగేసేందుకు లాలు ఇటీవల గట్టి ప్రయత్నమే చేశారు. దాన్ని సకాలంలో పసిగట్టిన నితీశ్ లలన్కు ఉద్వాసన పలికి తానే పార్టీ అధ్యక్ష పదవి చేపట్టారు. ఈ ఉదంతంతో ఆర్జేడీతో విభేదాలు తారస్థాయికి చేరాయి. లాలు, నితీశ్లిద్దరికీ రాజకీయ గురువైన బిహార్ దివంగత సీఎం కర్పూరి ఠాకూర్ శత జయంత్యుత్సవాల సందర్భంగా బుధవారం నితీశ్ చేసిన వ్యాఖ్యలు విభేదాలకు మరింతగా ఆజ్యం పోశాయి. పారీ్టల్లో కుటుంబాల పెత్తనాన్ని కర్పూరి తీవ్రంగా వ్యతిరేకించేశారన్న నితీశ్ వ్యాఖ్యలు ఆర్జేడీని ఉద్దేశించినవేనంటూ లాలు కుటుంబం మండిపడింది. నితీశ్ అవకాశవాది అని తూర్పారబడుతూ లాలు కుమార్తె రోహిణీ ఆచార్య ఎక్స్లో పెట్టిన పోస్టులతో పరిస్థితి రసకందాయంలో పడింది. నితీశ్పై ఆమె విమర్శలను రాష్ట్ర బీజేపీ అగ్ర నేతలు తీవ్రంగా ఖండించడం, ఆ వెంటనే ఆ పారీ్టతో జేడీ(యూ) దోస్తీ అంటూ వార్తలు రావడం... నితీశ్, లాలు నివాసాల్లో పోటాపోటీ సమావేశాల తదితర పరిణామా లు వెంటవెంటనే జరిగిపోయాయి. గిరిరాజ్ చెణుకులు పదేపదే ఆర్జేడీపై అలగడం నితీశ్కు పరిపాటేనంటూ కేంద్ర మంత్రి, బీజేపీ అగ్ర నేత గిరిరాజ్సింగ్ విసిరిన చెణుకులు గురువారం వైరల్గా మారాయి. ‘‘నే పుట్టింటికి వెళ్లిపోతా. నువ్వు చూస్తూ ఉండిపోతావ్ అని పాడుతూ లాలును నితీశ్ చీటికీమాటికీ బెదిరిస్తుంటారు. కానీ పుట్టింటి (బీజేపీ) తలుపులు తనకు శాశ్వతంగా మూసుకుపోయాయన్న వాస్తవాన్ని మాత్రం దాస్తుంటారు’’ అంటూ తాజా పరిణామాలపై గిరిరాజ్ స్పందించారు. గోడదూకుళ్లలో ఘనాపాఠి రాజకీయ గాలికి స్వీయ ప్రయోజనాలకు అనుగుణంగా మంచినీళ్ల ప్రాయంగా కూటములను మార్చడంలో నితీశ్కుమార్ సిద్ధహస్తుడు. దాంతో ఆయన్ను పల్టూ (పిల్లిమొగ్గల) కుమార్గా పిలవడం పరిపాటిగా మారింది. బీజేపీ వాజ్పేయీ, అడ్వాణీల సారథ్యంలో సాగినంత కాలం ఆ పారీ్టతో నితీశ్ బంధం అవిచి్ఛన్నంగా సాగింది. వారి శకం ముగిసి నరేంద్ర మోదీ తెరపైకి రావడంతో పొరపొచ్ఛాలు మొదలయ్యాయి. ఆయన్ను ప్రధాని అభ్యరి్థగా ప్రకటించడంతో బీజేపీతో 17 ఏళ్ల బంధానికి 2013లో తొలిసారిగా గుడ్బై చెప్పారు. 2014 లోక్సభ ఎన్నికల తర్వాత బిహార్ సీఎంగా తప్పుకుని జితిన్రాం మాంఝీని గద్దెనెక్కించారు. తన బద్ధ విరోధి అయిన లాలు సారథ్యంలోని ఆర్జేడీతో పొత్తు ద్వారా సర్కారును కాపాడుకున్నారు. 2015లో ఆర్జేడీ, కాంగ్రెస్లతో మహాఘట్బంధన్గా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లారు. ఘనవిజయం సాధించి మళ్లీ సీఎం అయ్యారు. కానీ సంఖ్యాబలంలో ఆర్జేడీ పెద్ద పారీ్టగా అవతరించడంతో నితీశ్ ప్రాధాన్యం తగ్గుతూ వచ్చింది. లాలు కుమారుడు తేజస్విని అయిష్టంగానే డిప్యూటీ సీఎం చేయాల్సి వచి్చంది. రెండేళ్లలోపే కూటమిలో పొరపొచ్ఛాలు పెద్దవయ్యాయి. సరిగ్గా అదే సమయంలో లాలు, తేజస్విలపై సీబీఐ కేసులు నితీశ్కు అందివచ్చాయి. డిప్యూటీ సీఎం పోస్టుకు రాజీనామా చేసేందుకు తేజస్వి ససేమిరా అనడంతో తానే సీఎం పదవికి రాజీనామా చేసి 2017లో కూటమి సర్కారును కుప్పకూల్చారు. గంటల వ్యవధిలోనే బీజేపీ మద్దతుతో మళ్లీ గద్దెనెక్కి ఔరా అనిపించారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ విజయంతో నితీశ్ మళ్లీ సీఎం అయ్యారు. కానీ ఈసారి బీజేపీ పెద్ద పారీ్టగా అవతరించడంతో ఏ విషయంలోనూ తన మాట సాగక ఉక్కపోతకు గురయ్యారు. చివరికి జేడీ(యూ)ను చీల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందంటూ 2022 ఆగస్టులో దానికి గుడ్బై చెప్పారు. మర్నాడే ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో మహాఘట్బంధన్ సర్కారు ఏర్పాటు చేసి సీఎం పీఠం కాపాడుకున్నారు. తాజాగా నితీశ్ మళ్లీ బీజేపీ వైపు చూస్తున్నారన్న వార్తలు నిజమైతే ఇది ఆయనకు ఐదో పిల్లిమొగ్గ అవుతుంది! తెరపైకి మెజారిటీ లెక్కలు... నితీశ్ బీజేపీ గూటికి చేరతారన్న వార్తల నేపథ్యంలో బిహార్ అసెంబ్లీలో బలాబలాలు మరోసారి తెరపైకొచ్చాయి. 243 మంది సభ్యుల అసెంబ్లీలో మెజారిటీ మార్కు 122. మహాఘట్బంధన్ ప్రస్తుత బలం 159. 45 మంది ఎమ్మెల్యేలున్న జేడీ(యూ) ని్రష్కమిస్తే ఆర్జేడీ (79), కాంగ్రెస్ (19), వామపక్షాల (16)తో కూటమి బలం 114కు పడిపోతుంది. అప్పుడు మెజారిటీకి మరో 8 మంది ఎమ్మెల్యేలు అవసరమవుతారు. జితిన్రాం మాంఝీ సారథ్యంలోని హెచ్ఏఎం (4), మజ్లిస్ (1), స్వతంత్ర ఎమ్మెల్యే (1) మద్దతు కూడగట్టినా 120కే చేరుతుంది. మెజారిటీకి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కావాలి. ఈ నేపథ్యంలో మాంఝీ తదితరులతో పాటు జేడీ(యూ) అసంతృప్త ఎమ్మెల్యేలతో కూడా ఆర్జేడీ చీఫ్ లాలు జోరుగా మంతనాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్జేడీకి చెందిన స్పీకర్ పాత్ర కూడా కీలకంగా మారేలా కన్పిస్తోంది. మరోవైపు బీజేపీ, జేడీ(యూ) కలిస్తే 123 మంది ఎమ్మెల్యేలతో మెజారిటీ మార్కును అలవోకగా దాటేస్తాయి. తద్వారా తానే సీఎంగా కొనసాగాలని నితీశ్ భావిస్తున్నట్టు సమాచారం. కానీ అందుకు బీజేపీ సుముఖంగా లేదని, తమకే సీఎం చాన్సివ్వాలని భావిస్తోందని చెబుతున్నారు. అందుకు నితీశ్ అంగీకరించే పక్షంలో ఆయనను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. -
పెద్ద పదవులు కోరుకోవడం లేదు: నితీశ్
పాట్నా: గత వారం ఢిల్లీలో జరిగిన విపక్ష ‘ఇండియా’ కూటమి సమావేశంలో తీసుకున్న నిర్ణయాల పట్ల తాను అసంతృప్తితో ఉన్నానంటూ వెలువడిన వార్తలను బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) నేత నితీశ్ కుమార్ ఖండించారు. తమ కూటమిలో భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు త్వరలోనే పూర్తవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో ఇండియా కూటమి తరపున ప్రధానమంత్రి అభ్యరి్థగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేరును మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ వంటి నేతలు ప్రతిపాదించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. నితీశ్ కుమార్ సోమవారం పాటా్నలో మీడియాతో మాట్లాడారు. వ్యక్తిగతంగా తనకు పెద్ద కోరికలేవీ లేవని తెలిపారు. పెద్ద పదవులను తాను ఆశించడం లేదన్నారు. ‘ఇండియా’ కూటమి నిర్ణయాలపై తనకు ఎలాంటి అసంతృప్తి లేదని ఉద్ఘాటించారు. జేడీ(యూ) నేతల మధ్య తీవ్ర విభేదాలున్నాయన్న ప్రచారాన్ని నితీశ్ కొట్టిపారేశారు. పారీ్టలో ఎలాంటి సమస్యలు లేవని చెప్పారు. -
నితీశ్ సిగ్గుపడాలి: ప్రధాని నరేంద్ర మోదీ
దమోహ్/గుణ: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సాక్షాత్తూ అసెంబ్లీలో మహిళలను ఉద్దేశించి దిగజారుడు వ్యాఖ్యలు చేశారని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. మహిళలను దారుణంగా అగౌరవపర్చినా ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు నోరు విప్పడం లేదని, కనీసం ఖండించడం లేదని తప్పుపట్టారు. అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యల పట్ల నితీశ్ సిగ్గుపడాలని అన్నారు. తల్లులు, అక్కచెల్లెమ్మల పట్ల ఏమాత్రం గౌరవం లేని నాయకులతో ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు. మహిళలను చిన్నచూపు చూసే వ్యక్తులకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు మోదీ సూచించారు. మహిళల గౌరవాన్ని కాపాడడానికి తాను చేయాల్సిందంతా చేస్తానని హామీ ఇచ్చారు. బుధవారం మధ్యప్రదేశ్లోని దమోహ్, గుణ పట్టణాల్లో ఎన్నికల ప్రచార సభల్లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు తనకు వ్యతిరేకంగా ప్రపంచంలో ఏ కోర్టుకు వెళ్లినా సరే ఉచిత రేషన్ సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తానని తేల్చిచెప్పారు. ప్రతి ఇంట్లోనూ సౌర విద్యుత్ ఉత్పత్తి విధానాన్ని అమలు చేస్తున్నామని, ఇంట్లో వాడుకున్న తర్వాత మిగిలిన కరెంటును ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు. దేశంలో ప్రతి పౌరుడూ విద్యుత్ ఉత్పత్తిదారుడే అవుతారని వెల్లడించారు. మధ్యప్రదేశ్లో డబుల్ ఇంజన్ ప్రభుత్వం రావడంతో అభివృద్ధి వేగం పుంజుకుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర బడ్జెట్ రూ.80 వేల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్లకు చేరిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిస్తే అభివృద్ధి ఆగిపోతుందని అన్నారు. ‘ఉచిత రేషన్’ పొడిగింపుపై కాంగ్రెస్ అక్కసు పేదల ప్రజలకు ఉచిత రేషన్ సరుకుల పంపిణీ పథకాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగిస్తామంటూ తాను హామీ ఇవ్వడాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు జీరి్ణంచుకోలేకపోతున్నారని, అందుకే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెబుతున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. వారిని ఆ పాపం చేయనిద్దామని అన్నారు. తాను మాత్రం పేదల సంక్షేమం కోసం కృషి చేస్తూనే ఉంటానని చెప్పారు. 80 కోట్ల మందికి వచ్చే ఏదేళ్లపాటు ఉచితంగా రేషన్ సరుకులు ఇవ్వబోతున్నామని తెలిపారు. తనను చాలామంది ఇష్టానుసారంగా దూషిస్తున్నారని, అయిప్పటికీ అవినీతిపై పోరాటం ఆపబోనని తేల్చిచెప్పారు. ఎవరెంత తిట్టుకున్నా తాను లెక్కచేయనని అన్నారు. ఛత్తీస్గఢ్, రాజస్తాన్లో ప్రజలు కాంగ్రెస్కు అధికారం అప్పగిస్తే ఆ పార్టీ ముఖ్యమంత్రులు బెట్టింగ్ల్లో భాగస్వాములవుతున్నారని, నల్లధనం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రపంచంలో పదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న మన దేశం తాము 2014లో అధికారంలోకి వచ్చాక ఐదో స్థానానికి చేరుకుందని, 200 ఏళ్లపాటు మన దేశాన్ని పరిపాలించిన ఇంగ్లాండ్ను వెనక్కి నెట్టేశామని మోదీ ఉద్ఘాటించారు. ప్రపంచమంతా సంభ్రమాశ్చర్యాలతో మనవైపు చూస్తోందని అన్నారు. తాను మూడోసారి ప్రధానమంత్రి కావడం తథ్యమని, భారత్ను ప్రపంచంలో మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ‘85 శాతం కమిషన్ వ్యవస్థ’ మళ్లీ అమల్లోకి వస్తుందంటూ ప్రజలను అప్రమత్తం చేశారు. కాంగ్రెస్ను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. -
కాంగ్రెస్ వల్లే ‘ఇండియా’లో వేడి తగ్గింది: నితీశ్ కుమార్
పట్నా: విపక్ష ‘ఇండియా’ కూటమి స్తబ్ధుగా మారిపోయిందని, ప్రధాన భాగస్వామి అయిన కాంగ్రెస్ పారీ్టయే అందుకు కారణమని జేడీ(యూ) సీనియ ర్ నేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ మునిగిపోయిందని, దాంతో ఇండియా కూటమిలో వేడి తగ్గిందని అన్నా రు. గురువారం బిహార్ రాజధాని పట్నాలో సీపీఐ ఆధ్వర్యంలో జరిగిన సభలో నితీశ్ ప్రసంగించారు. కేంద్రంలో బీజేపీ పాలనను వ్యతిరేకించే పారీ్టలు ఒకే వేదికపైకి వచ్చాయని, ఆ కూటమిలో ఆశించిన పురోగతి కనిపించడం లేదని అభిప్రాయపడ్డారు. -
ముందస్తును కొట్టిపారేయలేం: నితీశ్
పట్నా: దేశంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలను కొట్టిపారేయలేమని బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) నేత నితీశ్ కుమార్ మరోసారి స్పష్టం చేశారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలు ఏకమవుతుండడం అధికార బీజేపీకి కలవరం కలిగిస్తోందని చెప్పారు. విపక్ష కూటమి పూర్తిగా బలం పుంజుకోకముందే ఎన్నికలు నిర్వహించాలన్న యోచనలో అధికార పక్షం ఉండొచ్చని తెలిపారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఐచ్ఛికం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందని గుర్తుచేశారు. -
23న విపక్ష పార్టీల భేటీ.. కేసీఆర్కు అందని ఆహ్వానం
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనే కార్యాచరణ సిధ్దం చేసేందుకు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ ఏర్పాటు చేసిన ప్రతిపక్ష అగ్రనేతల సమావేశం ఈ నెల 23న పాట్నాలో జరుగనుంది. ఈ నెల 12నే విపక్ష నేతల సమావేశం జరగాల్సి ఉన్నా, కాంగ్రెస్ సహా ఇతర పార్టీల ముఖ్య నేతలు అందుబాటులో లేకపోవడంతో ఈ భేటీని 23న నిర్వహించనున్నట్లు జేడీయూ అధ్యక్షుడు లాలన్ సింగ్ ప్రకటించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు సీఎం స్టాలిన్, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ–ఎంఎల్ జాతీయ కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్యలు హాజరు కానున్నారు. కాగా ఈ భేటీకి బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుకు జేడీయూ నేతలు ఆహ్వానం పంపలేదు. గత ఏడాది ఆగస్టులో బిహార్లో నితీశ్కుమార్తో భేటీ నిర్వహించిన కేసీఆర్, బీజేపీ ముక్త్ భారత్ౖMðకలిసి పోరాడతామని ప్రకటించారు. అయితే అనంతరం వివిధ కారణాలతో రెండు పార్టీల మధ్య ఎలాంటి చర్చలు జరుగలేదు. తాజా భేటీకి ఆహ్వానం పంపలేదు. ఈ భేటీలో లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉమ్మడి కార్యాచరణ తీసుకునే అంశంపై చర్చించనున్నారు. హాజరవుతున్నా: శరద్ పవార్ బిహార్ సీఎం నితీశ్కుమార్ బుధవారం తనకు ఫోన్ చేసి ఆహ్వానించారని, విపక్షాల భేటీకి తాను హాజరవుతానని ఎన్సీపీ అధినేత శరద్పవార్ గురువారం తెలిపారు. పలు జాతీయ అంశాలపై కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని, అది విపక్షాల బాధ్యతని పవార్ అన్నారు. -
12న పట్నాలో విపక్షాల కీలక భేటీ!
పట్నా/కోల్కతా: కేంద్రంలో అధికార బీజేపీని ఓడించడమే లక్ష్యంగా విపక్షాలను ఉమ్మడి వేదికపైకి తీసుకొచ్చేందుకు బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) అగ్రనేత నితీశ్ కుమార్ తన కార్యాచరణను వేగవంతంగా చేశారు. తమతో కలిసివచ్చే పార్టీల ముఖ్యనాయకులతో రాజధాని పట్నాలో కీలక భేటీ నిర్వహించాలని ఆయన ఇప్పటికే నిర్ణయించారు. ప్రతిపక్షాల సమావేశం వచ్చే నెల 12న జరిగే అవకాశం ఉందని నితీశ్ కుమార్కు సన్నిహితుడైన బిహార్ మంత్రి విజయ్కుమార్ చౌదరి సోమవారం చెప్పారు. భేటీ తేదీ దాదాపు ఖరారైనట్లేనని అన్నారు. బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నీ హాజరవుతాయని భావిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతిపక్షాలు కలిసికట్టుగా పనిచేస్తే 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించడం చాలా తేలిక అని అభిప్రాయపడ్డారు. విపక్ష కూటమి ఏర్పాటుకు నితీశ్ కుమార్ చొరవ తీసుకుంటున్నారని తెలిపారు. హాజరుకానున్న మమతా బెనర్జీ ఈ భేటీకి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత హాజరయ్యే అవకాశం ఉందని టీఎంసీ నేత చెప్పారు. ప్రతిపక్ష కూటమి ఏర్పాటుతోపాటు బీజేపీ వ్యతిరేక పోరాటాన్ని బలోపేతం చేయడానికి ఆమె సలహాలు సూచనలు ఇస్తారని వెల్లడించారు. పట్నాలో ప్రతిపక్షాల కీలక సమావేశం ఏర్పాటు చేయాలన్న సూచన తొలుత మమత నుంచి రావడం విశేషం. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బలంగా ఉన్నచోట తాము ఆ పార్టీకే మద్దతు ఇస్తామని మమత గతంలో అన్నారు. -
మిడ్ డే మీల్లో పాము.. 100 మంది విద్యార్థులకు అస్వస్థత
పాట్నా: బిహార్లోని ఓ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో పాము కనిపించడం స్థానికంగా కలకలం సృస్టించింది. అప్పటికే ఆహారాన్ని తిన్న పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అరారియాలోని పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో భాగంగా పిల్లలందరికీ సిబ్బంది కిచిడీ వడ్డించారు. ఈ క్రమంలో ఓ అబ్బాయికి వడ్డించిన ప్లేట్లో పాము కనిపించింది. వెంటనే ఆ ఆహారాన్ని పడవేయగా.. అప్పటికే భోజనం చేసిన పిల్లల ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. కొందరు పిల్లలు వాంతులు చేసుకున్నారు. విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ఆందోళన చేశారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆహారం తిన్న తర్వాత 100 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారని అధికారులు తెలిపారు. వీరిలో ఆరోగ్యం విషమంగా ఉన్న 25 మంది పిల్లల్ని ఆసుపత్రిలో చేర్చినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ పిల్లల ఆరోగ్యం కూడా నిలకడగానే ఉన్నట్లు వెల్లడించారు. చదవండి:శునకాన్ని చిన్నపాటి కొమ్మతో అదిలించాడు..అంతే అది రెచ్చిపోయి... స్థానిక సమాచారం ప్రకారం.. మధ్యాహ్నం భోజనం పాఠశాల బయట వంట చేసి దానికి ఓ సప్లయర్ తీసుకువస్తాడు. పాఠశాల యాజమాన్యం తప్పిదం ఏమీ లేదని స్థానిక నాయకులు తెలిపారు. కాగా ఛప్రాలోని పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో మే18న బల్లి కనిపించిన ఘటన మరవకముందే ఈ ఘటన జరగడం గమనార్హం చదవండి:బోగీలను వదిలి రైలింజన్ పరుగులు! -
కేంద్రంతో వివాదంలో మా మద్దతు మీకే
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ప్రభుత్వాధికారుల అజమాయిషీ విషయంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు తమ పూర్తి మద్దతు ఉంటుందని జేడీయూ నేత, బిహార్ సీఎం నితీశ్కుమార్ భరోసా ఇచ్చారు. ఆదివారం నితీశ్ ఢిల్లీలో కేజ్రీవాల్ను ఆయన నివాసంలో కలిశారు. ఆయన వెంట బిహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కూడా ఉన్నారు. ఢిల్లీలోని ప్రభుత్వాధికారులపై అజమాయిషీ రాష్ట్ర ప్రభుత్వానిదేనంటూ ఈనెల 11న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడం, ఆ తీర్పును పూర్వపక్షం చేసేలా కేంద్రం శుక్రవారం ఆర్డినెన్స్ జారీ చేయడం తెలిసిందే. నితీశ్తో చర్చల అనంతరం సీఎం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. ఆర్డినెన్స్ స్థానంలో కేంద్రం ప్రవేశపెట్టే బిల్లును రాజ్యసభలో తిప్పికొట్టేందుకు మద్దతివ్వాలంటూ అన్ని ప్రతిపక్ష పార్టీల నేతలను కలిసి కోరుతానన్నారు. రెండు, మూడు రోజుల్లో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్లను కలుస్తానన్నారు. ప్రతిపక్ష పార్టీలతో మాట్లాడాలంటూ నితీశ్ కుమార్కు కూడా విజ్ఞప్తి చేశానన్నారు. -
కూటమిపై విపక్షాల భేటీలో చర్చిస్తాం: నితీశ్
పాట్నా: 2024లో కేంద్రంలో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు చేతులు కలిపి, బలమైన కూటమిగా ఏర్పడాల్సిన అవసరం ఉందని బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) అగ్రనేత నితీశ్ కుమార్ శనివారం చెప్పారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక విపక్ష నేతల భేటీ జరుగుతుందని తెలిపారు. ప్రధానంగా విపక్షాల ఐక్యత, కూటమి ఏర్పాటుపై విస్తృతంగా చర్చించనున్నట్లు వివరించారు. కొన్ని పార్టీల నాయకులు ప్రస్తుతం కర్ణాటక ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా ఉన్నారని, ప్రతిపక్షాల సమావేశ వేదికను ఇంకా ఖరారు చేయలేదని, బిహార్ రాజధాని పాట్నాలో ఈ భేటీ జరిగితే తాను సంతోషిస్తానని అన్నారు. పాట్నాలో నిర్వహించాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనకు సూచించారని గుర్తుచేశారు. విపక్షాలకు ఏకం చేయడమే ధ్యేయంగా ఇప్పటికే వివిధ పార్టీల ముఖ్య నేతలతో మాట్లాడానని, త్వరలో మరికొన్ని బీజేపీయేతర పార్టీల నాయకులను కలిసి చర్చిస్తానని వెల్లడించారు. -
Bihar: నితీశ్ కుమార్పై దాడికి యత్నం!
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్పై సోమవారం దాడికి యత్నం జరిగింది. ఔరంగాబాద్ జిల్లాలో సమాధాన్ యాత్ర సందర్బంగా సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. విరిగిన కుర్చీ ముక్కను సీఎం నితీశ్పైకి విసిరేశాడు ఓ యువకుడు. అయితే టైంకి ఆయన ఆగిపోవడంతో.. అది పక్కన పడింది. వెంటనే అది గమనించిన ఆయన పక్కనే ఉన్న సిబ్బంది అప్రమత్తమై ఆయన్ని రౌండప్ చేసి ముందుకు తీసుకెళ్లారు. దాడికి పాల్పడిన వ్యక్తి వెంటనే అక్కడి నుంచి పరుగులు అందుకున్నాడు. ప్రజలతో ఆయన మమేకమై మాట్లాడుతున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఓ యువకుడు ఈ దాడికి పాల్పడగా.. పారిపోయిన ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భద్రతా ఉల్లంఘనలకు గానూ అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దాడి యత్నానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. #WATCH | Bihar: A part of a broken chair was hurled towards Bihar CM Nitish Kumar during Samadhan Yatra in Aurangabad. pic.twitter.com/MqeR6MLnFR — ANI (@ANI) February 13, 2023 -
చావనైనా చస్తా.. కానీ బీజేపీతో మాత్రం చేతులు కలపను..
పాట్నా: బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను చావనైనా చస్తా గానీ, మరోసారి బీజేపీతో చేతులు కలిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. వాళ్లది బోగస్ పార్టీ అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తేజస్వీ యాదవ్ తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్పై కేసు పెట్టి కమలం పార్టీ ఏం సాధించిందని నీతిశ్ నిలదీశారు. 'మేం అటల్ బిహారీ వాజ్పేయీ ఫాలోవర్లం. ఆయనతో అంతా బాగుండేది. 2017లో బీజేపీతో జట్టుకట్టాం. తర్వాత విడిపోయాం. నేను సీఎం కావాలనుకోలేదు. బీజేపీ ఎక్కువ సీట్లు గెలిచింది కాబట్టి వాళ్లనే సీఎం పదవి చేపట్టమన్నా. కానీ నన్ను బలవంతంగా ముఖ్యమంత్రిని చేశారు. ఆ తర్వాత ఎన్నికల్లో మేం ఎలా ఓడిపోయామో మా పార్టీ నేతలు వివరించారు. మా ప్రజల ఓట్లతో వాళ్లు గెలిచారు. మళ్లీ ఎన్నికలు జరిగితే అప్పుడు బీహార్ ప్రజలంటే ఏంటో వాళ్లకు తెలుస్తుంది.' అని నితీశ్ అన్నారు. '2005లో రెండు సార్లు ఎన్నికలు జరిగాయి. బీజేపీ ఎన్ని సీట్లు గెలిచింది. 2010లో ఎన్ని గెలిచింది. అప్పుడు ముస్లిం ఓటర్లు కూడా ఆ పార్టీకి ఓటు వేశారు. 2015లో మాతో విడిపోయాక ఆ పార్టీ ఎన్ని స్థానాల్లో గెలిచింది? ఈసారి మా ఓట్లు వేయించుకుని మమ్మల్నే ఓడించింది.' అని నితీశ్ పేర్కొన్నారు. తమకు అటల్ జీ, అద్వానీ అంటే అభిమానమేనని, కానీ ఇప్పుడున్న బీజేపీ పూర్తిగా వేరు అని నితీశ్ వివరించారు. ఈ నాయకులు వచ్చాక మొత్తం మారిందన్నారు. స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన వారిని మర్చిపోవడం తగునా? అని నితీశ్ వ్యాఖ్యానించారు. 2024లో బిహార్లో 34 ఎంపీ సీట్లు గెలుస్తామని చెబుతున్న బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని నితీశ్ జోస్యం చెప్పారు. మరోవైపు తాము మరోసారి జేడీయూతో పొత్తు పెట్టకోవద్దని బిహార్ బీజేపీ తీర్మానించింది. నితీశ్కు మరోసారి మోసం చేసే అవకాశం ఇవ్వమని చెప్పింది. చదవండి: భారత్ జోడో యాత్ర లక్ష్యం నెరవేరింది.. మంచులోనే రాహుల్ ప్రసంగం -
జనాభాను నియంత్రించలేం
పాట్నా: జనాభా పెరుగుదలను అరికట్టే విషయంలో బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) అధినేత నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తమ రాష్ట్రంలో స్త్రీలు నిరక్షరాస్యులని, పురుషుల్లో నిర్లక్ష్యం ఎక్కువని, అందుకే జనాభా పెరుగుదలను నియంత్రించలేమని తేల్చిచెప్పారు. సమాధాన్ యాత్రలో భాగంగా ఆయన ఆదివారం వైశాలీలో బహిరంగ సభలో ప్రసంగించారు. మహిళలు చదువుకుంటే జనాభా తగ్గుతుందని, ఇదే వాస్తవమని అన్నారు. గర్భం రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అక్షరాస్యులైన మహిళలకు తెలుస్తుందని వెల్లడించారు. జనాభా నియంత్రణపై పురుషులు సైతం దృష్టి పెట్టడం లేదని ఆక్షేపించారు. ఎక్కువ మంది పిల్లలను కనొద్దన్న ఆలోచన వారిలో ఉండడం లేదన్నారు. నితీశ్ కుమార్ వ్యాఖ్యలను ప్రతిపక్ష బీజేపీ నేత సామ్రాట్ చౌదరి తప్పుపపట్టారు. బిహార్ ప్రతిష్టను దెబ్బతీసేలా నితీశ్ మాట్లాడారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి పదవికి ఉన్న గౌరవాన్ని దిగజార్చేలా వ్యవహరించారని ట్విట్టర్లో పేర్కొన్నారు. -
బిహార్ కులకలం
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఏ ఇతర పార్టీ చేయని సాహసానికి పూనుకున్నారు. రాష్ట్రంలో కులగణనకి శ్రీకారం చుట్టారు. బడుగు, బలహీన వర్గాలకు శాస్త్రీయ విధానంలో సంక్షేమ పథకాలను అమలు చేయాలంటే కులాలు లెక్కలు పక్కాగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ ప్రక్రియను ప్రారంభించారు. రెండు దశలుగా సాగే ఈ ప్రక్రియ కోసం ప్రత్యేకంగా ఒక మొబైల్ అప్లికేషన్ను రూపొందించారు. దేశ ప్రయోజనాల కోసమే కులగణనను చేపడుతున్నామని, ఓబీసీల అసలు లెక్కలు ఎంతో తేల్చాలన్నదే తమ ఉద్దేశమని నితీశ్ కుమార్ బయటకి చెబుతున్నప్పటికీ రాజకీయ లబ్ధి కోసమే ఆయన ఈ సంక్లిష్ట ప్రక్రియను మొదలు పెట్టారన్న విమర్శలు మొదలయ్యాయి. కులగణనపై వివిధ వర్గాల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. దేశంలో సామాజిక న్యాయం జరగాలంటే, సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందాలంటే కులాల వారీగా జనాభా లెక్కలు చేపట్టాల్సిందేనని ఒక వర్గం గట్టిగా పట్టుబడుతోంది. ఓబీసీలకు కేటాయించిన కోటా వారికి సమానంగా పంపిణీ చేయడం కోసం నియమించిన రోహిణి కమిషన్ ఓబీసీల్లో 2,633 కులాలు ఉన్నాయని తేల్చింది. అయితే ప్రస్తుతం మన దేశంలో అమలవుతున్న ఓబీసీల రిజర్వేషన్లలో ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వార్డ్ కేస్ట్స్ (ఈబీసీ)లకే అమలవుతున్నాయి. మరోవైపు 21 శతాబ్దంలో కూడా కులాల వారీగా జనాభా లెక్కిస్తే సమాజంలో మరిన్ని చీలికలు వస్తాయని మరో వర్గం వాదనగా ఉంది. ఇంకా కులాల కుంపట్లలోనే మగ్గిపోతూ ఉంటే గ్లోబల్ సూపర్ పవర్గా భారత్ ఎదిగే అవకాశాలకు గండిపడుతుందనే అభిప్రాయాలున్నాయి. ఎందుకీ కులగణన? స్వాతంత్య్రానంతరం ఇప్పటివరకు కులాలవారీగా జనాభా లెక్కింపు చేపట్టలేదు. 1990లో కేంద్రంలో జనతాదళ్ ఆధ్వర్యంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించింది. జనాభా ప్రాతిపదిక అంటూ ఏమీ లేకుండా 27% రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం 1992 నుంచి అమలవుతోంది. ఇప్పటివరకు మన దగ్గరున్న కులాల లెక్కలకు 1931 నాటి గణాంకాలే ఆధారం. వాటి ప్రకారం జనాభాలో ఓబీసీలు 52 శాతం! పదేళ్లకోసారి జరిగే జనాభా లెక్కింపులో ఎస్సీ, ఎస్టీల జనాభాను లెక్కిస్తున్నారు. జనాభా ప్రాతిపదికన వారికి రిజర్వేషన్లున్నాయి. అందుకే తమకూ అలాగే రిజర్వేషన్లను పెంచాలని ఓబీసీలు డిమాండ్ చేస్తున్నారు. కుల సమీకరణలు అధికంగా ఉన్న బిహార్లో ఓబీసీలే కీలకం. ఓబీసీ నాయకుడైన నితీశ్ మొదట్నుంచి కులగణనకు మద్దతుగా ఉన్నారు. ఎన్డీయే నుంచి బయటకు వచ్చాక దాన్ని ఆచరణలో పెట్టి రాజకీయ వేడిని పెంచారు. ఒక్కసారి చరిత్రలోకి చూస్తే.. భారత దేశంలో మొట్టమొదటి సారిగా బ్రిటిష్ ప్రభుత్వం 1871లో కులగణన చేపట్టింది. మన దేశంలో ఉన్న విభిన్న వర్గాల ప్రజల్ని అర్థం చేసుకోవడానికే ఈ ప్రక్రియ మొదలు పెట్టింది. అప్పట్లో సేకరించిన సమాచారం ఆధారంగా కులాలకు ప్రాధాన్యతా క్రమాలను నిర్దేశించింది. అలా మొదలు పెట్టిన కులగణన 1931లో చివరిసారిగా చేశారు. ఆ నాటి జనాభా గణాంకాల ప్రాతిపదికగానే మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించారు. స్వాంతంత్య్రానంతరం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీలన్నీ కులగణనకు దూరంగా ఉన్నాయి. పదేళ్లకి ఒకసారి చేసే జనాభా లెక్కింపులో ఎస్సీ, ఎస్టీల డేటా సేకరణకు మాత్రమే పరిమితమయ్యారు. 2011లో యూపీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా సామాజిక, ఆర్థికంగా వెనుకబడిన కులాల వివరాలను కూడా సేకరించింది. కానీ వాటిని విడుదల చేయలేదు. ప్రస్తుతం కేంద్రంలో సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రి ప్రతిమ భూమిక యూపీఏ హయాంలో జరిగిన కులగణన సరిగా జరగలేదని, అదంతా తప్పులతడకగా సాగిందని చెబుతున్నారు. ప్రస్తుతమున్న పరిస్థితులకు ఆ డేటా పాతబడిపోయిందని వివరించారు. లోక్సభ ఎన్నికలపై ప్రభావం ఎంత ? బిహార్లో కులగణన పూర్తయి లోక్సభ ఎన్నికల కంటే ముందే నివేదిక వస్తే నితీశ్ కుమార్, తేజస్వి యాదవ్లకే అత్యధికంగా లాభం చేకూరే అవకాశాలే కనిపిస్తున్నాయి. బిహార్లో ఓబీసీల్లో మరింతగా వెనుకబడిన వారైన అత్యంత వెనకబడిన తరగతులు(ఈబీసీ), దళితుల్లో మరింత అణగారిన మహాదళితుల కార్డుతో కొత్త సామాజిక సమీకరణలకి తెరతీసిన నితీశ్ రాజకీయంగా లబ్ధి పొందుతూ వస్తున్నారు. వీరి వాస్తవ సంఖ్య వెల్లడైతే ఓటు బ్యాంకు రాజకీయాల్లో ఆయన పై చేయి సాధించవచ్చు. మహారాష్ట్ర, ఒడిశా వంటి రాష్ట్రాలు, ఎస్పీ, బీఎస్పీ, డీఎంకే వంటి పార్టీలు కులగణనకు మద్దతుగా ఉండడంతో దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియ చేపట్టాలన్న స్వరం పెరుగుతుంది. ఇప్పుడు బిహార్లో ఓబీసీ జనాభా ఎంత ఉందో వాస్తవాలు వెల్లడైతే వారి ఓటు బ్యాంకే ప్రధానంగా కలిగిన ప్రాంతీయ పార్టీలు బలపడతాయి. ఇది జాతీయ స్థాయిలో ప్రధాన పార్టీలైన బీజేపీకి, కాంగ్రెస్కు కూడా ఎదురు దెబ్బగా పరిణమిస్తుంది. అంతే కాకుండా దేశంలో మరోసారి మండల్ వర్సెస్ కమండల్ రాజకీయాలకు తెరలేవచ్చు. 1990 దశకంలో బీజేపీ నేత అద్వానీ రథయాత్రకు కౌంటర్గా మండల్ కమిషన్ నివేదికతో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించడం దేశవ్యాప్తంగా హింసకు దారి తీసింది ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలను మినహాయించి మిగిలిన కులాల జనగణన సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఇప్పుడు నితీశ్ కుమార్ చేపట్టిన ప్రక్రియ జాతీయ రాజకీయాలను ఎలాంటి మలుపులు తిప్పుతుందో వేచి చూడాల్సిందే. – సాక్షి, నేషనల్డెస్క్ -
‘మీ నవ భారత జాతిపిత దేశానికి ఏం చేశారో చెప్పండి?’
పట్నా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని నవ భారత జాతిపితగా మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత ఫడ్నవీస్ అభివర్ణించిన విషయం తెలిసింది. ఈ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్. ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. నవీన భారత జాతి పిత దేశానికి ఏం చేశారని ప్రశ్నించారు. ‘వారు దేశ స్వాతంత్య్రం కోసం పోరాడలేదు. ఆర్ఎస్ఎస్ కూడా స్వాతంత్య్ర పోరాటం చేయలేదు. అయినా, నవీన భారత జాతిపితగా పేర్కొన్నట్లు విన్నాం. అసలు నవీన భారత్కు సరికొత్త జాతి పిత ఏం చేశారు? ’ అనిఘాటుగా స్పందించారు నితీశ్ కుమార్. రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటిస్తే తనకు ఎటువంటి సమస్య లేదని పేర్కొన్నారు నితీశ్. తాను ప్రధాని కావాలని కోరుకోవడం లేదని పునరుద్ఘాటించారు. అన్ని మిత్ర పక్షాలతో మాట్లాడి వారు ఈ అంశాన్ని ప్రకటించాలని, ప్రస్తుతం నేతలంతా భారత్ జోడో యాత్రలో బిజీగా ఉన్నారని గుర్తు చేశారు. బిహార్ విద్యాశాఖలో ఉద్యోగులకు నియామక పత్రాలు అంద జేసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. మరోవైపు.. మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే సైతం అమృత ఫడ్నవీస్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీతో ఎవరినీ పోల్చలేమని స్పష్టం చేశారు. ‘జాతిపితతో ఎవరినీ పోల్చలేం. వారి(బీజేపీ) సరికొత్త భారత్ కేవలం కొద్ది మంది ధనవంతుల కోసం మాత్రమే ఏర్పడింది. మిగిలిన ప్రజలు ఇంకా పేదరికంలోకి వెళ్లారు. క్షుద్భాతతో అలమటిస్తున్నారు. ఇలాంటి సరికొత్త ఇండియా మాకు అవసరం లేదు’అని స్పష్టం చేశారు. #WATCH | They had nothing to do with the fight for Independence. RSS didn't have any contribution towards the fight for Independence...we read about the remark of 'New father of nation'...what has the 'new father' of 'new India' done for nation?: Bihar CM Nitish Kumar (31.12) pic.twitter.com/5RdJmrasIP — ANI (@ANI) January 1, 2023 ఇదీ చదవండి: ఆ వ్యాఖ్య ప్రధాని మోదీని అవమానించడమే: సంజయ్ రౌత్ ధ్వజం -
బిహార్ సీఎం నితీశ్ దగ్గర ఎంత డబ్బు ఉందో తెలుసా?
పాట్నా: బిహార్ సీఎం నితీశ్ కుమార్ తన ఆస్తుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లో పొందుపరిచారు. వీటి ప్రకారం ఆయన వద్ద మొత్తం రూ.75.53 లక్షలు విలువ చేసే స్థిరాస్థులు చరాస్థులు ఉన్నాయి. గతేడాదితో పోల్చితే ఈ మొత్తం రూ.18,000 పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వ వైబ్సైట్లోని వివరాల ప్రకారం నితీశ్ కుమార్ వద్ద రూ.28,135 క్యాష్ ఉంది. బ్యాంకుల్లో మరో రూ.51,586 డిపాజిట్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సహా మంత్రులందరూ తమ ఆస్తులకు సంబంధించిన వివరాలను ప్రతి ఏటా డిసెంబర్ చివర్లో ప్రభుత్వ వెబ్సైట్లో పొందుపరచాలని సీఎం నితీశ్ కొత్త రూల్ పెట్టారు. ఈ నేపథ్యంలో ఆయనతో పాటు మంత్రులంతా తమ ఆస్తుల వివరాలను డిసెంబర్ 31న పొందుపరిచారు. అయితే సీఎం కంటే చాలా మంది మంత్రులు సంపన్నులుగా ఉన్నారు. డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ వద్ద రూ.75వేల నగదు(మార్చి 31,2022 వరకు) ఉంది. ఆయన భార్య రాజశ్రీ వద్ద రూ.1.25లక్షల నగదు ఉంది. తేజస్వీ సోదరుడు, బిహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ వద్ద రూ.1.7 లక్షల క్యాష్ ఉంది. ఆయన స్థిరాస్థులు, చరాస్థుల విలువ మాత్రం రూ.3.2కోట్లుగా ఉంది. చదవండి: హై రిస్క్ దేశాల నుంచి వచ్చినవారికి అక్కడ వారం రోజుల క్వారంటైన్ -
తాగి చనిపోతే పరిహారం ఇవ్వాలా?: సీఎం నితీశ్
పాట్నా: బిహార్ సరన్ జిల్లాలో కల్తీ మద్యం తాగి మరణించిన వారి సంఖ్య 60కి పెరిగింది. ఈ విషయంపై అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. కల్తీ మద్యం తాగి చనిపోయిన వారికి ఎలాంటి పరిహారం ఇచ్చే ప్రసక్తే లేదని సీఎం నితీశ్ కుమార్ తేల్చిచెప్పారు. అలాంటి వారిపట్ల సానుభూతి చూపాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. మద్యం తాగితే చనిపోతారని, తాగాలని ప్రోత్సాహించే వారు మీకు ఎలాంటి మేలు చేయరని సీఎం సభలో అన్నారు. #WATCH | "No compensation will be given to people who died after drinking...We have been appealing- if you drink, you will die...those who talk in favour of drinking will not bring any good to you...", said CM Nitish Kumar in assembly earlier today. (Source: Bihar Assembly) pic.twitter.com/zquukNtRIA — ANI (@ANI) December 16, 2022 అయితే నితీశ్ కుమార్ వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆయన తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బిహార్లో కల్తీ మద్యం కారణంగా పదుల సంఖ్యలో చనిపోతున్నారు. రాష్ట్రంలో మద్య నిషేధం 2016 నుంచి అమలు అవుతున్నప్పటికీ.. అక్రమంగా కొందరు సారా విక్రయిస్తున్నారు. ఇది తాగి అమాయకులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మద్యం తాగితే చస్తారని సీఎం వ్యాఖ్యానించారు. చదవండి: షాకింగ్..12 ఏళ్లకే గుండెపోటు..స్కూల్ బస్సులోనే కుప్పకూలిన విద్యార్థి.. -
‘సారా తాగితే చస్తారు’.. కల్తీ మద్యం మరణాలపై సీఎం నితీశ్
పట్నా: మద్య నిషేధం అమల్లో ఉన్న బిహార్లో కల్తీ సారా మరణాలు కలకలం సృష్టిస్తున్నాయి. శరన్ జిల్లాలో బుధవారం కల్తీ సారా కాటుకు 21 మంది బలవగా.. మరో 9 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ప్రాణాలు కోల్పోయారు. వారంతా మంగళవారం ఉదయం అస్వస్థతకు గురయ్యారు. ఈ అంశం రాష్ట్ర అసెంబ్లీని కుదిపేసింది. సారాను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని విపక్ష బీజేపీ సభ్యులు ఆరోపించారు. వారిపై సీఎం నితీశ్ కుమార్ మండిపడ్డారు. తాగిన వారు చస్తారు.. జాగ్రత్త కల్తీసారా అంశంపై అసెంబ్లీ వేదికగా విపక్షాలపై మడ్డిపడ్డ సీఎం నితీశ్ కుమార్ తాజాగా మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే మద్యం తాగుతారో వారు చనిపోతారు అంటూ పేర్కొన్నారు. ఛాప్రా కల్తీ సారా ఘటనపై మీడియాతో మాట్లాడారు నితీశ్. ‘లిక్కర్ తాగే వారు చనిపోతారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. మేము పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. బాపు(మహాత్మా గాంధీ) ఏం చెప్పారో మీకు తెలుసు. ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు ఏం చెబుతున్నాయి? మద్యం ప్రమాదకరమని ఇంటింటికి తెలియజేస్తున్నాం. చాలా కాలంగా కల్తీ మద్యం తాగి ప్రజలు చనిపోతున్నారు. ఇది దేశవ్యాప్తంగా జరుగుతోంది. ప్రజలే ఎక్కువ అప్రమత్తంగా ఉండాలి. నిషేధం ఉన్న చోట లిక్కర్ అమ్ముతున్నారంటే.. అందులో ఏదో ఉన్నట్లు అర్థం. కొందరు తెలిసి తప్పులు చేస్తున్నారు.’ అని పేర్కొన్నారు నితీశ్ కుమార్. ఇదీ చదవండి: మీరు తాగొచ్చారు.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై ఆగ్రహంతో ఊగిపోయిన సీఎం -
మీరు తాగొచ్చారు.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై ఆగ్రహంతో ఊగిపోయిన సీఎం
పాట్నా: బిహార్ సీఎం నితీశ్ కుమార్ అసెంబ్లీలో ఆగ్రహంతో ఊగిపోయారు. సభలో ఆందోళనలు చేపట్టిన ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీరంతా తాగొచ్చారని గట్టిగా అరిచారు. దీంతో అసెంబ్లీలో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బిహార్లో 2016లోనే మద్యాన్ని నిషేధించారు. అయితే కల్తీ మద్యం మాత్రం విచ్చలవిడిగా దొరుకుతోంది. ఇది తాగి ఛప్రా సరన్ జిల్లాలో 17 మంది చనిపోయారు. ఇందులో ఆరుగురు మంగళవారమే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయంపైనే ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు సీఎంపై విమర్శలు గుప్పించారు. కల్తీ మద్యాన్ని అరికట్టలేకోయిన సీఎం అసెంబ్లీ ద్వారం వద్ద నిల్చొని ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సభలో నితీశ్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రతిపక్ష నేతల తీరుపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం జరిగింది? కాస్త శాంతియుతంగా ఉండండి. మీరంతా తాగి వచ్చినట్లు ఉన్నారు. అని ఫైర్ అయ్యారు. సీఎం వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యేలు మళ్లీ నిరసనకు దిగారు. Liquor Ban isn't working... Illegal trader's are selling it Openly... Accept it or Not But Mr. Nitish Kumar is Pushing Bihar Back into JungleRaj.#NitishKumar #Bihar #GOAT𓃵 #NewHigh4TNSports#Messi𓃵 pic.twitter.com/oZ0hC97BhW — Suhani Anand (@SuhaniAnand17) December 14, 2022 ఛప్రా సరన్ జిల్లాలో మంగళవారం చనిపోయిన ఆరుగురి మరణానికి ఇంకా కారణం తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. వీరంతా కల్తీ మద్యం తాగే చనిపోయారనే విషయాన్ని మాత్రం ధ్రువీకరించలేదు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తామన్నారు. కల్తీ మద్యం ఘటనలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: కేబినెట్ మంత్రిగా ఉదయనిధి స్టాలిన్ ప్రమాణం -
నితీష్ కుమార్ రాజకీయ వారసుడు అతడే! హింట్ ఇచ్చిన బిహార్ సీఎం
పాట్నా: బిహార్ సీఎం నితీశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ వారసుడు ఎవరో సూత్రప్రాయంగా తెలిపారు. డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవే 2025 అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమిని ముందుండి నడిపిస్తారని స్పష్టం చేశారు. అధికార ఎమ్మెల్యేలతో మంగళవారం జరిగిన సమావేశంలో ఈమేరకు వ్యాఖ్యానించారు. నేను ప్రధాని అభ్యర్థిని కాదు, ముఖ్యమంత్రి అభ్యర్థినీ కాదు. బీజేపీని ఓడించడమే నా లక్ష్యం. అని నితీశ్ అన్నారు. తేజస్వీ యాదవ్ను ప్రోత్సహించాలని అధికార కూటమి ఎమ్మెల్యేలకు సూచించారు. సోమవారం కూడా నితీశ్ ఈ విషయంపై పలుమార్లు హింట్ ఇచ్చారు. తేజస్వీ యాదవ్తో కలిసి నలందలో డెంటల్ కాలేజీ ప్రారంభోత్సవానికి వెళ్లిన ఆయన మాట్లాడుతూ.. మా ప్రభుత్వం చాలా చేస్తోంది. భవిష్యత్తులో ఇంకా ఏమైనా చేయాల్సినవి ఉంటే వాటిని తేజస్వీ యాదవ్ పూర్తి చేస్తారు. మమ్మల్ని విడదీయాలనుకుంటున్న వారు ఆ ప్రయత్నాలు మానుకోండి. మేం కలిసే ఉంటాం. ఎలాంటి విభేదాలు ఉండవు. అని వ్యాఖ్యానించారు. దీంతో తేజస్వీ యాదవ్ను నితీశ్ తన రాజకీయ వారసుడిగా ప్రకటించారని ప్రచారం ఊపందుకుంది. ఆ మరునాడే ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో నితీశ్ మరోమారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దీనికి మరింత బలాన్ని చేకూర్చింది నితీశ్ వ్యాఖ్యలపై తేజస్వీ స్పందించారు. ప్రస్తుతం తన దృష్టంతా 2024 సార్వత్రిక ఎన్నికలపైనే అని, ఆ తర్వాతే మిగతా విషయాల గురించి ఆలోచిస్తానని స్పష్టం చేశారు. చదవండి: ఎన్సీపీ అధినేత శరద్ పవార్కు బెదిరింపులు.. మళ్లీ అతడే..! -
‘రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి ఎత్తివేయాలి’
పట్నా: దేశంలో రిజర్వేషన్లపైనున్న 50 శాతం పరిమితిని ఎత్తివేయాలని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు ఆర్థికంగా వెనుకబడిన వారికి 10% కోటాను సమర్థించడంపై నితీశ్ హర్షం వ్యక్తం చేశారు. రిజర్వేషన్లకు తాము ఎప్పుడూ అనుకూలమేనని ప్రకటించారు. ‘సుప్రీం కోర్టు తీర్పు చాలా న్యాయంగా ఉంది. రిజర్వేషన్లకు మేము ఎప్పుడూ అనుకూలమే. అయితే రిజర్వేషన్లపై 50% పరిమితిని ఎత్తివేయడానికి ఇదే సరైన సమయం. ఈ పరిమితి వల్ల ఓబీసీ, ఈబీసీలకు వారి జనాభాకి అనుగుణంగా అవకాశాలు రావడం లేదు’ అని అన్నారు. దేశవ్యాప్తంగా కులాల వారీగా జనాభా గణన చేపట్టాలని ఆయన పునరుద్ఘాటించారు. కుల గణన జాతీయ స్థాయిలో జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఇదీ చదవండి: షాకింగ్ రిపోర్ట్: కరోనాను మించిన వైరస్ తయారీలో పాక్-చైనా! -
సీఎం నితీశ్ కుమార్కు తప్పిన ప్రమాదం
పాట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న బోటు వంతెన పిల్లర్ను ఢీకొట్టినట్లు అధికారులు తెలిపారు. సీఎంతో పాటు ఆయనతో బోటులో ఉన్నవారంతా సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడినట్లు చెప్పారు. పాట్నా సమీపంలోని గంగానదిలో బోటు ప్రయాణం చేస్తున్న క్రమంలో శనివారం ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు. పాట్నాలోని ఛత్గట్ను పరిశీలించేందుకు బోటులో ప్రయాణించారు సీఎం నితీశ్. ఆయనతో పాటు పలువురు పార్టీ నేతలు, అధికారులు సైతం బోటులో ఉన్నారు. ఈ క్రమంలో జేపీ సేతు పిల్లర్ను బోటు ఢీకొట్టింది. అయితే, బోటు వేగం తక్కువగా ఉండటం వల్ల భారీ స్థాయిలో ఎలాంటి పగుళ్లు ఏర్పడలేదు. దీంతో నీటిలో మునిగిపోయే ప్రమాదం తప్పింది. బోటులో ఉన్న సీఎం నితీశ్తో పాటు మిగితా వారంతా క్షేమంగా బయటపడ్డారని అధికారులు తెలిపారు. Patna | Bihar CM Nitish Kumar's boat collided with a pillar of JP Setu during the inspection of Chhath Ghat situated on the bank of river Ganga today. All onboard the boat including the CM are safe. pic.twitter.com/ga8vusRtjH — ANI (@ANI) October 15, 2022 ఇదీ చదవండి: కశ్మీరీ పండిట్లే లక్ష్యంగా మళ్లీ రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఒకరు మృతి -
మా పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయాలట
సితాబ్ దియారా: తమ జేడీ(యూ) పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సలహా ఇచ్చాడని జేడీ(యూ) చీఫ్, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వెల్లడించారు. సామాజికవేత్త జయప్రకాశ్ నారాయణ్ జన్మస్థలి సితాబ్ దియారాలో పర్యటించిన నితీశ్ శనివారం అక్కడి మీడియాతో మాట్లాడారు. ‘ రెండు వారాల క్రితం ప్రశాంత్ కిశోర్ నా వద్దకు వచ్చారు. నేనేం అతడిని పిలవలేదు. జేడీయూను కాంగ్రెస్లో కలిపేస్తే మంచిదని నాలుగైదేళ్ల క్రితమే నాకు సలహా ఇచ్చాడు. ఇప్పడేమో చాలాసేపు ఏవోవో అంశాలు మాట్లాడుతున్నాడు. నాకప్పుడే అర్థమైంది ప్రశాంత్ బీజేపీ తరఫున పనిచేస్తున్నాడని ’ అని నితీశ్ చెప్పారు. ‘10–15 రోజుల క్రితం నితీశే నన్ను పిలిచారు. తన జేడీయూ పార్టీకి సారథ్యం వహించాలని కోరారు. నేను తిరస్కరించా. మళ్లీ జేడీయూలో చేరలేనని చెప్పా’ అని మంగళవారం ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించిన నాలుగు రోజులకే నితీశ్ స్పందించడం గమనార్హం. ఐ–ప్యాక్కు సారథ్యం వహిస్తూ 2018లో జేడీయూలో చేరిన ప్రశాంత్కు జాతీయ పౌరసత్వం సవరణ చట్టంపై నితీశ్తో అభిప్రాయ భేదాలొచ్చాయి. దీంతో పార్టీ నుంచి ప్రశాంత్ను బహిష్కరించారు. -
‘ప్రధాని’ ఆసక్తి లేదు: నితీశ్
న్యూఢిల్లీ: బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) నేత నితీశ్కుమార్ మంగళవారం ఆప్ నేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, సీపీఐ, సీపీఎం ప్రధాన కార్యదర్శులు డి.రాజా, సీతారాంలతో భేటీ అయ్యారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన సోమవారం దేశ రాజధానికి చేరుకోవడం తెలిసిందే. విపక్షాలన్నింటినీ ఒక్కతాటిపైకి తెచ్చే ప్రయత్నాల్లో భాగంగానే వారితో సమావేశమైనట్టు అనంతరం నితీశ్ మీడియాకు తెలిపారు. కాంగ్రెస్, వామపక్షాలతో పాటు ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఏకమై విపక్షాల సమష్టి శక్తిని చాటాల్సిన సమయం వచ్చిందన్నారు. అనంతరం సమాజ్వాదీ నేత ములాయంసింగ్ యాదవ్, పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ఐఎన్ఎల్డీ నేత ఓం ప్రకాశ్ చౌతాలా తదితరులను కూడా నితీశ్ కలిశారు. తనకు ప్రధాని కావాలని ఉందన్న వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు. ‘‘ఆ పదవికి నేను పోటీదారు కాను. దానిపై నాకు ఆసక్తీ లేదు’’ అని చెప్పుకొచ్చారు. విపక్షాలన్నింటినీ ఏకం చేయడమే తమ తొలి అజెండా తప్ప ప్రధాని అభ్యర్థిని నిర్ణయించడం కాదని ఏచూరి చెప్పారు. ప్రధాని అభ్యర్థి ఎవరన్నది సమయం వచ్చినప్పుడు తేలుతుందన్నారు. బీజేపీపై పోరులో నితీశ్ కలిసి రావడం దేశ రాజకీయాలకు గొప్ప శుభ సంకేతమని అభిప్రాయపడ్డారు. నితీశ్, కేజ్రీవాల్ భేటీ గంటన్నర పాటు సాగింది. విద్య, వైద్యం తదితర అంశాలతో పాటు ఆపరేషన్ లోటస్, విపక్షాల ఎమ్మెల్యేల కొనుగోలు తదితరాలపై చర్చించినట్టు కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణకోసం బీజేపీపై పోరాటానికి వామపక్షాలు, ప్రాంతీయ పార్టీలు ఒక్కతాటిపైకి రావాల్సిన సమయం వచ్చిందని రాజా అన్నారు. సోమవారం రాహుల్గాంధీతోనూ నితీశ్ భేటీ కావడం తెలిసిందే. 25న ‘బల ప్రదర్శన’ ర్యాలీ నితీశ్, కేసీఆర్, మమత హాజరు! సెప్టెంబర్ 25న హరియాణాలో ఐఎన్ఎల్డీ తలపెట్టిన ర్యాలీని విపక్షాల బల ప్రదర్శనకు వేదికగా మార్చాలని నితీశ్ భావిస్తున్నారు. దానికి ఎన్సీపీ అధినేత శరద్ పవార్, అఖిలేశ్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, అకాలీదళ్ నేత ప్రకాశ్సింగ్ బాదల్ తదితరులను ఐఎన్ఎల్డీ ఆహ్వానించింది. తెలంగాణ సీఎం కేసీఆర్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తదితరులకు కూడా ఆహ్వానాలు పంపుతామని పేర్కొంది. ఈ ర్యాలీలో విపక్ష నేతలంతా ఒకే వేదికపైకి వచ్చి పలు అంశాలపై లోతుగా చర్చిస్తారని చెప్పుకొచ్చింది. బీజేపీతో జనం విసిగిపోయారని చౌతాలా అన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక వాతావరణం స్పష్టంగా కన్పిస్తోందని చెప్పారు. -
ప్రధాని అభ్యర్థి కావాలని ఆశించడంలేదు : బీహార్ సీఎం నితీష్
-
బీజేపీని ఓడిద్దాం రండి
పట్నా: కేంద్రంలో బీజేపీని ఓడించడానికి ప్రతిపక్షాలన్నీ ఒక్కటి కావాలని జనతాదళ్(యునైటెడ్) సీనియర్ నాయకుడు, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పిలుపునిచ్చారు. దేశ ప్రజలు ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. పార్టీలన్నీ తమ మధ్యనున్న విభేదాలను పక్కనపెట్టి, ప్రజా సంక్షేమం కోసం చేతులు కలపాలని అన్నారు. శనివారం బిహార్ రాజధాని పాట్నాలో జేడీ(యూ) జాతీయ కార్యవర్గ సమావేశంలో నితీశ్ ప్రసంగించారు. ప్రతిపక్షాల ఐక్యత కోసం పనిచేయాలన్నదే తన ఏకైక లక్ష్యమని స్పష్టం చేశారు. బీజేపీయేతర పార్టీలను ఉమ్మడి వేదికపైకి తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలిపారు. విపక్షాలన్నీ కలిసి పోరాడితే 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీని కేవలం 50 సీట్లకే పరిమితం చేయొచ్చని అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకం చేయాల్సిన బాధ్యతను నితీశ్కు అప్పగిస్తూ జేడీ(యూ) జాతీయ కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అలాగే కాషాయ పార్టీ పాలనలో దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతోందని, దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని ఆరోపిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించారు. ప్రభుత్వ విధానాలు నచ్చకపోతే అసమ్మతి తెలియజేయడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని తీర్మానంలో ఉద్ఘాటించారు. అసమ్మతి తెలిపినవారిపై దేశద్రోహులుగా ముద్ర వేస్తున్నారని విమర్శించారు. మతోన్మాద బీజేపీకి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. ‘‘మైనార్టీలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. సమాజంలో అసహనం, తీవ్రవాదం పెరిగిపోతున్నాయి. దళితులు, గిరిజనులు వేధింపులకు గురవుతున్నారు’’ అని జేడీ(యూ) ఆందోళన వ్యక్తం చేసింది. మోదీకి ప్రత్యామ్నాయం నితీశ్ జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయ నేతగా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ను తెరపైకి తీసుకొచ్చేందుకు బిహార్లో అధికార కూటమిలోని జేడీ(యూ) ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. పార్టీ జాతీయ కార్యవర్గ, జాతీయ మండలి సమావేశాలు శనివారం పాట్నాలో ప్రారంభమయ్యాయి. రెండు రోజులపాటు జరుగున్న ఈ భేటీల్లో తొలిరోజు కీలక అంశాలపై చర్చించారు. నితీశ్ను ప్రధాని అభ్యర్థిగా అభివర్ణిస్తూ వేదిక వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ‘దేశ్ కా నేత కైసా హో.. నితీశ్ కుమార్ జైసా హో’ అంటూ జేడీ(యూ) కార్యకర్తలు నినదించారు. రేపటి నుంచి నితీశ్ ఢిల్లీ పర్యటన! 2024 ఎన్నికల్లో బీజేపీ ఢీకొట్టడానికి విపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో భాగంగా నితీశ్ ఈ నెల 5 నుంచి మూడు రోజులపాటు ఢిల్లీలో పర్యటించే అవకాశముంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా విపక్ష నాయకులతో ఆయన భేటీ కానున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్, హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓంప్రకాశ్ చౌతాలాతోపాటు కమ్యూనిస్ట్ నేతలతోనూ ఆయన సమావేశమవుతారని జేడీ(యూ) వర్గాలు తెలిపాయి. బిహార్లో బీజేపీతో తెగతెంపుల తర్వాత నితీశ్కు ఇదే తొలి ఢిల్లీ పర్యటన. మణిపూర్లో జేడీ(యూ)కు షాక్ బీజేపీలోకి ఐదుగురు ఎమ్మెల్యేలు జంప్ పట్నా/ఇంఫాల్: జేడీ(యూ)కు మణిపూర్లో పెద్ద షాక్ తగిలింది. ఆరుగురు ఎమ్మెల్యేలకు గాను, ఏకంగా ఐదుగురు శుక్రవారం అధికార బీజేపీలో చేరారు. వారి విలీనానికి స్పీకర్ ఆమోదం కూడా తెలిపారని అసెంబ్లీ కార్యదర్శి ప్రకటించారు. ఆ ఎమ్మెల్యేలకు సాదర స్వాగతం పలుకుతున్నట్టు ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్, బీజేపీ రాష్ట్ర చీఫ్ ఎన్.శారదాదేవి సాదర పేర్కొన్నారు. శనివారం ఢిల్లీలో విందు కార్యక్రమంలో సదరు ఎమ్మెలోయేలతో వారు భేటీ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పట్ల ప్రజల విశ్వాసానికి, ప్రేమకు ఎమ్మెల్యేల చేరిక సూచిక అని బీరేన్సింగ్ ఫేస్బుక్లో పోస్టు చేశారు. 60 సీట్లున్న మణిపూర్ అసెంబ్లీలో తాజా చేరికలతో బీజేపీ బలం 37కు పెరిగింది. ఎమ్మెల్యేలను కొనడమే పనా: నితీశ్ తాజా పరిణామాలపై జేడీ(యూ) నేత, బిహార్ సీఎం నితీశ్కుమార్ మండిపడ్డారు. ఎమ్మెల్యేలను కొనేయడం రాజ్యాంగబద్ధమేనా అని బీజేపీని నిలదీశారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను బుట్టలో వేసుకోవడమే పనిగా పెట్టుకుందని బీజేపీపై ధ్వజమెత్తారు. 2024 ఎన్నికల్లో అన్ని పార్టీలూ బీజేపీకి వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. బీజేపీలో చేరిన తమ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని మణిపూర్ జేడీ(యూ) అధ్యక్షుడు కుశ్ బీరేన్ చెప్పారు. వారి తీరు రాజ్యాంగ ఉల్లంఘనే అన్నారు. -
‘అదే జరిగితే 2024లో పిక్చర్ వేరేలా ఉంటుంది’
పాట్నా: మణిపూర్లో జేడీయూకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరటంతో ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బతగిలినట్లయింది. ఈ క్రమంలో బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు జేడీయూ అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్. ప్రతిపక్షాలు ఏకమైతే 2024లో పరిస్థితులు మరోస్థాయిలో ఉంటాయన్నారు. శనివారం సాయంత్రం తలపెట్టిన జేడీయూ రాష్ట్ర ప్రతినిధుల సమావేశానికి హాజరయ్యేందుకు మణిపుర్ జేడీయూకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారని, అయితే, ఆకస్మికంగా ఆ మరుసటి రోజునే బీజేపీలో చేరటం ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. ‘ఇది రాజ్యాంగబద్ధమేనా? కొద్ది నెలల క్రితం వారంతా బిహార్కు వచ్చారు. బీజేపీ ప్రవర్తిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారు. వారు అనుసరించిన తీరు ఎలాంటిది? దానర్థం ప్రతిపక్షం ఉండకూడదని కోరుకుంటున్నారు. ’ అని ఆరోపించారు. మరోవైపు.. జేడీయూ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ అలియాస్ లలన్ సింగ్ సైతం బీజేపీపై విమర్శలు గుప్పించారు. బీజేపీ స్వభావం మరోమారు బయపడిందన్నారు. ‘వారితో మేము కలిసి ఉన్నప్పటికీ అరుణాచల్ ప్రదేశ్లోనూ ఇదే చేశారు. ఇప్పుడు మేము కూటమి నుంచి బయటకి వచ్చేశాం. మరోమారు అలాగే చేశారు. 2024లోనే వారికి సరైన గుణపాఠం లభిస్తుంది. 2024 ఎన్నికలపై భయంతోనే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీ, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో ఇలాంటి వ్యూహాలు అమలు చేస్తున్నారు. కానీ, ప్రజలు వారిని గమనిస్తూనే ఉన్నారు. బిహార్లోనూ ప్రయత్నించినా సఫలం కాలేకపోయారు. ’అని పేర్కొన్నారు. ఇదీ చదవండి: నితీశ్కు ఊహించని షాక్.. బీజేపీలో చేరిన జేడీయూ ఎమ్మెల్యేలు.. -
అందుకే సీట్లు తక్కువొచ్చినా సీఎం పదవి: నితీశ్ కుమార్
పాట్నా: బిహార్లో బీజేపీకి టాటా చెప్పి తన పాత స్నేహితులతో కలిసి తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు నితీశ్ కుమార్. ఈ క్రమంలో బీజేపీ, జేడీయూ మధ్య మాటల యుద్ధం మొదలైంది. నితీశ్ కుమార్ అసలు సీఎం పదవికి తగిన వ్యక్తి కాదంటూ బీజేపీ నేతలు ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో 2020లో బీజేపీతో పోలిస్తే తనకు తక్కువ సీట్లు వచ్చినా ముఖ్యమంత్రి పదవి ఇవ్వటం వెనుకున్న కారణాలను బలపరీక్ష సందర్భంగా అసెంబ్లీ వేదికగా వెల్లడించారు నితీశ్ కుమార్. విపక్ష నేతలతో చేతులు కలిపి నితీశ్ ద్రోహం చేశారంటూ బీజేపీ చేసిన ఆరోపణలను తిప్పికొడుతూ పలు ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించారు. ‘ 2020 ఎన్నికల్లో బీజేపీతో పోలిస్తే తక్కువ సీట్లు వచ్చినా.. నేను ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు సిద్ధమయ్యాను. కానీ, సీఎం పదవిలో కొనసాగేందుకు నాపై తీవ్రమైన ఒత్తిడి ఉంది. నేనే ముఖ్యమంత్రినని వారు చెప్పారు. నాకు ముఖ్యమంత్రి పదవి వద్దని చెప్పాను. మీరు ఎక్కువ సీట్లు గెలిచారు.. మీ పార్టీ నుంచే ముఖ్యమంత్రి ఉండాలని సూచించాను. చివరకు అంగీకరించాను. కానీ, ఆ పదవిని ఒత్తిడిలో చేపట్టాను. నంద్ కిషోర్ యాదవ్ను స్పీకర్గా చేస్తారని నాకు చెప్పారు. పాత మిత్రుడని.. బావుంటుందని చెప్పాను. కానీ, అతను కాలేదు. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. ఓ వ్యక్తిని కింది స్థాయి నుంచి తీసుకొచ్చి కేంద్రంలోకి పంపిస్తే నాకే ద్రోహం చేశాడు.’ అని పేర్కొన్నారు నితీశ్. ముఖ్యమంత్రి రేసులో ఉన్న బీజేపీ నేతలు సుశీల్ కుమార్ మోదీ, ప్రేమ్ కుమార్ పేర్లను సైతం వెల్లడించారు. ఆర్జేడీ, కాంగ్రెస్లతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయటంపై బీజేపీ చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు నితీశ్ కుమార్. 2017లో ఆర్జేడీని వీడి బీజేపీతో చేతులు కలిపిన అంశాన్ని లేవనెత్తుతూ విమర్శలు చేయటంపై స్పష్టత ఇచ్చారు. ‘2017లో వారి నుంచి విడిపోయాను. మీరు చాలా ఆరోపణలు చేశారు. కానీ ఐదేళ్ల గడిచినా వారికి వ్యతిరేకంగా ఏమీ కనిపించలేదు.’ అని స్పష్టం చేశారు నితీశ్. ఇదీ చదవండి: Bihar Floor Test: బల పరీక్షలో నెగ్గిన నితీష్ ప్రభుత్వం.. బీజేపీపై అటాక్ -
బలపరీక్ష రోజే తేజస్వీకి షాక్.. ఆర్జేడీ నేతల ఇళ్లపై సీబీఐ దాడులు
పాట్నా: బిహార్లో నితీశ్ కూమార్ నేతృత్వంలోని మహా గట్బంధన్ ప్రభుత్వం బలపరీక్ష ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న కొన్ని గంటల ముందు ఆర్జేడీ సీనియర్ నేతల ఇళ్లపై దాడులు జరగటం సంచలనంగా మారింది. ముగ్గురు సీనియర్ నేతల నివాసాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ బుధవారం తనిఖీలు చేపట్టింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో రైల్వే శాఖ మంత్రిగా లాలూప్రసాద్ ఉన్న రోజుల్లో జరిగిన ‘ల్యాండ్ ఫర్ జాబ్స్’ కుంభకోణం దర్యాప్తులో భాగంగా తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. పాట్నాలోని ఆర్జేడీ ఎమ్మెల్సీ సునీల్ సింగ్ నివాసం సహా ఆర్జేడీ రాజ్యసభ ఎంపీ అహ్మద్ అష్ఫాఖ్ కరీమ్, ఆర్జేడీ మాజీ ఎమ్మెల్సీ సుబోధ్ రాయ్ నివాసాల్లో ఈ సోదాలు జరిగాయి. ‘ఈ సోదాలు ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారు. అందులో ఎలాంటి అర్థం లేదు. భయంతో మా ఎమ్మెల్యేలు వారితో చేరతారనే కారణంగా చేస్తున్నారు.’అని పేర్కొన్నారు ఎమ్మెల్సీ సునీల్ సింగ్. ముందే ట్వీట్.. దాడులకు కొన్ని గంటల ముందు ఆర్జేడీ అధికార ప్రతినిధి సీబీఐ దాడులపై ట్వీట్ చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. బిహార్లో అధికారం కోల్పోవటంపై బీజేపీ కోపంగా ఉందని, అందుకే సీబీఐ, కేంద్ర ఏజెన్సీలతో దాడులు చేపట్టేందుకు సిద్ధమైందన్నారు. బుధవారం కీలకమైన రోజుగా ఆయన పేర్కొనటం గమనార్హం. ఇదీ చదవండి: అవిశ్వాస తీర్మానం పెట్టినా.. రాజీనామా చెయ్యను! బీహార్ స్పీకర్ మొండిపట్టు -
‘అలా జరిగితే బలమైన ప్రధాని అభ్యర్థిగా నితీశ్ కుమార్’
పాట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎదుగుతారనే వాదనల నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఆర్జేడీ నేత, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్. విపక్షాలు పరిగణనలోకి తీసుకుంటే జేడీయూ నేత నితీశ్ కుమార్ తన సద్భావనతో బలమైన ప్రధాని అభ్యర్థిగా ఎదగగలరని పేర్కొన్నారు. బిహార్లో మహాకూటమి అధికారంలోకి రావటాన్ని జంగిల్ రాజ్యం తిరిగి వచ్చిందనే బీజేపీ వాదనలను తిప్పికొట్టారు తేజస్వీ యాదవ్. అలసిపోయి, నక్క ఏడుపులు ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ సహా ఇతర పక్షాలు కలిసి అధికారాన్ని ఏర్పాటు చేయటం ఐక్యతకు నిదర్శనమన్నారు. ‘చాలా ప్రతిపక్ష పార్టీలు దేశం ముందున్న పెద్ద సవాలును గుర్తించాయి. అది బీజెపీ ఆధిపత్యం. డబ్బు, మీడియా, ప్రభుత్వ ఏజెన్సీల బలంతో చలాయించే ఆధిపత్యాన్ని భారతీయ సమాజం, రాజకీయాల నుంచి తొలగించాలని నిర్ణయించుకున్నారు. వారు సహకార సమాఖ్య విధానంపై మాట్లాడుతున్నారు. ప్రాంతీయ అసమానతలను బీజేపీ విస్మరిస్తోంది. ఈ విషయంపై బీహార్ ప్రత్యేక దృష్టి పెట్టాలి. ’ అని పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థిగా నితీశ్ సరైన వ్యక్తి అని మీరు అనుకుంటున్నారా? అని అడగగా తనదైన శైలీలో సమాధానమిచ్చారు తేజస్వీ యాదవ్. ‘ఈ ప్రశ్నను గౌరవ నితీశ్ జీకే వదిలేస్తున్నాను. మొత్తం విపక్షాల తరఫున నేను మాట్లాడలేను. కానీ, వారు పరిగణనలోకి తీసుకుంటే నితీశ్ జీ కచ్చితంగా బలమైన అభ్యర్థి అవుతారు. ఆయనకు 37ఏళ్ల పార్లమెంటరీ, పరిపాలన అనుభవం ఉంది. క్షేత్రస్థాయిలో మంచి పేరు ఉంది.’ అని తెలిపారు. ఇదీ చదవండి: ‘2014లో మాదిరిగా 2024లో గెలుస్తారా?’.. ప్రధాని మోదీకి నితీశ్ సవాల్! -
బిహార్ కేబినెట్ విస్తరణ.. మంత్రులుగా 31 మంది ప్రమాణం
పాట్నా: ఎన్డీఏ కూటమితో తెగదెంపులు చేసుకుని పాత మిత్రులతో కలిసి బిహార్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు నితీశ్ కుమార్. సీఎంగా నితీశ్, ఉప ముఖ్యమంత్రిగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ప్రమాణం చేశారు. తాజాగా కేబినెట్ విస్తరణ చేపట్టారు సీఎం నితీశ్ కుమార్. 31 మంది నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంగళవారం ఉదయం రాజ్భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో నూతన మంత్రుల చేత ప్రమాణం చేయించారు గవర్నర్ ఫాగు చౌహాన్. మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ సైతం ఉన్నారు. బిహార్ కేబినెట్లో మొత్తం 36 మంత్రి పదవులు ఉన్నాయి. ఈ తరుణంలో కేబినెట్లో తేజస్వియాదవ్ ఆర్జేడీకి 16, నితీశ్ కుమార్ జేడీయూకు 11 స్థానాలు కేటాయించారు. అదే సమయంలో కాంగ్రెస్ నుంచి ఇద్దరు, హిందుస్థానీ ఆవామ్ మోర్చా జితిన్ రామ్ మాంఝీకి, మరో ఇండిపెండెట్ అభ్యర్థికి సైతం కేబినెట్ బెర్త్లు ఇచ్చారు. Tej Pratap Yadav, RJD leader and brother of Deputy CM Tejashwi Yadav, takes oath as a minister in the Bihar cabinet. #BiharCabinetExpansion pic.twitter.com/68zpjRUuPO — ANI (@ANI) August 16, 2022 ఇదీ చదవండి: బీహార్లోనూ మహారాష్ట్ర సీన్ రిపీట్??.. షిండేలాగే నితీశ్ కూడా.. -
విపక్షాలకు నితీష్ కుమార్ రూపంలో ప్రత్యామ్నాయం దొరికిందా?
బీహార్ తాజా రాజకీయా పరిణామాల ప్రభావం దేశంపైన, తెలుగు రాష్ట్రాలపైన ఏ మేరకు పడుతుంది? బీహార్లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆధ్వర్యంలోని జేడీయూ పక్షం బీజేపీకి గుడ్ బై చెప్పి మళ్లీ ఆర్జేడి, కాంగ్రెస్లతో కూడిన మహా కూటమిలో భాగం అయింది. ఎన్డిఎలో ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ ఇప్పుడు ప్రత్యర్ధి కూటమిలో కూడా సీఎం అయి మరోసారి తన ప్రత్యేకత నిరూపించుకున్నారు. పలు ఆటుపోట్లను చవిచూసిన నితీష్ రాజకీయ చాతుర్యం ఒక విధంగా అసాధారణమైనదే అని చెప్పాలి. చదవండి: గోరంట్ల మాధవ్ వీడియో అంశం: చెత్త వ్యూహంతో టీడీపీ దెబ్బ తిందా? 2024లో నరేంద్ర మోదీ తిరిగి ప్రధాన మంత్రిగా ఎన్నిక కాలేరని చెబుతున్న ఆయన 2014లో కూడా తప్పుడు అంచనాతో బీజేపీకి దూరం అయ్యారు. అయినా బీహారు ప్రజలు ఆయన ఏ కూటమిలో ఉంటే దానికి జై కొట్టారు. మహాకూటమిలో భాగంగా ఉండి 2015లో అధికారంలోకి వచ్చిన నితీష్ , ఆ తర్వాత ఆ కూటమిని వీడి తిరిగి బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్.డి.ఎ.కూటమిలో భాగస్వామి అయ్యారు. ఒకప్పుడు మోదీని తీవ్రంగా వ్యతిరేకించినా, తదుపరి ఆయన దగ్గరయ్యారు. 2020 లో బీజేపీతో కలిసి అధికారం సాధించిన నితీష్ ఈసారి ఎన్.డి.ఎ.ని వదలిపెట్టి మహాకూటమిలో భాగస్వామి అయ్యారు. 2025లో సాధారణ ఎన్నికలు వచ్చేవరకు ఇదే కూటమిలో ఉంటారా? మరోసారి కూటమి మారతారా అన్నది అప్పుడే చెప్పలేం. మామూలుగా అయితే ఇన్నిసార్లు కూటములు మార్చే నేతలపై ప్రజలలో, ఇతర రాజకీయ పార్టీలలో వ్యతిరేకత వస్తుంటుంది. కాని నితీష్ రెండు కూటములవారిని ఆకర్షించడం ఆయన ప్రత్యేకత. దానికి కారణం ప్రధానంగా ఆయన వ్యక్తిత్వమే అని చెప్పాలి. అవినీతి ముద్ర లేకుండా పోవడం, బీహార్లో సంక్షేమ కార్యక్రమాలకు తగు ప్రాధాన్యం ఇవ్వడం, వీలైనంత అభివృద్ధి వైపు రాష్ట్రాన్ని నడిపించడం వంటి కారణాల వల్ల ఆయనపై ప్రజలలో మరీ ఏవగింపు లేదు. నితీష్ కుమార్ దేశంలో మరే నేత సాధించలేని విధంగా ఎనిమిది సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి రికార్డు సృష్టించారు. ఒకప్పుడు బలం లేకపోయినా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి కేవలం అతి కొద్ది రోజులు మాత్రమే అధికారంలో ఉండి, మెజార్టీ కొరవడి పదవి నుంచి వైదొలగవలసి వచ్చింది. కాని ఆ తదుపరి కేంద్ర మంత్రిగా ఉంటూ పేరు తెచ్చుకున్నారు. బీజేపీతో కలిసి బీహారులో 2005 లో అధికారంలోకి వచ్చింది మొదలు, మధ్యలో కొద్ది నెలలు మినహా ఇప్పటివరకు ఆయనే సీఎంగా ఉన్నారు. ఆయన ఏ కూటమిలో ఉన్నా, తన సొంత పార్టీ అయిన జేడీయూ ఇతర పార్టీలకన్నా తక్కువ సీట్లే సాధించినా, నితీష్ కుమార్ నే ఆయా కూటములు సీఎంగా ఎన్నుకోవడం విశిష్ట పరిణామం. అదే సమయంలో నితీష్ కుమార్ పై అవకాశవాద రాజకీయాలు చేస్తారన్న విమర్శ కూడా ఉంది. గతంలో మహాకూటమిని వదలి ఎన్డీఏ కూటమిలోకి వచ్చినప్పుడు ఆర్జేడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఈయనను పాముతో పోల్చారు. సరిగ్గా ఇప్పుడు అదే పద ప్రయోగాన్ని బిజెపి నేతలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, దేశ వ్యాప్తంగా ప్రతిపక్షానికి నితీష్ లో కొద్ది ఆశారేఖలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్దిగా ఫోకస్ చేయడానికి కొన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్న తరుణంలో సుదీర్ఘ రాజకీయ అనుభవం, ముఖ్యమంత్రిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న తీరుతో నితీష్ ప్రధాని అభ్యర్ధి కావచ్చనే ప్రచారం ఆరంభం అయింది. నితీష్ మనసులో ఇదే ఉద్దేశం గత కొన్నేళ్లుగా ఉన్పప్పటికీ, మోదీ హవా ముందు తలవంచుకుని కామ్ తన పని తాను చేసుకుపోయారు. మరో రెండేళ్లలో సాధారణ ఎన్నికలు జరగనున్నందున ఇప్పుడు మళ్లీ తన వ్యూహాలకు పదును పెడుతున్నట్లుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మోదీని నితీష్ ఎదుర్కోగలుగుతారా ?లేదా అన్న ప్రశ్న ఉన్నప్పటికీ, స్తూలంగా నితీష్ అభ్యర్ధిత్వాన్ని బీజేపీని వ్యతిరేకించే వివిధ రాజకీయ పక్షాలు ఆమోదించే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు ఈ విషయంలో ఏమి జరుగుతుందో జోస్యం చెప్పలేకపోయినా, దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీయేతర రాజకీయ పక్షాలలో నితీష్కే ఎక్కువగా గుడ్ విల్ ఉన్నట్లు భావించవచ్చు. కాగా నితీష్ రాజకీయ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఎలా ఉండవచ్చు అన్న చర్చ కూడా ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలి కాలంలో బీజేపీపై ఫైట్ చేస్తున్న మొనగాడుగా గుర్తింపు తెచ్చుకునే యత్నం చేస్తున్నారు. ఒక దశలో జాతీయ పార్టీని పెట్టుకుని ప్రధాని రేసులో ఉండాలని కూడా ఆయన ఆశించారు. కాని ప్రాక్టికల్ రాజకీయాలలో అది చాలా కష్టమైనదిగా కనిపిస్తుంది. నితీష్ ఉత్తరాది రాజకీయ నేత అవడం ఒక అడ్వాంటేజ్ కాగా, కేసీఆర్ దక్షిణాది నేత కావడం, తెలంగాణలో కేవలం 17 లోక్ సభ స్థానాలే ఉండడం డిజడ్వాంటేజ్ గా భావించవచ్చు. బీహార్లో 40 లోక్సభ సీట్లు ఉన్నాయి. అయితే కేసీఆర్ బీజేపీపై చేస్తున్న పోరాటానికి నితీష్ కుమార్ తాజా నిర్ణయం నైతికంగా బలం చేకూర్చుతుంది. మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలలో బీజేపీ అనుసరించిన వ్యూహానికి ప్రతిగా బీహార్లో నితీష్ ఆ పార్టీకి ఝలక్ ఇచ్చారు. తద్వారా ప్రస్తుతానికి తన పార్టీని చీల్చే అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడగలిగారు. బీహార్లో ఎదురుదెబ్బ తినడంతో తెలంగాణలో బీజేపీ తన గేమ్ను చాలా జాగ్రత్తగా ఆడవలసి ఉంటుంది. ప్రధానంగా సీబిఐ, ఈడీ వంటి సంస్థలను ప్రయోగించడంలో ఆచితూచి వ్యవహరించవలసి ఉంటుంది. అది టీఆర్ఎస్కు ధైర్యం ఇచ్చే అంశం అవుతుంది. మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నిక జరగనున్నందున, టీఆర్ఎస్ బీహార్ రాజకీయాలను ప్రచారంలో వాడుకోవచ్చు. బీజేపీని ప్రజా వ్యతిరేకిగా చూపించడానికి ఈ పరిణామాన్ని వాడుకోవచ్చు. కొద్ది రోజుల క్రితం నితీ ఆయోగ్ సమావేశానికి వెళ్లకుండా కేసీఆర్ బహిష్కరించారు. కేసీఆర్తో పాటు నితీష్ కూడా ఆ సమావేశానికి వెళ్లలేదు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్తో ఇప్పటికే కేసీఆర్ సంబంధాలు పెట్టుకున్నారు. ఇప్పుడు వారితో కలిసి కేసీఆర్ రాజకీయం చేసే అవకాశం ఉంటుంది. కాగా ఆంధ్రప్రదేశ్లో స్థానిక రాజకీయంపై పెద్దగా ప్రభావం చూపదుకాని, ఢిల్లీ స్థాయిలో వైఎస్సార్ కాంగ్రెస్కు, ముఖ్యమంత్రి జగన్కు మరింత ప్రాధాన్యత ఏర్పడవచ్చు. జేడీయూ నిష్క్రమణతో రాజ్యసభలో బీజేపీకి అవసరమైన మెజార్టీకి కొంత తక్కువ సీట్లు ఉన్నాయి. కీలకమైన బిల్లులపై ఓటింగ్ వస్తే వైసీపీపైన, ఒడిషాలోని బీజేడీపైన బీజేపీ ఆధారపడవలసి వస్తుందని ఇప్పటికే విశ్లేషణలు వచ్చాయి. బీహార్లో ఈ సారి మెజార్టీ లోక్ సభ సీట్లు బీజేపీకి ఎంతవరకు వస్తాయన్నది చెప్పలేం. ఒకవేళ బీజేపీ కూటమికి గత మాదిరి 39 సీట్లు రాకపోతే, కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటులో కొంత ఇబ్బంది రావచ్చు. యూపి. ఎంపీ, కర్ణాటక వంటి రాష్ట్రాలలో కూడా లోక్ సభ ఎన్నికలలో గతంలో వచ్చినట్లుగా ఓవర్ హెల్మింగ్ గా సీట్లు రాకపోవచ్చు. ఆయా రాష్ట్రాలలో సీట్ల సాధనలో వెనుకబడితే, అప్పుడు వైసీపీ వంటి పార్టీలు సాధించే సీట్లకు గిరాకి ఏర్పడుతుంది. అలాగే ఎలాగైనా బీజేపీతో అంటకాగాలని ఆరాటపడుతున్న తెలుగుదేశం పార్టీకి కూడా ఈ పరిణామం కాస్త ఆశ కలిగించవచ్చు. కానీ బీజేపీ ఏపీకి సంబంధించి వైసీపీపైన ఆధారపడాలా? టీడీపీతో జత కలవాలా అన్నదానిపై ఎన్నికల తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా బీజేపీపై వ్యతిరేకత ప్రబలితే ,అప్పుడు విపక్షాల కూటమికి కాస్త మెరుగైన ఫలితాలు రావచ్చు. అప్పుడు మోదీ అభ్యర్ధిత్వంపై చర్చ జరగవచ్చు. మోదీ ప్రధాని కాకుండా ఉంటే మద్దతు ఇస్తామని కొన్ని పార్టీలు ప్రతిపాదించవచ్చు. ఇలా రకరకాల పరిణామాలు వచ్చే లోక్ సభ ఎన్నికల తర్వాత జరిగే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా ఆయా రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలపై దూకుడుగా వెళుతున్న బీజేపీ కొంత తగ్గవచ్చు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆయా ప్రాంతీయ పార్టీలను ఆకర్షించే పనిలో పడవచ్చు. ఏది ఏమైనా ఇంతవరకు మోదీకి ప్రత్యామ్నాయం లేరనుకుంటున్న తరుణంలో నితీష్ కుమార్ రూపంలో విపక్షాలకు ఒక ప్రత్యామ్నాయం దొరికిందని భావించవచ్చేమో! -కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు -
2 వారాల తర్వాతే ‘నితీశ్’ బల నిరూపణ.. కారణమేంటి?
పాట్నా: బిహార్లో బీజేపీతో సంబంధాలు తెంచుకుని ఆర్జేడీతో కలిసి మరోమారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు నితీశ్ కుమార్. ఆయన సీఎంగా కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వత తొలిసారి నిర్వహించే అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సెషన్స్లోనే జేడీయూ-ఆర్జేడీ ప్లస్ ప్రభుత్వం బలనిరూపణ చేసుకోవాల్సి ఉంది. కానీ, ప్రస్తుతం స్పీకర్ పదవీలో బీజేపీ నేత ఉండటంతో ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. ముందుగా స్పీకర్ను మార్చాలని అధికార కూటమి భావిస్తోంది. అవసరమైన బలం ఉన్నప్పటికీ అనవసర రిస్క్ తీసుకోకూడదని నేతలు భావిస్తున్నారు. సాంకేతికంగా గవర్నర్ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ఆదేశించాలి. కానీ, ప్రభుత్వ ప్రతిపాదనల మేరకు నడుచుకుంటారు. ఇప్పటికే.. స్పీకర్ విజయ్ కుమార్ సిన్హాపై అవిశ్వాస తీర్మానాన్ని 55 మంది మహాకూటమి ఎమ్మెల్యేలు ఇచ్చారు. అయితే.. నిబంధనల ప్రకారం ఈ తీర్మానం ఇచ్చిన రెండు వారాల తర్వాతే అసెంబ్లీ ముందుకు వస్తుంది. అందుకే ఆగస్టు 24 వరకు వేచి చూడాల్సిన అవసరం ఏర్పడింది. మహాగడ్బంధన్ కూటమికి ప్రస్తుతం 164 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. 243 సభ్యుల అసెంబ్లీలో 122 మంది మద్దతు ఉంటే సరిపోతుంది. అయితే, ఎలాంటి రిస్క్ తీసుకోకూడదనే ధోరణి కనిపిస్తోంది. ఆగస్టు 25న విశ్వాస పరీక్ష ఎదుర్కోనున్నారు నితీశ్. ఆగస్టు 24న అసెంబ్లీ సమావేశాల తొలిరోజున అవిశ్వాస తీర్మానంతో స్పీకర్ విజయ్ కుమార్ సిన్హాను తొలగించి కొత్తవారిని ఎన్నుకోనున్నారు. మరోవైపు.. ఆలోపే స్పీకర్ సిన్హా రాజీనామా చేసే అవకాశాలు సైతం కనిపిస్తున్నాయి. అయితే, ఆయన బీజేపీ నాయకత్వం చెప్పినట్లు నడుచుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. కొత్త స్పీకర్ ఆర్జేడీ నుంచి ఎన్నికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదీ చదవండి: ఉచితాలు, సంక్షేమ పథకాలు రెండు వేరు వేరు: సుప్రీం కోర్టు -
ప్రధాని మోదీకి బిహార్ సీఎం నితీశ్ కుమార్ 2024 సవాల్!
పాట్నా: బిహార్ ముఖ్యమంత్రిగా 8వ సారి ప్రమాణ స్వీకారం చేశారు నితీశ్ కుమార్. బీజేపీతో తెగదెంపులు చేసుకుని ఆర్జేడీ, కాంగ్రెస్ సహా పలు పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఎన్డీయే వర్గానికి విపక్ష నేతగా మారిన ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. 2014లో గెలుపొందిన ప్రధాని మోదీ.. 2024 ఎన్నికల్లో గెలుపొందటంపై ఆందోళనపడాలన్నారు. 2014 మాదిరిగా 2024లో గెలుస్తారా? అని ప్రశ్నించారు. ‘బీజేపీని వీడాలని పార్టీ మొత్తం కలిసి తీసుకున్న నిర్ణయం. 2024 వరకు నేను ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాళ్లు ఏం కావాలో చెప్పగలరు. కానీ, 2014 ఏడాదిలో జీవించలేను. 2014లో అధికారంలోకి వచ్చిన వారు.. 2024లోనూ విజయం సాధిస్తారా? 2024 ఎన్నికల్లో విపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలని కోరుకుంటున్నా. 2020లో ముఖ్యమంత్రిగా ఉండాలనుకోలేదు. ఒత్తడి చేసి సీఎంను చేశారు. అందుకే మీతో మాట్లాడలేకపోయాను. 2015లో మాకు ఎన్ని సీట్లు వచ్చాయి. అదే బీజేపీతో కలిసి ఉండటం వల్ల 2020లో ఎన్ని తగ్గాయి.’ అని పేర్కొన్నారు నితీశ్. మరోవైపు.. 2024 లోక్సభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా ఉండే అంశాన్ని తోసిపుచ్చారు నితీశ్. ఇదీ చదవండి: బీహార్ సీఎంగా ఎనిమిదో సారి నితీశ్ ప్రమాణం.. డిప్యూటీగా ఆర్జేడీ నేత తేజస్వి -
బీహార్ సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణం
పాట్నా: బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జనతా దళ్(యునైటెడ్)కు చెందిన నితీశ్ కుమార్ ప్రమాణం చేశారు. బుధవారం మధ్యాహ్నాం రాజ్భవన్లో గవర్నర్ సమక్షంలో ఆయన బీహార్కు సీఎంగా ఎనిమిదో సారి బాధ్యతలు చేపట్టారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి గుడ్ బై చెబుతూ.. ఆయన తన రాజీనామాను గవర్నర్కు మంగళశారం సాయంత్రం సమర్పించారు. అయితే.. ఆ వెంటనే ఆర్జేడీ సహా విపక్షాల మద్దతుతో ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సీఎంగా నితీశ్ కుమార్, తేజస్వి యాదవ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. #WATCH Bihar CM Nitish Kumar and Deputy CM Tejashwi Yadav greet each other after the oath-taking ceremony, in Patna pic.twitter.com/fUlTz9nGHS — ANI (@ANI) August 10, 2022 ఈ ప్రమాణ కార్యక్రమానికి బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, తేజస్వి యాదవ్ భార్య రాజశ్రీ తదితర ప్రముఖులు, ముఖ్యనేతలు హాజరయ్యారు. బుధవారం ఈ ఇద్దరు మాత్రమే ప్రమాణం చేయడం విశేషం. మిగతా కేబినెట్ కూర్పు తర్వాత ఉండే ఛాన్స్ ఉంది. Patna | RJD leader Tejashwi Yadav takes oath as Deputy CM of Bihar pic.twitter.com/mvhweGd1zt — ANI (@ANI) August 10, 2022 #WATCH | Bihar: CM-designate Nitish Kumar, RJD's Tejashwi Yadav and his wife Rajshri, former CM Rabri Devi and RJD leader Tej Pratap Yadav at the swearing-in ceremony at Raj Bhavan in Patna. pic.twitter.com/bdxHBNSiyh — ANI (@ANI) August 10, 2022 ఇదీ చదవండి: ఎన్డీయే నుంచి జేడీయూ నిష్క్రమణపై బీజేపీ స్పందన -
బిహార్లో ఏం జరుగుతోంది? సీఎం నితీశ్పై విరుచుకుపడ్డ బీజేపీ ఎమ్మెల్యే
పట్నా: బిహార్ బీజేపీ ఎమ్మెల్యే వినయ్ బిహరీ సీఎం నితీశ్ కుమార్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఫిలిం సీటీ, అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వంటి ప్రాజెక్టులు రాజ్గిరికే ఎందుకు తరలివెళ్తున్నాయని ప్రశ్నించారు. రాజ్గిరి సీఎం నితీశ్ కుమార్ సొంత జిల్లా నలందలో ఉండటం గమనార్హం. దీంతో వినయ్ బిహారీ సోమవారం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పించారు. తాను కళలు, సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని రాష్ట్ర రాజధాని పట్నాలో నిర్మించాలనుకున్నట్లు వినయ్ చెప్పారు. కానీ ఆ ప్రాజెక్టును రాజ్గిరికి తరలించారని ఆరోపించారు. అలాగే ఫిలిం సిటీని కూడా వాల్మీకి నగర్లో నిర్మించాలనుకున్నట్లు చెప్పుకొచ్చారు. కానీ దాన్ని కూడా రాజ్గిరికి మార్చారాని ఆరోపించారు. భోజ్పురి ఫిలిం మేకర్ అయిన వినయ్ బిహారీ.. తనకంటే ఎక్కువ నితీశ్ కుమార్కు ఏమీ తెలియదన్నారు. అక్కడైతే ఫిల్మ్ మేకింగ్కి అనువైన వాతావరణం ఉంటుందని, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండవని పేర్కొన్నారు. అసలు ఈ రెండు ప్రాజెక్టులను రాజ్గిరికి ఎందుకు మార్చారో సీఎం, సంబంధిత మంత్రి, బీజేపీ డిప్యూటీ సీఎంలే చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు ఫిలిం సిటీ, క్రికెట్ స్టేడియం పనులు నత్తనడకన సాగుతున్నాయని సీఎంపై వినయ్ బిహారీ విమర్శలు గుప్పించారు. 2014లో మొదలైన ఈ ప్రాజెక్టులు సగం కూడా పూర్తి కాలేదన్నారు. బిహార్లో అధికార జేడీయూ, బీజేపీ మిత్రపక్షాలు. అలాంటిది సీఎంపై బీజేపీ ఎమ్మెల్యే ఈ స్థాయిలో విరుచుకుపడటం రాజకీయంగా చర్చనీయాంశమైంది. చదవండి: బీజేపీ నేతలపై ఈడీ చర్యలు ఉంటాయా?.. చర్చనీయాంశంగా ఎన్సీపీ బ్యానర్! -
Nitish Kumar: బిహార్ సీఎం నితీశ్ కుమార్కు కరోనా పాజిటివ్
పాట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్కు కరోనా సోకింది. గత నాలుగు రోజులుగా ఆయన జ్వరంతో బాధపడుతున్నారు. సోమవారం రాత్రి నిర్వహించిన కోవిడ్ పరీక్షల్లో పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. వైద్యుల సలహా మేరకు హోమ్ ఐసోలేషన్కు వెళ్లినట్లు పేర్కొంది. గత నాలుగు రోజులుగా నితీశ్ కుమార్ అనారోగ్యానికి గురైనట్లు ఆరోగ్య శాఖ అదనపు చీఫ్ సెక్రెటరీ ప్రత్యాయ అమృత్ తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని పేర్కొన్నారు. ఇదీ చదవండి: MK Stalin Covid Positive: తమిళనాడు సీఎం స్టాలిన్కు కరోనా.. ట్విటర్ ద్వారా ప్రకటన -
అలా రాసిస్తేనే పెళ్లిళ్లకు వస్తానని చెప్పా: సీఎం
పట్నా: వర కట్నానికి వ్యతిరేకంగా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కట్నం తీసుకోలేదని వరుడి తరపు వారు చెబితేనే తాను పెళ్లికి హాజరవుతానని ఆయన అన్నారు. పట్నాలో కొత్తగా నిర్మించిన బాలికల హాస్టల్ను ఈనెల 23న ప్రారంభించిన సందర్భంగా సీఎం నితీశ్ కుమార్ మాట్లాడుతూ.. పెళ్లికొడుకు కట్నం తీసుకోలేదని రాతపూర్వకంగా తెలిపితేనే పెళ్లికి హాజరవుతానని అందరికీ చెప్పినట్టు వెల్లడించారు. పెళ్లి చేసుకోవడానికి కట్నం తీసుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ‘పెళ్లి కోసం కట్నం తీసుకోవడం దారుణం. మీరు పెళ్లి చేసుకుంటే మీకు పిల్లలు పుడతారు. ఇక్కడ ఉన్న మనమంతా తల్లులకు పుట్టాము. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడతారా?’ అంటూ సీఎం నితీశ్ కుమార్ వ్యాఖ్యానించారు. (క్లిక్: 54% మహిళలకే సొంత సెల్ఫోన్) ప్రచార కార్యక్రమాలతో వరకట్నం, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. అబ్బాయిలతో సమానంగా విద్యా, ఉద్యోగ రంగాల్లో అమ్మాయిలు కూడా రాణిస్తున్నారని తెలిపారు. మహిళల డిమాండ్ మేరకే తమ ప్రభుత్వం మద్యపానాన్ని నిషేధించిందని నితీశ్ కుమార్ అన్నారు. (క్లిక్: కాంగ్రెస్కు కపిల్ సిబల్ రాజీనామా) -
పూజలకు హింసతో సంబంధం ఏంటి?: సీఎం నితీశ్కుమార్
పాట్నా: తాజా మత ఘర్షణల మీద బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఘర్షణలను ప్రతీ వర్గం పక్కనపెట్టాలని, అసలు దేవుడి ప్రార్థనలకు హింసతో సంబంధం లేదని వ్యాఖ్యానించారు. శ్రీ రామ నవమి సందర్భంగా దేశంలో పలు చోట్ల అల్లర్లు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. వీటిపై స్పందించాల్సిందిగా మీడియా.. సోమవారం సీఎం నితీశ్కుమార్ను కోరింది. ‘‘వర్గాల మధ్య శాంతి, సామరస్యం వెల్లివిరియాలి. దేవుళ్లను ఆరాధించడంలో ఒక్కొక్కరిది ఒక్కో శైలి. అంతేగానీ మనలో మనం కొట్టుకోవడం కాదు. పూజించడం మీద అంత నమ్మకం ఉంటే.. సరిగ్గా పూజలు చేసుకోవాలి. అంతేగానీ పూజల పేరుతో ఘర్షణలకు పాల్పడడం ఏంటి? ప్రార్థనలకు హింసకు ఏమైనా సంబంధం ఉందా? ఇలాంటివి బీహార్లో జరిగితే ఊరుకునేదే లేదు’’ అని సీఎం నితీశ్ కామెంట్ చేశారు. एक दूसरे से झग़ड़ा का पूजा से कोई सम्बंध हैं ??आपको पूजा करना हैं तो पूजा कीजिएगा ना कि झगड़ा ये कहना हैं @NitishKumar का @ndtvindia @Anurag_Dwary pic.twitter.com/LA4xWtMKG0 — manish (@manishndtv) April 18, 2022 మరోవైపు మసీదుల వద్ద ఆజాన్, లౌడ్ స్పీకర్ల చుట్టూ వివాదాలు సృష్టిస్తున్న వారికి మతంతో సంబంధం లేదని, ప్రజలు తమ మతాన్ని అనుసరించాలని, వారిని అడ్డుకోవద్దని నితీష్ కుమార్ అన్నారు. ప్రతి మతానికి దాని స్వంత మార్గాలు ఉన్నాయి. దీని గురించి మనలో మనం గొడవ పడకూడదు. ప్రతి ఒక్కరూ తమ మతాన్ని అనుసరించాలి. ఎవరైనా ఈ విషయాలపై వివాదాలు సృష్టిస్తే, అతనికి మతంతో సంబంధం లేదు అని అన్నారాయన. ఇదిలా ఉండగా.. రామ నవమి సందర్భంగా రాళ్లు రువ్విన వాళ్ల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేయాలంటూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు వివాదాస్పదంగా మారడంతో పాటు సుప్రీం కోర్టుకు చేరాయి. ఈ తరుణంలో బీజేపీ మిత్రపక్షం హిందుస్థాన్ అవామ్ మోర్చా చీఫ్, బీహార్ మాజీ సీఎం జతిన్ రామ్ మాంఝీ.. శ్రీ రాముడిపై ప్రతికూల కామెంట్లు చేయగా, ఇప్పుడు మరో మిత్రపక్ష నేత, సీఎం నితీశ్ సైతం పూజల పేరుతో అల్లర్లకు పాల్పడుతున్న వాళ్లపై విమర్శలు గుప్పించడం గమనార్హం. -
ఎవ్వరినీ వదలడం లేదు.. కరోనా బారిన పడ్డ మరో ఇద్దరు సీఎంలు
బెంగుళూరు/పాట్నా! భారత్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. లక్షల్లో రోజువారీ కేసులు వెలుగు చూస్తున్నాయంటే పరిస్థితి ఎంత ఆందోళనకరంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఓ వైపు సాధారణ పౌరులపై కోవిడ్ పంజా విసురుతుంటే మరోవైపు ప్రజాప్రతినిధులను కూడా విడిచి పెట్టడం లేదు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా చాలా మంది నాయులు కరోనా బారిన పడ్డారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పాటు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్కు కరోనా సోకగా.. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మె కోవిడ్ బారిన పడ్డారు. ఈ మేరకు సీఎం తన అధికారిక ట్విటర్ ద్వారా వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్గా తేలిందని, స్వల్ప లక్షణాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగేఉందని, వైద్యుల సూచనల మేరకు హోం క్వారంటైన్లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇటీవల తననుకలిసిన వారంతా కోవిడ్ టెస్టులు చేయించుకొని హోం ఐసోలేషన్లో ఉండాలని విజ్జప్తి చేశారు. చదవండి: కాశీ విశ్వనాథ్ ధామ్ సిబ్బందికి మోదీ ఊహించని బహుమతి I have tested positive for COVID -19 today with mild symptoms. My health is fine, I am under home quarantine. I request everyone who have recently come in my contact to isolate themselves and get tested. — Basavaraj S Bommai (@BSBommai) January 10, 2022 మరోవైపు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్కు కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. తాజాగా జరిపిన పరీక్షలో ఆయనకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు సీఎం ఆఫీస్ అధికారులు వెల్లడించారు. దీంతో సీఎం నితీశ్ కుమార్ ఇంట్లోనే ఐసోలేట్ అయి చికిత్స తీసుకుంటున్నారని వెల్లడించారు. డాక్టర్లు ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు అందిస్తున్నారని వెల్లడించారు. కోవిడ్ వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. చదవండి: రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు కరోనా.. జేపీ నడ్డాకు కరోనా బీజేపీ జాతీయ అధ్యక్షడు జేపీ నడ్డా కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉన్నారు. ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపిన నడ్డా.. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారందరూ కరోనా టెస్టులు చేసుకోవాలని సూచించారు. माननीय मुख्यमंत्री श्री नीतीश कुमार कोरोना जाँच में पॉज़िटिव पाये गए हैं। चिकित्सकों की सलाह पर वह होम आइसोलेशन में हैं। उन्होंने सभी से कोविड अनुकूल सावधानियां बरतने की अपील की है। — CMO Bihar (@officecmbihar) January 10, 2022 -
కుల ఆధారిత జనగణన చేపట్టాలి: నితీశ్
పట్నా: దేశంలో ఎస్సీ, ఎస్టీలు తప్ప ఇతర కులాల జనాభాను లెక్కించే ప్రసక్తే లేదంటూ పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనపై బిహార్ ముఖ్యమంత్రి, ఎన్డీయే భాగస్వామిగా ఉన్న జేడీ(యూ) నేత నితీశ్ కుమార్ భిన్నస్వరం వినిపించారు. దేశవ్యాప్తంగా కుల ఆధారిత జనగణన చేపట్టాలని శనివారం డిమాండ్ చేశారు. సంక్షేమ ఫథకాలకు రూపకల్పన చేయడానికి ఈ గణాంకాలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. దేశంలో దళితేతర పేదలు ఎంతమంది ఉన్నారో తేల్చడానికి కుల ఆధారిత జనగణనే మార్గమని పేర్కొన్నారు. 2010లో కులాలవారీగా జనాభా లెక్కింపు ప్రారంభించారని, 2013లో నివేదిక సిద్ధమయ్యిందని, దాన్ని విడుదల చేయలేదని ఆక్షేపించారు. ఒక్కసారైనా కులాలవారీగా జనాభాను లెక్కించాలని కోరారు. -
పొలిటికల్ మిషన్
నవీన్ చంద్ర హీరోగా హనీ బన్నీ క్రియేషన్స్, శ్రీ మిత్ర, మై విలేజ్ సమర్పణలో రూపొందుతున్న చిత్రం ‘మిషన్ 2020’. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రేరణతో వాస్తవ సంఘటనల ఆధారంగా సమకాలీన రాజకీయాల నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న సినిమా ఇది. కరణం బాబ్జీ దర్శకత్వంలో కుంట్లూర్ వెంకటేష్ గౌడ్, కేవీఎస్ఎస్ఎల్ రమేష్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మార్చి 5న సినిమా విడుదల కానుంది. ‘‘ఈ సినిమాను చూసి ఏషియన్ ఫిలిమ్స్ విడుదల చేయడానికి ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు నిర్మాతలు. ‘‘ఈ రోజుల్లో కూడా ఇలాంటి మంచి కాన్సెప్ట్ ఉన్న కథతో సినిమా తీయడం అంటే డేరింగ్ స్టెప్ అనుకోవచ్చు. సినిమా బాగా నచ్చింది కాబట్టి నైజాంలో విడుదల చేస్తున్నాం’’ అన్నారు ఏషియన్ ఫిలిమ్స్ సునీల్ నారంగ్. ‘‘పరిస్థితులకు అద్దం పట్టేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం’’ అన్నారు కరణం బాబ్జీ. ‘‘ఇప్పటికే విడుదలైన పాటలు ఘనవిజయం సాధించాయి. సినిమా కూడా పెద్ద హిట్టవుతుందనే నమ్మకంతో ఉన్నాం’’ అన్నారు కేవీఎస్ఎస్ఎల్ రమేష్ రాజు. ఎగ్జిబిటర్ శ్రీధర్, సంగీతదర్శకుడు ర్యాప్ రాక్ షకీల్ తదితరులు పాల్గొన్నారు. -
అవినీతిలో భీష్ముడంతటి వాడు..
పాట్నా: సోషల్ మీడియాలో చేసే వ్యాఖ్యలను సైబర్ నేరంగా పరిగణించే విధంగా గ్యాగ్ ఆర్డర్ను తీసుకొచ్చిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్పై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా పోస్ట్లు పెట్టడాన్ని సైబర్ నేరంగా పరిగణించమని సీఎం నితీష్ కుమార్ బీహార్ ఆర్థిక నేరాల విభాగానికి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో.. తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డారు. ప్రజల హక్కులను కాలరాయడంలో నితీష్ హిట్లర్తో సమానమని విమర్శించారు. సీఎం నితీష్ కుమార్ 60కిపైగా కుంభకోణాలకు పాల్పడ్డారని.. ఆయన అవినీతిలో భీష్ముడంతటివాడని ఆయన ట్విటర్ వేదికగా ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కుర్చీని కాపాడుకునేందుకు ఆయన నేరస్తులకు కొమ్ము కాస్తూ.. అనైతిక, రాజ్యాంగ విరుద్ధమైన ప్రభుత్వాన్ని నడుపుతున్నారని విమర్శించారు. బీహార్ పోలీసులు మద్యం అమ్ముతున్నారని హిందీలో ట్వీట్ చేసిన తేజస్వి.. ఈ చట్టం కింద తనను అరెస్ట్ చేయాలని ఛాలెంజ్ చేశారు. ప్రజాస్వామ్యానికి తల్లి లాంటి రాష్ట్రంలో ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారని తేజస్వి విమర్శించారు. నితీష్ తన ఆదర్శాలను తాకట్టుపెట్టి బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు అమ్ముడుపోయారని, ఆయన సంఘ్ పరివార్కు చెందిన ముఖ్యమంత్రిగా తయారయ్యారన్నారు. -
నితీశ్ కేబినెట్లో 57% మంది నేరచరితులే
పట్నా: బిహార్లో నితీశ్కుమార్ సర్కార్ ప్రమాణ స్వీకారం చేసిందో లేదో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేరచరిత కలిగిన వారికి నితీశ్ కేబినెట్లో చోటు దక్కడంతో విపక్షాలు దాడికి దిగాయి. విద్యాశాఖ మంత్రిగా జేడీ(యూ)కి చెందిన మేవాలాల్ చౌధురిని నియమించడంతో రగడ మొదలైంది. గతంలో వ్యవసాయ యూనివ ర్సిటీ వైస్ చాన్స్లర్గా మేవాలాల్ అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఆయనకు విద్యాశాఖ మంత్రి పదవి కట్టబెట్టడంతో విపక్ష ఆర్జేడీ కూటమికి ఒక ఆయుధం దొరికింది. కేబినెట్లో మరో ఏడుగురు నేర చరిత కలిగిన వారు ఉన్నారని అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తాజా నివేదిక వెల్లడించింది. నితీశ్ కేబినెట్లో బెర్త్ సంపాదించిన 14 మంది ఎన్నికల అఫిడవిట్లో సమర్పించిన వివరాలను విశ్లేషించిన ఆ సంస్థ ఎనిమిది మంది (57%) నేరచరిత్ర కలిగినవారని పేర్కొంది. వారిలో ఆరుగురు (43%)అత్యంత తీవ్రమైన క్రిమినల్ కేసుల్ని ఎదుర్కొంటున్నారు. ఎనిమిది మంది కళంకిత మంత్రుల్లో బీజేపీ నుంచి నలుగురు, జేడీ(యూ) నుంచి ఇద్దరు కాగా మిగతా ఇద్దరు కూటమి పార్టీలకు చెందినవారు. -
బిహార్ ముఖ్యమంత్రిగా ఏడోసారి
పట్నా: బిహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ అధ్యక్షుడు నితీశ్ కుమార్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. బిహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం నితీశ్కు ఇది ఏడోసారి. 2005 నవంబర్ నుంచి, మధ్యలో స్వల్పకాలం మినహాయించి, నితీశ్ బిహార్ సీఎంగా కొనసాగుతున్నారు. 2014 మే నుంచి 2015 ఫిబ్రవరి వరకు జితన్ రామ్ మాంఝీ రాష్ట్ర సీఎంగా ఉన్నారు. బీజేపీ అగ్రనేత, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా ఎన్డీయే మిత్రపక్ష నాయకుల సమక్షంలో రాజ్భవన్లో నితీశ్తో గవర్నర్ ఫగు చౌహాన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే విజయం సాధించిన విషయం తెలిసిందే. నితీశ్తో పాటు 14 మంది ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో బీజేపీకి చెందిన తార్కిషోర్ ప్రసాద్, రేణుదేవి ఉప ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్నారు. బీజేపీ నుంచి ఏడుగురు, జేడీయూ నుంచి ఐదుగురు, హెచ్ఏఎం, వీఐపీల నుంచి ఒక్కొక్కరు చొప్పున తాజా మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. హెచ్ఏఎం నుంచి మాజీ సీఎం జితన్రామ్ మాంఝీ కుమారుడు సంతోష్ కుమార్ సుమన్(ఎంఎల్సీ), వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ(వీఐపీ) నుంచి ఆ పార్టీ చీఫ్ ముకేశ్ సాహ్నీ మంత్రులుగా ప్రమాణం చేశారు. అసెంబ్లీ స్పీకర్గా ఈసారి బీజేపీ నేత నందకిషోర్ యాదవ్కు అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది. 2000లో తొలిసారి నితీశ్కుమార్ బిహార్ సీఎంగా తొలిసారి 2000లో బాధ్యతలు చేపట్టారు. మెజారిటీ నిరూపించుకోలేక వారం రోజుల్లోపే రాజీనామా చేశారు. ఐదేళ్ల తరువాత, జేడీయూ– బీజేపీ కూటమి మెజారిటీ సాధించడంతో రెండోసారి సీఎం అయ్యారు. 2010లో అదే కూటమి ఘన విజయంతో మూడో సారి సీఎం పీఠం అధిష్టించారు. 2014 లోక్సభ ఎన్నికల్లో జేడీయూ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత, 2015 ఫిబ్రవరిలో మళ్లీ సీఎం అయ్యారు. 2015 నవంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఆర్జేడీ, కాంగ్రెస్లతో కలిసి జేడీయూ పోటీ చేసి విజయం సాధించడంతో నితీశ్ మరోసారి సీఎం అయ్యారు. అయితే, ఆర్జేడీతో విభేదాల కారణంగా 2017లో సీఎం పదవికి రాజీనామా చేశారు. అనంతరం, 24 గంటల్లోపే బీజేపీతో మరోసారి జట్టు కట్టి ఆరోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. బిహార్ సీఎంగా అత్యధిక కాలం కొనసాగిన ఘనత శ్రీకృష్ణ సింగ్ పేరిట ఉంది. స్వాతంత్య్ర పూర్వం నుంచి 1961లో చనిపోయేవరకు ఆయన సీఎంగా ఉన్నారు. ఇలా ఉండగా, కొత్త సీఎం నితీశ్కు అభినందనలు తెలుపుతూనే.. ఐదేళ్లు ఎన్డీయే ముఖ్యమంత్రిగానే నితీశ్ కొనసాగుతారని ఆశిస్తున్నట్లు లోక్జనశక్తి పార్టీ ప్రెసిడెంట్ చిరాగ్ పాశ్వాన్ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. నితీశ్కుమార్ బీజేపీ నామినేట్ చేసిన ముఖ్యమంత్రి అని కొత్త సీఎం నితీశ్కు మాజీ సహచరుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చురకలంటించారు. రాజకీయంగా అలసి పోయిన నేత ముఖ్యమంత్రిత్వంలో ప్రజలు నీరసపాలన అనుభవించక తప్పదన్నారు. ప్రధాని అభినందనలు న్యూఢిల్లీ: బిహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్డీయే కుటుంబం కలసికట్టుగా కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర సంక్షేమం కోసం కేంద్రం తరఫున సాధ్యమైన సాయం చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రులుగా ప్రమాణం చేసిన నాయకులను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. -
బిహార్ సీఎంగా మళ్లీ నితీశ్
పట్నా: బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ వరుసగా నాలుగోసారి సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బొటాబొటి మెజార్టీతో నెగ్గిన ఎన్డీయే కూటమి ముందే ప్రకటించినట్టుగా సీఎం పగ్గాలు నితీశ్కే అప్పగించింది. ఆదివారం పట్నాలో జరిగిన ఎన్డీయే కూటమి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేలు తమ శాసనసభా పక్ష నేతగా నితీశ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 243 సీట్లున్న అసెంబ్లీలో 125 సీట్ల మెజార్టీతో అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. సుపరిపాలనా దక్షుడిగా పేరు తెచ్చుకున్న నితీశ్కుమార్ కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ సమయంలో వలస కార్మికుల సమస్యను ఎదుర్కోవడంలో విఫలం కావడంతో చాలా మంది ఆయనకు వ్యతిరేకమయ్యారు. గత అసెంబ్లీతో పోల్చి చూస్తే నితీశ్ పార్టీ జనతాదళ్ యునైటెడ్ (జేడీ–యూ) బలం 71 నుంచి 43కి పడిపోయింది. అయినప్పటికీ ముందుగా చేసిన నిర్ణయానికి కట్టుబడి ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు మిస్టర్ క్లీన్ ముద్ర ఉన్న నితీశ్కు మళ్లీ ముఖ్యమంత్రి పదవిని అప్పగించారు. గవర్నర్ని కలుసుకున్న నితీశ్ ఎన్డీయే శాసనసభా పక్షనాయకుడిగా ఎన్నికైన వెంటనే నితీశ్ కుమార్ రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ ఫాగూ చౌహాన్ను కలుసుకున్నారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఆయనని కోరారు. ఎన్డీయే పార్టీల ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన పత్రాన్ని గవర్నర్కు సమర్పించారు. అనంతరం నితీశ్ విలేకరులతో మాట్లాడుతూ సోమవారమే తాను పదవీ ప్రమాణం చేయనున్నట్టుగా చెప్పారు. ‘‘ఎన్డీయే కూటమిలో నాలుగు పార్టీల ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖని గవర్నర్కి సమర్పించాను. గవర్నర్ ఆదేశం మేరకు సోమవారం సాయంత్రం 4–4:30 మధ్య రాజ్భవన్లో పదవీ ప్రమాణ స్వీకారం చేస్తాను’’అని చెప్పారు. ఎన్డీయే కూటమి సమావేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పార్టీ రాష్ట్ర ఇన్ చార్జ్ భూపేంద్ర యాదవ్, ఎన్నికల ఇన్చార్జ్ ఫడ్నవీస్ హాజరయ్యారు. బీజేపీ శాసనసభా పక్ష నేతగా తార్ కిశోర్ బిహార్ ఉప ముఖ్యమంత్రి పదవి ఈసారి ఇద్దరిని వరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కతిహర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన తార్ కిశోర్ ప్రసాద్, బెత్తాహ్ ఎమ్మెల్యే రేణుదేవిలను డిప్యూటీ సీఎంలుగా దాదాపు ఖరారు అయినట్టే. అసెంబ్లీలో బీజేపీ శాసనసభా పక్ష నాయకునిగా తార్ కిశోర్ ప్రసాద్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో ఆయనే డిప్యూటీ సీఎం పగ్గాలు చేపడతారని భావిస్తున్నారు. ఇన్నాళ్లూ డిప్యూటీ సీఎంగా వ్యవహరించిన సుశీల్ కుమార్ మోదీకి కేంద్రంలో పదవి అప్పగించే అవకాశాలున్నాయి. బీజేపీ శాసనసభ పక్ష సమావేశంలో ఆయనే ప్రసాద్ పేరు ప్రతిపాదించారు. బీజేపీఎల్పీ ఉప నేతగా రేణు దేవిని ఎన్నుకోవడంతో ఆమెకు కూడా డిప్యూటీ సీఎం పదవి లభిస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎవరీ తార్కిశోర్ ప్రసాద్ ? రాజకీయవర్గాల్లో పెద్దగా పరిచయం లేని ప్రసాద్ (52) ఎంపికపై అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ ఏబీవీపీ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ప్రసాద్ వెనుకబడిన కల్వార్ సామాజిక వర్గానికి చెందినవారు. కతిహర్ నుంచి వరుసగా నాలుగోసారి ఎమ్మెల్యే అయ్యారు. తార్ కిశోర్, రేణు దేవి -
బిహార్ మంత్రివర్గం రాజీనామా
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ శుక్రవారం ఆ రాష్ట్ర గవర్నర్ ఫగూ చౌహాన్ని కలిశారు. తన మంత్రివర్గ రాజీనామాను సమర్పించి, అసెంబ్లీని రద్దుచేయాలని సిఫారసు చేశారు. దీంతో బిహార్లో నితీశ్ నేతృత్వంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. నితీశ్ రాజీనామాను గవర్నర్ ఆమోదించి, ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు అయ్యేంత వరకు తాత్కాలిక ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరారు. అంతకుముందు సీఎం అధికార నివాసంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు జేడీయూ, బీజేపీ, హెచ్ఏఎం, వికాస్శీల్ ఇన్సాన్ పార్టీల నాయకులు భేటీ అయ్యారు. కొత్త ఎన్నికైన ఎన్డీయే ఎమ్మెల్యేలంతా ఆదివారం మధ్యాహ్నం సమావేశమై నితీశ్ను తమ నేతగా ఎన్నుకోనున్నారు. బిహార్లో జేడీయూ కన్నా బీజేపీ 31 స్థానాలు అధికంగా గెలుపొందినప్పటికీ, ప్రధాని, బీజేపీ అధిష్టానం నితీశ్ కుమార్నే కాబోయే ముఖ్యమంత్రిగా ప్రకటించడం విశేషం. ఉప ముఖ్యమంత్రిగా దళిత వర్గానికి చెందిన బీజేపీ నేత కామేశ్వర్ చౌపాల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈయనకు సంఘ్పరివార్తో అనుబంధం ఉంది. ఇలా ఉండగా, స్వతంత్ర ఎమ్మెల్యే చకాయ్ సుమిత్ సింగ్ ఎన్డీయేకి మద్దతు ప్రకటించారు. -
నితీష్ కుమారే బీహార్ సీఎం: ఎన్డీయే
బిహార్: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ(73) కంటే జేడీ(యూ) (43) తక్కువ స్థానాల్లో విజయం సాధించడంతో నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రిగా కొనసాగుతారా లేదా అనే ఊహగానాలకు తెరపడింది. బిహార్ పగ్గాలు మరోసారి జేడీయూ అధినేత నితీష్ కుమారే చేపడతారని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. దీపావళి తరువాత నితీష్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్టు జేడీయూ ఎంపీ కెసి త్యాగి తెలిపారు. నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉంటారా..లేరా... అనే విషయంపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ స్పందిస్తూ.. నితీష్ కుమార్ను జాతీయ రాజకీయాల వైపు రావాలని సెక్యులర్ నాయకులతో కలిసి దేశాన్ని విచ్ఛిన్నం చెయ్యాలని చూస్తున్న వారికి వ్యతిరేకంగా పని చెయ్యాలని, బీహార్ నితీష్ స్థాయికి చిన్నదైపోయిందంటూ ట్వీట్ చేశారు. (చదవండి : నితీష్ సీఎం అయితే మాదే క్రెడిట్: శివసేన) దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ నితీష్ కుమార్ బీజేపీ నాయకుడని, గెలుపోటములు ఆయన స్థాయిని దిగజార్చవని, ఆయనపై విమర్శలు చేసిన ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ను ప్రజలు తిరస్కరించారని, దిగ్విజయ్ తన రాష్ట్రంలో తన పార్టీ రాజకీయాలను చూసుకోవాలని విమర్శించారు. ఇదే అంశంపై బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్మోదీ మాట్లాడుతూ.. బిహార్లో ఎన్డీయే కూటమి విజయం సాధించిందని, ఇది ఏ ఒక్క పార్టీ గెలుపు కాదని, సమిష్టి విజయమన్నారు. బిహార్ ప్రజలు ఎన్డీయే కూటమిపై నమ్మకముంచి పట్టం కట్టారన్నారు. కాగా, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే 125 కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో బీజేపీ 74 స్థానాలు, జేడీయూ 43 స్థానాలు గెలుచుకుంది. -
ఇవే నా చివరి ఎన్నికలు: నితీశ్
పట్నా: ఈ అసెంబ్లీ ఎన్నికలే తన చివరి ఎన్నికలని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రకటించారు. ఆ తర్వాత రాజకీయాల నుంచి తప్పుకుంటానని పూర్ణియాలో గురువారం ఎన్నికల ప్రచార సభలో స్పష్టం చేశారు. ‘ఇవే నా చివరి ఎన్నికలు. ఆ తర్వాత మళ్లీ పోటీ చేయను. పదవీ విరమణ చేస్తాను. అంతా బాగున్నప్పుడే మనం తప్పుకోవాలి’అని ఎన్నికల సభలో అనూహ్యంగా తన నిర్ణయాన్ని ప్రకటించారు. నితీశ్ తన రాజకీయ జీవితంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత సంక్లిష్టమైన ఎన్నికల్ని ఈ సారి ఎదుర్కొంటున్నారు. దీంతో ఓటర్లను ఆకర్షించడానికే చివరి ఎన్నికలంటూ ఒక కొత్త స్టంట్కు తెరతీశారని ప్రత్యర్థులు వ్యాఖ్యానించారు. బీజేపీ స్టార్ క్యాంపెయినర్ అయిన యోగి ఒక ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ చొరబాటుదారుల సమస్యను పరిష్కరించడానికి ప్రధాని మోదీ సీఏఏని తీసుకువచ్చారంటూ వివాదాన్ని రేపారు. ఈ వ్యాఖ్యలపై నితీశ్ ధ్వజమెత్తారు. ఏమిటీ నాన్సెన్స్ ? ఎవరీ చెత్త మాట్లాడుతున్నారు అంటూ విరుచుకుపడ్డారు. బిహార్లో ముస్లిం మైనార్టీలు నితీశ్ పక్షానే ఉన్నారు. యోగి వ్యాఖ్యలతో వారెక్కడ దూరం అవుతారోనన్న భయం ఆయనని వెంటాడుతోంది. బిహార్ అభివృద్ధికి నితీశే ఉండాలి: మోదీ బిహార్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగేందుకు నితీశ్ కుమార్ ప్రభుత్వం అవసరం ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. రాష్ట్రాభివృద్ధి విషయంలో ప్రజలకు ఎన్డీఏయేపై మాత్రమే పూర్తి నమ్మకం ఉందన్నారు. అరాచక వాతావరణాన్ని సృష్టించిన 2005 ముందు నాటి పాలన పరిస్థితుల నుంచి రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే తేరుకుంటోందనీ, సంస్కరణల ప్రక్రియ ప్రారంభమైందని ఆయన అన్నారు. -
రెబల్స్కు ఫడ్నవీస్ వార్నింగ్ !
బిహార్: లోక్ జన్శక్తి పార్టీ తరపున ఎవరైనా పోటీ చేయాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని మహారాష్త్ర మాజీ ముఖ్యమంత్రి, బిహార్ ఎన్నికల ఇన్ఛార్జి దేవేంద్ర ఫడ్నవీస్ హెచ్చారించారు. భాజపా నుంచి కొందరు రెబల్స్ ఎల్జేపీ తరుపున పోటీ చేస్తున్నట్లు సమాచారం రావడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేకంగా ఎవరి పేర్లు బయటకు చెప్పనప్పటికీ ఈ హెచ్చరిక రెబల్స్కే అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ ముఖ్య నేతలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన ఫడ్నవీస్, బిహార్లో ఎన్డీయే ముఖ్యమంత్రి అభ్యర్థి నితీశ్ కుమారే అని వెల్లడించారు. ఎన్నికల తర్వాత భాజపా- ఎల్జేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్న ఆరోపణలను ఆయన కొట్టిపడేసారు. ముఖ్యమంత్రి కావాలని చిరాగ్ పస్వాన్ ఆశిస్తున్నాడని, అది సాధ్యమయ్యే పని కాదని ఫడ్నవీస్ తెలిపారు. మోది పేరు వాడొద్దు... భాజపా రాష్త్ర అధ్యక్షుడు సంజయ జైశ్వాల్, బిహార్ ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ... బిహార్లో ఎన్డీయే తరపున పోటీ చేసే అభ్యుర్థులు కచ్చితంగా నితీశ్ కుమార్ నాయకత్వాన్ని ఆహ్వానించాలన్నారు. ఎన్డేయేతర అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోది పేరును వాడుకొని ఓట్లు అడిగే హక్కు లేదని, అలా చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
రైలు టిక్కెట్లకు డబ్బులు ఇవ్వొద్దు: సీఎం
పట్నా: కేంద్ర ప్రభుత్వానికి బిహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ ధన్యవాదాలు తెలిపారు. లాక్డౌన్తో ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న బిహారీలను తరలించడానికి ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయాలన్న తన సూచనను పాటించినందుకు సంతోషంగా ఉందన్నారు. శ్రామిక్ ప్రత్యేక రైళ్లలో బిహార్ వచ్చే వారు టిక్కెట్లకు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే వారి కోసం క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు క్వారంటైన్లో 21 రోజులు పాటు ఉండాల్సివుంటుందని సీఎం నితీశ్ స్పష్టం చేశారు. క్వారంటైన్ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరికి బిహార్ ప్రభుత్వం వెయ్యి రూపాయల సహాయం అందజేస్తుందని చెప్పారు. ఈ పథకంలో కింద బిహార్లో ఇప్పటికే 19 లక్షల మందికి వెయ్యి రూపాయల చొప్పున ఇచ్చామని వెల్లడించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బిహారీలకు ఎటువంటి సమస్యలు రాకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. (వామ్మో.. ఇంత పేద్ద ‘బారా’) యూపీని చూసి నేర్చుకోండి: బీజేపీ కాగా, సొంత ప్రభుత్వంపై బీజేపీ నాయకుడు సంజయ్ జైశ్వాల్ విమర్శలు గుప్పించారు. లాక్డౌన్ 3.0 అమలు, వలసదారులను తిరిగి తీసుకువచ్చే రైళ్ల వివరాలపై నితీశ్ సర్కారుకు స్పష్టత లేదని ఫేస్బుక్లో విమర్శించారు. ఉత్తరప్రదేశ్ నుంచి బిహార్ పాఠాలు నేర్చుకోవాలని సలహాయిచ్చారు. బిహార్ ప్రభుత్వంలో భాగస్వామి అయిన బీజేపీ నుంచి విమర్శలు ఎదుర్కొవడం జేడీ(యూ) సర్కారు తలనొప్పిగా మారింది. (బీజేపీకి ఒక్క సీటు కూడా రాదు..) -
పోర్న్ సైట్ల వల్లే రేప్లు: నితీశ్
గోపాల్గంజ్: పోర్న్ సైట్ల కారణంగానే మహిళలపై లైంగిక నేరాలు పెరుగుతు న్నాయని బిహార్ సీఎం నితీశ్ కుమార్ వ్యాఖ్యా నించారు. పోర్న్సైట్లను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు తెలిపారు. ‘దిశ’ ఘటనపై ఆయన మాట్లాడుతూ.. ‘సోషల్ మీడియా, సాంకేతికత పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేయడం వల్లే మహిళలు, చిన్నారులపై దేశమంతటా ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. నేరగాళ్లు వీటిని చిత్రీకరించి, ఇంటర్నెట్లో పెడుతున్నారు. వీటిని చూసి ఇతరులు దారుణాలకు పాల్పడుతున్నారు. అందుకే ఈ పోర్న్ సైట్లపై దేశంలో పూర్తి నిషేధం విధించాలని కేంద్రానికి లేఖ రాస్తా’ అని వెల్లడించారు. -
'15ఏళ్లు పైబడిన ప్రభుత్వ వాహనాలు నిషేధం'
పాట్నా : బీహార్లో నితీశ్కుమార్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో 15 సంవత్సరాలకు పైబడిన ప్రభుత్వ వాహనాలను సోమవారం నుంచే పూర్తిగా నిషేదించినట్లు నిర్ణయం తోసుకుంది. ఈ సందర్భంగా కాలుష్య నియంత్రణపై ముఖ్యమంత్రి అధ్యక్షతన నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశం అనంతరం రాష్ట్ర ముఖ్య కార్యదర్శి దీపక్ కుమార్ విలేకరులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఇటివలే పండుగ సీజన్లో నమోదైన కాలుష్య స్థాయిని గమనిస్తే అందులో ఈ వాహనాల నుంచి వెలువడే పొగ కాలుష్యం అధికంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అందుకే పాట్నా మెట్రో పాలిటన్ ఏరియాలో 15 ఏళ్లకు పైబడిన ప్రభుత్వ వాహనాలను నిషేదించామని తెలిపారు. అయితే ప్రైవేటు వాహనాలను ఈ నిషేధం నుంచి మినహాయించామని, కానీ యజమానులు తమ వాహనాలకు కొత్తగా కాలుష్య పరీక్షలు చేయించి ధృవీకరణ పత్రాలను పొందాల్సి ఉంటుదన్నారు. దీని కోసం ప్రత్యేకంగా మంగళవారం నుంచి ఇంటెన్సివ్ డ్రైవ్ నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మంగళవారం జారీ చేస్తామని, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. అలాగే కిరోసిన్తో నడుస్తూ అధిక కాలుష్యాన్ని వెదజల్లుతున్న ఆటో రిక్షాలు కొత్తగా పొల్యుషన్ టెస్ట్ను చేయించుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో డీజిల్తో నడుస్తున్న ఆటో రిక్షాలను త్వరలోనే పూర్తిస్థాయి సీఎన్జీ లేదా ఎలక్ట్రిక్తో నడిచే విధంగా రూపొందించనున్నట్లు తెలిపారు. వీటిని మార్చుకోవడానికి ఆటో యజమానులకు ప్రోత్సాహం కింద సబ్సిడీలు కూడా అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రజా ప్రాధిపాదిత ప్రాజెక్టుల నిర్మాణ స్థలాల కోసం ప్రభుత్వం మార్గదర్శకాలను ప్రభుత్వం రూపొందించింది. అదే విధంగా ప్రైవేట్ భవనాలకు సంబంధించి మునిసిపల్ కార్పొరేషన్లకు ఆదేశాలు ఇచ్చామని ఆయన చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో సౌండ్లెస్ జనరేటర్లను మాత్రమే ఉపయోగించుకునేలా సూచనలు జారీ చేసినట్లు తెలిపారు. చెత్తను పారవేసే ట్రక్కులు, ఇతర వ్యాన్లు డంపింగ్ యార్డుకు తీసుకెళ్లే మార్గంలో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చెత్తను పూర్తిగా కవర్లతో కప్పి ఉంచాలని ఆదేశించినట్లు తెలిపారు. -
సీఎం నితీశ్కు నిరసన సెగ
ముజఫర్పూర్/పట్నా: మెదడువాపు వ్యాధితో తమ పిల్లలను కోల్పోయిన బాధలో ఉన్న తల్లిదండ్రులు ఆస్పత్రిని సందర్శించిన బిహార్ సీఎం నితీశ్కుమార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముజఫర్పూర్ జిల్లాలో ఇప్పటి వరకూ 100 మందికి పైగా పిల్లలు మెదడువాపు వ్యాధితో మరణించడం తెల్సిందే. వ్యాధి వ్యాప్తిపై పట్నాలో అధికారులతో భేటీ తర్వాత నితీశ్ ముజఫర్పూర్లోని ఆస్పత్రి ఐసీయూలోకి వెళ్లారు. దీంతో అక్కడ కొందరు ‘నితీశ్ గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. నితీశ్ ఐసీయూలోకి రాగానే పిల్లల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. మా బిడ్డలను కాపాడండి సారూ అంటూ భోరున విలపించారు. నితీశ్ వారిని పరామర్శించి బిడ్డల పరిస్థితిని గురించి డాక్టర్ల వద్ద వాకబు చేశారు. త్వరలోనే కృష్ణా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ను 600 పడకల స్థాయి నుంచి 2,500 పడకల స్థాయికి చేరుస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దీపక్ కుమార్ చెప్పారు. -
చిన్నారుల మృతికి కారణాలివే..
సాక్షి, న్యూఢిల్లీ : బిహార్లోని ముజఫర్పూర్లో వందకు పైగా చిన్నారులు ఎక్యూట్ ఎన్ఫలైటిస్ సిండ్రోమ్ (ఏఈఎస్)తో బాధపడుతూ మరణించిన ఘటనపై స్ధానిక ఎంపీ అజయ్ నిషాద్ స్పందించారు. చిన్నారుల మృతులను తగ్గించేందుకు తక్షణ చర్యలు చేపట్టాల్సి ఉందని అన్నారు. వడగాడ్పులతో పాటు అపరిశుభ్ర వాతావరణం, పేదరికం, మారుమూల ప్రాంతాల్లో నివసించడం చిన్నారులు ఈ వ్యాధితో మృత్యువాత పడటానికి ప్రధాన కారణాలని ఎంపీ విశ్లేషించారు. రోగులంతా నిరుపేద కుటుంబాలకు చెందిన వారని, వారు ఉంటున్న ప్రాంతాల్లో అపరిశుభ్రత రాజ్యమేలుతోందని ఈ పరిస్ధితులను చక్కదిద్దాల్సిన అవసరం ఉందని ఎంపీ పేర్కొన్నారు. మరోవైపు చిన్నారులు చికిత్స పొందుతున్న ముజఫర్పూర్లోని కృష్ణ మెడికల్ కాలేజి ఆస్పత్రిని బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సందర్శించి చిన్నారుల ఆరోగ్య పరిస్ధితిని సమీక్షించారు. ముజఫర్పూర్లో ఏఈఎస్ వ్యాప్తి ప్రబలిన రెండు వారాల తర్వాత సీఎం ఆస్పత్రిని సందర్శించడం పట్ల రోగుల బంధువులు బిహార్ సీఎం నితీష్ కుమార్ రాకను వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు. -
ఈబీసీ కోటా అమలుకు రెడీ
పట్నా : అగ్రవర్ణ పేదలకు జనరల్ కోటాలో పది శాతం రిజర్వేషన్ కల్పించేందుకు అవసరమైన న్యాయ సలహా తీసుకుంటున్నామని, త్వరలోనే దీని అమలుకు పూనుకుంటామని బిహార్ సీఎం నితీష్ కుమార్ వెల్లడించారు. అగ్రవర్ణ పేదలకు జనరల్ కోటాలో పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాజ్యాంగ సవరణను చేపట్టిన సంగతి తెలిసిందే. అత్యంత వెనుకబడిన కులాల వారికి జాతీయ స్దాయిలో ప్రత్యేక రిజర్వేషన్ను కల్పించాలని నితీష్ కుమార్ డిమాండ్ చేశారు. కాగా తమ పార్టీ పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకమని ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. బిహార్లో ఇటీవల చోటుచేసుకున్న మూక హత్యలను ప్రస్తావిస్తూ ఇవి శాంతి భద్రతల సమస్యకు సంబంధించినవి కావని, వీటిని నియంత్రించేందుకు సామాజిక చైతన్యం పెరిగేలా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలన్నారు. -
మళ్లీ ఆయనే సీఎం కావాలంటున్నారు!
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నాయకుడు నితీశ్ కుమార్కు ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. మళ్లీ ఆయనే ముఖ్యమంత్రి కావాలని బిహార్ ప్రజలు కోరుకుంటున్నారు. రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్ పార్టీలతో బంధాన్ని తెంచుకుని బీజేపీతో జతకట్టి ఏడాది పూర్తైంది. ఈ సందర్భంగా ఇండియాటుడే సర్వే నిర్వహించింది. ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ 46 శాతం మంది మద్దతు ప్రకటించారు. బీజేపీతో కలవడం వల్ల ఆయన విశ్వసనీయత కోల్పోలేదని 56 శాతం మంది అభిప్రాయపడ్డారు. నితీశ్ ప్రభుత్వం నుంచి ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలను వెళ్లగొట్టిన తర్వాత రాష్ట్రంలో అవినీతి తగ్గిందా? అని ప్రశ్నించగా 49 శాతం మంది అవునని సమాధానం ఇచ్చారు. 40 శాతం కాదని చెప్పారు. 11 శాతం మంది తటస్థంగా ఉండిపోయారు. ఈనెల 22 నుంచి 26 వరకు 40 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ద్వారా సర్వే నిర్వహించినట్టు ఇండియా టుడే వెల్లడించింది. 2020లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2017, జూలైలో మహాకూటమి నుంచి నితీశ్ కుమార్ బయటకు వచ్చారు. ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి 2015 ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత.. నితీశ్ ఈ రెండు పార్టీలను వదిలేసి బీజేపీతో జత కట్టడాన్ని అప్పట్లో చాలా మంది తప్పుబట్టారు. కమలం పార్టీతో పొత్తు అనైతికమని దుయ్యబట్టారు. అయితే తాజా సర్వేలో నితీశ్కు ప్రజలు జై కొట్టడం విశేషం. -
బీజేపీతో నితీష్ కటీఫ్..?
సాక్షి, పట్నా : బీజేపీతో మరోసారి తెగదెంపులకు బిహార్ సీఎం నితీష్ కుమార్ సంసిద్ధమవుతున్నారా అనే సంకేతాలు వెల్లడవుతున్నాయి. ఎన్డీఏ కూటమిలో బీజేపీతో నితీష్ అసౌకర్యంగా ఉన్నారనే వార్తలకు బలం చేకూరుతోంది. జేడీ(యూ)-బీజేపీ మధ్య సంబంధాలు గత రెండు వారాలుగా జరుగుతున్న పరిణామాలతో బెడిసికొట్టాయనే ప్రచారం సాగుతోంది. బీజేపీ పెద్దన్న తీరుతో నితీష్ విసిగిపోయారని, ఇటీవల నాలుగు సందర్భాల్లో బీజేపీ వ్యవహరశైలిపై ఆయన గుర్రుగా ఉన్నారని చెబుతున్నారు. నోట్ల రద్దుపై నితీష్ యూటర్న్ సైతం ఇవే సంకేతాలు పంపుతోంది. పట్నాలో జరిగిన ఓ బ్యాంకింగ్ సదస్సులో పాల్గొన్న నితీష్ నోట్ల రద్దును తాను గట్టిగా సమర్ధించానని, అయితే దీనివల్ల ఎంతమంది ప్రజలు లబ్ధిపొందారని ఆయన ప్రశ్నించారు. పలుకుబడి కలిగిన కొందరు సంపన్నులు పెద్దమొత్తంలో సొమ్మును ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించారని, పేదలు మాత్రం నగదు అందుబాటులో లేక ఇబ్బందులు పడ్డారని అన్నారు. విపక్షాలు సైతం ఇదే తరహాలో మోదీ సర్కార్ నోట్ల రద్దు నిర్ణయాన్ని తప్పుబట్టాయి. మరోవైపు వరద సాయంపై బిహార్కు రూ 7,363 కోట్లు ప్రకటించిన కేంద్రం తాజాగా కేవలం రూ 1750 కోట్లు మంజూరు చేసి చేతులు దులుపుకోవడం సైతం నితీష్కు ఆగ్రహం తెప్పించినట్టు చెబుతున్నారు. అసమ్మతి బాహాటంగా వ్యక్తం చేసే క్రమంలోనే నితీష్ కుమార్ బిహార్కు ప్రత్యేక ప్యాకేజ్ డిమాండ్ను మళ్లీ తెరపైకి తెచ్చారని భావిస్తున్నారు.2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విపక్షాలు మోదీకి వ్యతిరేకంగా ఏకమవుతున్న నేపథ్యంలో నితీష్ వైఖరి ఆసక్తికరంగా మారింది. -
బిహార్ బుక్లెట్పై పాకిస్తాన్ బాలిక
పట్నా: బిహార్లో ‘స్వచ్ఛ్ జమయి, స్వస్థ్ జమయి ప్రచారానికి ముద్రించిన బుక్లెట్ కవర్పేజీపై పాకిస్తాన్ బాలిక చిత్రం ఉండటం విమర్శలకు దారితీసింది. ఐదేళ్ల ఆ బాలిక కుర్చీలో కూర్చుని పాకిస్తాన్ జాతీయ పతాకాన్ని గీస్తున్నట్లు అందులో కనిపిస్తోంది. పాకిస్తాన్లో బాలికా విద్యపై అవగాహన పెంచేందుకు యూనిసెఫ్ ఆ ఫొటోను గతంలో వాడింది. పొరపాటున ఆ ఫొటో స్వచ్ఛ్ బుక్లెట్లోకి వచ్చిందని జముయి జిల్లా అధికారులు చెప్పారు. సుమారు 5 వేల బుక్లెట్లపై పాక్ బాలిక చిత్రం ముద్రితం కావడంపై బిహార్ సీఎం నితీశ్ స్వతంత్ర విచారణకు ఆదేశించారు. ఆ ప్రతులను జముయి జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో పంపిణీ చేశారు. -
ఐశ్వర్య రాయ్తో తేజూ పెళ్లి: వైరల్
పట్నా : తేజ్ ప్రతాప్ యాదవ్- ఐశ్వర్య రాయ్ల పెళ్లి వార్త దేశమంతటా ఆసక్తి రేపుతున్నది. లక్షల మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ముహుర్తం ఖరారైంది. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఇంట పెళ్లి సందడి మొదలుకానుంది. బీహార్ మాజీ ముఖ్యమంత్రి దరోగా ప్రసాద్ రాయ్ మనుమరాలు, ఢిల్లీ యూనివర్సిటీ పూర్వ విద్యార్థిని ఐశ్వర్యా రాయ్తో తేజ్ ప్రతాప్ పెళ్లి ఫిక్స్ అయినట్లు యాదవ్ పరివారం వెల్లడించింది. ఏప్రిల్ 18న నిశ్చితార్థం, వచ్చే నెలలో పెళ్లి జరిపించేందుకు ఇరు కుటుంబాలూ అంగీకరించినట్లు సన్నిహితులు తెలిపారు. పట్నాలోని వెటర్నరీ కాలేజీ గ్రౌండ్స్లో పెళ్లి వేడుకలు జరుగుతాయని సమాచారం. ఐశ్వర్యదీ పెద్ద కుటుంబమే: లాలూ ఇంటి కోడలిగా రానున్న ఐశ్వర్యరాయ్దీ పెద్ద కుటుంబమే. ఆమె తాత దరోగా ప్రసాద్ రాయ్ బీహర్లో యాదవ సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రిగా ఎన్నికైన తొలి వ్యక్తి. ఐశ్వర్య తండ్రి చంద్రికా రాయ్ బిహార్ మంత్రిగానూ పనిచేశారు. ఢిల్లీ యూనివర్సిటీలో ఉన్నత విద్యనభ్యసించిన ఐశ్వర్యకు ఎన్నో సంస్థల్లో ఉద్యోగావకాశాలు లభించినప్పటికీ తిరస్కరించిందని ఆమె బంధువులు తెలిపారు. పెళ్లి ఖరారు కావడంతో లాలూ సతీమణి, మాజీ సీఎం రబ్రీ దేవి ‘కోడళ్ల అన్వేషణ’ సగం ఫలించినట్లైంది. తేజ్ ప్రతాప్ సోదరుడు తేజస్వీ యాదవ్కు ఇప్పటికే 40వేల పెండ్లి ప్రపోజల్స్ వచ్చాయి. చిన్న కొడుకు పెళ్లి కూడా చేసేస్తే తన అన్వేషణ పూర్తవుతుందని రబ్రీ పలు మార్లు చమత్కరించిన సంగతి తెలిసిందే. గతంలో ‘పెద్దవాళ్లను గౌరవిస్తూ, ఇంటిని చక్కగా నడిపించే కోడలు దొరికితే చాలు’ అంటూ రబ్రీ దేవి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో.. ‘సంస్కారమున్న కోడలు అంటే గృహిణిగా ఉండటమే కాదని.. ప్రేమ, ఆప్యాయతలు కురిపించి కుటుంబాన్ని తీర్చిదిద్దే లక్షణాలున్న గృహిణి అయినా, ఉద్యోగస్తురాలైనా కావచ్చు’ అంటూ లాలూ ట్వీట్ చేశారు. -
‘నితీష్ పిరికిపంద’
సాక్షి,పాట్నా : బిహార్ సీఎం నితీష్ కుమార్పై ఆర్జేడీ నేత, బిహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. నితీష్ కుమార్ను పిరికిపందగా అభివర్ణించారు. రాష్ట్రంలోని అరారియా, భాగల్పూర్, దర్భంగాల్లో ఇటీవల చెలరేగిన హింసకు నితీషే బాధ్యత వహించాలని అన్నారు. నితీష్ భయంతో నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. హింసకు ప్రేరేపించింది బీజేపీ వారే అయినా సీఎం నితీష్ కుమార్ దీనికి బాధ్యత వహించాలని తేజస్వి యాదవ్ స్పష్టం చేశారు. బీజేపీ సీనియర్ నేత గిరిరాజ్ సింగ్ పైనా ఆరోపణలు చేశారు. దళితుల భూములను గిరిరాజ్ సింగ్ ఆక్రమించిని ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఆరోపించారు. హింసకు పాల్పడుతున్న నిందితులు ఎలాంటి భయం లేకుండా కుంభకోణాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. నితీష్ పిరికిపందలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గిరిరాజ్ సింగ్ బీహార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నా నితీష్ కుమార్ చోద్యం చూస్తున్నారని అన్నారు. -
28 ఏళ్ల బచ్చాను.. నితీశ్ దుమ్ము దులిపా!
సాక్షి, పట్నా: ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఓ లోక్సభ స్థానాన్ని, ఓ అసెంబ్లీ సీటును ఆర్జేడీ సొంతం చేసుకుంది. ఓ స్థానంలో మాత్రం బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గొలుపొందారు. అయితే ఎన్నికలకు ముందు తాను ఏం చెప్పానో గుర్తుచేసుకోవాలని బిహార్ సీఎం నితీశ్ కుమార్కు ఆర్జేడీ నేత, మాజీ మంత్రి తేజస్వీ యాదవ్ సూచించారు. ఉప ఎన్నికల విజయాన్ని ఆస్వాదించే సమయం తన వద్ద లేదని రైతులు, రాష్ట్రంలో ఎన్నో సమస్యలపై పోరాడాల్సి ఉందన్నారు తేజస్వీ. తాను 28 ఏళ్ల బచ్చానని, చాచా(నితీశ్) మీరు 67 ఏళ్ల వ్యక్తి అయినా ఎన్నికల్లో సత్తా చాటి చూపిస్తానని సీఎం నితీశ్కు వారం రోజుల ముందే చెప్పానన్నారు తేజస్వీ. బిహార్ మాజీ సీఎం, తేజస్వీ తండ్రి లాలు ప్రసాద్ యాదవ్ జైలుకెళ్లిన తర్వాత జరిగే ఎన్నికల్లో తామే విజయం సాధిస్తామని జేడీయూ చీఫ్, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ధీమాగా ఉన్నారు. కానీ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత నితీశ్ వెనుకంజ వేస్తున్నారని ఇకనైనా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని తేజస్వీ అభిప్రాయపడ్డారు. గత ఎన్నికల్లో బీజేపీ బిహార్ రైతులకిచ్చిన ఇచ్చిన హామీల అమలుపై పోరాటం కొనసాగిస్తానని తెలిపారు. ఎన్డీయేతర పార్టీల సీనియర్ నేతలు చర్చించుకుని 2019 ఎన్నికలకు ఇప్పటినుంచే వ్యూహాలు రచించాలని లాలు తనయుడు ఆకాంక్షించారు. 'ఎన్డీఏ కూటమి నుంచి నేడు టీడీపీ వైదొలగింది. నితీశ్ ఇంకా ఏం విషయం తేల్చుకోలేక పోతున్నారు. మహా కూటమి నుంచి బయటకు వచ్చి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నితీశ్ తప్పిదం చేశారు. టీడీపీ బాటలో పయనించి మీరు ఎన్డీఏ నుంచి ఎప్పుడు బయటకొస్తారో చెప్పాలంటూ' నితీశ్ను తేజస్వీ ప్రశ్నించారు. ఉప ఎన్నికల్లో ఓటమితో పాటు ఎన్డీఏ నుంచి వైదొలగే అంశంపై కామెంట్ చేసేంతే వరకూ తాను ప్రశ్నిస్తూనే ఉంటానని తేజస్వీ యాదవ్ స్పష్టం చేశారు. -
‘అతను పప్పు కాదు’
పట్నా: బిహార్లో లోక్సభ ఉప ఎన్నికల్లో ఆర్జేడీ విజయం వెనుక కనిపించని శక్తి తేజస్వీ యాదవ్పై ప్రశంసలుకురుస్తున్నాయి. తండ్రి లాలూ ప్రసాద్ జైలుకెళ్లిన తరువాత ఎదుర్కొన్న మొదటి ఎన్నికల్లోనే ఆర్జేడీ ఘనవిజయం సాధించిన దరిమిలా.. ‘మా నాయకుడు పప్పు కాదు. రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని నడిపించగల సమర్థుడు’అంటూ పార్టీ నాయకులు విశ్వసిస్తున్నారు. అరారీయా , జహనాబాద్ ఉప ఎన్నికల్లో ఆర్జేడీ అభ్యర్ధులు భారీ మెజారిటీతో గెలిచిన సంగతి తెలిసిందే. అరారియా లోక్సభ స్థానంలో బీజేపీ ప్రత్యర్థి ప్రదీప్ కుమార్ సింగ్పై 61 వేల పైచిలుకు ఓట్ల భారీ ఆధిక్యంతో ఆర్జేడీ అభ్యర్థి సర్ఫరాజ్ అలం గెలుపొందారు. సర్ఫరాజ్కు 5,09,334 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి ప్రదీప్ కుమార్కు 4,47,346 ఓట్లు పోలయ్యాయి. ఆర్జేడీ ఎంపీ మహమ్మద్ తస్లిముద్దీన్ మృతితో ఈ అరారియాకకు ఉప ఎన్నిక జరుగగా.. తస్లిముద్దీన్ తనయుడు అలాంను ఆర్జేడీ బరిలోకి దింపింది. తండ్రి తర్వాత ఆయన తనయుడే అరారియాలో (ఆర్జేడీ) ఘనవిజయం సాధించింది. ఇక జహనాబాద్ అసెంబ్లీ స్థానాన్ని కూడా ఆర్జేడీ గెలుచుకుంది. ఆర్జేడీ అభ్యర్థి కృష్ణమోహన్ యాదవ్ ఇక్కడ విజయం సాధించారు. సమీప ప్రత్యర్ధి, జేడీయూకు చెందిన అభిరామ్ శర్మపై 35,000 ఓట్ల మెజార్టీతో కృష్ణమోహన్ గెలుపొందారు. ఈ రెండు స్థానాల్లో ఆర్జేడీ విజయం సాధించడంతో ఆ పార్టీ కార్యకర్తలు తేజస్వీపై ప్రశంసలు కురిపిస్తూ ప్రకటనలు చేస్తున్నారు.మహాకూటమి నుంచి జేడీయూ వైదొలిగిన తర్వాత జరిగిన ఈ ఉప ఎన్నిక ఆ పార్టీ చీఫ్, సీఎం నితీశ్ కుమార్కు పరీక్షగా నిలిచాయన్న సంగతి విదితమే. -
ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యల్లో తప్పేముంది..?
సాక్షి, పాట్నా: సరిహద్దులను కాపాడేందుకు సిద్ధంగా ఉన్నామని ఓ సంస్థ చెబుతున్న మాటలపై వివాదం రేపడం సరికాదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలను బీహార్ సీఎం నితీష్ కుమార్ సమర్ధించారు. మోహన్ భగవత్ వ్యాఖ్యలపై స్పందించాలని మీడియా కోరగా ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలు వివాదాస్పదమైనవా అంటూ ఎదురు ప్రశ్నించారు. అయితే మొత్తం వ్యవహారంపై తనకు అవగాహన లేదని అన్నారు. బీహార్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలు దుమారం రేపాయి. సైనికులను తయారుచేసేందుకు సైన్యం ఆరేడు నెలలు తర్ఫీదు ఇస్తుంటే రాజ్యాంగం అనుమతిస్తే తాము మూడు రోజుల్లోనే సైనికులను సుశిక్షితులుగా తీర్చిదిద్దుతామని ఆయన వ్యాఖ్యానించారు. -
బిహార్ సీఎం కాన్వాయ్పై రాళ్ల దాడి
పట్నా/బక్సార్: బిహార్ సీఎం నితీశ్ కుమార్ కాన్వాయ్పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. వికాస్ సమీక్షా యాత్రలో భాగంగా ఆయన శుక్రవారం బక్సార్ జిల్లా డుమ్రావ్ వైపు వెళ్తుండగా నందన్ గ్రామం దగ్గర్లో దళితవాడలో తాము పడుతున్న ఇబ్బందులను గమనించేందుకు రావాలని కేకలు వేస్తూ కొందరు సీఎం వాహన శ్రేణిపైకి రాళ్లు విసిరారు. ఈ ఘటనలో సీఎంసహా ఎవరూ గాయపడలేదు. రాళ్లను ఎవరు, ఎందుకు విసిరారో తెలియాల్సి ఉంది. కొందరు కావాలనే ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారంటూ అధికార జేడీయూ.. ఆర్జేడీపై విమర్శలు చేసింది. -
నితీశ్ కుమార్దే జేడీ(యూ): ఈసీ
న్యూఢిల్లీ: జేడీ(యూ)పై ఆధిపత్య పోరులో బిహర్ సీఎం నితీశ్ కుమార్ విజయం సాధించారు. పార్టీని, ‘బాణం’ గుర్తును ఆయనకే కేటాయిస్తున్నట్లు శుక్రవారం ఎన్నికల కమిషన్ తేల్చి చెప్పింది. జేడీ(యూ) పార్టీలోని మెజారిటీ శాసనసభ్యులు, జాతీయ కౌన్సిల్ నితీశ్కే మద్దతు తెలిపినట్లు పేర్కొంది. పార్టీని, గుర్తును తమకే కేటాయించాలంటూ శరద్ యాదవ్ వర్గం దాఖలు చేసిన పిటిషన్ ఈసీ తిరస్కరించింది. బీజేపీకి మద్దతు, ఆర్జేడీతో తెగదెంపుల విషయంలో ఇరువురు నేతల మధ్య విభేదాలు రావడంతో పార్టీ రెండుగా చీలింది. దీంతో జేయూ(యూ) అధ్యక్షుడిగా సీనియర్ నేత, ఎమ్మెల్యే చోటుభాయ్ అమర్సాంగ్ వాసవను శరద్ నియమించారు. తమదే అసలైన జేడీ(యూ) అని ఈసీని అమర్సాంగ్ కోరగా ఈసీ శుక్రవారం తన నిర్ణయం వెలువరించింది. -
'లాలూజీ.. మీరో విషయం అర్థం చేసుకోవాలి'
పట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఓ నిరుద్యోగి(పరోక్షంగా పని పాట లేని వ్యక్తి) అని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తీవ్రంగా విమర్శించారు. అందుకే మరో పనిలేక తనపై కట్టుకథలు అల్లుతూ దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. తనకు రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించడం తప్ప మరో పని గురించి ఆలోచించే తీరికే లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీలోని ఎమ్మెల్యేలను తన పార్టీలోకి లాగేసుకునే ప్రయత్నాల్లో నితీశ్ కుమార్ ఉన్నారంటూ ఆర్జేడీ అధినేత లాలూ చేసిన వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు. 'లాలూజీ మీరో విషయం అర్థం చేసుకోవాలి. మీరు (మీడియా ప్రతినిధులు) కూడా ఓ విషయం తెలుసుకోవాలి. ఎప్పుడు కొంతమందిని తన జేబులో పెట్టుకోవడం లాలూకు అలవాటు. అలా ఉండటానికి కొంతమంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు నచ్చక బయటకు వెళుతున్నారు. దీంతో వారిని నైతికత లేనివారిగా అభివర్ణించడమే కాకుండా, మమ్మల్ని తప్పుబడుతున్నారు. కానీ, ఇందులో మా ప్రమేయం లేదు. బిహార్ అభివృద్ధికే మేం కట్టుబడి ఉన్నాం. ఆ విషయం అర్థం చేసుకుంటే మంచిది' అని నితీశ్ హితవు పలికారు. -
నితీశ్ కల చెదిరింది కథ మారింది..
న్యూఢిల్లీ: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కల చెదిరింది...కథ మారింది....ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయ నాయకుడిగా 2019 నాటి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్షాన్ని విజయపథాన నడిపించి ప్రధాన మంత్రి కావాలనుకున్న ఆయన కల చెదిరింది. ఈ విషయంలో గత శనివారం నాడు రాహుల్ గాంధీతో జరిపిన మంతనాలు ఫలించలేదు. అందుకని ఆయన బీజేపీ పెద్దలతో మంతనాలు జరిపి కథను మార్చేశారు. రాత్రికి రాత్రి కాంగ్రెస్, ఆర్జేడీ, జేడీయూలతో కూడిన మహా కూటమి ప్రభుత్వానికి గుడ్బై చెప్పారు. బీజేపీతో కలసి కొత్త ప్రభుత్వానికి కొలువుతీశారు. అవినీతి కేసుల్లో ఇరుక్కుపోయిన డిప్యూటీ ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ రాజీనామాకు ససేమిరా అనడం, ఆయన్ని ఆర్జేడీ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ వెనకేసుకు రావడం తదితర పరిణామాలే మహా కూటమి ప్రభుత్వాన్ని కూల్చివేసిందనేది అర్ధ సత్యమేనన్నది రాజకీయ పరిశీలకుల భావన. ప్రధాన మంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోదీని ఖరారు చేయడంతో సెక్యులర్ భావాలుగల నితీశ్ కుమార్ 2013లో బీజేపీ పొత్తుకు రాం రాం పలికారు. ఇప్పుడు మళ్లీ అదే బీజేపీతో చేతులు కలిపారు. ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీ కలను కూడా చెదరగొట్టిందని చెప్పవచ్చు. 2019 నాటి పార్లమెంట్ ఎన్నికల నాటికి అవినీతికి ఆమడ దూరంగా, ముక్కుసూటిగా నడిచే వ్యక్తిగా పేరున్న నితీశ్ కుమార్ను ముందుపెట్టి ప్రతిపక్షాన్ని విజయపథాన నడిపించాలన్నది కాంగ్రెస్ గాంచిన కల. అసలు ఈ ఆలోచనకు, వ్యూహానికి ఊతమిచ్చిందే నితీశ్ కుమార్. ఈ కల కార్యరూపం దాల్చితే తానే ప్రధాన మంత్రిని కావాలన్నది నితీశ్ కుమార్ కలగా రాజకీయ వర్గాల్లో ఎప్పటి నుంచో ప్రచారం ఉంది. ఈ విషయంలో ఇంతవరకు ఆయనకు కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఇవ్వలేదు. ఆ నాటి పరిస్థితిని బట్టి అప్పుడే నిర్ణయం తీసుకుందామన్నది సోనియా గాంధీ మాటగా ప్రచారమైంది. శనివారం నాడు రాహుల్తో జరిపిన చర్చల్లో ప్రతిపక్ష కూటమికి ఆయనే నాయకుడని స్పష్టం చేసినట్లు తెల్సింది. 13 ఏళ్ల క్రితం యూపీఏకు నాయకత్వం వహించిన సోనియాకున్న పరిణతి, నాయకత్వ లక్షణాలు ఇప్పటికీ కూడా రాహుల్ గాంధీకి లేవన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అదే అభిప్రాయం కలిగిన నితీశ్ కుమార్, ప్రధాన మంత్రి పదవి దక్కనప్పుడు ప్రస్తుతమున్న ముఖ్యమంత్రి పదవే ఎన్నో విధాల ఉత్తమమని భావించి మోదీ, అమిత్షాలు వేసిన స్కెచ్లో ఒదిగిపోయారు. -
మోదీ బంపర్ ఆఫర్
- లాలూను వదిలెయ్.. బీజేపీ మద్దతు తీస్కో.. - సీఎం నితీశ్కు బిహార్ బీజేపీ చీఫ్ సుశీల్ ఓపెన్ ఆఫర్ పట్నా: పశువుల దాణా కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో శరాఘాతం తిన్న ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్పై రాజకీయదాడి మొదలైంది. ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న ఆర్జేడీ, జేడీయూల మధ్య విబేధాలకు ఆజ్యం పోసేలా బిహార్ బీజేపీ చీఫ్ సుశీల్ కుమార్ మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతిపరుడైన లాలూతో తక్షణమే తెగదెంపులు చేసుకోవాలని సీఎం నితీశ్కుమార్ను సుశీల్ మోదీ కోరారు. ప్రభుత్వం నిలబడేందుకు అవసరమైతే బీజేపీ మద్దతు తీసుకోండని ఓపెన్ ఆఫర్ ప్రకటించారు. దాణా కేసులో సోమవారం సుప్రీం తీర్పు అనంతరం మోదీ పట్నాలో విలేకరులతో మాట్లాడారు. ‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సీఎం నితీశ్కు ఓపెన్గా చెబుతున్న.. తక్షణమే లాలూ స్నేహాన్ని వదిలెయ్యండి, ప్రభుత్వం పడిపోకుండా బీజేపీ మద్దతు తీస్కోండి’అని సుశీల్ మోదీ వ్యాఖ్యానించారు. గత సార్వత్రిక ఎన్నికల కంటే ముందు 17 సంవత్సరాలపాటు జేడీయూ- బీజేపీలు మిత్రులుగా ఉన్నారని గుర్తుచేశారు. కాగా, లాలూకు వ్యతిరేకంగా చక్రం తిప్పడంలోనూ నితీశ్ కీలక భూమిక పోషించారని సుశీల్ మోదీ ట్విస్ట్ ఇచ్చారు. సీఎం నితీశ్ కుమార్ ఆదేశాల మేరకే లాలూ ప్రసాద్ యాదవ్తోపాటు ఆర్జేడీకి చెందిన మంత్రుల ఫోన్లు ట్యాప్ అయ్యాయని మోదీ చెప్పారు. ‘లాలూ ఎవరెవరితో ఫోన్లో ఏమేం మాట్లాడుతున్నారో నితీశ్కు తెలుసు. లాలూను బలహీనపర్చడం ద్వారా 2019లో ప్రధానమంత్రి అభ్యర్థిత్వాన్ని సులువుగా పొందొచ్చన్నది నితీశ్ ఎత్తుగడ’ అని మోదీ ఆరోపించారు. 243 స్థానాలున్న బిహార్ అసెంబ్లీలో ప్రస్తుతం ఆర్జేడీకి 80, జేడీయూకు 71, బీజేపీకి 58, కాంగ్రెస్ పార్టీకి 27 సభ్యుల మద్దతు ఉంది. గత ఎన్నికల్లో ఆర్జేడీ-జేడీయూలు కలిసి పోటీచేసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. కాగా, సుశీల్ మోదీ ఆఫర్ పై సీఎం నితీశ్ స్పందించాల్సిఉంది. దాణా కేసులో లాలూకు వ్యతిరేకంగా వచ్చిన తీర్పు బిహార్ రాజకీయాలను ఎన్ని మలుపులు తిప్పుతుందో వేచిచూడాలి. (దాణా కుంభకోణం: సుప్రీం కోర్టులో లాలూకు ఎదురుదెబ్బ) -
ముఖ్యమంత్రికి ఎయిర్పోర్టులో షాక్
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు ఢిల్లీ విమానాశ్రయంలో చిత్రమైన అనుభవం ఎదురైంది. వీఐపీలు, వృద్ధుల కోసం ఉద్దేశించిన బ్యాటరీ కారులో ఆయన వెళ్లబోతుండగా.. ఓ ప్రయాణికుడు కోపంగా వచ్చి ఆయన ముందు సీట్లో కూర్చుని.. 'వీఐపీ సంస్కృతి వద్దు' అంటూ గట్టిగా అరిచాడు. ముంబై నుంచి విమానంలో దిగిన నితీష్ కుమార్ ఆ కారులో కూర్చోగానే అతడు వచ్చి అదే కారులో కూర్చుని అరవడం మొదలుపెట్టాడు. సెక్యూరిటీ వాళ్లు ఆ ప్రయాణికుడిని దిగాల్సిందిగా కోరినా.. అతడు వినలేదు. దాంతో ఏమీ చేయలేక అతడిని కూడా ఆ బ్యాటరీ కారులో తీసుకెళ్లారు. నితీష్ కుమార్ అంతర్జాతీయ లాంజ్ వద్ద దిగిపోగా, రెండో ప్రయాణికుడు మాత్రం ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వరకు వెళ్లాడు. ఢిల్లీ విమానాశ్రయంలో ఎస్కలేటర్లు, వాకలేటర్లు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నా, వీఐపీలను మాత్రం గోల్ఫ్ కార్ట్ తరహా బ్యాటరీ కార్లలో ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వరకు తీసుకెళ్తారు. అలాంటివి మొత్తం 30 కార్లు ఉన్నాయి. ముంబై నుంచి నితీష్ వచ్చిన ఎయిరిండియా విమానం ఏఐ 310లోనే వచ్చిన ఆ ప్రయాణికుడు.. నేరుగా వచ్చి నితీష్ ఎదురుసీట్లో కూర్చుండిపోయాడు. సాధారణంగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రినైనా విమానాశ్రయాల్లో వీఐపీగానే చూస్తారు. వాళ్లకు వ్యక్తిగత భద్రత కల్పిస్తారు. నితీష్తో పాటు బ్యాటరీ కారులో కూర్చున్న వ్యక్తి ఆయనకు ఎలాంటి హాని కల్పించకపోవడం, హింసాత్మకంగా ప్రవర్తించకపోవడంతో తాము కూడా మరీ బలవంతం చేయలేదని, ముఖ్యమంత్రి సైతం ఎలాంటి అభ్యంతర వ్యక్తం చేయలేదని విమానాశ్రయాలలో భద్రతా ఏర్పాట్లు చూసే సీఐఎస్ఎఫ్ దళాలు తెలిపాయి. ఒకవైపు వీఐపీ సంస్కృతి వద్దంటూ మంత్రులు, ఇతరుల కార్లమీద ఎర్రబుగ్గలు తీసేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయిస్తే.. మరోవైపు విమానాశ్రయాలలో మాత్రం ఇలా కొంతమందిని ప్రత్యేకంగా చూడటం ఏంటన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అస్సలు నడవలేనివాళ్లు, వృద్ధులు, రోగులకైతే పర్వాలేదు గానీ అంతా బాగానే ఉన్నవారికి ప్రత్యేకంగా ఇలా గోల్ఫ్ కార్టులు కల్పించడం ఎందుకన్న వాదనలున్నాయి. -
'పీకే' విషయంలో సీఎం తప్పు లేదు: సుప్రీం
పట్నా: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(పీకే)ను బిహార్ ముఖ్యమంత్రి సలహాదారుగా నియమించడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ విషయంలో బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఎటువంటి ఉల్లంఘనకు పాల్పడలేదని పేర్కొంది. సీఎం తన సలహారుదారుకు కేబినెట్ హోదా కల్పించడం తప్పుకాదని తేల్చిచెప్పింది. 'ప్రశాంత్ కిషోర్ పై ముఖ్యమంత్రికి నమ్మకం ఉంది. ఆయనతో కలిసి పనిచేయాలని సీఎం అనుకుని ఉండొచ్చు. ఈ విషయంలో జోక్యం చేసుకోబోమ'ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖెహర్ పేర్కొన్నారు. ప్రశాంత్ కిషోర్ నియామకంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యాయవాది ఒకరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 39 ఏళ్ల ప్రశాంత్ కిషోర్ 2014 సాధారణ ఎన్నికల్లో ప్రధాని మోదీ తరపున పనిచేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి తరపున వ్యూహకర్తగా వ్యహరించారు. తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పనిచేశారు. -
సీఎం ఆహ్వానం.. రెండు వర్గాలుగా బీజేపీ
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పంపిన విందు ఆహ్వానం విషయంలో ఆ రాష్ట్ర బీజేపీ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు వెళ్లాలని, మరికొందరు వెళ్లరాదని నిర్ణయించుకున్నారు. సీఎం నితీష్ అధికార నివాసంలో జరిగే డిన్నర్ పార్టీకి వెళతానని మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ చెప్పగా.. తాము వెళ్లబోమని ప్రతిపక్ష నేత ప్రేమ్ కుమార్, మరో సీనియర్ నేత నంద కిశోర్ యాదవ్ స్పష్టం చేశారు. సుశీల్ కుమార్తో పాటు బీజేపీకి చెందిన మరో 12 మంది ఎమ్మెల్యేలు విందులో పాల్గొననున్నారు. కాగా ఈ విందుకు ఎమ్మెల్యేలందరూ వెళ్లాలని బీజేపీ నాయకులు మొదట నిర్ణయించింది. అయితే 2010లో నితీశ్ తమతో వ్యవహరించిన తీరును గుర్తు చేసుకుని మనసు మార్చుకున్నారు. అప్పట్లో పట్నాలో జరిగిన బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశానికి ఎల్ కే అద్వానీ, నరేంద్ర మోదీ హాజరైనపుడు.. ఆ పార్టీ నేతలకు పంపిన విందు ఆహ్వానాన్ని నితీష్ వెనక్కు తీసుకున్నారు. కాంట్రాక్టు టీచర్లు, ఆశా వర్కర్లపై పోలీసులు లాఠీచార్జీ చేసినందుకు నిరసనగా సీఎం విందు ఆహ్వానాన్ని తిరస్కరించినట్టు ప్రేమ్ కుమార్ చెప్పారు. ప్రేమ్ కుమార్, నంది కిశోర్ యాదవ్కు సన్నిహితంగా ఉంటున్న ఎమ్మెల్యేలు కూడా సీఎం ఆహ్వానాన్ని తిరస్కరించారు. -
మా అబ్బాయి సీఎం అవుతాడని చెప్పలేదు
పట్నా: బిహార్ ప్రజలు కోరుకుంటే తన కొడుకు, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అవుతారని వ్యాఖ్యానించిన మాజీ సీఎం రబ్రీదేవి యూ టర్న్ తీసుకున్నారు. సీఎం పోస్టు ఖాళీగా లేదని, ముఖ్యమంత్రి పదవిలో నితీష్ కుమార్ పూర్తికాలం కొనసాగుతారని చెప్పారు. బిహార్లో ప్రస్తుతం జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ సంకీర్ణ కూటమి అధికారంలో ఉంది. గత ఎన్నికల్లో కుదిరిన ఒప్పందం మేరకు జేడీయూ నేత నితీష్ సీఎం అయ్యారు. గురువారం రబ్రీదేవి మీడియాతో మాట్లాడుతూ.. తేజస్వి యాదవ్ సీఎం కావాలని ఆర్జేడీ ఎమ్మెల్యేలు కోరుతున్నారని చెప్పారు. దీనిపై విమర్శలు వచ్చాయి. రబ్రీదేవి పొత్తు ధర్మాన్ని విస్మరించారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమె మాట మార్చారు. గత ఫిబ్రవరిలో ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ కూడా తన కొడుకు తేజస్వి భవిష్యత్లో ముఖ్యమంత్రి అవుతారని వ్యాఖ్యలు చేసి తర్వాత మాట మార్చారు. బిహార్ తర్వాతి ముఖ్యమంత్రి ఎవరన్నది ఇప్పుడే చెప్పడం తొందరపాటని, 2020లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు నిర్ణయిస్తారని చెప్పారు. బిహార్ ముఖ్యమంత్రులుగా లాలు, ఆయన భార్య రబ్రీ దేవి పనిచేశారు. ప్రస్తుతం వీరి చిన్న కొడుకు తేజస్వి డిప్యూటీ సీఎంగా, మరో కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ మంత్రిగా ఉన్నారు. -
సీఎం ఆస్తుల్లో పది ఆవులు, ఐదు దూడలు!
పట్నా: సాధారణంగా ఆవులు, గేదెల వంటి పశు పోషణ అనగానే బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ గుర్తొస్తారు. కానీ బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చరాస్తుల్లోనూ 10 ఆవులు, 5 దూడలు ఉన్నాయి. నితీశ్, ఆయన మంత్రివర్గ సహచరులు డిసెంబర్ 31న తమ ఆస్తులను ప్రకటించారు. అందులో నితీశ్ తన వద్దనున్న ఆవులు, దూడల విలువను రూ. 1.45 లక్షలుగా ఆయన పేర్కొన్నారు. సీఎం నితీశ్ వద్ద రూ. 56.49 లక్షల విలువ కలిగిన స్థిర, చరాస్తులున్నాయి. వాటిలో ఢిల్లీలోని రూ. 40 లక్షల విలువైన ఫ్లాట్, రూ. 16.49 లక్షల విలువైన చరాస్తులు ఉన్నాయి. వాటిలో ఒక ఫోర్డ్ ఇకోస్పోర్ట్, ఒక హ్యుందయ్ గ్రాండ్ ఐ10 కార్లున్నాయి. అలాగే, ఆయన పేరుపై రూ. 3.79 లక్షల వాహన రుణం కూడా ఉంది. కాగా, నితీశ్ కుమారుడు నిశాంత్ వద్ద నితీశ్ కన్నా నాలుగు రెట్లు అధికంగా విలువ కలిగిన స్థిర, చరాస్తులుండటం విశేషం. ఆయన పేరుపై రూ. 2.36 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. -
సీఎం వైఫల్యాలపై ప్రోగ్రెస్ కార్డు
నితీష్ కుమార్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి ఏడాది నిండటంతో.. ముఖ్యమంత్రి వైఫల్యాలతో కూడిన ప్రోగ్రెస్ రిపోర్టును ఎన్డీయే విడుదల చేసింది. రాష్ట్రంలో పాలన అన్ని రకాలుగా విఫలమైందని, ముఖ్యంగా శాంతిభద్రతలు మంటగలిశాయని చెప్పింది. 'ఏక్ సాల్.. బురా హాల్' అనే పేరుతో బీజేపీ సీనియర్ నాయకుడు సుశీల్ కుమార్ మోదీ ఈ ప్రోగ్రెస్ రిపోర్టును విడుదల చేశారు. గడిచిన ఏడాది కాలంలో వీళ్లు చేసిన తప్పుల కారణంగానే వార్తల్లో నిలిచారని ఆయన మండిపడ్డారు. ఒకరోజు ముందుగానే తాము ఈ ప్రోగ్రెస్ కార్డును విడుదల చేస్తున్నామని, ఇది చూసి ముఖ్యమంత్రి తమ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని సుశీల్ మోదీ అన్నారు. నితీష్ సర్కారులో ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు కూడా భాగస్వాములే. ఈ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆదివారంతో ఏడాది పూర్తవుతుంది. 2005 నవంబర్లో నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2006 నుంచి ప్రతియేటా ఇలా ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వడాన్ని ఆయనే మొదలుపెట్టారు. కేంద్రమంత్రి, ఎల్జేపీ అధినేత రాం విలాస్ పాశ్వాన్, కేంద్ర సహాయ మంత్రి ఉపేంద్ర కుష్వాహా, హిందూస్థాన్ ఆవామీ మోర్చా (ఎస్) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంఝీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మంగళ్ పాండే తదితరులు కూడా ఈ ప్రోగ్రెస్ రిపోర్టు విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. మహ్మద్ షహాబుద్దీన్, రాజ్ వల్లభ్ యాదవ్, రాకీ యాదవ్ తదితరులకు బెయిల్ మంజూరుచేయడంపై ప్రతిపక్షం గట్టిగా ప్రశ్నించి ఉండకపోతే నితీష్ సర్కారు వాటిపై సుప్రీంకోర్టుకు వెళ్లి ఉండేది కాదని సుశీల్ మోదీ అన్నారు. 1.52 లక్షల కోట్ల వ్యవసాయ రోడ్ మ్యాప్ పేమైందని, మిషన్ మానవ్ వికాస్, మహాదళిత్ వికాస్ మిషన్, విజన్ డాక్యుమెంట్ 2025 అన్నీ ఎక్కడకు పోయాయని నిలదీశారు. -
పాక్ కు ప్రేమలేఖలు రాయడం మానుకోండి!
పట్నా: పాకిస్థాన్ లో సైన్యం నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో మిగతా ప్రతిపక్షాలకు భిన్నమైన వైఖరిని బిహార్ సీఎం నితీశ్ కుమార్ ప్రదర్శించారు. సర్జికల్ దాడులపై మోదీ ప్రభుత్వాన్ని పూర్తిగా సమర్థిస్తూనే... సైన్యం విరోచిత చర్యను రాజకీయాలకు వాడుకోవద్దని సుతిమెత్తగా సూచించారు. పాకిస్థాన్ కు వ్యతిరేకంగా తీసుకొనే ప్రతి చర్య విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని నితీశ్ కుమార్ అన్నారు. అయితే, గత నెల సైన్యం నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ పై రాజకీయ అవకాశవాదానికి పాల్పడొద్దని సూచించారు. రాజ్ గిరిలో సోమవారం జరిగిన బహిరంగ సభలో నితీశ్ మాట్లాడుతూ.. 'పాక్ కు వ్యతిరేకంగా ఏ చర్య అవసరమైనా తీసుకోండి. ఇకనైనా ఆ దేశానికి ప్రేమలేఖలు రాయడం మానుకోండి' అంటూ ప్రధాని మోదీకి సూచించారు. పాక్ ప్రధాని షరీఫ్ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోదీ ఆకస్మికంగా లాహోర్ కు వెళ్లిన విషయాన్ని నితీశ్ పరోక్షంగా విమర్శించారు. పాకిస్తాన్ పై ఇక కఠిన వైఖరి అవలంబించాలని సూచించారు. ప్రధాని మోదీ ప్రధానమంత్రి దేశానికి నాయకుడిగా వ్యవహరించాలని కానీ, బీజేపీకి కాదని ఆయన అన్నారు. పాక్ లో భారత సైన్యం నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో ప్రధాని మోదీని కీర్తిస్తూ బీజేపీ పోస్టర్లు అంటించడాన్ని ఆయన తప్పుబట్టారు. -
మద్యం కనిపిస్తే.. సీఎంను అరెస్టు చేయండి
బిహార్లో మద్య నిషేధం కోసం సరికొత్త చట్టాన్ని తెచ్చినందున.. ఇక మీదట రాష్ట్రంలో ఎక్కడైనా మద్యం కనిపిస్తే సీఎం నితీష్కుమార్ను అరెస్టుచేయాలని కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి రాం విలాస్ పాశ్వాన్ అన్నారు. మద్యాన్ని నిషేధిస్తూ ఏప్రిల్ 5న చేసిన చట్టాన్ని పట్నా హైకోర్టు కొట్టేసిన నేపథ్యంలో.. నితీష్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా అక్కడ ఊరట లభించిన విషయం తెలిసిందే. దాంతో ఈ అంశంపై తాజాగా పాశ్వాన్ స్పందించారు. ఇంట్లో ఎక్కడైనా మద్యం కనిపిస్తే ఆ కుటుంబంలోని పెద్దలందరినీ జైలుకు పంపిస్తామని ఈ కొత్త చట్టంలో ఉందని, అందువల్ల రాష్ట్రంలో ఎక్కడైనా మద్యం కనిపిస్తే ముఖ్యమంత్రిని కూడా అరెస్టు చేసి ఆయనను జైలుకు పంపాలని అన్నారు. రాష్ట్రంలో మద్యనిషేధానికి తమ పార్టీ లో్క్జనశక్తి కూడా అనుకూలమేనని, అయితే కొత్త మద్యనిషేధ చట్టంలో పెట్టిన కొన్ని నిబంధనలను మాత్రం తాము వ్యతిరేకిస్తున్నామని పాశ్వాన్ అన్నారు. ఇంట్లో మద్యం కనిపిస్తే కుటుంబ పెద్దలను అరెస్టుచేయడం లాంటి నిబంధనలపైనే ఆయన వ్యాఖ్యానించారు. ఇక బాలికపై అత్యాచారం కేసులో్ నిందితుడైన ఎమ్మెల్యే రాజ్ వల్లభ్ యాదవ్ను కలిసిన ఆర్జేడీ అధ్యక్షుడు లాలు ప్రసాద్ మీద కూడా పాశ్వాన్ మండిపడ్డారు. బెయిల్ మీద బయటకు వచ్చిన ఎమ్మెల్యేకు లాలు మద్దతు ఇవ్వడం సరికాదని, ఆయనను మళ్లీ జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు న్యాయం చేస్తుందన్న నమ్మకం తనకుందన్నారు. -
ప్లాస్టిక్ బ్యాగ్ మృతదేహంపై సీఎం స్పందన..
పాట్నాః ప్లాస్టిక్ బ్యాగ్ లో మృతదేహం తరలింపు ఘటనపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పందించారు. పోస్ట్ మార్టం నిర్వహించిన ఓ శవాన్ని ఆస్పత్రి వర్గాలు అంబులెన్స్ ఇవ్వని కారణంతో కుటుంబ సభ్యులు ప్లాస్టిక్ బ్యాగ్ లో తరలించడంపై సమగ్రంగా సమీక్షించాలని ఆరోగ్య శాఖను ఆదేశించారు. సింటూ కుమార్ అనే వ్యక్తి సుమారు రెండు వారాల క్రితం ప్రమాదవశాత్తు గంగానదిలో పడి మృతి చెందాడు. 25వ తేదీన అతని మృత దేహం బయట పడటంతో వెలికి తీయించిన పోలీస్ అధికారులు పోస్టు మార్టం నిమిత్తం కతియార్ కు తరలించారు. అయితే శరీరం అప్పటికే బాగా కుళ్ళుపోవడంతో అక్కడి వైద్యులు పోస్టుమార్టానికి స్వీకరించలేదు. దీనికి తోడు అంబులెన్స్ కూడా ఇచ్చేందుకు అనుమతించలేదు. దీంతో కాతియార్ నుంచి 86 కిలోమీటర్ల దూరంలో ఉన్న భాగల్పూర్ ఆసుపత్రికి బంధువులు శవాన్ని ప్లాస్టిక్ బ్యాగ్ లో చుట్టి తీసుకెళ్ళారు. విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న ముఖ్యమంత్రి ఘటనపై ఆరా తీశారు. విషయంపై లోతుగా పరిశీలించాలంటూ రాష్ట్ర ఆరోగ్య శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఇటువంటి ఘటన పునరావృతం కాకుండా చూడాలంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే ప్రతిజిల్లాలో పోస్టుమార్టం కేంద్రాల నిర్మాణం కోసం ప్రణాళికలు మంజూరు చేశామని పనులు కొనసాగుతున్నట్లు సీఎం వెల్లడించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా మెజిస్ట్రేట్ లల్లన్ జీ.. డీడీసీ, ఎస్డీవో, ఎస్డీపీవో లతో కూడిన ముగ్గురు సభ్యుల దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. రేపటికల్లా దర్యాప్తు బృందం నివేదికను సమర్పించాలని కోరినట్లు డీఎం తెలిపారు. సమగ్ర పరిశీలన నివేదికల ఆధారంగా అవసరమైన చర్యలు ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. -
రైల్వే బడ్జెట్ విలీనం మంచిదికాదు
ప్రత్యేక రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో విలీనం చేస్తూ కేంద్రకేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నాటి రైల్వే మంత్రి, నేటి బిహార్ సీఎం నితీష్ కుమార్ వ్యతిరేకిస్తున్నారు. 92 ఏళ్ల ఆనవాయితీకి చరమగీతం పాడుతూ సాధారణ బడ్జెట్లో ఈ బడ్జెట్ను విలీనం చేయడం వల్ల దేశానికి ఎలాంటి మంచి చేకూరదని ఆయన విమర్శించారు. దీనివల్ల రైల్వే తన స్వయంప్రతిపత్తిని కోల్పోతుందని తెలిపారు. ఈ విషయంపై ఎన్డీయే ప్రభుత్వం మరోసారి ఆలోచించుకోవాలని హితవు పలికారు. 1924 నుంచి ప్రత్యేక బడ్జెట్గా కొనసాగుతూ వస్తున్న రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో విలీనం చేసేందుకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. రైల్వే మంత్రిగా తనకున్న అనుభవం ప్రకారం రైల్వే బడ్జెట్కు మంగళం పాడటంతో ఇటు రైల్వేకు, అటు దేశానికి ఎలాంటి మంచి చేకూరదని వివరించారు. దీనివల్ల రైల్వే ఇప్పటివరకు కలిగిఉన్న తన స్వయం ప్రతిపత్తిని కోల్పోతుందని నితీష్ పేర్కొన్నారు. అటల్ బిహార్ వాజ్పేయి కాలంలో ఎన్డీయే ప్రభుత్వంలో నితీష్, రైల్వే మంత్రిగా పనిచేశారు. రైల్వే నుంచి ప్రజలు చాలా ఆశిస్తుంటారని ఆయన తెలిపారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి, రైల్వే శాఖను సాఫీగా నడిచేలా చేయడానికి రైల్వే బడ్జెట్ను వేరుగా ఉండటమే మంచిదని సూచించారు. ప్రభుత్వం ముందస్తు లాగానే ప్రత్యేక రైల్వే బడ్జెట్ను కొనసాగించాలని చెప్పారు. తను రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు, చాలామంది మంత్రులు సాధారణ బడ్జెట్ కంటే రైల్వే బడ్జెట్పైనే ఎక్కువగా ఆసక్తిచూపేవారని గుర్తుచేసుకున్నారు. వారి రాష్ట్రాలకు, నియోజకవర్గాలకు కొత్త రైళ్లు మార్గాలు వస్తాయని ఆశించేవారని చెప్పారు. కొన్ని సార్లు రైల్వేమంత్రులు సమస్యలు ఎదుర్కొన్నా, రైల్వే బడ్జెట్ ప్రత్యేకంగా ఉండటమే మంచిదని నితీష్ సూచించారు. -
సీఎంకు రెండు బంగ్లాలు ఎందుకు?
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రెండు ప్రభుత్వ బంగ్లాలను తన వద్ద ఉంచుకున్నారని బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ ఆరోపించారు. ముఖ్యమంత్రి హోదాలో నితీష్.. పట్నాలోని అధికార నివాసం అన్నె మార్గ్ 1 బంగ్లాకు మారారని, అయితే రెండేళ్ల క్రితం మాజీ సీఎం హోదాలో ఆయనకు కేటాయించిన బంగ్లాను ఇప్పటికీ ఖాళీ చేయలేదని చెప్పారు. నితీష్ అధికార బంగ్లాతో పాటు రెండేళ్ల క్రితం కేటాయించిన బంగ్లాను కూడా అంటిపెట్టుకున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి హోదాలో ఒకేసమయంలో రెండు బంగ్లాలను పొందరాదని, సర్క్యులర్ రోడ్డులోని 7 నెంబర్ బంగ్లాను నితీష్ ఖాళీ చేయాలని సుశీల్ డిమాండ్ చేశారు. సర్క్యులర్ రోడ్డు 7 బంగ్లా మరమ్మత్తుల కోసం నితీష్ కోట్లాది రూపాయల డబ్బును వృథా చేశారని సుశీల్ ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రులకు నివాసాల కేటాయింపులు, వాటికి మరమ్మత్తుల విషయంలో నితీష్ ద్వంద ప్రమాణాలు పాటిస్తున్నారని విమర్శించారు. 2014 మేలో నితీష్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. తర్వాత 2015 ఫిబ్రవరిలో మళ్లీ సీఎం పగ్గాలు చేపట్టారు. ఈ మధ్యకాలంలో జీతన్ రామ్ మంఝీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. గతేడాది జరిగిన బిహార్ ఎన్నికల్లో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి ఘనవిజయం సాధించడంతో నితీష్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. -
మోదీ ఆసనాలకు భిన్నంగా నితీశ్ రాగాలాపన!
ప్రపంచమంతా మంగళవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించడానికి సిద్ధమవుతుండగా బిహార్ మాత్రం అందుకు భిన్నమైన రాగాన్ని ఎత్తుకుంటోంది. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాష్ట్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించవద్దని నిర్ణయించారు. దేశంలో సంపూర్ణ మద్యపాన నిషేధానికి పూనుకోవాలని తాను ఇచ్చిన పిలుపును కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్ పట్టించుకోకపోవడంతో అందుకు ప్రతిగా యోగా దినోత్సవానికి దూరంగా ఉండాలని నితీశ్ భావిస్తున్నారట. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సహా ప్రపంచమంతా యోగాసనాలు వేస్తుండగా మరీ నితీశ్ ఏం చేయబోతున్నారంటే.. సంగీత రాగాలాపన చేయాలని ఆయన నిర్ణయించారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంతోపాటు అంతగా ప్రాచుర్యంలేని ప్రపంచ సంగీత దినోత్సవాన్ని కూడా జరపుకొంటారు. కాబట్టి మంగళవారం బిహార్ లో ప్రపంచ సంగీత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని నితీశ్ సర్కార్ నిర్ణయించింది. మోదీకి, నితీశ్ కి రాజకీయ బద్ధవైరం ఉన్న సంగతి తెలిసిందే. మోదీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడానికి రంగం సిద్ధం చేయడంతో 2014లో ఆ పార్టీతో ఉన్న పొత్తును నితీశ్ తెగదెంపులు చేసిన సంగతి తెలిసిందే. -
మోదీ ఆసనం.. నితీశ్ గానం!
ప్రపంచమంతా మంగళవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించడానికి సిద్ధమవుతుండగా బిహార్ మాత్రం అందుకు భిన్నమైన రాగాన్ని ఎత్తుకుంటోంది. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాష్ట్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించవద్దని నిర్ణయించారు. దేశంలో సంపూర్ణ మద్యపాన నిషేధానికి పూనుకోవాలని తాను ఇచ్చిన పిలుపును కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్ పట్టించుకోకపోవడంతో అందుకు ప్రతిగా యోగా దినోత్సవానికి దూరంగా ఉండాలని నితీశ్ భావిస్తున్నారట. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సహా ప్రపంచమంతా యోగాసనాలు వేస్తుండగా మరీ నితీశ్ ఏం చేయబోతున్నారంటే.. సంగీత రాగాలాపన చేయాలని ఆయన నిర్ణయించారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంతోపాటు అంతగా ప్రాచుర్యంలేని ప్రపంచ సంగీత దినోత్సవాన్ని కూడా జరపుకొంటారు. కాబట్టి మంగళవారం బిహార్ లో ప్రపంచ సంగీత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని నితీశ్ సర్కార్ నిర్ణయించింది. మోదీకి, నితీశ్ కి రాజకీయ బద్ధవైరం ఉన్న సంగతి తెలిసిందే. మోదీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడానికి రంగం సిద్ధం చేయడంతో 2014లో ఆ పార్టీతో ఉన్న పొత్తును నితీశ్ తెగదెంపులు చేసిన సంగతి తెలిసిందే. -
భూకబ్జాపై సీఎం ఆశ్చర్యం
పట్నా: ఉత్తరప్రదేశ్ లోని మథురలో జరిగిన భూకబ్జాపై బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భూమిని కబ్జా చేయడమే కాకుండా సమాంతర పాలన సాగించడం ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. ఈ వ్యవహారంపై ముందే మేలుకుని ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ప్రారంభంలోనే చర్యలు తీసుకునివుంటే పరిస్థతి ఇంతదాకా వచ్చేదికాదన్నారు. మథురలోని జవహర్బాగ్ లో గురువారం అక్రమ కట్టడాల కూల్చివేత సందర్భంగా జరిగిన హింసాకాండలో 24 మంది చనిపోయారు. బిహార్ ఎడ్యుకేషన్ బోర్డు(బిఎస్ఈబీ) వ్యవహారాన్ని తాను పర్యవేక్షిస్తున్నానని, రాష్ట్ర విద్యాశాఖ కూడా దర్యాప్తు చేపట్టిందని నితీశ్ కుమార్ తెలిపారు. బాధ్యులపై చర్యలు తప్పవని, ఎవరినీ ఉపేక్షించబోమని ఆయన చెప్పారు. బీఎస్ఈబీ నిర్వహించిన పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన 14 మందికి తాము రాసిన సబ్జెక్టుల గురించి కూడా ఏమాత్రం తెలియదని వెల్లడికావడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. దీంతో వీరికి మళ్లీ పరీక్ష నిర్వహించారు. -
విగ్రహాలపై ఉమ్మేస్తారు: నితీశ్
పట్నా: నెహ్రు-గాంధీ వారసుల విగ్రహాలు పెట్టడం మానుకోవాలని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అన్నారు. విగ్రహాలు పెట్టుకుంటూ పోతే వాటిపై ప్రజలు ఉమ్మేసే పరిస్థితి వస్తుందని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. కేంద్రంలో రెండేళ్లుగా అధికారంలో కొనసాగుతున్న ఎన్డీఏ ప్రభుత్వం చేసిందేమి లేదని, వచ్చే మూడేళ్ల పాలనలోనూ పెద్దగా ఒరిగేదేం ఉండబోదని అన్నారు. బిహార్ లో ఆటవిక పాలన నడుస్తోందని ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. మే 23 వరకు నమోదైన నేరాల వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. తమ పాలనలో నేరాలు బాగా తగ్గాయని, శాంతిభద్రతలకు భంగం వాటిల్లలేదని చెప్పుకొచ్చారు. నేరాలకు పాల్పడిన వారు ఎంతటివారైనా ఊపేక్షించబోమని స్పష్టం చేశారు. తాము అమలు చేస్తున్న మద్యపాన నిషేధాన్ని ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని చెప్పారు. -
మాకు సంఘ్ వద్దు.. షరాబ్ వద్దు!
వారణాసి: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ వచ్చే ఏడాది జరుగనున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ఇప్పుడే సమరశంఖం పూరించారు. గురువారం వారణాసిలో జరిగిన ఓ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ బీజేపీపై, నరేంద్రమోదీ సర్కార్పై నిప్పులు కురిపించారు. బిహార్లో బీజేపీకి ప్రజలు గట్టి గుణపాఠం చెప్పారని విమర్శించారు. బిహార్లో బీజేపీని ఓడించగలిగినప్పుడు, మిగతా ప్రాంతాల్లోనూ ఆ పార్టీని ఓడించవచ్చునని చెప్పారు. బీజేపీ ఎన్నికల సందర్భంగా ఎన్నో హామీలను ఇచ్చిందని, కానీ ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. బీజేపీ నేతల మాటలకు చేతలకు భారీ అంతరముంటుందని మండిపడ్డారు. తాము సంఘ్ (ఆరెస్సెస్) విముక్త భారతాన్ని కోరుకుంటున్నామని, అదేవిధంగా షరాబ్ (మద్యం) విముక్త సమాజాన్ని కూడా ఆకాంక్షిస్తున్నామని చెప్పారు. బిహార్, ఉత్తరప్రదేశ్ సోదరుల్లాంటివని, ఈ రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి తేడా లేదని, ఈ రెండింటి స్వభావాన్ని, భూమి ఒక్కటేనని అన్నారు. హామీలు నెరవేర్చలేకనే బీజేపీ దేశం దృష్టిని మళ్లించడానికి ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. -
బిహార్ సీఎంగా లాలూ కొడుకు!!
పాట్నా: అక్కడ రోడ్డుపై వందల సంఖ్యలో జనం ఆందోళన చేస్తున్నారు. ఇంతలో కుర్తాపైజామా ధరించిన ముఖ్యమంత్రి ఎస్యూవీ వాహనంలో అక్కడికి వచ్చారు. ఆందోళన చేస్తున్నవారి దగ్గరికి వెళ్లి సర్దిచెప్పారు. దోషులకు శిక్ష వేస్తామని హామీ కూడా ఇచ్చారు. ఆందోళనకారులు శాంతించారు. ఇలా బిహార్ సీఎంగా కనిపించి ఆందోళనకారులను శాంతింపజేసింది ఎవరో కాదు.. లాలూ ప్రసాద్ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్. ప్రస్తుతం బిహార్ ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న ఆయన ముఖ్యమంత్రి ఎప్పుడు అయ్యారని ఆశ్చర్యపోకండి. ఇదంతా సినిమా కోసమే. 'అపహరణ్ ఉద్యోగ్' (కిడ్నాప్ ఇండస్ట్రి) పేరిట రూపొందుతున్న ఓ సినిమాలో లాలూ తనయుడు తేజ్ప్రతాప్ బిహార్ ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్నారు. 1990లో బిహార్లో సంభవించిన కిడ్నాప్లు నేపథ్యంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. అప్పట్లో బిహార్ సీఎం లాలూ ఉన్నారు. అంధకారంలో ఉన్న బిహార్ను వెలుగులోకి తీసుకొచ్చే చక్కని కథతో రూపొందిన సినిమా కావడంతో తాను నటించానని, ఇందులో ఓ పాత్రలో లాలూ యాదవ్ కూడా కనిపిస్తారని షూటింగ్ అనంతరం తేజ్ప్రతాప్ తెలిపారు. తేజ్ తమ్ముడు తేజస్వి డిప్యూటీ సీఎంగా బిజీగా ఉండగా, ఆయన మాత్రం ఆరోగ్యశాఖను గాలికి వదిలేసి సినిమాలు, షూటింగ్లు అంటూ తిరుగుతున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. -
బిహార్లో పాక్షిక మద్యపాన నిషేధం!
పట్నా: బిహార్లో పాక్షిక మద్యపాన నిషేధం విధిస్తూ బుధవారం అసెంబ్లీలో బిల్లును ఆమోదించారు. మద్యం అక్రమ ఉత్పత్తి, వ్యాపారం చేసిన వారికి జీవితఖైదు విధించేలా బిల్లులో మార్పులు చేశారు. ‘ఒకరికి ధర్మోపదేశం చేసేముందు మనం పాటించాలి. చట్టం చేసే మనం మొదటగా మద్యాన్ని త్యజించాలి’ అని చర్చలో సీఎం నితీశ్ కుమార్ అన్నారు. మొదటి దశలో రాష్ట్రంలోని అన్ని పల్లెల్లో మద్యనిషేధం విధించారు. మునిసిపల్ కార్పొరేషన్లు, మండళ్లలో మాత్రం దేశంలో తయారైన విదేశీ మద్యం అమ్మకాలను మాత్రం అనుమతిస్తారు. -
ఏపీ ప్రత్యేక హోదాకు మద్దతిస్తాం: నితీశ్కుమార్
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్కు తమ మద్దతు ఉంటుందని బిహార్ సీఎం నితీశ్కుమార్ పేర్కొన్నారు. జాతీయ నాయకుల మద్దతు కూడగట్టేందుకు ఏపీసీసీ బృందం సోమవారం ఇక్కడ జేడీయూ నేత శరద్యాదవ్ను కలిసేందుకు రాగా.. అక్కడే నితీశ్కుమార్ కూడా కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ డిమాండ్కు మద్దతిస్తామని తెలిపారు. పార్లమెంటులో ప్రత్యేక హోదా గురించి లేవనెత్తుతామని శరద్యాదవ్ చెప్పారు. కొత్త ప్రభుత్వం గౌరవించాలి: పవార్ ఏపీకి హోదా విషయంలో పాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొత్త ప్రభుత్వం గౌరవించాలని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ పేర్కొన్నారు. ఏపీసీసీ బృందం ప్రత్యేక హోదా పై మద్దతు కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఏపీసీసీ బృందం సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డిని కూడా కలసి హోదాపై మద్దతు కోరింది. -
అన్ని రంగాల్లోకీ రాజకీయ అవినీతి
ఏడీఆర్, నేషనల్ ఎలక్షన్ వాచ్ సాక్షి, హైదరాబాద్: అన్ని రంగాల అవినీతికి రాజకీయ అవినీతి మూలకారణంగా నిలుస్తోందని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (న్యూ) సంస్థలు అభిప్రాయపడ్డాయి. ఈ సంస్థల ఆధ్వర్యం లో ‘ఎన్నికలు-రాజకీయ సంస్కరణలు’ అనే అంశంపై హైదరాబాద్లో రెండు రోజుల పాటు జరిగిన 12వ వార్షిక జాతీయ సదస్సు ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా ఏడీఆర్, న్యూ సంస్థల అధిపతి, రిటైర్డ్ మేజర్ జనరల్ అనిల్ వర్మ మాట్లాడుతూ.. ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లాగే పంచాయతీ ఎన్నికల్లో కూడా మద్యం ఏరులై పారుతోందని, డబ్బును విచ్చలవిడిగా పంచుతున్నారని పేర్కొన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల విజయానికి క్షేత్రస్థాయి నుంచి తీవ్ర కృషి చేశారని చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వివరాలను కూడా వెబ్ సైట్లలో అందుబాటులో ఉంచాలని జార్ఖండ్ ఎలక్షన్ వాచ్ కోఆర్డినేటర్ సుధీర్ పాల్ అన్నారు. క్షేత్రస్థాయిలో అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బిహార్ ఎన్నికల వాచ్ ప్రతినిధి రాజీవ్కుమార్ సూచించారు. సత్యాగ్రహ డాట్కామ్ వ్యవస్థాపకుడు సంజయ్దుబే మాట్లాడుతూ.. 2014 సాధారణ ఎన్నికల్లో సోషల్ మీడియా స్పష్టమైన ప్రభావం చూపిందని, వ్యక్తులు, పత్రికల ఆలోచన ధోరణిని కూడా ప్రభావితం చేస్తోందని అభిప్రాయపడ్డారు. -
రూ.5 అప్పు తీసుకున్న ముఖ్యమంత్రి
పచ్చజెండా ఊపి సిటీ బస్సులను ప్రారంభించిన ముఖ్యమంత్రి.. సరదాగా బస్సులో ప్రయాణించారు. తెలివైన మహిళా కండక్టర్ టికెట్ కొట్టి చేతిలో పెట్టేవరకు.. సీఎంగారు కాస్త కంగారుపడ్డారు. ఎందుకంటే అప్పుడాయన దగ్గర చిల్లిగవ్వా లేదుమరి! చివరికి ఓ అధికారి దగ్గర ఐదు రూపాయలు అప్పుతీసుకోక తప్పని ఆ ముఖ్యమంత్రి మరెవరోకాదు బిహార్ 'వికాస్ పురుష్' నితీశ్ కుమార్! పాట్నా సిటీలో బుధవారం లోకల్ బస్సు సేవలను ప్రారంభించిన సీఎం నితీశ్ గాంధీ మైదాన్ నుంచి పాట్నా స్నేషన్ వరకు వెళ్లే బస్సులో ఎక్కి కూర్చున్నారు. మొదటి ప్రయాణికుడు ముఖ్యమంత్రే కావడంతో ఆ బస్సు కండక్టర్ ఉత్సాహంగా టికెట్ కొట్టింది. జేబులో డబ్బులు లేకపోవడంతో సీఎం నితీశ్.. అర్బన్ డెవలప్ మెంట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అమృత్ లాల్ మీనా దగ్గర ఐదు రూపాయలు అడిగి తీసుకున్నారు. ఈ తంతంగం అనంతరం నిర్వహించిన సభలో సీఎం మాట్లాడుతూ'ఇవాళ ఓ అధికారి నా జీవితాన్ని కాపాడాడు' అంటూ బస్సులో జరిగిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ఒకటో తారీకున జీతం పడగానే ఐదురూపాయలు తిరిగిచ్చేస్తానని సరదాగా అన్నారు. ఇలా కచ్చితంగా అవసరమైనప్పుడు జేబులు తడుముకోవడం నితిశ్ కుమార్ కు కొత్తేమీకాదు. గతంలో ఓ సారి ఆయన పార్టీ సభ్యత్వం రెన్యూవల్ డబ్బును పార్టీ సభ్యుడొకరు చెల్లించారు. -
నిన్న వ్యూహకర్త.. నేడు సలహాదారు
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ నేత, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విజయంలో కీలక పాత్ర పోషించిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్కు కీలక పదవి దక్కింది. సీఎం నితీష్ తన సలహాదారుగా ప్రశాంత్ను నియమిస్తూ కేబినెట్ హోదా కల్పించారు. బిహార్ ఎన్నికల్లో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో కూడిన మహా కూటమి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎన్నికల సందర్భంగా నితీష్ ప్రచార బృందాన్ని ప్రశాంత్ పర్యవేక్షించారు. నితీష్ మరోసారి ముఖ్యమంత్రి కావడానికి కృషిచేశారు. మారుమూల ప్రాంత ప్రజలకు, యువతకు దగ్గరయ్యేలా ప్రచార వ్యూహాలు రూపొందించారు. సోషల్ మీడియాను ఉపయోగించుకుని యువతను ఆకర్షించేలా చేశారు. అంతకుముందు 2014 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే తరపున నరేంద్ర మోదీ విజయానికి కృషి చేశారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ప్రశాంత్ ఎన్డీయేకు దూరమైనట్టు సమాచారం. -
కాశీకి పోదాము... అంటున్న సీఎం
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్జేడీ చీఫ్ లాలుప్రసాద్ ఇద్దరూ కలిసి 'కాశీకి పోదాం' అనుకుంటున్నారట. యూపీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసికి వారిద్దరూ వెళ్తుండటం విశేషం. మోదీ వ్యతిరేక ప్రచారాన్ని ప్రారంభించేందుకు లాలుప్రసాద్ ఈనెల 17న వారణాసి వస్తారని ఆర్జేడీ యూపీశాఖ అధ్యక్షుడు రామ్ చంద్ర పుర్వే తెలిపారు. త్వరలోనే లాలు పశ్చిమబెంగాల్ కూడా వెళ్తారని ఆయన చిన్నకొడుకు, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ చెప్పారు. బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటినీ కూడగట్టడమే ఆయన లక్ష్యమన్నారు. త్వరలోనే బిహార్ సీఎం నితీష్ కుమార్ కూడా వారణాసి వెళ్లి, అక్కడ ర్యాలీ నిర్వహిస్తారని జేడీ(యూ) యూపీ అధ్యక్షుడు వశిష్ట నారాయణ్ సింగ్ తెలిపారు. యూపీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి లక్ష్యంగా జేడీ(యూ) పోటీ చేస్తుందని ఆయన అన్నారు. -
వీఐపీ వాహనాల సైరన్లపై నిషేధం
బిహార్ రాజధాని నగరంలో వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం పెరిగిపోవడంతో అక్కడి సీఎం నితీష్ కుమార్ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. వీఐపీ, వీవీఐపీ వాహనాలకు, ఎస్కార్ట్ వాహనాలకు సైరన్లు వాడకూడదంటూ నిషేధం విధించారు. అయితే గవర్నర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల ఎస్కార్టు వాహనాలకు, అంబులెన్సులు, ఫైరింజన్లకు మాత్రం దీన్నుంచి మినహాయింపు ఇచ్చారు. హోంశాఖ సమీక్ష సమావేశం సందర్భంగా సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. పట్నాలో పెరిగిపోతున్న శబ్ద కాలుష్యం పట్ల నితీష్ ఆందోళన వ్యక్తం చేశారు. అనవసరంగా హారన్లు ఉపయోగించకుండా వాహన డ్రైవర్లకు అవగాహన కల్పించాలని రవాణా, పర్యావరణ, అటవీ శాఖలను సీఎం ఆదేశించారు. వీఐపీలు, వీవీఐపీల వాహనాలు ఆస్పత్రులు, విద్యాసంస్థల్లాంటి సైలెంట్ జోన్లలో కూడా సైరన్లను మోతెక్కిస్తుండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు. -
అసెంబ్లీలో మొబైల్స్ స్విచాఫ్..!
పట్నా: బిహార్ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు మొబైల్ ఫోన్లు వాడటంపై స్పీకర్ విజయ్ చౌదరి ఆంక్షలు విధించారు. సభ్యులు అసెంబ్లీలోకి వచ్చే ముందుగా తమ మొబైల్స్ను స్విచాఫ్ చేసుకోవాలని ఆదేశించారు. 'అసెంబ్లీలో చర్చ జరుగుతున్నప్పుడు కొందరు సభ్యులు మొబైల్ ఫోన్లు వాడటం చూశా. గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలోనూ సభ్యులు మొబైల్స్ వాడటం కనిపించింది. ఇది మంచి పద్ధతి కాదు. ఇలాంటి సంఘటనలు సభ గౌరవానికి విరుద్ధం. సభ్యులు తమ మొబైల్ ఫోన్లు ఉంచడానికి సభ వెలుపల ఏర్పాట్లు చేస్తాం. లేదంటే ఎమ్మెల్యేలు సభలోకి వచ్చే ముందు తమ మొబైల్స్ స్విచాఫ్ చేసుకుని తీసుకురావాలి' అని సభలో విజయ్ చౌదరి చెప్పారు. -
అసెంబ్లీ నూతన స్పీకర్గా చౌదరి
పాట్నా : బిహార్ అసెంబ్లీ నూతన స్పీకర్గా జేడీ(యూ) సీనియర్ నేత విజయ కుమార్ చౌదరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ప్రొటెం స్పీకర్ సదానంద్ సింగ్ బుధవారం పాట్నాలో వెల్లడించారు. అసెంబ్లీ స్పీకర్గా విజయకుమార్ చౌదరి ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారని సదానంద్ చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన స్పీకర్గా ఎన్నికయ్యారని తెలిపారు. సమస్తీపూర్ జిల్లా సరాయిరంజన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయ కుమార్ చౌదరి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్, డిప్యూటి సీఎం తేజస్వీ యాదవ్, ప్రతిపక్ష నేత ప్రేమకుమార్... విజయ్ చౌదరికి శుభాకాంక్షలు తెలిపారు. విజయ్ చౌదరి గతంలో మంత్రిగా కూడా పని చేశారు. -
ప్రమాణం చేయకముందే ఎమ్మెల్యే హఠాన్మరణం
పట్నా: బిహార్ శాసనసభకు తొలిసారి ఎన్నికైన ఆర్ఎల్ఎస్పీ ఎమ్మెల్యే బసంత్ కుమార్ సోమవారం గుండెపోటుతో మరణించారు. ఇటీవల ఛాతినొప్ప రావడంతో పట్నా మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బసంత్ కుమార్.. ఆరోగ్యం విషమించడంతో ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. బసంత్ కుమార్ మృతిపట్ల బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఇతర నేతలు సంతాపం ప్రకటించారు. ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే భాగస్వామి ఆర్ఎల్ఎస్పీ తరపున హర్లఖీ నియోజకవర్గం నుంచి బసంత్ కుమార్ గెలుపొందారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయకముందే ఆయన మరణించడంతో విషాదం చోటు చేసుకుంది. బిహార్ కొత్త శాసనసభ తొలిసారిగా ఈ రోజు సమావేశమైంది. బసంత్ కుమార్ హఠాన్మరణం చెందడంతో ఈ రోజు జరగాల్సిన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం వాయిదాపడింది. ఆయన మృతికి సంతాపం సూచకంగా ఓ నిమిషం మౌనం పాటించిన అనంతరం సభ రేపటికి వాయిదా పడింది. ఎమ్మెల్యేలు మంగళవారం ప్రమాణం చేస్తారని ప్రొటెం స్పీకర్ సదానంద్ సింగ్ ప్రకటించారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్ఎల్ఎస్పీ తరపున ఇద్దరు మాత్రమే నెగ్గారు. బసంత్ కుమార్ మరణంతో శాసనసభలో ఆర్ఎల్ఎస్పీ బలం ఒకటికి పడిపోయింది. బిహార్లో మహాకూటమి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. జేడీయూ నేత నితీశ్ కుమార్ మంత్రివర్గంలో ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు చేరాయి. -
'కలాం పదవిని వదిలేయాలనుకున్నారు'
భువనేశ్వర్: బిహార్ అసెంబ్లీని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని2005లో సుప్రీంకోర్టు కొట్టివేసిన తర్వాత నాడు రాష్ట్రపతిగా ఉన్న అబ్దుల్ కలాం తన పదవిని వదులుకోవాలని భావించారని, ఆ రోజు ఆయన చాలా మదన పడ్డారని నాటి కలాం ప్రెస్ సెక్రటరీ ఎస్ఎం ఖాన్ తెలిపారు. ప్రస్తుతం ఆర్ఎన్ఐ డీజీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన 'మై డేస్ విత్ ద గ్రేటెస్ట్ హ్యూమన్ సోల్ ఎవెర్' అనే టాపిక్పై ఆదివారం శిక్ష్యా ఓ అన్సందన్ యూనివర్సిటీలో ఉపన్యాసం ఇచ్చిన సందర్భంగా ఈ అంశాన్ని గుర్తు చేశారు. 2005లో బిహార్ అసెంబ్లీని రద్దు చేస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకొని దానిని రాష్ట్రపతికి పంపించిందని, ఆ సమయంలో దానిని వెనక్కి పంపే అధికారం రాష్ట్రపతిగా కలాంకు ఉందని, అయితే, అలా పంపిన తర్వాత మరోసారి అదే తీర్మానం రాష్ట్రపతి వద్దకు వస్తే తిరిగి పంపించే అధికారం ఆయనకు లేనందున అయిష్టంగానే కలాం సంతకం చేశారని, దానిని సుప్రీంకోర్టు తోసిపుచ్చడంతో ఆయన తీవ్ర ఆవేదన చెందినట్లు తెలిపారు. ఆ సమయంలో కలాం రామేశ్వరం వెళ్లి తన సోదరుడిని కూడా కలిసి ఈ విషయం మాట్లాడారని, తన పదవికి రాజీనామా చేద్దామనుకుంటున్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారని ఎస్ఎం ఖాన్ చెప్పారు. -
అవినీతితో నీతి బిగి కౌగిలి...
పట్నా: బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయడం నెటిజెన్లకు కూడా ముచ్చటేసింది. అయితే అవినీతి కేసులో ఇప్పటికే దోషిగా తేలి ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా అర్హత కోల్పోయిన లాలూ ప్రసాద్ యాదవ్ వేదికపై చేసిన హంగామా నచ్చలేదు. అవినీతిని కూకటి వేళ్లతో సహా నిర్మూలిస్తామని శపథం చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లాలూను ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడం అంతకన్నా నచ్చలేదు. దీనిపై సోషల్ వెబ్సైట్లలో, ముఖ్యంగా ట్విట్టర్లో ఎవరికి వారు తమదైన శైలిలో విరుచుకుపడ్డారు. వ్యంగ్యోక్తులు విసిరారు. ‘అవినీతిని నీతి కౌగిలించుకున్న వేళ....లాలూను కేజ్రీవాల్ కౌగలించుకున్నారు. ఇక దేశం అవినీతి అనేది సమస్సే కాదు...అవకాశవాదానికి హద్దులు లేవు....అత్మవంచనకు పరాకాష్ట....కేజ్రివాల్ మెదడుకు ఇన్ఫెక్షన్ సోకినా ఆప్ కార్యకర్తలు ఇప్పటికీ ఆయన్ని ప్రేమిస్తారు....దాణా కేసులో కోట్లు కూడబెట్టి పాతిక లక్షల ఫైన్, కొన్నేళ్లు జైలు శిక్షతో సరిపెట్టుకున్న లాలూ ఇది మంచి డీల్....అవినీతి భరితమైన వ్యవస్థ దానంతట అదే ప్రక్షాళన అవుతుంది. కాకపోతే మనం కోరుకున్నట్టు కాదు....ఇదేమి వైచిత్రి, భారత రాజకీయాలే అంత...’ సోషల్ వెబ్సైట్లలో విమర్శల వర్షం కురిసింది. -
నితీష్ కార్యక్రమానికి మోదీ 'నో'
పట్నా: బిహార్ ముఖ్యమంత్రిగా మరోసారి పగ్గాలు చేపట్టబోతున్న నితీష్ కుమార్ చేస్తున్న ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ హాజరుకావడం లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆయనకు బదులుగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, రాజీవ్ ప్రతాప్ రూడి ప్రమాణ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు తెలిసింది. తన సీఎం ప్రమాణకార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ఆహ్వానిస్తూ నితిష్ కుమార్ ప్రధాని మోదీకి సందేశం పంపించిన విషయం తెలిసిందే. కాగా, 20న జరుగుతున్న ఈ కార్యక్రమానికి పలువురు ఎన్డీయే సభ్యులు హాజరుకానున్నట్లు తెలిసింది. పంజాబ్ డిప్యూటీ ముఖ్యమంత్రి సుఖ్ బీర్ బాదల్, శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రేల తరుపున సుభాష్ దేశాయ్, రామ్ దాస్ కడం కార్యక్రమానికి హాజరవుతున్నారు. బిహార్ ముఖ్యమంత్రిగా నితిష్ కుమార్ ప్రమాణం చేయడం ఇది నాలుగోసారి. మరోపక్క, ఈ కార్యక్రమానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కే్జ్రీవాల్, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్, సమాజ్ వాది పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ హాజరవుతున్నట్లు స్పష్టం చేశారు. -
నితీశ్ ప్రమాణ స్వీకారానికి మమత
పట్నా: బిహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అతిరథ మహారథులు రానున్నారు. ఈ కార్యక్రమానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరుకానున్నారు. ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా వచ్చే అవకాశముంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. జేడీయూ, మహాకూటమి శాసనసభ పక్ష నేతగా నితీశ్ ఎన్నికయ్యారు. ఈ నెల 20న బిహార్ సీఎంగా నితీశ్ ప్రమాణం చేయనున్నారు. -
బిహార్ ఎన్నికలపై దలైలామా వ్యాఖ్యలు
జలంధర్: దేశంలోని మెజారిటీ హిందువులు శాంతి, సామరస్యాలను విశ్వసిస్తున్నారడానికి బిహార్ ప్రజాతీర్పే నిదర్శనమని బౌద్ధుల ఆధ్యాత్మిక నాయకుడు దలైలామా పేర్కొన్నారు. 'భారత్లో సుదీర్ఘకాలం నుంచి శాంతి, సామరస్యపూర్వక సంప్రదాయం నెలకొని ఉంది. ఇటీవలి బిహార్ ఎన్నికల్లో ప్రజాతీర్పు కూడా.. మెజారిటీ హిందువులు శాంతి, సామరస్యాలను కోరుకుంటున్నారని ఋజువు చేసింది' అని ఆయన పేర్కొన్నారు. అయితే దలైలామా ఏ రాజకీయ పార్టీ పేరును నేరుగా ప్రస్తావించలేదు. 'ఈ సామరస్య వాతావరణం కారణంగానే మతసహనం కలిగిన దేశంగా భారత్ ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. ఇక్కడ అన్ని మతాలకు, వ్యక్తులకు సమాన హక్కులు కలవు' అని ఆయన చెప్పారు. జలంధర్లో ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన దలైలామా విలేకరులతో మాట్లాడారు. 'మతసహనం అంటే అన్ని మతాలను గౌరవించడమే కాదు వ్యక్తులను కూడా గౌరవించడం. అందువల్లే బౌద్ధమతం భారత్లో పుట్టింది. అందువల్లే భారత్ను గురువుగా, బౌద్ధులను శిష్యులుగా భావిస్తారు' అని ఆయన చెప్పారు. -
నితీశ్ కుమార్ రాయని డైరీ
ప్రమాణ స్వీకారం! ఈ మాట ఎందుకో సరైనదిగా అనిపించదు. ఇప్పటికి నాలుగు స్వీకారాలు అయ్యాయి. ఇది ఐదోది. అయినా స్వీకారం అనే మాటకు మనసు అలవాటు పడలేకపోతోంది. పదవీ స్వీకారం గానీ, ప్రమాణ స్వీకారం గానీ.. అసలు స్వీకారం ఏమిటి? సమర్పణ అని కదా అనాల్సింది! పదవిని ప్రజలకు సమర్పిస్తున్నాం. ‘మహా జనులారా ఇదిగో... ఈ పదవిని, ఈ అధికారాన్ని మీకు సమర్పిస్తున్నాం’ అని కదా అనాలి. అప్పుడది ప్రమాణ సమర్పణ అవుతుంది. పదవీ సమర్పణ అవుతుంది. జేపీ అనేవారు.. ప్రజలే నాయకులై నడిపిస్తే ఉత్తేజితుడినై ముందుకు నడిచినవాడిని నేను.. అని! ఇప్పుడీ మహా కూటమిని నడిపించిందీ ఆ ప్రజలే. జేపీ సంపూర్ణ క్రాంతి ఉద్యమం ప్రారంభమైన చోట.. పట్నా గాంధీ మైదానంలో మేమిప్పుడు ప్రమాణ స్వీకారం చేయాలనుకుంటున్నది కూడా అందుకే.. ప్రజలకు అధికారం సమర్పించడం కోసం. నిన్న అందరం కలసి కూర్చున్నాం. అలయెన్స్గా ఉన్నవాళ్లందరం. గెలిచాక ఫస్ట్ మీటింగ్. అందరి ముఖాల్లో సంతోషం. ఈ సంతోషం బిహార్ ప్రజల్లో కనిపించినప్పుడు కదా నిజంగా మేము గెలిచినట్లు! జేడీ(యూ) విడిగా గెలవలేదు. ఆర్జేడీ విడిగా గెలవలేదు. కాంగ్రెస్ విడిగా గెలవలేదు. విడివిడిగా గెలిపించకుండా, ఒకటిగా గెలిపించి, ఒకటిగా కలిపి ఉంచి ‘ఇక పాలించండి’ అని బిహార్ తీర్పు ఇచ్చింది. కలసి పాలించడం కష్టం కాదు. పాలించడానికి కలసి ఉండడమే కష్టం. దానికి కమిట్మెంట్ కావాలి. కమిట్మెంట్ ఉంటుందా ఉండదా అన్నది.. లాలూజీ కుమారులలో ఒకరికి డిప్యూటీ సీఎం పదవి వస్తుందా లేదా అన్నదాన్ని బట్టి ఉండకూడదు. జేడీ(యు)కి వచ్చిన సీట్లు ఆర్జేడీకి వచ్చిన సీట్లకంటే తక్కువ కదా అనే దాన్ని బట్టీ ఉండకూడదు. మోదీజీని కలసికట్టుగా కమిట్మెంట్తో దూరంగా ఉంచినట్టే, మహాకూటమి కమిట్మెంట్తో కలసికట్టుగా ఉండాలి. ప్రమాణ స్వీకారం బలప్రదర్శనలా ఉండాలి అంటున్నారు లెజిస్లేజర్ మీటింగ్లో యువ ప్రజాప్రతినిధులు. ‘సోనియాజీ, రాహుల్, మమతా బెనర్జీ, కేజ్రీవాల్, జయలలిత, నవీన్ పట్నాయక్లను ఒకే వేదికపై చూస్తే చాలు మోదీజీ గుండె జారిపోతుంది’ అంటున్నారు. అద్వానీ, మురళీమనోహర్ జోషీ, యశ్వంత్ సిన్హాలను కూడా రప్పిస్తే?..’ నవ్వుతున్నారు నవ ప్రతినిధులు. నాయకుల బలాన్ని ప్రదర్శించవలసిన వాళ్లు ప్రజలు. ప్రజల ఆశల్ని నెరవేర్చవలసిన వారు మాత్రమే నాయకులు. మోదీజీకి గుబులు పుట్టించడానికి ఇంతపెద్ద వేదిక అవసరం లేదు. ఇంతమంది నాయకులు ఆసీనులు అవనవసరం లేదు. లాలూజీ ఒక్కరు చాలు. మోదీజీ దేశాలు తిరిగి నిలుపుకోలేని దాన్ని, లాలూజీ రాష్ట్రాలు తిరిగి గెలుచుకోగలరు. - మాధవ్ శింగరాజు -
'అమిత్ షా తప్పుకోవాలి'
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా బాధ్యులని బీజేపీ ఎంపీ బోలా సింగ్ పునురుద్ఘాటించారు. పార్టీ ఓటమికి గల కారణాలపై అమిత్ షా వివరణ ఇవాలని లేదా అధ్యక్ష పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు. బిహార్ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలపై అగ్రనేతలే నిర్ణయం తీసుకున్నారని, ఓటమికి వారే బాధ్యత వహించాలని బెగుసరాయ్ లోక్ సభ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న బోలా సింగ్ అన్నారు. 'బీజేపీకి కేన్సర్ సోకింది. దీన్ని నిర్మూలించాల్సిన అవసరముంది' అని పేర్కొన్నారు. రిజర్వేషన్లపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యల ప్రభావం బిహార్ ఎన్నికల్లో లేదని చెప్పడాన్ని ఆయన తోసిపుచ్చారు. -
'పత్తి రైతుల నోట్లో కేంద్రం మట్టికొడుతోంది'
హైదరాబాద్: తెలంగాణ పత్తి రైతులను కేంద్రం పట్టించుకోవడం లేదని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర పత్తి రైతుల నోట్లో కేంద్రం మట్టికొడుతోందంటూ ఆయన విమర్శించారు. పేదల కోసం కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ ఒక్క పథకాన్నైనా ప్రవేశపెట్టిందా అని ఈ సందర్భంగా ఈటల ప్రశ్నించారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతోనైనా కేంద్రానికి కనువిప్పు కలగాలని మంత్రి హితవు పలికారు. -
'వారిద్దరినీ నిందించడం సరికాదు'
న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షాను నిందించడం సరికాదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. వాజపేయి, ఎల్ కే అద్వానీ హయాంలోనూ బీజేపీ ఓడిపోయిందని గుర్తు చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... బీజేపీ కుటుంబ పార్టీ కాదని, గెలుపోటములకు సమిష్టి బాధ్యత తీసుకోవాలని అన్నారు. కాగా, బిహార్ లో పార్టీ ఓటమికి మోదీ, అమిత్ షాలదే బాధ్యతని సీనియర్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీతో కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా సమావేశమయ్యారు. మోదీ-షా ద్వయానికి వ్యతిరేకంగా తమ గళాన్ని గట్టిగా వినిపించేందుకు సీనియర్లు సన్నద్ధమవుతున్నట్టు ఈ పరిణామాలను బట్టి తెలుస్తోంది. -
'ఒక్క గెలుపుతో గర్వం వద్దు'
పాట్నా: కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ఈనెల 14న నిర్ణయం తీసుకుంటామని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తెలిపారు. శనివారం మంత్రివర్గ సమావేశం జరుగుతుందని చెప్పారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా ప్రస్తుత శాసనసభను రద్దు చేయాలని గవర్నర్ ను తాము కోరతామని తెలిపారు. బుధవారం ఆయన బిహార్ గవర్నర్ రామనాథ్ కొవింద్ ను కలిశారు. నూతన ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ తో చర్చించారు. భేటీ అనంతరం నితీశ్ కుమార్ విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్షాలను గౌరవిస్తామని, రాష్ట్రాభివృద్ధికి వారు తమతో కలిసిరావాలని అన్నారు. ఒక్క గెలుపుతో గర్వం నెత్తికెక్కించుకోవాల్సిన అవసరం లేదని, అది వ్యక్తిత్వం కాదని అన్నారు. కాగా, ఈనెల 20న నితీశ్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఆహ్వానించాలని జేడీ(యూ) నిర్ణయించింది. -
బీజేపీకి శివసేన చురకలు
ముంబై: బిహార్ ఎన్నికల్లో ఓడిన బీజేపీని మిత్రపక్షం శివసేన మళ్లీ ఘాటుగా విమర్శించింది. ఎల్లప్పుడూ మోసగించడం రాజకీయాల్లో పనిచేయదని పేర్కొంది. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెబుతారని తన పత్రిక ‘సామ్నా’లో హెచ్చరించింది. ‘అలలు వస్తుంటాయి. పోతుంటాయి. అవి పోయాక.. వాటి ఆనవాళ్లు కూడా కనిపించవు.. సాధారణ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కూడా అలాంటిదే’ అని పేర్కొంది. -
నేరస్తులే ఎక్కువ
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం కన్నా.. నేరస్తులు, కోటీశ్వరుల బలమే ఎక్కువ సీట్లు సంపాదించింది. అసెంబ్లీకి ఎన్నికయిన వారిలో 143 మంది(58 శాతం) నేరచరితులు ‘అధ్యక్ష్యా!’ అనేందుకు సిద్ధమయ్యారు. అందులో 96 మందిపై హత్య, హత్యాయత్నం, కిడ్నాప్ వంటి తీవ్రమైన కేసులున్నాయి. ఎన్నికైన వారిలో అర్జేడీ నుంచి అత్యధికంగా 46 మంది ఉన్నారు. జేడీయూ నుంచి 37 మంది, బీజేపీ నుంచి 34 మంది, కాంగ్రెస్ నుంచి 16 మంది ఉన్నారు. -
ఎవరేమన్నారు?
‘‘బిహార్లో ప్రజా తీర్పును శిరసావహిస్తూ, ఓటమిని అంగీకరిస్తున్నాం. ఘనవిజయం సాధించిన నితీశ్ , లాలూలకు అభినందనలు’’ అమిత్ షా(బీజేపీ చీఫ్) ‘‘మోదీనే మా పార్టీకి బలం. ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను సమీక్షించి, దిద్దుబాటు చర్యలు తీసుకుంటాం. ఏ ఒక్క కారణంపైననో గెలుపోటములు అధారపడబోవు’’ రాం మాధవ్ (బీజేపీ నేత) ‘‘మహా కూటమి విజయంలో లాలూ ప్రసాద్ కన్నా.. నితీశ్కుమార్దే కీలక పాత్ర. సీఎంగా పదేళ్ల పాటు నితీశ్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే ఆయనకు విజయం సాధించిపెట్టాయి’’ చిరాగ్ పాశ్వాన్(ఎల్జేపీ నేత) ‘‘బిహార్లో మహా కూటమి గెలుపు.. బీజేపీ, ఆరెస్సెస్ల విభజనవాద అజెండా పరాజయం. విద్వేషంపై ప్రేమ.. విభజనపై ఐక్యత.. అసహనంపై సహనం సాధించిన విజయం.. ప్రధాని మోదీ విదేశీ పర్యటనలను పక్కనబెట్టి రైతులు, కూలీలు, నిరుద్యోగ యువతకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించాలి. మాటలు కట్టిబెట్టి పని ప్రారంభించాలి. డ్రైవర్ సీట్లో కూర్చున్న మోదీ ఇకనైనా వేగం పెంచాలి. లేదంటే బిహార్లో లాగా.. ప్రజలు ఆ సీట్లోంచి తొలగించేస్తారు’’ రాహుల్ గాంధీ(కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు) ‘‘బిహార్లో ఓటమి రాజకీయంగా ప్రధాని మోదీకి పెద్ద ఎదురుదెబ్బ. నియంతృత్వం తరహా నాయకత్వ తీరును ప్రజలు సహించబోరనడానికి ఇదే నిదర్శనం’’ మల్లికార్జున్ ఖర్గే(లోక్సభలో విపక్ష నేత) ‘‘నితీశ్ కుమార్ మహానాయకుడు. ఆయన గెలుపు బిహార్కు అవసరం. బిహార్లో మహాకూటమి గెలుపు ఓ నాయకుడి పతనాన్ని(మోదీని ఉద్దేశించి) సూచిస్తోంది. దేశ రాజకీయాల్లో ఈ ఫలితాలు ఒక కీలక మలుపునకు కారణమవుతాయయి’’ సంజయ్ రౌత్(శివసేన ఎంపీ) ‘‘మహకూటమి గెలుపు ధనబలంపై విలువలతో కూడిన రాజకీయం సాధించిన విజయం’’ -శరద్ యాదవ్(జేడీయూ చీఫ్) ‘‘సహనం గెలిచింది. అసహనం ఓడింది. నితీశ్, లాలూకు అభినందనలు’’ మమతా బెనర్జీ( బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్) ‘‘ఈ ఫలితాలు ప్రజాస్వామ్యం, బిహార్ ప్రజలు సాధించిన విజయం. అంతర్మధనానికి, మెరుగైన వ్యూహాలకు, మెరుగైన సమన్వయానికి, ఐక్య కృషికి ఇదే సరైన సమయం’’ - శత్రుఘ్న సిన్హా(బీజేపీ ఎంపీ) ‘‘విద్వేషపూరిత రాజకీయాలకు పాల్పడేవారికి చెంపదెబ్బలాంటి ఫలితాలివి. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాల పనితీరుపై ప్రజలిచ్చిన తీర్పు. మోదీ అహంకారపూరిత పాలనకు, నియంతృత్వ పోకడలకు ఇవి రెఫరెండం. కేంద్ర ప్రభుత్వ అహంకారాన్ని ఈ ఫలితాలు బద్ధలు కొట్టాయి’’ - అరవింద్ కేజ్రీవాల్(ఢిల్లీ సీఎం, ఆప్ నేత) ‘బీజేపీ ఓటమి ప్రధాని మోదీ వ్యక్తిగత ఓటమి. ఒక ప్రధాని.. ఒక రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఇంత ప్రాధాన్యతనివ్వడం ఇదే ప్రథమం. బిహార్లో వచ్చే ఎన్నికల నాటికి మేం మరింత బలోపేతమవుతాం’’ అసదుద్దీన్ ఒవైసీ(ఎంఐఎం చీఫ్) ప్రజల అభిమానం చూరగొన్నారు బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నితీశ్కుమార్కు అభినందనలు. రెండు సార్లు బిహార్ సీఎంగా బాధ్యతలు నిర్వహించిన నితీశ్.. ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నారనడానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనం. బిహార్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మహా కూటమి మంచి పాలన అందించాలి. - కేసీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి అభినందనలు బిహార్లో విజయం సాధించిన నితీష్ కుమార్కు అభినందనలు. బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీకి జన్మదిన శుభాకాంక్షలు. - చంద్రబాబునాయుడు, ఏపీ సీఎం లాలూ కింగ్ మేకర్ బలమైన సామాజిక కూటముల కలయిక వల్లే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి ఘన విజయం సాధిం చింది. ప్రజాతీర్పును గౌరవిస్తున్నాం. వారి నిర్ణయానికి అనుగుణంగా బాధ్యతాయుత ప్రతిపక్షంగా బిహార్ అభివృద్ధిలో ప్రభుత్వానికి సహకరిస్తాం. 80 సీట్లు గెలుచుకున్న లాలూ.. ‘కింగ్ మేకర్’, ‘బిగ్బాస్’ అవుతారు. రాష్ట్రమంతా పర్యటించి పార్టీ ఓటమికి కారణాలు తెలుసుకుంటాం. - సుశీల్మోదీ(బీజేపీ), బిహార్ మాజీ డిప్యూటీసీఎం మోదీ, షా, జైట్లీలే బాధ్యులు బిహార్ ఎన్నికల్లో బీజేపీ ఘోరపరాజయానికి ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలదే బాధ్యత. అధిష్టానం తీరుకు నిరసనగా పార్టీ కార్యకర్తలు.. నిశ్శబ్దంగా సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టారు. అంతకుముందు ఇచ్చిన హమీలను నెరవేర్చకుండా ప్రచారమంతా మోదీ కేంద్రీకృతంగా జరగటం, పార్టీ విభజన రాజకీయాల వల్లే ఓడిపోయారు. - అరుణ్శౌరీ, కేంద్ర మాజీ మంత్రి అభివృద్ధి ఫలితం ఈ గెలుపు రాష్ట్రంలో నితీశ్ సాధించిన అభివృద్ధి ఫలితం. సుపరిపాలనకు సామాజిక న్యాయానికి బిహార్ ఓటర్లు పట్టం కట్టారు. - కరుణానిధి, డీఎంకే అధ్యక్షుడు పతనానికి ప్రారంభం ఈ ఫలితాలు ప్రధాని మోదీ పతనానికి ప్రారంభం. మతం పేరుతో ప్రజల్లో విభేదాలు పెంచాలన్న మోదీ ప్రయత్నం విఫలమైంది. - ఊమెన్ చాందీ, కేరళ సీఎం మంచి రోజులు మొదలయ్యాయి దేశంలో మంచి రోజులు మొదలయ్యాయి. మోదీ హవాకు కాలం చెల్లడం ఢిల్లీ ఎన్నికలతోనే ప్రారంభమైంది. - సీతారాం ఏచూరి, సీపీఎం ప్రధాన కార్యదర్శి -
మార్కెట్లు బలహీన పడొచ్చు
బిహార్ ఫలితాలపై బార్ల్కేస్ అభిప్రాయం న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరాజయంతో దేశంలో సంస్కరణల వేగం మందగించవచ్చని, స్టాక్ మార్కెట్లను బలహీనపరచవచ్చని లండన్కు చెందిన ప్రముఖ బ్యాంకింగ్ వ్యవహారాలు, బ్రోకరేజీ సంస్థ బార్ల్కేస్ తెలిపింది. ‘భారత ఆర్థిక మార్కెట్లు రాజకీయ ఒడిదుడులతో ప్రభావితం అవుతుంటాయి. బీజేపీకి వచ్చిన వ్యతిరేక ఫలితాలు స్టాక్ మార్కెట్లను బలహీనపర్చొచ్చు. సోమవారం నాటి మార్కెట్లో 2 నుంచి 2.5 శాతం వరకు మార్పులు ఉండవచ్చు. అలాగే డాలర్తో పోలిస్తే రూపాయి మరింత బలహీనపడొచ్చు’ అని ఆ సంస్థ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. -
అతడు ఫీనిక్స్!
బిహార్లో కింగ్మేకర్గా లాలు పునరుత్థానం పట్నా: చితిలో దహనమైపోయి మళ్లీ బూడిద నుంచి బతికి వస్తుంది ఫీనిక్స్ పక్షి అని గ్రీకు పురాణంలో కథ. రాజకీయంగా ఇక పనైపోయిందనుకున్న ఆర్జేడీ అధినేత లాలుప్రసాద్.. సరిగ్గా ఫీనిక్స్ పక్షిలా మళ్లీ ప్రాణం పోసుకున్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రులు, ప్రత్యర్థులకన్నా ఎక్కువ సీట్లు సాధించిన ఆయన పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. పదిహేనేళ్ల పాటు బిహార్ను ఎదురులేకుండా పరిపాలించిన ఆర్జేడీ 2005లో అధికారం కోల్పోయిన తర్వాత.. అవినీతి ఆరోపణలు, కేసులు, జైళ్లతో ప్రతిష్టను, ప్రజాదరణను కోల్పోయి రాజకీయంగా క్రమంగా క్షీణిస్తూ మొన్నటి లోక్సభ ఎన్నికలతో నామమాత్రంగా మిగిలిపోయిన లాలూప్రసాద్.. ఈ ఎన్నికల్లో జేడీయూ, కాంగ్రెస్లతో మహాకూటమి కట్టి పోటీ చేయటం ద్వారా పునరుజ్జీవనం పొందటమే కాదు.. పదేళ్ల తర్వాత రాష్ట్రంలో మరోసారి కింగ్మేకర్గా అవతరించారు. తిరుగులేని నేతగా రాజ్యమేలి... బిహార్లో 1990లో జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా లాలుప్రసాద్ ఎన్నికయ్యారు. అనేక ప్రజాకర్షక పథకాలతో సామాన్య ప్రజానీకంలో విస్తృత ఆదరణ సంపాదించుకున్నారు. అప్పటికి లాలుతో కలిసి పార్టీలో ఉన్న నితీశ్కుమార్ క్రమంగా దూరమయ్యారు. జనతాదళ్ చీలటంతో 1995 నాటికి లాలు సీఎంగా, పార్టీ నేతగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. 1995 ఎన్నికల్లో 167 స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వచ్చారు. అయితే.. అవినీతి ఆరోపణల నేపథ్యంలో 1997లో జనతా పార్టీ నుంచి వేరుపడి ఆర్జేడీని స్థాపించారు. సీఎం పదవికి రాజీనామా చేసి.. ఆ స్థానంలో తన భార్య రబ్రీదేవిని సీఎం చేశారు. అనంతరం 2000 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో 103 స్థానాలతో పెద్ద పార్టీగా నిలిచి.. కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సీఎం పదవి మళ్లీ రబ్రీదేవి చేపట్టారు. అయితే.. 2005 ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో ఆర్జేడీ కేవలం 75 స్థానాలకు పడిపోయింది. అప్పటికీ పెద్ద పార్టీగా నిలిచింది. మరోవైపు నితీశ్తో కూడిన ఎన్డీఏకూ మెజారిటీ రాలేదు. మళ్లీ అదే ఏడాది అక్టోబర్లో జరిగిన ఎన్నికల్లో ఆర్జేడీ 54 స్థానాలకు పడిపోయింది. జేడీయూ, బీజేపీల ఎన్డీఏ భారీ మెజారిటీతో గెలిచింది. 2010 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ఐదింట నాలుగువంతుల మెజారిటీతో గెలవగా.. ఆర్జేడీ కేవలం 22 సీట్లకు పతనమైపోయింది. ఒకప్పుడు భారీ బీసీ-ముస్లిం ఓటు బ్యాంకు మద్దతుతో అజేయంగా కనిపించిన ఆర్జేడీ ఆ ఎన్నికల్లో చవిచూసిన పరాజయం ఎంతటిదంటే.. ప్రతిపక్ష నేత హోదా (గుర్తింపు) కూడా దానికి దక్కలేదు. ఇక దాణా కుంభకోణంలో 2013లో కోర్టు లాలును దోషిగా నిర్ధారించి శిక్ష విధించటం ఆయనను వ్యక్తిగతంగా చాలా దెబ్బతీసింది. ఆ తీర్పు వెంటనే ఆయన ప్రజాప్రతినిధి పదవికి అనర్హుడై అప్పటికే ఉన్న లోక్సభ సభ్యత్వాన్నీ కోల్పోయారు. అంతేకాదు.. ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయటం పైనా నిషేధానికి గురయ్యారు. 2014 లోక్సభ ఎన్నికల్లో లాలు తొలిసారిగా తాను ఎన్నికల్లో పోటీ చేయకుండానే పార్టీని పోటీచేయించి నడిపించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ ఎన్నికల్లో 40 లోక్సభ స్థానాల్లో లాలు పార్టీకి కేవలం 4 స్థానాలే దక్కాయి. ఎన్నికల్లో లాలు మార్కు ప్రచారం.. ఇక ఎన్నికల్లో సైతం లాలు తన మార్కు ప్రచారాన్ని ఉధృతం చేశారు. దేశంలో కులాల ఆధారంగా ఉన్న రిజర్వేషన్ల విధానాన్ని సమీక్షించాలంటూ ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్భగవత్ వ్యాఖ్యానించినపుడు.. మండల్ అనంతర రాజకీయాలకు ఇంకా కొనసాగుతున్న రూపంగా పరిగణించే లాలుప్రసాద్ తక్షణమే విరుచుకుపడ్డారు. ఆర్ఎస్ఎస్ సూచనల మేరకు మోదీ సర్కారు రిజర్వేషన్లను రద్దు చేసే అవకాశముందని గళమెత్తారు. ఈ అంశంపై ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. వరుస బహిరంగ సభల్లో ధ్వజమెత్తారు. -
బిహార్లో ఎవరెవరికి ఎన్ని సీట్లు..
పాట్నా: దేశం యావత్తు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తొలుత వచ్చిన ఫలితాలు బీజేపీ కూటమికి అనుకూలంగా ఉన్నా ఆ తర్వాత అనూహ్యంగా మహాకూటమి పుంజుకుని తిరుగులేని విజయాన్ని సాధించింది. మొత్తం 243 స్థానాలకు జరిగిన పోరులో సీఎం నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ల మహా లౌకిక కూటమి 178 సీట్లను కైవసం చేసుకొని అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీల వారిగా గెలుపొందిన సీట్లు.. పార్టీలు - గెలిచిన సీట్లు మహా కూటమి-178 జేడీయూ-71 ఆర్జేడీ-80 కాంగ్రెస్-27 ఎన్డీఏ-58 బీజేపీ-53 ఎల్ జేపీ-2 ఆర్ఎల్ఎస్పీ-2 హెచ్ఎంఎం-1 ఇతరులు-7 -
అసలు సిసలైన పొలిటికల్ థ్రిల్లర్
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పొలిటికల్ థ్రిల్లర్లా సాగాయి. ముందస్తు అంచనాలను తలకిందులు చేశాయి. తుదితీర్పు ప్రజల మనోగతానికి అద్దం పట్టింది. సచ్ఛీలత, సుస్థిరత, సుపరిపాలనలకు పట్టం గట్టాయి. అసహనానికి సహనం నూరిపోశాయి. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్పాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, నితీష్ కుమార్ నేతృత్వంలోని మహాకూటమి మధ్య హోరాహోరీగా జరిగిన ప్రచారం.. ఫలితాల్లో కూడా ప్రతిఫలిస్తుందని ఒకటి, రెండు మినహా అన్ని సర్వేలు చాటి చెప్పాయి. అయితే, ఒకటి రెండు సంస్థలు తప్ప దాదాపు సర్వేలన్నీ కూడా రెండు కూటముల మధ్య హోరాహోరీ పోరు సాగుతుందని, ఫలితాల్లో కూడా రెండు కూటములు దగ్గరగానే ఉంటాయి గానీ మహాకూటమి స్వల్ప ఆధిక్యంతో అధికారం చేపడుతుందని చెప్పాయి. అది మాత్రం తప్పయింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి నూటికి పైగా స్థానాలు గెలుచుకుంటుందని చెప్పినా, ఆ దరిదాపుల్లోకి చేరుకునే పరిస్థితి కూడా ఏ దశలోనూ కనిపించలేదు. దాదాపు అన్ని వర్గాల ప్రజలు నితీష్ నాయకత్వాన్ని, లాలు అండదండలను కోరుకున్నారనే విషయం తీర్పుతో స్పష్టమైంది. యాదవులు, ముస్లింలు ఎక్కువగా ఉన్న సీమాంచల్లో దాదాపు 75 శాతం ఓట్లు మహా కూటమికి పడ్డాయి. మొత్తం 70 శాతానికి పైగా బీసీలు, ఓబీసీలు మహాకూటమికే ఓటేశారని ఫలితాల తీరు తెలియజేస్తోంది. 80 శాతం వరకు ముస్లింలు, 45 శాతం మహిళలు, 41 శాతం యువకులు మహా కూటమికే మద్దతు పలికారు. దాద్రీ నుంచి ఢిల్లీ వరకు పెరిగిపోయిన అసహన సంఘటనలు బీజేపీ కూటమిపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. నమ్ముకున్న అగ్రవర్ణాలు, యువత, కొత్త ఓటర్ల నుంచి కూడా ఆశించిన స్థాయిలో మద్దతు లభించలేదు. అభివృద్ధి మంత్రం పేరిట ఆర్థికంగా వెనకబడిన వివిధ వర్గాలను తమవైపు తిప్పుకోడానికి ప్రధాని మోదీ చేసిన ప్రయత్నం ఫలించలేదు. తొలుత అటూ ఇటూ ఊగిసలాడిన ఈబీసీలు కూడా చివరకు సుస్థిర పాలన నినాదానికే కట్టుబడి ఓటేశారు. ఒకప్పుడు భూస్వాముల ప్రైవేటు సైన్యం హింసాకాండలో నలిగిపోయిన కులాలు కూడా సుస్థిర పరిపాలనకే మొగ్గుచూపాయి. హిందూ అతివాద శక్తుల ఎజెండాను వ్యతిరేకిస్తున్న ఉదారవాదులు, హేతువాదులు, సామ్యవాదులు కూడా కలసికట్టుగా నితీస్ కూటమివైపే నిలబడ్డారు. వామపక్షాల కూటమి ఎన్నికల బరిలో ఉన్నా.. పెద్దగా ప్రభావం చూపలేదు. దళిత వర్గానికే చెందిన జితన్ రామ్ మాంఝీ సొంత పార్టీ పెట్టి ఏకంగా 40 సీట్లకు పోటీచేసినా నితీష్ కూటమి విజయపథాన్ని అడ్డుకోలేకపోయారు. మహాదళితులు ఓట్లు ఆయన చీల్చుకు రాగలరని, దాంతో ఫలితాలు ఎన్డీయే కూటమికి అనుకూలంగా ఉంటాయని భావించారు గానీ అలా జరగలేదు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాలనకు ఇది రిఫరెండం అయినా, కాకపోయినా ఆయన వ్యక్తిగత ప్రతిష్ఠను మాత్రం బిహార్ ఎన్నికల ఫలితాలు దెబ్బతీశాయి. కేంద్రంలో ప్రతిపక్షాల పునరుజ్జీవనానికి బిహార్ ఎన్నికల తీర్పు దోహదపడుతుందని చెప్పవచ్చు. -
ప్రజల తీర్పును గౌరవిస్తాం: అమిత్ షా
న్యూఢిల్లీ: బిహార్ శాసనసభ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కు ఆయన అభినందనలు తెలిపారు. 'బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినందుకు నితీశ్ కుమార్ కు, రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కు అభినందనలు. ప్రజల తీర్పును మేము గౌరవిస్తాం. కొత్త ప్రభుత్వానికి అభినందనలు. నూతంగా ఏర్పడబోయే ప్రభుత్వం బిహార్ ను అభివృద్ధి పథంలో పయనిస్తుందని ఆశిస్తున్నాం' అని అమిత్ షా అన్నారు. -
బీహార్ ముఖ్యమంత్రి ఎవరు?
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధిస్తే ముఖ్యమంత్రి ఎవరు అవుతారనే అంశంపై ఆ రాష్ట్ర బీజేపీ వర్గాల్లో చర్చ మొదలైంది. అనుభవజ్ఞుడైన మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ఎన్నికలకు ముందు వినిపించింది. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. సీఎం పదవికి రేసులో ఉన్న నాయకుల్లో ఆయన పేరు మచ్చుకు కూడా వినిపించడం లేదు. దీనికి కారణం ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడమే కావచ్చు. రొహతాస్ జిల్లా దినార అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన రాజేంద్రసింగ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. రాజేంద్ర సింగ్ ఆరెస్సెస్లో పూర్తికాల కార్యకర్త. ఆయన్ని అప్పుడే 'బిహార్ మనోహర్ లాల్ ఖట్టర్' అని కూడా అనుచరవర్గం పిలుస్తోంది. ఆరెస్సెస్ మాజీ ప్రచారక్ అయిన మనోహర్ లాల్ ప్రస్తుతం హర్యానా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆరెస్సెస్లో పూర్తికాల కార్యకర్తగా రాజేంద్రసింగ్ పనిచేసినా ఆయన బిహార్ రాజకీయాల్లో ఎప్పుడూ చురుగ్గా లేరు. ఏబీవీపీ నుంచి పార్టీలోకి వచ్చినా.. ఆయన ఎక్కువకాలం ఉత్తరప్రదేశ్లోనే ఉన్నారు. జార్ఖండ్ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా 2013లో ఆయన ఎన్నికయ్యారు. అయితే ఆయనకున్న అడ్డంకి ఒక్కటే. ఆయన తాను పోటీచేసిన దినార నియోజకవర్గం నుంచి గెలుస్తారా అన్నదే. ఎందుకంటే అక్కడ ఆయనపై నితీష్ ప్రభుత్వంలో సహకార శాఖ మంత్రిగా పనిచేస్తున్న జయ్కుమార్ సింగ్ జేడీయూ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయనకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అంచనా. రాజేంద్రసింగ్ తర్వాత ఎక్కువగా వినిపిస్తున్న పేరు బీజేపీ గయ ఎమ్మెల్యే ప్రేమ్కుమార్. ఆయన బిహార్ అసెంబ్లీలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఎమ్మెల్యే కావడంతో పాటు 1990 నుంచి ఇప్పటివరకు విజయ ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఎన్నడూ ఓడిపోలేదు. బలహీనవర్గాలకు చెందిన ఆయనే కాబోయే ముఖ్యమంత్రంటూ గయ పోలింగ్కు రెండు రోజుల ముందు బీజేపీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ ప్రకటించారు. ఆయనది కూడా రాజేంద్రసింగ్ లాంటి సమస్యే. ఆయనపై కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థి ప్రియరంజన్ పోటీచేశారు. బిహార్ ప్రస్తుత అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతున్న నందకిషోర్ యాదవ్ కూడా రేస్లో ఉన్నారు. ప్రేమ్కుమార్లాగే ఆయన కూడా ఓటమి ఎరుగని ధీరుడు. పైగా ఆరెస్సెస్ కార్యకర్త. నరేంద్ర మోదీకి కాస్త సన్నిహితులు. అలాగే మోదీకి సన్నిహితులు, బలహీనవర్గానికి చెందిన రామేశ్వర్ ప్రసాద్ చౌరాసియా పేరు కూడా వినిపిస్తోంది. -
బీజేపీ 'ఆవు' ప్రకటన కలకలం
పూర్నియా: 'ముఖ్యమంత్రిగారు.. మీ భాగస్వమి పవిత్ర గోమాతనూ, హిందువులనూ అవమానిస్తూ స్టేట్మెంట్లు గుప్పిస్తాడు. అతడిపై చర్యలు తీసుకోవాల్సిందిపోయి మీరు మౌనంగా ఉంటారు. అంటే దీని అంతరార్థమేమిటి?' అంటూ బీజేపీ జారీచేసిన భారీ ప్రకటనలు.. బుధవారం బిహార్లోని అన్ని ప్రధాన వార్తాపత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఈ ప్రకటనతో ప్రధానంగా 9 జిల్లాల్లో రాజకీయ కలకలం రేగింది. ఎందుకంటే.. ఈ జిల్లాల్లోని 57 నియోజకవర్గాల్లోనే రేపు(గురువారం) ఐదో(చివరి) విడత పోలింగ్ జరగనుంది. వీటిలో ఎక్కువ స్థానాల్లో ముస్లిం ఓటర్లదే ఆధిపత్యం. ఎంఐఎం పార్టీ కూడా ఈ ప్రాంతం నుంచి పోటీచేస్తుండటం గమనార్హం. చివరి విడతలో బీజేపీ ఇలా హిందూత్వ కార్డును ప్రయోగించడంపై మిగిలిన పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కొద్దిరోజుల కిందట దాద్రీ ఘటనపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ హిందువులు కూడా గోమాంసం తింటారని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. లాలూ వ్యాఖ్యలపై నితిశ్ కుమార్ మౌనం వహించడమూ విదితమే. తాజా ఆవు ప్రకటనపై బిహార్ వెలుపలి నేతలు కూడా స్పందించారు. 'ప్రకటనలో కేవలం బీజేపీ అని మాత్రమే పేర్కొన్నారు. ఇంతకీ ఈ యాడ్ ఇచ్చింది ఆ పార్టీ అనుచరగణమా? లేక అధిష్ఠానమా?' అని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ట్వీట్ చేశాడు. 'ఉద్రేకపూరిత ప్రకటనతో నిద్రలేచినట్లు బీహార్ కామ్రేడ్లు ఫోన్లు చేశారు' అని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరీ ట్వీట్ చేశాడు. ఇక జేడీయూ- ఆర్జేడీల మహాకూటమి నేతలు బీజేపీ ప్రకటనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేసేందుకు సిద్ధమవుతున్నారు. పూర్నియా, అరారియా, దర్భాంగ, కతిహార్, కిషన్ గంజ్, మాధేపురా, మధుబని, సహర్సా, సుపౌల్ జిల్లాల్లోని 57 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రేపు పోలింగ్ జరగనుంది. దీంతో సుదీర్ఘంగా సాగిన పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. నవంబర్ 8న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన వెలువడనుంది. -
బిహార్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే..?
న్యూఢిల్లీ: మనదేశంలో విద్వేష రాజకీయాలు పనికిరావని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే ఈ విషయం ఆ పార్టీకి తెలిసివస్తుందని పేర్కొన్నారు. 'బిహార్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం ముఖ్యం. బిహార్ లో ఓడితే దేశంలో విద్వేష రాజకీయాలు పనికిరావన్న విషయం బీజేపీకి తెలుస్తుంది' అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ప్రజలు ఆత్మీయత, శాంతి కోరుకుంటున్నారని.. విద్వేషాలు కాదని అన్నారు. జేడీ(యూ)కు ఓటు వేయాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. 'నితీశ్ కుమార్ కు ఓటు వేయాలని మీ బంధువులు, స్నేహితులకు చెప్పండి' అని ఢిల్లీలోని బిహారీలను కేజ్రీవాల్ కోరారు. బిహార్ లో చివరి విడత ఎన్నికలు ఈనెల 5న జరగనున్నాయి. 8న ఫలితాలు రానున్నాయి. కాగా, దేశంలో మత అసహనం పెరిగిపోతోందని బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను కేజ్రీవాల్ స్వాగతించారు. షారూఖ్ వ్యాఖ్యలతోనైనా పరిస్థితిలో మార్పు వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. It is imp that BJP lose Bihar so that they know that hate politics will not work in this country. People want love n peace, not hate — Arvind Kejriwal (@ArvindKejriwal) November 4, 2015 -
'ప్రధాని సెక్షన్ ఆఫీసర్ కాదు'
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీపై కేంద్ర మాజీ మంత్రి అరుణ్ శౌరి మరోసారి విమర్శలు గుప్పించారు. ప్రధాని సెక్షన్ ఆఫీసర్ కాదని, దేశ నైతిక ప్రమాణాలకు ఆయన నిదర్శనంగా నిలబడాలని సూచించారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల కోసమే 'దాద్రి' ఘటనపై మోదీ మౌనం దాల్చారని ఆరోపించారు. 'ప్రధాని అంటే హోమియోపతి డిపార్ట్ మెంట్ లో సెక్షన్ ఆఫీసర్ కాదు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్ మెంటూ కాదు. ఆయన దేశానికి ప్రధానమంత్రి. నైతిక మార్గంలో నడుస్తూ ప్రమాణాలు నెలకొల్పాల్సిన బాధ్యత ఆయనపై ఉంది' అని అరుణ్ శౌరి వ్యాఖ్యానించారు. అసహనం పెరిగిపోవడం, గోమాంసం వివాదం నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. యూపీఏకు కొనసాగింపుగా ఎన్డీఏ పాలన ఉందని అంతకుముందు విమర్శించారు. బిహార్ ఓట్ల కోసం దాద్రి ఘటనపై ప్రధాని మోదీ మౌనం వహిస్తే.. ఆయన మంత్రులు, బీజేపీ నేతలు మాత్రం దాద్రి చిచ్చు చల్లారకుండా చూస్తున్నారని ఆరోపించారు. 2002 నుంచి అసహనానికి ఎక్కువగా గురైంది ప్రధాని నరేంద్ర మోదీయేనని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలపై శౌరి స్పందించారు. మోదీని గుడ్డిగా వెనకేసుకొస్తున్నారని దుయ్యబట్టారు. అవార్డులు వెనక్కు ఇచ్చేస్తున్నవారి వెనుక రాజకీయ శక్తులున్నాయన్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. -
ఇదో 'నకిలీ' రాజకీయ దగా..
ఎన్నికల హడావిడి మొదలైన దగ్గర నుంచి ఓటర్లు పోలింగ్ ప్రక్రియ ముగిసేంతవరకు రకరకాల స్థాయిల్లో నగదు పట్టుబడుతూ ఉండటం తెలిసిందే. ఈవీఎంపై మీట నొక్కేంతవరకు ఆయా రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడమూ విన్నదే. ఈ రెండు విధానాలకు కాస్త అడ్వాన్స్డ్ వెర్షన్ గా.. ఓటర్లను దగా చేయడానికి పూనుకున్నారు గుర్తు తెలియని బిహార్ నేతలు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి పక్కా ఆధారాలు కూడా లభించాయి. ఐదంచెల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి వేల కోట్ల డబ్బు చేతులు మారి ఉంటుందన్న ఆరోపణల నేపథ్యంలో పోలీసులకు చిక్కింది మాత్రం రూ.19.72 కోట్లే. ఆశ్చర్యకరమైన విషయమేమంటే.. ఆ 19.72 కోట్లలో భారీగా నకిలీ నోట్ల కట్టలున్నాయి. నకిలీ నోట్లేకాక, దాదాపు రూ. 70 లక్షలు విలువగల నేపాల్ కరెన్సీ, మరో 70 లక్షల విదేశీ కరెన్సీ కూడా ఉండటం ఎన్నికల అధికారులను కలవరపాటుకు గురి చేసింది. గ్రామీణ ప్రాంతాల్లోని నిరక్షరాస్యులను నకిలీ కరెన్సీని అంటగట్టి, ప్రయోజనం పొందేందుకు కొన్ని రాజకీయపార్టీలు ఎత్తుగడలు వేసినట్లు తెలిసింది. కేవలం ఓటు వేసేందుకు వచ్చే ఎన్నారైలను ప్రలోభపెట్టేందుకే విదేశీ కరెన్సీని తెచ్చినట్లు అనుమానాలున్నాయి. ఇంత మొత్తంలో నకిలీ, విదేశీ కరెన్సీ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ముందుగా హవాలా కోణంలో కూపిలాగే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పటివరకు ఎన్నికల్లో నల్లధనం మాత్రమే పంపిణీ అవుతుండగా, ఇప్పుడు నకిలీ నోట్లతోనూ ప్రజాస్వామ్య ప్రక్రియకు చీడపట్టిస్తున్నాయి రాజకీయపార్టీలు! -
భారీగా పెరిగిన ఎమ్మెల్యేల ఆస్తులు
'భారీగా జీతభత్యాలే కాకుండా బడా వ్యాపారవేత్తలను తలదన్నేలా సంపద పోగేసుకోగలిగే మార్గం.. రాజకీయం' ఐదేళ్ల తీవ్ర పరిశోధన అనంతరం ప్రజాస్వామిక పరిశోధనల సంఘం, ఎన్నికల నిఘా బృందం సంయుక్తంగా తేల్చిచెప్పిన సత్యమిది. ఈ స్టేట్ మెంట్ కు రుజువులుగా గడిచిన ఐదేళ్లలో మన ప్రజాప్రతినిధులు.. నయా కుబేరులుగా అవతరిస్తున్న తీరును వెల్లడించాయి ఆ సంస్థలు. తాజాగా ఎన్నికలు జరుగుతున్న బిహార్ లో ప్రస్తుత ఎమ్మెల్యేల సంపద.. సంచలనాత్మక రీతిలో ఏకంగా 2వేల శాతానికిపైగా పెరిగినట్లు తెలిపాయి. సంపద భారీగా పోగేసిన ఎమ్మెల్యేల జాబితాలో మహిళలే ముందజలో నిలవటం గమనార్హం. అధికార జేడీయూ ఎమ్మెల్యే పూనం దేవీ యాదవ్.. 2010లో తన ఆస్తుల విలువ రూ. 1.87 కోట్లుగా చూపింది. తూర్పు బిహార్ లోని ఖగారియా నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీకి దిగిన ఆమె.. తాజాగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో రూ. 41.34 కోట్ల ఆస్తులున్నట్లు వెల్లడించారు. అంటే ఆవిడ సంపద 2013 శాతం వృద్ధి చెందినట్లు అసోషియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీసెర్చ్(ఏడీఆర్), ఎలక్షన్ వాచ్ లు పేర్కొన్నాయి. అయితే పూనం వివరణ మాత్రం మరోలా ఉంది. తన పేరుమీదున్న భూముల విలువ పెరగటం వల్లే ఆస్తి విలువ కూడా పెరిగినట్లు ఓ జాతీయ వార్తా సంస్థకు వివరణ ఇచ్చింది. మొన్నటివరకు జేడీయూ ఎమ్మెల్యేగా ఉన్న పూర్ణిమా యాదవ్.. మహాకూటమి పొత్తులో భాగంగా తాను ప్రాతినిథ్యం వహిస్తున్న నవద సీటును కోల్పోయారు. దీంతో జేడీయూను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమె ప్రస్తుతం గోవింద్ పూర్ నుంచి బరిలోకి దిగారు. 2010లో రూ. 2.75 కోట్ల ఆస్తున్నట్లు ప్రకటించిన ఆమె ప్రస్తుతం రూ. 16.14 కోట్ల (480 శాతం వృద్ధి) సంపద ఉన్నట్లు వెల్లడించారు. ఇక బీజేపీ ఎమ్మెల్యే (లాఖీసరాయ్ నియోజకవర్గం) విజయ్ కుమార్ ఆస్తులు రూ. 4.13 కోట్ల నుంచి రూ.15.64 కోట్లకు పెరగగా, దర్భాంగ (రూరల్) స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆర్జేడీ ఎమ్మెల్యే లలిత్ కుమార్ ఆస్తులు రూ. 2.83 కోట్ల నుంచి రూ. 12.89 కోట్లకు పెరిగింది. సమాజ్ వాదీ పార్టీకి చెందిన చిరాయి ఎమ్మెల్యే అన్వేశ్ కుమార్.. రూ.1.25 కోట్ల నుంచి రూ.8.18 కోట్లకు ఎగబాకారు. ఏడీఆర్ బయలుపర్చిన వివరాల ప్రకారం గడచిన ఐదేళ్లలో 160 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల ఆస్తులు దాదాపు 200 శాతం పెరిగాయి. పార్టీల వారిగా బీజేపీకి చెందిన 66 మంది ఎమ్మెల్యేలు, 52 మంది జేడీయూ ఎమ్మెల్యేలు, 12 మంది ఆర్జేడీ ప్రజాప్రతినిధులు, జీతన్ రామ్ మాంఘీ పార్టీ హెచ్ఏఎంకు చెందిన ఏడుగురు ఎమ్మెలు సంపదపోగేయటంలో చక్కటి ప్రతిభకనబరిచారు. మరో విశేషమేమంటే ఈ జాబితాలో ఓ సీపీఐ ఎమ్మెల్యే (అవాదేశ్ కుమార్- బచ్వారా నియోజకవర్గం) కూడా స్థానం సంపాదించారు. ఈ కమ్యూనిస్ట్ నాయకుడి ఆస్తి 60 శాతం పెరిగినట్లు ఏడీఆర్ పేర్కొంది. -
సిక్కుల ఊచకోత మరిచారా?
‘మత అసహనం’పై కాంగ్రెస్కు మోదీ చురక మాకు నీతులు చెప్పే నైతిక హక్కు మీకు లేదంటూ మండిపాటు బిహార్లో తన ప్రచారం ముగించిన ప్రధాని దాదాపు 30 సభల్లో ప్రసంగం పూర్నియా: మరో రెండు రోజుల్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికల తుది దశ పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ విపక్షాలపై విమర్శల పదును పెంచారు. తరచుగా మత అసహనం అంశాన్ని లేవనెత్తుతున్న కాంగ్రెస్కు.. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన సిక్కుల ఊచకోతను గుర్తుచేశారు. ‘సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి మాకు నీతులు చెప్తారా?’ అంటూ విరుచుకుపడ్డారు. మోదీ సోమవారం సీమాంచల్ ప్రాంతంలోని పూర్నియాలో, దర్భంగాలో, ఫోర్బిస్గంజ్లో జరిగిన సభల్లో పాల్గొని తన ఎన్నికల ప్రచారాన్ని ముగించారు. ‘మీకు 1984 నాటి దురాగతం గుర్తుందా? ఇందిర హత్యానంతరం ఢిల్లీ తదితర ప్రాంతాల్లో లక్షలాది సిక్కులను ఊచకోత కోశారు. నాటి అల్లర్ల బాధితుల కన్నీళ్లింకా ఇంకిపోలేదు. వారి గాయాలింకా మానలేదు. ఈ దురాగతానికి సంబంధించి కాంగ్రెస్పై, ఆ పార్టీ నేతలపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు అదే కాంగ్రెస్ మత సహనంపై మాకు పాఠాలు చెబ్తోంది. డ్రామాలు ఆడుతోంది. సిగ్గుతో తల దించుకోవాల్సిన వారు మాకు నీతులు చెబుతున్నారు’ అంటూ మండిపడ్డారు. అసహనంపై తమకు పాఠాలు చెప్పే నైతిక హక్కు కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీకి లేదన్నారు. దేశంలో పెచ్చరిల్లుతున్న మత అసహన ఘటనలకు నిరసనగా కాంగ్రెస్ ప్రతినిధి బృందం రాష్ట్రపతిని కలవాలని నిర్ణయించుకోవడం, విభజనవాద శక్తులు దేశ ఐకమత్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయని, వాటిని ఎదుర్కొంటామని ఆదివారం సోనియా విమర్శలు చేసిన నేపథ్యంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. బిహార్లో ఎన్డీయే గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మోదీ.. సుడిగాలి పర్యటనల్తో ప్రచారం సాగించారు. దాదాపు 30 ఎన్నికల సభల్లో పాల్గొన్నారు. జంగిల్ రాజ్ + జంతర్మంతర్ రాజ్ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, జేడీయూ నేత నితీశ్ కుమార్ల పొత్తును ‘జంగిల్ రాజ్ + జంతర్మంతర్ రాజ్’ అని మోదీ అభివర్ణించారు. వారిద్దరూ కలసి బిహార్ను నాశనం చేస్తారంని హెచ్చరించారు. వారు తోసేసిన వెనకబాటుతనం అనే బావి నుంచి బిహార్ను పైకి లాగేందుకు రెండు ఇంజిన్లు అవసరమని, వాటిలో ఒకటి ఢిల్లీలో(కేంద్రంలోని ఎన్డీయే) ఉందని, మరోటి పట్నాలో రావాలని వ్యాఖ్యానించారు. థాంక్యూ నితీశ్, లాలూ.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు 40 స్థానాలు కేటాయించినందుకు మహా కూటమి నేతలు నితీశ్కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్లకు మోదీ వ్యంగ్య రీతిలో కృతజ్ఞతలు తెలిపారు. ‘ఆ 40 సీట్లు ఈజీగా బీజేపీ ఖాతాలో చేరుతాయి’ అని ఎద్దేవా చేశారు. బిహార్లో కాంగ్రెస్ ఉనికే లేదంటూ వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులకు ఆశ్రయం.. ఉగ్రవాదులకు, వారి మద్దతుదారులకు ఆశ్రయం ఇస్తూ దేశ భద్రతపై ఆటలాడుతున్నాయంటూ మహా కూటమి నేతలపై మోదీ ధ్వజమెత్తారు. ముస్లింలను అన్యాపదేశంగా ప్రస్తావిస్తూ.. ఒక ప్రత్యేక వర్గానికి రిజర్వేషన్లు కల్పించడం కోసం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్ల నుంచి 5% కోత పెట్టాలని కుట్ర చేస్తున్నాయని జేడీయూ, ఆర్జేడీలపై మరోసారి ఆరోపణలు గుప్పించారు. ‘కులతత్వ విషం, మతతత్వ పిచ్చి.. ఇవి ప్రజాస్వామ్యంపై మరకల’న్నారు. ప్రతిపక్ష నేత ఎవరు? బిహార్లో ఎన్డీయే గెలుపు ఖాయమనే అర్థంలో.. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పదవి కోసం నితీశ్కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడి మధ్య పోటీ ఉంటుందని ఎద్దేవా చేశారు. నితీశ్, లాలూ, కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ కలిసి ఒక్క ఎన్నికల సభలోనూ పాల్గొనకపోవడాన్ని ప్రస్తావిస్తూ.. వారి మధ్య నెలకొన్న విశ్వాసలేమికి అదే తార్కాణమన్నారు. -
జ్యోతిష్కుడితో భవిష్యత్తు చెప్పించుకున్న మోదీ!
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రముఖ జ్యోతిష్కుడు బెజాన్ దరువాలాను కలిసినట్టు వెలుగుచూడడం బీజేపీని తీవ్ర ఇరకాటంలో పడేసింది. గతంలో ఓసారి మోదీ తనను కలిశారని, ఆయన చేతుల్లో దేశ భవిష్యత్తు, ప్రగతి ఎలా ఉంటుందో తాను జోస్యం చెప్పానని దరువాలా ఆదివారం తెలిపారు. జోస్యం చెప్పించుకునేందుకు మోదీ తన చేతిని ఆయనకు చూపిస్తున్న ఫొటోలను కొన్ని మీడియా చానెళ్లు ప్రసారం చేశాయి. మోదీ జ్యోతిష్కుడిని కలువడం వివాదాస్పదమయ్యే అవకాశం కనిపిస్తున్నది. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ ఓ తాంత్రికుడిని కలిసిన వీడియోను బీజేపీ యూట్యూబ్లో అప్లోడ్ చేసింది. బిహార్ ఎన్నికల ప్రచారంలో ఈ విషయమై ప్రధాని మోదీ నితీశ్పై విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే నితీశ్ తాంత్రికుడిని కలిశారని దుయ్యబట్టారు. బిహార్కు తాంత్రికులు-మాంత్రికులు అవసరం లేదని పేర్కొన్నారు. 18వ శతాబ్దపు దృక్పథమున్న ఈ నేతలతో బిహార్ అభివృద్ధి చెందుతుందా? అని మోదీ ప్రశ్నించారు. -
బిహార్ పోలింగ్ ప్రశాంతం
♦ నాలుగో దశలో 55 స్థానాల్లో 57.59% పోలింగ్ ♦ తొలి మూడు దశలకన్నా అధికం.. 2010 ఎన్నికల కన్నా ఎక్కువ పట్నా/న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం నాలుగో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఏడు జిల్లాల్లోని 55 అసెంబ్లీ స్థానాలకు నిర్వహించిన ఈ ఎన్నికల్లో గత మూడు దశలకన్నా అధికంగా 57.59 శాతం పోలింగ్ నమోదవటం విశేషం. ఇది ఈ నియోజకవర్గాల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన పోలింగ్ కన్నా మూడు శాతం ఎక్కువ. ముజఫర్పూర్, తూర్పు చంపారన్, పశ్చిమ చంపారన్, సీతామర్హి, షోహార్, గోపాల్గంజ్, సివాన్ జిల్లాల్లోని ఈ నియోజకవర్గాల్లో మొత్తం 1.46 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. మహిళా ఓటర్లలో 60.40 శాతం మంది, పురుష ఓటర్లలో 54.20 శాతం మంది ఓటు వేశారు. మొదటి దశ పోలింగ్లో 54.85, రెండో దశలో 54.99, మూడో దశలో 54.24 చొప్పున పోలింగ్ శాతాలు నమోదవగా.. నాలుగో దశలో రికార్డు స్థాయిలో 57.59 శాతం పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి అజయ్నాయక్ తెలిపారు. మొత్తం నాలుగు దశలూ కలిపితే పోలింగ్ శాతం 55.41 గా ఉంది. రఘునాథ్పూర్ పరిధిలో ఉద్రిక్తత... సివాన్ జిల్లాలోని రఘునాథ్పూర్ నియోజకవర్గంలోని రాతౌరా గ్రామంలో ఇరు వర్గాలకు చెందిన వారు రాళ్లు రువ్వుకుని ఉద్రిక్తత తలెత్తటంతో.. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు మూడు రౌండ్లు కాల్పులు జరిపి, లాఠీచార్చి చేశారని ఉప ఎన్నికల కమిషనర్, బిహార్ ఇన్చార్జ్ ఉమేశ్సిన్హా ఢిల్లీలో మీడియాకు తెలిపారు. మత ఉద్రిక్తత తలెత్తే పరిస్థితి నెలకొందని.. అయితే పరిస్థితిని పూర్తి నియంత్రణలోకి తెచ్చామని, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను మోహరించామని అజయ్నాయక్ వివరించారు. ఘర్షణలో గాయపడిన ఇద్దరు వ్యక్తులను ఆస్పత్రికి తరలించామన్నారు. కాగా, నాలుగో దశ బరిలో 55 నియోజకవర్గాల్లో మొత్తం 776 మంది అభ్యర్థులు ఉన్నారు. వారిలో 55 మంది మహిళలు. ఈ 55 అసెంబ్లీ స్థానాల్లో గెలుపుపై జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ల లౌకిక కూటమి, బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏలు ధీమాగా ఉన్నాయి. 2010 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూతో కలిసి పోటీచేసిన బీజేపీ ఈ 55 సీట్లలో 26 సీట్లు గెలుచుకుంది. నాడు బీజేపీతో కలిసి పోటీచేసిన జేడీయూ మరో 24 సీట్లు గెలుపొందింది. ఆర్జేడీ 2 సీట్లు గెలుచుకోగా.. మిగతా 3 సీట్లలో స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. కానీ.. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. నాడు మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ - జేడీయూలు ఇప్పుడు ప్రత్యర్థులుగా బరిలోకి దిగాయి. మహాకూటమి నుంచి ఆర్జేడీ 26 స్థానాల్లో, జేడీయూ 21, కాంగ్రెస్ 8 చోట్ల పోటీ చేస్తున్నాయి. ఇక ఎన్డీఏ నుంచి బీజేపీ 42 స్థానాల్లో తన అభ్యర్థులను నిలిపింది. గెలుపులో ముస్లింలు, ఈబీసీలే కీలకం... ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ స్వగ్రామం ఫుల్వారియా(గోపాల్గంజ్ జిల్లా) హథ్వా నియోజకవర్గంలో భాగం. తూర్పు చంపారన్, పశ్చిమ చంపారన్, సీతామర్హి జిల్లాలు నేపాల్ సరిహద్దులో ఉన్నాయి. ఈ జిల్లాల్లో ముస్లింల జనాభా ఎక్కువ. గత ఎన్నికల్లో ఈ ప్రాంతాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. అలాగే షోహార్, సీతామహి, ముజఫర్పూర్ జిల్లాల్లో బాగా వెనుకబడిన తరగతుల (ఈబీసీలు) వారి పట్టు ఎక్కువ. ఈ ప్రాంతాల్లో గత ఎన్నికల్లో జేడీయూ ఆధిక్యత సాధించింది. ముజఫర్పూర్, సీతామహి జిల్లాల్లో యాదవులు, ఈబీసీల ఓటింగ్ సరళి ఎలా ఉంటుందన్న దానిపై నాలుగో దశ ఫలితాలు ఆధారపడి ఉంటుందని పరిశీలకులు చెప్తున్నారు. ఇప్పటివరకూ జరిగిన మూడు దశల ఎన్నికల్లో రెండు కూటములూ పోటాపోటీగా ఉన్నాయన్న అంచనాల నేపథ్యంలో.. ఈ నాలుగో దశ ఎన్నికలు విజేతని నిర్ణయిస్తాయని భావిస్తున్నారు. ఈ దశలో రికార్డు స్థాయిలో 57.59 శాతం పోలింగ్ నమోదు కావటం తమకు అనుకూలమని బీజేపీ భావిస్తోంది. -
ప్రారంభమైన బిహార్ నాలుగో దశ పోలింగ్
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ ఆదివారం ప్రారంభమైంది. పోలింగ్ జరగనున్న ఏడు జిల్లాల్లో ఎన్నికల కమిషన్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఉదయం నుంచే ప్రజలు ఓటేసేందుకు బారులు తీరారు. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ముజఫర్పూర్, తూర్పు చంపారన్, పశ్చిమ చంపారన్, సీతామర్హి, షియోహర్, గోపాల్గంజ్ జిల్లాల్లోని మొత్తం 55 నియోజకవర్గాల్లో వివిధ పార్టీలకు చెందిన 776 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. భద్రత కారణాల దృష్ట్యా 4 నియోజకవర్గాల్లో మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్ ప్రక్రియ నిలిపివేయనున్నారు. మరో 8 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు, మిగతా 43 నియోజవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మొత్తం 1,46,93,294 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 14, 139 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. నవంబర్ 5న ఐదో దశ పోలింగ్ జరగనుంది. -
బిహార్ దిశానిర్దేశం
త్రికాలమ్ బిహార్ దేశంలోని 29 రాష్ట్రాలలో ఒకటి. ఆ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఎందుకు చర్చనీయాంశం అవుతున్నాయి? పద్దెనిమిది మాసాల కిందట లోక్సభ ఎన్నికలలో అద్భుతమైన విజయం సాధించి అట్టహాసంగా హస్తినలో అధికారదండం చేతబట్టిన నరేంద్రమోదీ ఎందుకు బిహార్ ఎన్నికలపైన శక్తియుక్తులన్నిటినీ కేంద్రీకరిస్తున్నారు? ప్రధానిగా నరేంద్రమోదీ వ్యవహరణ తీరును ఈ ఎన్నికల ఫలితాలు నిర్దేశించబోతున్నాయి. రాజ్యసభలో ఎన్డీఏకి మెజారిటీ ఎప్పుడు లభించేదీ సూచించబోతున్నాయి. ఒక రాజకీయ నాయకుడుగా నితీశ్కుమార్ భవిష్య త్తును తేల్చబోతున్నాయి. పాతికేళ్ల కిందటే 'సామాజిక న్యాయం' నినాదాన్ని ఎన్నికలలో ప్రయోగించి చరిత్ర సృష్టించిన లాలూప్రసాద్ యాదవ్ పదేళ్ల అరణ్యవాసం తర్వాత బిహార్ రాజకీయాలలో తిరిగి ఒక శక్తిగా కోలుకుంటారో లేదో కూడా ఈ ఎన్నికలు నిర్ణయించబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కానీ, రాహుల్గాంధీ కానీ పెద్దగా చర్చలో లేనట్టే లెక్క. ఇది రెండు కూటముల మధ్య పోరాటం. ప్రధానంగా ఇద్దరు నాయకుల మధ్య బ్యాలట్ యుద్ధం. ఒక వైపు ప్రధాని నరేంద్రమోదీ, రెండో వైపు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్. బీజేపీ, దాని మిత్రపక్షాలు (నేషనల్ డెమొక్రాటిక్ అలయెన్స్- ఎన్డీఏ) గెలిస్తే లోక్సభ నాటి హవా కొనసాగినట్టూ, మోదీ కత్తికి ఎదురు లేనట్టూ ప్రజలు అర్థం చేసుకుంటారు. లాలూతో స్నేహం వల్ల నితీశ్ దెబ్బతిన్నాడని తీర్మానిస్తారు. జనతాదళ్-యూ, రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్లతో కూడిన మహా ఘట్బంధన్ విజయం సాధిస్తే 2019 నాటి లోక్సభ ఎన్నికలలో ప్రధాని నరేంద్రమోదీకి నితీశ్కుమార్ ఒక లౌకిక ప్రత్యామ్నాయంగా ఎదుగుతారు. విభిన్న మైన అభివృద్ధి నమూనాకు ప్రతినిధిగా నిలబడతారు. ఇద్దరి అభి వృద్ధి నమూనాలలో వ్యత్యాసం ఏమిటో పరిశీలిద్దాం. మహాకూటమికే మొగ్గు? ఇప్పటికి మూడు ఘట్టాల పోలింగ్ ముగిసింది. ఇంకా రెండు ఘట్టాలు మిగిలి ఉన్నాయి. నాలుగో విడత పోలింగ్ ఈ రోజు. చివరి ఘట్టం నవంబర్ 5న. నవంబర్ 8 న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి. మొదటి రెండు దశల పోలింగ్ మహాకూటమికి అనుకూలంగా సాగినట్టూ, మూడో దశలో చెరిసగం ఆధిక్యం ఉన్నట్టూ రాజకీయ పరిశీలకుల అంచనా. చివరి రెండు దశలలో పోలింగ్ జరిగే నియోజకవర్గాలలో ముస్లింల జనాభా గణనీయం. మొత్తంమీద మహాకూటమి (మహా ఘట్బంధన్)కి వాతావరణం అనుకూలంగా ఉన్నట్టు చెబుతున్నారు. అంతా యాదవుల ఓట్లు కూర్మీ అభ్యర్థులకూ, కూర్మీల ఓట్లు యాదవ అభ్యర్థులకూ పడతాయా లేదా అన్నదానిపైన ఆధారపడి ఉంటుంది. లోక్సభ ఎన్ని కలలో మొత్తం 40 స్థానాలకు 32 స్థానాలు గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రాబల్యం అంతలోనే క్షీణించిందా? లోక్సభ ఎన్నికలలో బిహార్ ప్రజలు యూపీఏను శిక్షించాలనే లక్ష్యంతో బీజేపీకీ, దాని మిత్రపక్షాలకు ఓట్లు వేశారు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు పట్నాలో ఎవరికి పట్టం కట్టాలనే విషయం తేల్చడానికి. ముఖ్యమంత్రిగా 2005 నుంచి ఇప్పటి వరకూ (మధ్యలో మాంఝీ హయాంను మినహాయిస్తే) నితీశ్కుమార్ చేసిన మంచి పనులను ప్రజలు మరచిపోలేదు. ముఖ్యంగా మహిళా సాధికారికత విషయంలో బిహార్ ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ విజయాలు సాధించింది. 2010 నాటి ఎన్నికల నుంచి మహిళా ఓటర్లు పురుషుల కంటే ఎక్కువగా ఓటు హక్కు వినియోగిం చుకోవడం ఇందుకు నిదర్శనం. ఉన్నత కులంగా చలామణి అవుతున్న భూమిహార్ ప్రజలలో సైతం మగవారు బీజేపీని సమర్థిస్తుంటే ఆడవారు జనతా దళ్-యూని బలపర్చుతున్నారు. మహా ఘట్బంధన్ తరఫున నితీశ్కుమార్, లాలూప్రసాద్ యాదవ్, సోనియాగాంధీ, రాహుల్గాంధీ ప్రచారం చేస్తు న్నారు. ఎన్డీఏ అభ్యర్థుల పక్షాన మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా , ఎందరో కేంద్రమంతులు, మిత్రపక్షాల నాయకులైన మాంఝీ, రాంవిలాస్ పాశ్వాన్, తదితరులు ఓటర్లను ప్రభావితులను చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రధాని ర్యాలీలకే జనసమీకరణ భారీగా జరుగుతోంది. ఆయన ప్రసం గాలనే జాతీయ టెలివిజన్ చానళ్లు సంపూర్ణంగా ప్రసారం చేస్తున్నాయి. మోదీ ప్రచారం ప్రభావవంతంగా ఉంది. ముప్పయ్ అయిదేళ్ల కాంగ్రెస్ పాలనలో, పాతికేళ్ల లాలూ, నితీశ్ ఏలుబడితో బిహార్కి ఒరిగింది శూన్య మంటూ ఢంకా బజాయించి చెబుతున్నారు. నితీశ్తో పాటు తొమ్మిదేళ్లకు పైగా బీజేపీ అధికారం పంచుకున్న వైనాన్ని విస్మరిస్తున్నారు. బిహార్కి మేలు జరగనే లేదంటూ నొక్కి చెబుతున్నారు. ఇక లాలూపైన జంగిల్రాజ్ అంటూ ధ్వజ మెత్తారు. లాలూతో పొత్తుపెట్టుకోవడం నితీశ్ అవకాశవాద రాజకీయానికి నిదర్శనమంటూ ఎండగట్టారు. ఎన్నికల ప్రచారంలో మోదీ శైలి తెలిసిందే. మోదీ-నితీశ్ వైరం బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోదీని నియమించినప్పుడు ఆ నిర్ణయాన్ని నితీశ్కుమార్ స్వాగతించి ఉంటే ఇప్పుడు ఎన్నికల పోరులో ఆయన ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా, ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండేవారు. లాలూ, సోనియాల కూటమి పేలవంగా తేలిపోయేది. ఎన్నికల రంగం ఇంతటి రసవత్తరంగా ఉండేది కాదు. నరేంద్రమోదీ పట్ల వ్యక్తిగత, విధానపరమైన వ్యతిరేకత ఉన్న కారణంగానే ఎన్డీఏ నుంచి నితీశ్ వైదొలిగారు. లోక్సభ ఎన్నికలలో ఘోరపరాజయానికి నైతిక బాధ్యత వహించి పదవి నుంచి తప్పు కొని తన స్థానంలో మాంఝీని కూర్చోబెట్టారు. ఏకులాగా వచ్చిన మాంఝీ మేకులాగా తయారై బీజేపీతో జతకట్టడంతో మాంఝీని తోసిరాజని ముఖ్య మంత్రిగా నితీశ్ తిరిగి బాధ్యతలు చేపట్టవలసి వచ్చింది. మోదీ హయాంలో గుజరాత్ గణనీయంగా అభివృద్ధి చెందినట్టు చెప్పడం, దేశమంతా గుజరాత్ అభివృద్ధి నమూనాను అమలు చేయాలని ప్రచారం చేయడం రెండేళ్లుగా చూస్తున్నాం. నిజానికి మోదీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి పూర్వమే గుజరాత్ అభివృద్ధిపథంలో ఉన్నది. దాదాపు రెండు శతాబ్దాలుగా గుజరాతీయులలో వ్యాపారదక్షత పెరుగుతూ వచ్చింది. ధీరూ భాయ్ అంబానీ, గౌతమ్ అదానీ, కర్సన్భాయ్ పటేల్ వంటి దిగ్గజాలు మోదీ రావడానికి ముందే వ్యాపారరంగంలో తమ ముద్రను వేశారు. మాధవ్ సింగ్సోలంకీ ముఖ్యమంత్రిగా ఉండగా (1984) దేశంలో రూ.4,000 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించిన వంద జిల్లాల జాబితా తయారు చేస్తే అందులో పాతిక జిల్లాలు గుజరాత్ రాష్ట్రంలోనివే. ఒక్క భారూచ్ జిల్లాలో పెట్టు బడులే జాబితాలోని తక్కిన అన్ని జిల్లాల పెట్టుబడులకంటే అధికం. అప్పుడు మోదీ ఎక్కడున్నారు? వాస్తవం ఏమిటంటే గుజరాత్లో చాలాకాలంగా సాగు తున్న అభివృద్ధి నమూనానే మోదీ కొనసాగించారు. బీజేపీ సర్కార్కు సుస్థిరత ప్రసాదించడం మూలంగా కొన్ని రంగాలలో అభివృద్ధి కొట్టవచ్చినట్టు కనిపిస్తు న్నది. మోదీ అభివృద్ధి నమూనా విపణి చోదకమైనది. కొన్ని రంగాలలో కొన్ని సంస్థలకే అభివృద్ధి ఫలాలు అందాయి. సామాజిక న్యాయం ఆశించినంత జరగ లేదు. దేశంలోని అతిసంపన్నవంతమైన రాష్ట్రాల జాబితాలో మూడో స్థానంలో ఉన్నప్పటికీ, అక్షరాస్యతలో, శిశుమరణాలలో, పేదరికంలో, ఇతర అభివృద్ధి సూచీలలో గుజరాత్ చాలా వెనుకబడి ఉన్నది. బిహార్ ఇందుకు భిన్నం. ‘బీమారూ’ రాష్ట్రాల జాబితాలో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్ సరసన ఉండిన బిహార్ పదేళ్లలో గణనీయమైన అభి వృద్ధి సాధించింది. నితీశ్కుమార్ అనుసరించిన నమూనా ఫలితంగా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలను కొంతమేరకు పేదరికం నుంచి బయట పడవేయడం, తరతరాలుగా అణచివేతకు గురవుతూ వచ్చిన మహిళలకు అధికారం అప్పగించడం వంటి ప్రగతి సాధ్యమైంది. మానవ వికాసానికి అవసరమైన అభివృద్ధి అందుబాటులోకి వచ్చింది. 2001 నుంచి 2011 వరకూ అక్షరాస్యత 16.8 శాతం పెరిగింది. మహిళల అక్షరాస్యత 20 శాతం పెరిగింది. మూడు అంతస్తుల పంచాయతీరాజ్ వ్యవస్థలో మహిళలకు 50 శాతం స్థానాలు ప్రత్యేకించడమే కాకుండా 20 శాతం బడుగు కులాలవారికీ, పది శాతం దళితులకూ కేటాయించడం ద్వారా గ్రామీణ వ్యవస్థపైన శతాబ్దాలుగా కొన సాగిన భూస్వాముల ఆధిపత్యాన్ని అంతం చేయడం నితీశ్కుమార్ సాధించిన అద్భుతమైన సామాజిక విప్లవం. పంచాయతీరాజ్ వ్యవస్థలో పరిపాలనా సామర్థ్యాన్ని పెంపొందించేందుకు మహిళా ప్రతినిధులకు శిక్షణ ఇవ్వడం విశేషం. అతి బడుగు వర్గాలకు చేయూతనివ్వడం కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడంలో కూడా నితీశ్ కృతకృత్యుడైనారు. సామాజిక న్యాయం, సామా జికార్థిక అభివృద్ధి, ప్రాథమిక వనరుల కల్పన అనే మూడు అంశాలకు ప్రాధాన్యమిస్తూ సాగిన నితీశ్ అభివృద్ధి నమూనా సమాజంలో అంతరాలు తగ్గించడానికీ, బడుగువర్గాల అభ్యున్నతికీ దోహదం చేసింది. భూసంస్కరణలు అమలు చేయగలిగి ఉండే సామాజిక న్యాయ సాధన ఇంకా వేగవంతమై ఉండేది. భూసంస్కరణలను సూచించడం కోసం బందోపాధ్యాయ కమిటీని నియమించినప్పటికీ కమిటీ సూచనలను అమలు చేయడంలో నితీశ్ కుమార్ విఫలమైనారు. ఈసారి ఎన్నికలలో గెలిస్తే నితీశ్, లాలూ ప్రసాద్ నిర్మాణాత్మ కంగా పనిచేసి భూసంస్కరణలు అమలు చేసి వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేయగలిగితే బిహార్ సమాజంలో అంతరాలు మరింతగా తగ్గిపోతాయి. ఇంత కాలం దేశానికి ముడి ఖనిజం అందిస్తున్న బిహార్ ఉత్పత్తి రంగాన్ని ప్రోత్సహిస్తే సంపద పెంచుకొని అభివృద్ధి చెందిన రాష్ట్రాల సరసన చేరుతుంది. పశ్చిమ బెంగాల్లో మూడు దశాబ్దాలకు పైగా వామపక్ష సంఘటనకు ప్రజలు అధి కారం ఇచ్చినప్పటికీ ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాను రూపొందించడంలో విఫలమైనారు. బిహార్లో నితీశ్కుమార్ కొంత వరకైనా సాధించి చూపించారు. అందుకే, మూడో టరమ్ ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం బిహార్ ప్రజలు నితీశ్కుమార్కి ఇచ్చినట్లయితే, ఆయన నాయకత్వంలోని ప్రభుత్వం ప్రశాం తంగా పని చేసుకునే వీలు లాలూప్రసాద్ కల్పించినట్లయితే, ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనా ఫలితాలు సాధించేందుకు ఇంకొంత సమయం లభిస్తుంది. ఎన్డీఏ విజయం సాధిస్తే ఢిల్లీలో, గాంధీనగర్లో అమలు జరుగుతున్న మార్కెట్ నమూనానే బిహార్లోనూ అమలు చేసే ప్రయత్నం జరుగుతుంది. నితీశ్ ప్రయోగం ఆగిపోతుంది. అందుకు బిహార్ ఎన్నికలంటే కేవలం కులాల పోరాటం లేదా రాజకీయ నాయకుల ఆరాటం మాత్రమే కాదు. బిహారీ లేదా బాహరీ కాదు. రెండు అభివృద్ధి నమూనాల మధ్య పోటీ. -
సోనియా కూడా ‘బాహరీ’నా?
బయటివాడని నితీశ్ చేసిన వ్యాఖ్యలకు మోదీ కౌంటర్ ♦ 25 ఏళ్ల పాలనలో బిహార్ను లూటీ చేశారని నితీశ్, లాలూలపై ధ్వజం ♦ ముగిసిన 4వ దశ ఎన్నికల ప్రచారం; 55 స్థానాలకు రేపు పోలింగ్ ముజఫర్పూర్/గోపాల్గంజ్: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ముగింపు దశకు చేరుకుంటున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది. 4వ దశ ఎన్నికల ప్రచారం చివరిరోజైన శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ముజఫర్పూర్, గోపాల్గంజ్ సభల్లో పాల్గొన్నారు. ఎన్నికల్లో జేడీయూ నేత, సీఎం నితీశ్ కుమార్ చేస్తున్న ‘బిహారీ వర్సెస్ బాహరీ(బిహార్ వ్యక్తి వర్సెస్ బయటి వ్యక్తి)’ ప్రచారంపై మోదీ మరోసారి మండిపడ్డారు. తాను పాకిస్తాన్కో, శ్రీలంకకో, బంగ్లాదేశ్కో ప్రధానిని కానని.. బిహార్తో కూడిన భారత్కు ప్రధానినని స్పష్టం చేశారు. ‘ఢిల్లీలో నివసిస్తున్న సోనియాగాంధీని కూడా నితీశ్ బయటి వ్యక్తి అనే అంటారా? ఆమె బిహారీనా? లేక బాహరీనా?.. చెప్పండి నితీశ్ బాబూ.. పనితీరు పరంగా చెప్పుకోవడానికి ఏమీ లేని వారే ఇలా అంటుంటారు’ అని అన్నారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్యాదవ్ సొంతగడ్డ గోపాల్గంజ్ సభలో మాట్లాడుతూ.. దోపిడీలతో ఈ ప్రాంతాన్ని మరో చంబల్గా మార్చాడంటూ లాలూపై ధ్వజమెత్తారు. ‘లోక్సభ ఎన్నికల్లో ఇచ్చిన అచ్చే దిన్ హామీని నెరవేర్చలేకపోతే పాత రోజులను మోదీ తిరిగితెస్తారా?’ అన్న నితీశ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ..‘నాటి ఆటవిక పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారా?’ అని నితీశ్ను ప్రశ్నించారు. గత ప్రభుత్వాల హయాంలో రాష్టంలో వెల్లువెత్తిన 30 కుంభకోణాల జాబితాను మోదీ వరుసబెట్టి చెప్పారు. ‘ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ల కూటమిని గెలిపిస్తే మరిన్ని స్కామ్లు తెరపైకి వస్తాయి. బిహార్ను లూటీ చేసిన వారంతా కలసి ఏర్పాటు చేసుకున్న కూటమిని శాశ్వతంగా తిరస్కరించండి. వారిని కఠినంగా శిక్షించండి’ అని పిలుపునిచ్చారు. అన్ని విషయాల్లో తనపై విమర్శలు గుప్పించే తన శత్రువులు సైతం.. ప్రధానిగా తన 16 నెలల పాలనపై అవినీతి ఆరోపణలు చేయలేదని గుర్తుచేశారు. లోక్సభ ఎన్నికల్లో తనపై విశ్వాసం ఉంచినట్లే.. ఈ ఎన్నికల్లోనూ తనను నమ్మాలని బిహారీలను కోరారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉండటం మంచిదని చెబుతూ.. ‘వెనకబాటుతనం అనే ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని పైకి లాగడానికి కేంద్రం, రాష్ట్రం అనే రెండు ఇంజిన్లు అవసరమవుతాయ’ని వ్యాఖ్యానించారు. 4వ దశ ఎన్నికల్లో 55 స్థానాలకు నవంబర్ 1న ఎన్నికలు జరగనున్నాయి. రిజర్వేషన్ల కుట్ర... ముస్లిం రిజర్వేషన్లను అన్యాపదేశంగా ప్రస్తావిస్తూ.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల కోటా నుంచి కొంత శాతాన్ని ఓ ప్రత్యేక వర్గాన్ని కేటాయించేందుకు మహా కూటమి కుట్ర చేస్తోందని మోదీ మళ్లీ ఆరోపించారు. దీన్ని రాజ్యాంగ నిర్మాతలు కూడా వ్యతిరేకించారన్నారు. దీనికి సంబంధించి నితీశ్ కుమార్ 2005, ఆగస్ట్ 24న పార్లమెంట్లో చేసిన ప్రసంగాన్ని మోదీ ప్రస్తావించారు. బడే భాయి.. చోటే భాయి.. ‘గత 25 ఏళ్లుగా రాష్ట్రాన్ని ఏలిన బడే భాయి(లాలూ), చోటే భాయి(నితీశ్) రాష్ట్రాన్ని నాశనం చేశారు. వారు మళ్లీ అధికారంలోకి వస్తే మీకు ఉద్యోగాలు రావు. ఉపాధి దొరకదు. బడా భాయికి తన కుటుంబం బావుంటే చాలు. గతంలో దాణా కుంభకోణంలో జైలుకు వెళ్లినప్పుడు భార్యను సీఎం చేశాడు. ఇప్పుడు పార్టీ పగ్గాలు అప్పగించేందుకు కొడుకును సిద్ధం చేస్తున్నాడు’ అని లాలు, నితీశ్లను ఎద్దేవా చేశారు. అభివృద్ధి మంత్రం నుంచి పక్కకు.. బిహార్లో ఎన్డీయే క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోందన్న వార్తల నేపథ్యంలో బీజేపీ ప్రచార దిశ అభివృద్ధి మంత్రం నుంచి ఓబీసీలను ఆకర్షించే వైపునకు మారింది. ఓ ఓబీసీ కుమారుడికి అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత లేదా? అంటూ మోదీ ఈ ప్రచారంలో ఓబీసీలను ఆకర్షించే ప్రయత్నం చేశారు. దేశాన్నీ కోల్పోతారు: నితీశ్ బిహార్ను సాధించుకోవాలనే ఆరాటంతో ఉన్న ప్రధాని మోదీ తన విభజనవాద వ్యాఖ్యలతో దేశాన్నీ కోల్పోతారని నితీశ్ అన్నారు. కోటాపై మోదీ చేసిన వ్యాఖ్యలకు ఇలా స్పందించారు. -
మధ్య భారతంలో మహా పోరు
జాతిహితం మందిర్ ఊపు తరువాత బీజేపీ పటిష్టం కావడానికి కారణం అది కుల రాజకీయాలను అర్థం చేసుకుంది. కుల సమీకరణలను కాంగ్రెస్ కంటే వేగంగా అర్థం చేసుకోవడం మొదలుపెట్టింది. కాంగ్రెస్ ఇటీవలి కాలంలో కింద కులాల నుంచి ఒక్క కీలకమైన నాయకుడిని కూడా అందించలేకపోయింది. ఉత్తరప్రదేశ్, బిహార్లలో కాంగ్రెస్లో కంటే బీజేపీలోనే పెద్ద పెద్ద ఓబీసీ నాయకులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఇటీవలి దశాబ్దాలలో చూస్తే కాంగ్రెస్ పార్టీలో కనిపించే అతి పెద్ద ఓబీసీ నాయకుడు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఒక్కరే. కులం, రాజకీయాల పరస్పరానుబంధం భారతదేశంలోను, విదేశాలలోను డజన్ల కొద్దీ, ఇంకా చెప్పాలంటే వందల కొద్దీ పీహెచ్డీ సిద్ధాంత వ్యాసాలను రాయించింది. ఈ విషయం మీద పరిశోధన చేస్తూ జీవితకాలం విద్యార్థి వేతనాలు పొందిన వ్యక్తులు ఈ అంశాన్ని లోతుగా విశ్లేషించారు. నేను మన రాజకీయాలలో కులం పాత్ర గురించి మాట్లాడుతున్నాను. అయితే పరిశోధకుడి ముసుగులో మాత్రం కాదు, రాజకీయాంశాలను నివేదించే పత్రికా రచయితగానే వాటి గురించి మాట్లాడుతున్నాను. ఈ వారం జాతిహితం శీర్షికకు ఉత్తర బిహార్లోని ముజఫర్పూర్ కేంద్రం నుంచి రాయడానికి మించిన అర్హత కలిగిన మరో అంశం కనిపించదు కూడా. ఎన్నికల తీరును పరిశీలించడానికి ఆ ప్రాంతంలో వారం రోజులుగా తిరుగుతూ, గోడల మీద రాతలు చదువుకుంటూ ఇది రాశాను. ఎన్నికల వార్తలను సేకరించడానికి బిహార్ వెళితే, ఒక గంట సమయంలో ‘కులం’ అనే మాటను ఆరుసార్లయినా వింటాం. ఇంకో రాష్ట్రానికి ఈ పని మీద వెళితే ఆ మాటే ఇంకొన్ని సార్లు తక్కువగా వినిపిస్తుంది. అంతేగానీ సంభాషణల మధ్య నుంచి ఆ పదం ఎక్కడికీ పోదు. బహుశా పశ్చిమ బెంగాల్, కొంత వరకు అసోం ఇందుకు మినహాయింపు అనుకోవచ్చు. కులరాజకీయాల గురించి తెలుసుకోవాలంటే ఎన్నికలకు మించిన సందర్భం మరొకటి ఉండదు. 1980లో జరిగిన లోక్సభ ఎన్నికల సమ యంలో హరియాణాలోని కురుక్షేత్ర నియోజకవర్గంలో తిరుగుతున్నప్పుడు విస్తుపోయే అనుభవం ఒకటి ఎదురైంది. అప్పుడు షెడ్యూల్డ్ కులాలకు (అప్పుడు దళిత్ అన్న పదం పెద్దగా ఉపయోగించేవారు కాదు) చెందిన జిల్లా పోలీసు అధిపతి ఒకరు- భజన్లాల్ విధేయుడు- నాకు కొన్ని విషయాలు చెప్పారు. ఆయన ఒక నోట్ ప్యాడ్ తీసుకుని ఒక్కొక్క కులాన్ని విభజించి, దాని వాటాను సూచిస్తూ బొమ్మలు గీసి, ఎవరు ఏ పార్టీకి ఓటు వేసే అవకాశం ఉందో వివరించాడు. చివరికి ఆయన చెప్పినదేమిటంటే, షెడ్యూల్డ్ కులాల ఓట్లు ఎటు పడితే, అటు కాటా మొగ్గుతుందనీ, అందులో మూడింట రెండు వంతుల ఓట్లు ‘మనవి’ (అంటే ఆయన అభిమానించే బాబూ జగ్జీవన్రామ్ సామాజిక వర్గానివి) అని చెప్పాడు. తరువాత సామూహికంగా పార్టీ ఫిరాయించి సంచలనం సృష్టించినా, అప్పటికి భజన్లాల్ బాబూజీ వైపు ఉన్నారు. ఎస్సీలలో మిగిలిన వారు ఎవరు అని నేను అడిగాను. ‘మిగిలినవి కింది కులాల వారివి’ అని ఆ పోలీస్ చీఫ్ చెప్పాడు. కులం గురించి అంత యథేచ్ఛగా మాట్లాడడానికి ఆయన తన స్థాయి నుంచి పక్కకు జరిగాడని నేను అనుకున్నాను. తరువాత కాలంలో కూడా ఇలాంటివే మరో రెండు సందర్భాలు తటస్థించాయి. 1983లో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో సుదీర్ఘ సమ్మె జరిగినప్పుడు, ‘బ్రాహ్మణులు, ఠాకూర్లు, భూమిహార్లు; తూర్పు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బిహార్ అంటూ ఒక ఆచార్యుడు చాలా సహాయపడే రీతిలో కుల పరిభాషలో అక్కడి రాజకీయాలను గురించి వివరించిన తీరు చూసి నాకు చాలా ఆసక్తి కలిగింది. అయితే కులం ప్రాధాన్యం బాగా ప్రస్ఫుటమైనది మాత్రం ఎనభై దశకంలో రాజీవ్గాంధీ, ఆయన పార్టీ కాంగ్రెస్ పతనమైన తరువాతే. కాన్షీరామ్ తన సామాజిక సిద్ధాంతాన్ని రాజకీయ పార్టీగా మలచి, ఆ దశాబ్దపు ఎన్నికలలో మూడో శక్తిగా అవతరించారు. బోఫోర్స్ వివాదంపై రాజీవ్ మంత్రిమండలి నుంచి రాజీనామా చేసి, మళ్లీ పార్లమెంటుకు రావడానికి వీపి సింగ్ అలహాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అమితాబ్ బచ్చన్ తిరోగ మనంలో పడ్డారు. కాంగ్రెస్ తన అభ్యర్థిగా లాల్ బహదూర్ శాస్త్రి కుమారుడు అనిల్ శాస్త్రిని బరిలోకి దింపింది. కాన్షీరామ్ ‘ఓట్లు మావి, రాజ్యాం మీదా, ఇకపై సాగదు’ అన్న తన నినాదంతో రంగంలో దిగారు. ఆయన అప్పుడు దేని గురించి మాట్లాడారో తలుచుకుంటే మాలో కొందరు విస్తుపోతూ ఉంటాం. తరువాత ఆయనకు వచ్చిన ఓట్లు, మూడో స్థానానికి పరిమితం కావడం చూస్తే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. వీపీ సింగ్ మండల్ కమిషన్ నివేదిక అమలులో పెట్టడం, అగ్రవర్ణాల నిరసనలు, మూడో ఫ్రంట్కు ములాయం సింగ్ యాదవ్, లాలూప్రసాద్ అగ్రసేనానులు కావడం వంటి పరిణామాలతో తరువాత మూడేళ్ల కాలంలో కులం సత్తా ఏమిటో వెల్లడైంది. అప్పుడే మందిర్ పరిణామాలు తలెత్తడంతో వెనుకబడిన కులాల ఆధిపత్యాలను తగ్గించడానికి దోహదం చేసింది. ఆ తరువాతే కీలకమైన మధ్య భారత రాజకీయాలు మండల్, కమండల్ పేర్లతో పిలుచుకోవడం మొదలైంది. బిహార్ ఎన్నికల పోరును లాలూ యాదవ్ ఈ స్థాయికి తీసుకువెళ్లారు. అయితే సుశీల్ మోదీ మాత్రం మండల్, కమండల్ రెండూ తమతోనే ఉన్నాయని కౌంటర్ ఇచ్చారు. పాతికేళ్ల తరువాత ఇప్పుడు బిహార్ ఎన్నికలలో మండల్ కన్న బిడ్డలే కీలక పాత్రధారులయ్యారు. వారి విజయం- ఇంకో మాటలో చెప్పాలంటే కుల రాజకీయాల మీదే ఆధార పడి ఉంది. అందుకే వీరిని సవాలు చేస్తున్న నరేంద్ర మోదీ బృందం కూడా ఆ భాషలోనే మాట్లాడవలసి వస్తున్నది. సెక్యులర్/ కమ్యునల్ అంశం మీద మోదీ మాట్లాడితే ఇప్పటికీ, మీరు పోరాడదలచిన శత్రువు ఎవరు? పొరుగు మతమా; దారిద్య్రమా? చెప్పండన్న ధోరణిలోనే మాట్లాడుతున్నారు. అయితే బిహార్లో మాత్రం తన కులం గురించిన మూలాలను ఓటర్ల ముందు ఆవిష్కరిస్తున్నారు. ఆయన పార్టీలోని సీనియర్ నాయకుడు సుశీల్ మోదీ కూడా అత్యంత వెనుబడిన వర్గాల నుంచి లేదా ఈబీసీల నుంచి వచ్చారని మోదీని శ్లాఘిస్తున్నారు. కులం ఆధిక్యం గురించి బీజేపీ రాజకీయాలకీ, ఆరెస్సెస్ సిద్ధాంతానికీ మధ్య వైరుధ్యాలు వ్యక్తమయ్యాయి. ఆరెస్సెస్కు వర్ణం అనే అంశంలో మౌలికంగా ఆమోదం ఉన్నా, కులాన్ని విభజన శక్తిగా పునర్ మూల్యాంకన చేయడానికి కూడా ఆమోదం ఉంది. కుల ప్రాతిపదికన రిజర్వేషన్లను కల్పించడం గురించి అక్కడ నుంచి ప్రశ్న రావడం అందుకే. హిందూ చింతనలో కులాన్ని ఒక విభజన శక్తిగానే ఆరెస్సెస్ చూస్తుంది. అయితే అగ్రకులాలను వదులుకోవడం దాని ఉద్దేశం కాకపోయినా, మండల్ రాజకీయాలతో పాత రాజకీయ వ్యవస్థ కదలడం, రాజకీయ వారసత్వాలు మారడం దానికి రుచించదు. బిహార్ ఎన్నికలలో బీజేపీ అవకాశాల మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో కూడా ఆలోచించకుండా రిజర్వేషన్లను సమీక్షించాలనడం అందుకే. ఆరెస్సెస్ లక్ష్యం పాతదే. కులం ద్వారా వచ్చిన విభజనను విశ్వాసం ద్వారా ఐక్యం చేయడం. మండల్ వారసులు గతంలోని డీఎంకె వారి వలె నాస్తికులు కాదు, ఏ వ్యవస్థనీ విశ్వసించని వారు కూడా కాదు. అయితే రాజకీయ వారసత్వాలను కులం ద్వారా పటాపంచలు చేయాలని వారు కోరుకుంటున్నారు. అందుకే వెనుకబడిన లేదా కింది కులాల రాజకీయాలు ఆరెస్సెస్ పాలిట శాపంగా మారాయి. కానీ నరేంద్ర మోదీ, అమిత్షాలకు వారి రాజకీయ ప్రాధాన్యాలు స్పష్టంగా తెలుసు. కాబట్టే వారు రిజర్వేషన్ రాజకీయాల వైపు మొగ్గారు. ప్రస్తుతం బీజేపీ కేంద్రంలో పూర్తి మెజారిటీతో అధికారంలో ఉన్న ప్పటికీ, చరిత్రలో మున్నెన్నడూ లేనన్ని రాష్ట్రాలలో అధికారంలో ఉన్నప్పటికీ, తన ప్రత్యర్థి కాంగ్రెస్ పతనావస్థలో మూలుగుతున్నప్పటికీ విశ్వాసానికీ, కులానికీ మధ్య ఏర్పడిన పోటీలో ఇప్పుడు కుల మే గెలుస్తున్నదని చెప్పడానికి నేను సందేహించను. అయితే బీజేపీ ప్రధాని ఈబీసీ వర్గానికి చెందినవారు. ఈ విషయాన్ని అది గర్వంగా చెప్పుకోవచ్చు. ఆ పార్టీకి చెందిన కొందరు నాయకులు, ముఖ్యంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి వంటివారు వెనుకబడిన కులాల నుంచి వచ్చినవారే. నిజానికి మహారాష్ట్రకు ఒక బ్రాహ్మణ ముఖ్య మంత్రి వచ్చినప్పుడు, హరియాణాకు రెండు దశాబ్దాల తరువాత జాట్ కులానికి చెందని వ్యక్తి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు - 2014 సంవత్సరం కేవలం ఆ రెండు సందర్భాలలోనే కులాన్ని పరిగణనలోనికి తీసుకోలేదు. ఊహించడానికి వీలుకాని ఇలాంటి సంఘటనలు ఎక్కడో అక్కడ త్వరలో పునరావృతమవుతాయి. బిహార్లో బీజేపీ గెలిచినా అలాంటి సంఘటనకు మాత్రం అవకాశం లేకపోవచ్చు. అక్కడ వెనుకబడిన లేదా దళిత నాయకుడు ముందు వరసలో నిలవడం ఖాయం. 1989 మందిర్ ఊపు తరువాత బీజేపీ పటిష్టం కావడానికి కారణం అది కుల రాజకీయాలను అర్థం చేసుకుంది. కుల సమీకరణలను కాంగ్రెస్ కంటే వేగంగా అర్థం చేసుకోవడం మొదలు పెట్టింది. కాంగ్రెస్ ఇటీవలి కాలంలో కింద కులాల నుంచి ఒక్క కీలకమైన నాయకుడిని కూడా అందించలేక పోయింది. ఉత్తరప్రదేశ్, బిహార్లలో కాంగ్రెస్లో కంటే బీజేపీలోనే పెద్ద పెద్ద ఓబీసీ నాయకులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఇటీవలి దశాబ్దాలలో చూస్తే కాంగ్రెస్ పార్టీలో కనిపించే అతి పెద్ద ఓబీసీ నాయకుడు కర్ణాటక ముఖ్య మంత్రి సిద్ధరామయ్య ఒక్కరే. ఆయనను దేవెగౌడ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ దిగుమతి చేసుకుంది. బీజేపీ ఎందుకు పటిష్టమైందంటే, అది కొత్త వాస్తవాన్ని అంగీకరించింది కాబట్టేనని చెప్పడం సముచితంగా ఉంటుంది. కొత్తగా వస్తున్న వారి కోసం, వెనుకబడిన కులాలవారి ప్రతిభ నిరూపణ కావడం కోసం అగ్రకులాలకు చెందిన తన పాతతరం నాయకులను తప్పుకునేటట్టు బీజేపీ చేయగలిగింది. కాంగ్రెస్ పతనమైందంటే, ఈ వాస్తవాన్ని అది గుర్తించకపోవడం వల్లనే. అయితే బిహార్ ఎన్నికల ప్రచారంలో కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. ఈ మార్పుల పట్ల ఆరెస్సెస్లో కొంత అసహనం రేగినట్లు తొలి సంకేతాల వల్ల అర్థమవుతున్నది. అలాగే సెక్యులర్ కూటమిలో తనది మూడో స్థానమేనన్న వాస్తవాన్ని కాంగ్రెస్ ఆమోదిస్తున్నట్టు కూడా కనిపిస్తున్నది. ప్రస్తుతం బీజేపీలో అంతర్గతంగా ఉన్న సందేహాలను సర్దుబాటు చేయడంలో ఆ పార్టీ ప్రదర్శించే సామర్థ్యం, కాంగ్రెస్ సహా ఇతర కులవాద పార్టీలు, ఓటు బ్యాంకు పార్టీలు ప్రదర్శించే వాస్తవిక దృక్పథం మధ్య భారత రాజకీయాల దిశను నిర్దేశిస్తాయి. ఇప్పటికీ పోటీ సాధికార రాజకీయాలకూ, హిందూత్వకూ మధ్య, ఇంకా- ఏది ఐక్యం చేయగలదు; ఏది విభజించగలదు? విశ్వాసమా, కులమా? అనే అంశాల మధ్యనే నెలకొని ఉంది. - శేఖర్ గుప్తా twitter@shekargupta -
మహాకూటమిపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు
న్యూఢిల్లీ: బిహార్ ప్రజలను మతప్రాతిపదికన విడగొట్టేందుకు మహా కూటమి ప్రయత్నిస్తోందని ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది. కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వి నేతృత్వంలోని బీజేపీ నాయకులు శుక్రవారం ఈసీని కలిశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల కోసం కాంగ్రెస్, జేడీ(యూ), ఆర్జేడీ నాయకులు ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని ఈసీకీ బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. రాహుల్ గాంధీ, నితీశ్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ పై తగిన చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అభ్యంతకర వ్యాఖ్యలు చేశారని ఈసీ దృష్టికి తీసుకొచ్చారు. రాజకీయ దివాళాకోరుతనంతో కొంత మంది నాయకులు హద్దులు దాటారని ఈసీని కలిసిన తర్వాత నఖ్వీ విమర్శించారు. -
నేను బయటి వ్యక్తిని అయితే ఆమె ఎవరు?
గోపాల్ గంజ్: బిహార్ ను దోచుకున్న వారిని శిక్షించాలని ఓటర్లకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి ఓటు వేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బిహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గోపాల్ గంజ్ లో జరిగిన ర్యాలీలో మోదీ ప్రసంగించారు. 'బిహార్ ఓటర్లకు ఒక విషయం చెప్పడానికి నేను ఇక్కడకు వచ్చాను. మీరు నన్ను నమ్మండి. లోక్ సభ ఎన్నికల్లో నాపై విశ్వాసం ఉంచారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ నామీద నమ్మకం ఉంచండి. రాష్ట్రంలో అవినీతిని అంతంచేసి చూపిస్తా' అని మోదీ పేర్కొన్నారు. ముజాఫర్పూర్ నిర్వహించిన ర్యాలీలోనూ మోదీ ప్రసంగించారు. నితీశ్ కుమార్ చేసిన 'బిహార్ వర్సెస్ బాహారి' కామెంట్ పై మోదీ స్పందించారు. నేను బయటి వ్యక్తిని అయితే సోనియా గాంధీ ఎవరని ఆయన ప్రశ్నించారు. 'సోనియా గాంధీ ఢిల్లీలో నివసిస్తున్నారు. ఆమెను బాహారి అంటారా లేదా బిహారి అంటారా? దేశానికి నేను ప్రధానమంత్రిని కాదా, బిహార్ రాష్ట్రం ఇండియాలో లేదా, నేను ఎలా బయటి వ్యక్తిని అవుతాను' అని మోదీ ప్రశ్నించారు. -
ప్రచారంలో వెనకబడిన రాహుల్, సోనియా
పట్నా: ప్రతిష్టాత్మకమైన బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ప్రచార సారథులైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ఎందుకు ఎక్కువ పాల్గొనడం లేదు? ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఆ రాష్ట్ర పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం కోసం రావాల్సిందిగా సోనియా, రాహుల్ గాంధీల వెంటపడి ప్రాధేయపడేవారు. ఇప్పుడు ఎందుకు అలా జరగడం లేదు? సోనియా గాంధీ ఇప్పటి వరకు బిహార్ ఎన్నికల ప్రచారంలో రెండు, మూడు పర్యాయాలు మాత్రమే పాల్గొన్నారు. రాహుల్ గాంధీ కూడా గతంతో పోలిస్తే చాలా తక్కువ ప్రచార సభల్లోనే పాల్గొంటున్నారు. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది? బిహార్ ఓటర్లు యూపీఏ-2 ప్రభుత్వంలో వెలుగుచూసిన కుంభకోణాలను ఇప్పటికి మరచిపోలేక పోతున్నారని, సోనియా, రాహుల్ గాంధీలు వచ్చి ప్రచారం చేస్తే ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని కాంగ్రెస్ అభ్యర్థులే భావిస్తున్నారని రాష్ట్ర పార్టీ వర్గాలు తెలిపాయి. వారికన్నా లాలూ, నితీష్ కుమార్ ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. ఈ కారణంగానే సోనియా, రాహుల్ ఎన్నికల ప్రచారానికి రావాలని లాలూ, నితీష్లు కూడా కోరుకోవడం లేదని వారన్నారు. సోనియా, రాహుల్ కంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్, సినీ తారలు రాజ్బబ్బర్, నగ్మాల ఎన్నికల ప్రచారాన్నే అభ్యర్థులు ఎక్కువగా కోరుకుంటున్నారని పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి. ముస్లింలు అధికంగా ఉన్న నియోజక వర్గాల్లో గులామ్ నబీ ఆజాద్ ప్రచారం ఉపయోగపడుతుండగా, జన సమీకరణలో నగ్మా గ్లామర్, రాజ్బబ్బర్ వాక్ఛాతుర్యం ఉపయోగపడుతోందన్నది అభ్యర్థుల వాదనగా వినిపిస్తోంది. ఎన్డీయే ప్రచార సారథి నరేంద్ర మోదీకి పోటాపోటీగా ఎన్నికల ప్రచారం చేస్తున్న లాలూ, నితీష్ల ద్వయం కాంగ్రెస్ పార్టీ అధినాయకులపై ఏ మాత్రం ఆధారపడకుండా ప్రచారపర్వంలో పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. రిజర్వేషన్ల అంశానికి సంబంధించి లాలూ ప్రసాద్ యాదవ్ ఎప్పటికప్పుడు మోదీపై వాగ్బాణాలు విసురుతుండగా, నితీష్ కుమార్ అభివృద్ధి మంత్ర, తంత్రాలను ప్రయోగిస్తున్నారు. -
'ఓటమిని ఒప్పుకున్న మోదీ'
బెనిపట్టి/కిషన్ గంజ్: మహా కూటమిని 'త్రీఇడియట్స్' వర్ణించిన ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలను కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తిప్పికొట్టారు. ఈ వాఖ్యలు చేయడం ద్వారా బిహార్ ఎన్నికల్లో ఓటమిని మోదీ ముందే అంగీకరించారని రాహుల్ అన్నారు. 'బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం తప్పదని మోదీకి తెలిసిపోయింది. అందుకే మహా కూటమిని సైతాన్, త్రీఇడియట్స్ అంటూ సంబోధిస్తున్నారు. దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నానన్న విషయాన్ని మోదీ మర్చిపోతున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ఆయన హోదాకు తగవు' అని రాహుల్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం నిర్వహించిన ర్యాలీల్లో రాహుల్ గాంధీ ప్రసంగించారు. సూటు, బూటు సర్కార్ అంటూ మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బూటకపు హామీలతో ప్రజలను మోదీ బురిడీ కొట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇకనైనా అబద్దాలు కట్టిపెట్టి నితీశ్ కుమార్ లా దేశ ప్రజల కోసం పనిచేయాలని మోదీని హితవు పలికారు. -
బిహార్ మూడో దశలో 53 శాతం పోలింగ్
పట్నా: 50 నియోజకవర్గాల్లో బిహార్ అసెంబ్లీ మూడో దశ ఎన్నికల పోలింగ్ బుధవారం ముగిసింది. 53.32% పోలింగ్ నమోదైంది. ఇది మొదటి, రెండో దశల పోలింగ్ శాతం కన్నా తక్కువ. ఈ దశలోనూ పురుషుల(52.5%) కన్నా మహిళలే(54%) ఉత్సాహంగా ఓటేశారు. బక్సర్లో అత్యధికంగా 56.58%, పట్నాలో అత్యల్పంగా 51.82% ఓటింగ్ జరిగినట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి అజయ్ వీ నాయక్ తెలిపారు. సరన్ జిల్లాలో 123 ఏళ్ల వృద్ధురాలు ఓటుహక్కును వినియోగించుకుందన్నారు. భక్తియార్పూర్లోని ఓ పోలింగ్ కేంద్రంలో ముఖ్యమంత్రి నితీశ్కుమార్ ఓటేశారు. ఈ ప్రాంతంలో సరైన వైద్యం అందని కారణంగా ఒక బాలిక మృతి చెందిన విషయమై ఆయన కొంత నిరసనను ఎదుర్కొన్నారు. గవర్నర్ రామ్ నాథ్ కోవింద్ దంపతులు, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్, ఆయన భార్య రబ్రీదేవీ తదితరులు ఓటేశారు. -
బిహార్లో జోరుగా బెట్టింగ్లు
పాట్నా: బిహార్ అసెంబ్లీకి బుధవారం ఓ పక్క హుషారుగా పోలింగ్ జరుగుతుండగా, మరోపక్క జోరుగా బెట్టింగ్లు సాగుతున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తుందన్న విశ్వాసంతో 'సత్తా' మార్కెట్ తన సత్తాను చాటుకుంటోంది. బీహార్లో ప్రభుత్వం ఏర్పాటకు అవసరమైన 122 స్థానాల లక్ష్యాన్ని ఎన్డీయే కూటమి సునాయాసంగా అధిగమిస్తుందని అక్రమ బెట్టింగ్లో పంటర్లు పెట్టుబడులు పెడుతున్నారు. అసెంబ్లీలోని మొత్తం 243 స్థానాలకుగాను ఎన్డీయే కూటమికి 150 నుంచి 152 స్థానాలు వస్తాయని, బీజేపీకి ఒంటరిగా 110 నుంచి 112 సీట్లు వస్తాయని పంటర్లు భావిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కరిష్మాను ఈ ఎన్నికల్లో పణంగా ఒడ్డడం, నితీష్ కుమార్ అభివృద్ధి నినాదాన్ని బీజేపీ విజయవంతంగా అందిపుచ్చుకోవడం ఈ ఎన్నికల్లో తమకు కలసివచ్చే అవకాశాలని పంటర్లు వాదిస్తున్నారు. అలాగే లాలూ ప్రసాద్తో నితీష్ కుమార్ చేతులు కలపడం మహా కూటమికి చేతులు కాల్చుకోవడమేనన్న వాస్తవ పరిస్థితులను కూడా తాము పరిగణలోకి తీసుకున్నామని వారు చెబుతున్నారు. నితీష్ నాయకత్వంలోని జేడీయూకు 44 నుంచి 46 సీట్లు వస్తాయని, మిత్రపక్షమైన ఆర్జేడీకి 27-29 సీట్లు, కాంగ్రెస్కు 8-10 సీట్లు వస్తాయని పంటర్లు అంచనా వేస్తున్నారు. జేడీయూ, ఆర్జేడీ పార్టీలు చెరో వంద సీట్ల చొప్పున పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీ, జైపూర్, అహ్మదాబాద్, సూరత్, ముంబై తదితర నగరాలకు తమ పార్టనర్లు విస్తరించి ఉన్నారని.. పాట్నా మార్కెట్ పంటర్లు తెలియజేస్తున్నారు. నలుగురైదుగురు పెద్ద ప్లేయర్ల నేతృత్వంలో ఈ బెట్టింగ్ వ్యాపారం నడుస్తుందని వారు తెలిపారు. పోలీసులకు చిక్కకుండా తమ వ్యాపారులు ఎప్పటికప్పుడు తమ కాంటాక్ట్ నెంబర్లు మారుస్తారని చెప్పారు. తమ బాస్లందరూ ఒకరికొకరు బాగా తెలిసినవారేనని, వారి మధ్య ఎలాంటి మోసాలు ఉండవని స్థానిక పంటర్ ఒకరు మీడియాకు తెలిపారు. ఎన్డీయేపైనా 80పైసలు, మహాకూటమిపైన 1.20 రూపాయలు బెట్టింగ్ నడుపుతున్నట్టు పంటర్లు తెలిపారు. ఎవరైనా ఎన్డీయేపై లక్ష రూపాయలు బెట్టింగ్ పెడితే ఎన్డీయే గెలిచిన పక్షంలో అతనికి 80వేల రూపాయల లాభం వస్తుంది. పంటర్ల అంచనాలు చాలాసార్లు తలకిందులవుతుంటాయి. గత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ఆద్మీ పార్టీకి 20 సీట్లు వస్తాయని మొదలు పెట్టిన సత్తా మార్కెట్ 34 సీట్ల వరకు వెళ్లింది. ఏకంగా 67 సీట్లను సాధించి ఆమ్ఆద్మీ పార్టీ అందరి అంచనాలు తలకిందులు చేసింది. -
'రిజర్వేషన్లపై మోదీ మతం రంగు పులుముతున్నారు'
పట్నా: రిజర్వేషన్ల అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ మతాలను వాడుకుంటున్నారని ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ ఆరోపించారు. బిహార్ అసెంబ్లీ మూడో విడత ఎన్నికల ర్యాలీలో సోమవారం, మంగళవారం ప్రధాని చేసిన వ్యాఖ్యలు వాటికి ఊతమిస్తున్నాయని బుధవారం లాలు వ్యాఖ్యానించారు. ఓటేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, లాలు ప్రసాద్, నితీష్ల కూటమి అధికారంలోకి వస్తే భవిష్యత్తులో రిజర్వేషన్లు ప్రమాదకరస్థితిలో ఉంటాయని దేశ ప్రధాని స్థాయికి ఇది తగదన్నారు. మతాల పరంగా రిజర్వేషన్లు కల్పిస్తారంటూ ప్రధానిగా ఉన్న వ్యక్తి వ్యాఖ్యానించడం సబబు కాదన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీలకు ఇవ్వాల్సిన 5 శాతం రిజర్వేషన్ వారికి దూరం చేసి, ఇతర మతాల వారికి ఇస్తారని మోదీ తన ర్యాలీలో పేర్కొనడంపై లాలు మండిపడ్డారు. దళితులు, ఓబీసీల రిజర్వేషన్లను దేశంలో ఎవరూ తొలగించలేరని, బిహార్ ఎన్నికల ఫలితాలు ఎన్డీఏ కూటమిని దిగ్భ్రాంతికి గురిచేస్తాయని చెప్పారు. మహాకూటమి కచ్చితంగా ఈ ఎన్నికలలో విజయం సాధిస్తుందని, తమకు కావలసిన మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. -
తాంత్రికుడితో సీఎం భేటీ!
♦ వీడియో విడుదల చేసిన బీజేపీ ♦ మహాకూటమిపై నిప్పులు ♦ మంత్ర తంత్రాలతో గెలవరన్న కేంద్ర మంత్రి జైట్లీ పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఓ తాంత్రికుడిని కలిసిన వీడియో ఎన్నికల ప్రచారంలో సంచలనం సృష్టిస్తోంది. ఓ జేడీయూ ఎమ్మెల్యే అభ్యర్థితో కలసి నితీశ్ క్షుద్ర విద్యలను ఆచరించే గురువు దగ్గరకు వెళ్లి.. ఆయన పక్కన కూర్చున్న వీడియో మీడియాలో, సోషల్ మీడియాలో వైరస్లా పాకిపోయింది. బీజేపీ ఎంపీ గిరిరాజ్ సింగ్ ఈ వీడియోను మీడియాకు రిలీజ్ చేశారు. ఈ వీడియోలో నితీశ్.. ఓ తాంత్రికుడి పక్కన కూర్చుని ఉన్నారు. ‘ఆర్జేడీ అధినేత లాలూతో మీరెందుకు కలిశారు. మీరు ఒంటరిగా పోటీ చేస్తే బాగుండేది. నితీశ్ జిందాబాద్.. లాలూ ముర్దాబాద్’ అని ఆ తాంత్రికుడు నితీశ్ను ఆశీర్వదించి హత్తుకున్నట్లు వీడియోలో కనబడుతోంది. లాలూ పీడ వదిలించుకునేందుకే నితీశ్.. ఆ తాంత్రికుడిని కలిశారని బీజేపీ విమర్శించింది. బిహార్ ఎన్నికల ప్రచారంలో ప్రధాన మంత్రిపై విమర్శలు చేస్తూ.. ‘కొన్ని శక్తులను రాష్ట్రం నుంచి బయటకు పంపించేందుకు ఏమేం చేయాలో తమకు తెలుస’ని లాలూ చేసిన వ్యాఖ్యలను గిరిరాజ్ సింగ్ గుర్తుచేశారు. ఎన్నికల్లో గెలిచేందుకు తాంత్రికులను సంప్రదించటం సిగ్గుచేటని నితీశ్పై విరుచుకుపడ్డారు. పరిస్థితి సరిగా లేనప్పుడు మంత్ర, తంత్రాలు పనిచేయవని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ.. పరోక్షంగా నితీశ్ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. ప్రధాని పదవినే అవమానించారు ఎన్నికల ప్రచారంలో ప్రధాని అనుచిత భాష వాడి ఆయన పదవినే కించపరిచారని నితీశ్ కుమార్ విమర్శించారు. ‘సైతాన్, అహంకారి’ వంటి పదాలను వాడటం ప్రధాని స్థాయికి మంచివి కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని.. దేశంలో 300 జిల్లాలకు పైగా కరువుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా.. ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఉందన్నారు. హరియాణాలో దళిత బాల సజీవ దహనంపై ప్రధాని నోరు ఎందుకు మెదపటం లేదని ప్రశ్నించారు. ఘటన జరిగి నాలుగు రోజులు గడుస్తున్నా మోదీ పెదవి విప్పలేదని.. పైగా గాంధీ ఆలోచనలు పాటించాలని చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. ‘బిహార్లో జంగిల్ రాజ్ అని విమర్శిస్తున్న వారు.. హరియాణాలో మంగళ్ రాజ్(సుపరిపాలన) ఉందా? సమాధానం ఇవ్వాల’ని ఓ ఎన్నికల సభలో డిమాండ్ చేశారు. మాంఝీనే సీఎం అని చెప్పలేదే: షా ‘బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ గెలిస్తే.. నేనే సీఎం అవుతాన’న్న హిందుస్థానీ అవామీ మోర్చా చీఫ్, మాజీ సీఎం జితన్ రాం మాంఝీ వ్యాఖ్యలపై బీజేపీ చీఫ్ అమిత్ షా స్పందించారు. మాంఝీకి అలాంటి భరోసాలేమీ ఇవ్వలేదని ఓ టీవీ చానల్తో అన్నారు. సీఎం ఎవరినీ ప్రతిపాదించకపోవటంపై వస్తున్న విమర్శలకు స్పందిస్తూ.. బీజేపీది టీమ్ వర్క్ అని.. మహారాష్ట్ర, జార్ఖండ్లలో.. పార్టీ గెలిచాకే ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేసిన విషయాన్ని గుర్తుచేశారు. -
'డ్రీమ్ గాల్'ను తలుచుకున్న మాజీ సీఎం
పాట్నా: బిహార్ రహదారులను హేమమాలిని బుగ్గలు మాదిరిగా నున్నగా తయారుచేస్తానని గతంలో ప్రకటించిన మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మరోసారి 'డ్రీమ్ గాల్'ను తలుచుకున్నారు. బిహార్ బీజేపీ హేమమాలిని కూడా కాపాడలేరని ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించారు. 'హేమమాలినితో ఓటర్లను ఆకట్టుకోవాలనుకుంటే బీజేపీ పప్పులో కాలేసినట్టే' అని లాలూ అన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున హేమమాలిని స్టార్ కాంపైనర్ గా కొనసాగుతున్నారు. కాగా, రిజర్వేషన్లను రద్దు చేయాలని బీజేపీ భావిస్తోందని లాలూ ఆరోపించారు. రిజర్వేషన్ల విధానాన్ని సమీక్షించాలన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ తో ఏకీభవిస్తున్నారో, లేదో బీజేపీ నాయకులు స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
పప్పూ యాదవ్ పడిపోయారు!
పార్టీతో పనిలేదు.. క్యారెక్టర్ అంతకన్నా అవసరం లేదు.. చాంతాడంత కేసుల సంగతీ అక్కర్లేదు. కేవలం పాపులారిటీనే కొలమానంగా తీసుకుంటే ప్రముఖ నేతల జాబితాలో పప్పు యాదవ్ పేరు తప్పక ఉంటుంది. లాలూ ప్రసాద్ యాదవ్ సమీప బంధువుగా, ఆర్జేడీ కీలక నేతగా చాలాకాలంపాటు బిహార్ లో 'రాజ్ నీతి' లో ఆరితేరిన రాజేశ్ రంజన్ అలియాస్ పప్పూ యాదవ్ అత్యంత వివాదాస్పద నాయకుడని తెలిసిందే. లాలూకు దూరమైన తర్వాత సొంతగా జన్ అధికార్ పార్టీ (జేఏపీ)ని స్థాపించి, అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టారు. సోమవారం సీతామర్తీ జిల్లాలోని పరిహార్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న పప్పూ యాదవ్ వేదిక కూలి కిందపడిపోయారు. దీంతో ఆయన కాలికి స్వల్పగాయాలయ్యాయి. పలువురు నేతలు తీవ్రంగా గాయపడ్డారు. 'నారంగా గ్రామంలో ఏర్పాటుచేసిన ప్రచార సభా వేదికపై జనం ఎక్కువ కావడంతో ఒక్కసారిగా కూలిపోయింది. పప్పూ యాదవ్ కాలికి గాయమైంది. ప్రాథమిక చికిత్స అనంతరం కోలుకున్న ఆయన.. పక్కగ్రామంలో మరో సభలో పాల్గొన్నారు' అని పప్పూ వ్యక్తిగత సహాయకుడు తెలిపారు. ములాయం సింగ్ యాదవ్, శరద్ పవార్ లతో కలిసి మూడో ఫ్రంట్ ను ఏర్పాటుచేసిన పప్పూయాదవ్.. మహాకూటమి, ఎన్డీఏలను ఎదుర్కొంటున్నారు. అయితే, సమాజ్ వాదీ పార్టీ.. బీజేపీ అనుకూల వ్యాఖ్యలు చేస్తోందని పవార్ ధర్డ్ ఫ్రంట్ కు దూరమయ్యారు. సమాజ్ వాదీ పార్టీకి బిహార్ లో ఆదరణలేదు. దీంతో థర్డ్ ఫ్రంట్ కు.. ఫ్రెంటు, బ్యాకూ తానే అయి పోరాడుతున్నారు పప్పూ యాదవ్. -
బిహార్ ఎన్నికల్లో డబ్బు హవా...
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికలంటే పోలింగ్ కేంద్రాల ఆక్రమణ, పోలింగ్ యంత్రాల అపహరణలాంటి అంశాలు తరచుగా వినిపించేవి. ఇప్పుడవి గతించిన అంశాలు. కేంద్ర బలగాలతోని పోలింగ్ కేంద్రాలకు పటిష్ట భద్రతను కల్పించడం, అందుకు వీలుగా పోలింగ్ విడతలను పెంచడం లాంటి చర్యల వల్లన అవి గతకాలపు విద్యలుగా మారిపోయాయి. వాటి స్థానంలో ఇప్పుడు ధనలక్ష్మి తన ప్రభావాన్ని చూపిస్తోంది. నోటుతో ఓటు కొనడం సర్వ సాధారణమై పోయింది. ఈ సంస్కృతి రోజు రోజుకు పెరిగిపోతోంది. 2010లో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఒకటిన్నర కోటి రూపాయల డబ్బును ఎన్నికల కమిషన్ వర్గాలు పట్టుకోగా గత లోక్సభ ఎన్నికల సందర్భంగా నాలుగు కోట్ల రూపాయల డబ్బును పట్టుకున్నాయి. ఇప్పడు జరుగుతున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రెండు విడతల పోలింగ్ సందర్భంగా ఇప్పటికే 20 కోట్ల రూపాయలను ఎన్నికల కమిషన్ వర్గాలు పట్టుకున్నాయి. ఇంకా మూడు విడతల పోలింగ్ మిగిలే ఉంది. ఓ టెలివిజన్ ఛానెల్ నిర్వహించిన స్ట్రింగ్ ఆపరేషన్ కారణంగా మరో 19 కోట్ల రూపాయలను ఆదాయం పన్నుశాఖ అధికారులు పట్టుకున్నారు. పట్టుబడిన డబ్బు సంగతి పక్కన పెడితే పట్టుపడకుండా రాజకీయ పార్టీలు, నాయకుల ద్వారా నేరుగా ఓటర్ల జేబుల్లోకి వెళుతున్న డబ్బుకు లెక్కే లేదు. గతంలో పోలింగ్ కేంద్రాలను ఆక్రమించుకోవడం రిగ్గింగ్ చేయడం, పోలింగ్ యంత్రాలను ఎత్తుకుపోవడంలో ప్రధాన పాత్ర వహించినవారిలో అగ్రవర్ణాల వారిదే పైచేయి కాగా, ఈసారి డబ్బు ప్రలోభపెడుతున్న వారిలో కూడా వారిదే పైచేయిగా కనిపిస్తోంది. డబ్బులు చేతులు మారకుండా ఆధునిక జీపీఎస్ వ్యవస్థ ఆధారంగా రాజకీయ నేతలు, కార్యకర్తల కదలికలపై ఎన్నికల కమిషన్ వర్గాలు గట్టి నిఘా పెడుతున్నప్పటికీ వారికి చిక్కకుండా రాజకీయ నాయకులు వినూత్న పద్ధతులను అనుసరిస్తున్నారు. మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్వై ఖురేషి రాసిన ‘యాన్ అన్డాక్యుమెంటెడ్ వాండర్-ది మేకింగ్ ఆఫ్ ది గ్రేట్ ఇండియన్ ఎలక్షన్’ పుస్తకంలో వెల్లడించిన అంశాల ప్రకారం పండుగలు, పబ్బాల పేరిట ఓటర్లకు డబ్బు పంచుతున్నారు. దొంగ పుట్టిన రోజుల పేరుమీద ఓటర్లకు నగదు, చీరలు, దోవతులు తదితర బహుమతులను పంచుతున్నారు. ఓటర్ల గృహాల వద్ద నకిలీ హారతి కార్యక్రమాలను ఏర్పాటుచేసి వాటి ద్వారా డబ్బు పంచుతున్నారు. తమిళనాడు ఎన్నికల్లో టన్నుల కొద్ది చీరలు, దోవతులతోపాటు వేలాది గ్యాస్ స్టవ్లు, వాషింగ్ మిషన్లను ఓటర్లకు పంచారని ఆ పుస్తకంలో ఖురేషి తెలిపారు. స్థానిక మనీలెండర్ల ద్వారా కూడా డబ్బుల పంపిణీ జరిగినట్టు ఆయన చెప్పారు. 2009లో మధురైలోని తిరుమంగలమ్ ఉప ఎన్నికల్లో డీఎంకే పార్టీ కార్యకర్తలు ఓటుకు ఐదు వేల రూపాయల చొప్పున పంచినట్టు ఆయన వెల్లడించారు. ఎన్నికల్లో ఈ డబ్బు ప్రభావాన్ని అరికట్టేందుకు లా కమిషన్ చేసిన సిఫార్సులపై కసరత్తు ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. -
రెండోదశలో 55% పోలింగ్బిహార్
ఎన్నికలు ప్రశాంతం పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో శుక్రవారం జరిగిన రెండోదశలో 55 శాతం పోలింగ్ నమోదైంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో ఆరు జిల్లాల్లోని 32 నియోజకవర్గాలకు జరిగిన పోలింగ్లో ఒకటి, రెండు చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. రెండోదశలో మహిళా ఓటర్లే అధికంగా పోలింగ్ బూత్లకు తరలివచ్చారని ప్రధాన ఎన్నికల అధికారి వెల్లడించారు. మహిళల్లో 57.5 శాతం మంది పోలింగ్లో పాల్గొనగా... పురుషుల్లో 52.5 శాతం మంది ఓట్లేశారని ఆయన చెప్పారు. గయ జిల్లాలోని ఇమామ్గంజ్ నియోజకవర్గ పరిధిలో రెండు బాంబులను సీఆర్పీఎఫ్ సిబ్బంది గుర్తించి నిర్వీర్యం చేశారని ఎన్నికల అధికారి తెలిపారు. రెండోదశలో కైమూర్ నియోజకవర్గంలో అత్యధికంగా 57.86 శాతం పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా ఔరంగాబాద్లో 52.5 శాతం పోలింగ్ జరిగింది. ఇమామ్గంజ్ నియోజకవర్గం నుంచి స్పీకర్ చౌదరీతో తలపడుతున్న మాంఝీ శుక్రవారం ఓటేశారు. ఎన్డీఏ గెలుపు అభివృద్ధికి ఊతం: బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏకి అనుకూలంగా తీర్పిస్తే అభివృద్ధికి ఊతం లభిస్తుందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఎన్డీఏ గెలిస్తే రాజ్యసభలో బలం పెరిగి కీలక బిల్లుల ఆమోదం సాధ్యమవుతుందని, దేశ అభివృద్ధిలో ముందుకు సాతుందని శుక్రవారమిక్కడ విలేకర్లతో పేర్కొన్నారు. కాగా, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ కుడి చేతిపై ఫ్యాన్ పడటంతో స్వల్పంగా గాయపడ్డారు. తూర్పు చంపారన్ల్ లో ఎన్నికల సభా వేదికపై టీ తాగుతుండగా శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. మహాకూటమికి స్వల్ప ఆధిక్యం! న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిపై.. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ల మహాకూటమి స్వల్ప ఆధిక్యం చూపే అవకాశముందని ఇండియా టుడే-సిసిరో గ్రూపు తాజా సర్వేలో తేలింది. తొలిదశ ఎన్నికలు జరిగిన ఈ నెల 12కు కొన్ని రోజుల ముందు ఈ గ్రూపు నిర్వహించిన రెండో సర్వేలో మొత్తం 243 సీట్లకు గాను మహాకూటమికి 122 సీట్లు, ఎన్డీఏకు 111 సీట్లు దక్కొచ్చని వెల్లడైంది. అయితే ఇదే గ్రూపు నెల కిందట నిర్వహించిన తొలి సర్వేలో ఎన్డీఏకు 125, మహాకూటమికి 106 సీట్లు వస్తాయని తేలడం గమనార్హం. తొలి సర్వేలో యువ ఓటర్లలో 46 శాతం మంది బీజేపీపై మొగ్గు చూపగా రెండో సర్వేలో వారి శాతం 36కు పడిపోయింది. తొలి సర్వేలో సీఎం పదవికి నితీశ్పై 28 శాతం మంది, రెండో సర్వేలో 38 శాతం మొగ్గుచూపారు. -
రెండో దశ పోలింగ్.. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా బుధవారం రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. నేడు పోలింగ్ జరగనున్న ఆరు జిల్లాల్లో నిషేధిత మావోయిస్టు పార్టీకి గట్టి పట్టుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమయ్యే సమయానికే ఓటర్లు పోలింగ్ స్టేషన్లకు చేరుకున్నారు. ప్రస్తుతం ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదని తెలుస్తున్నది. కైమూర్, రోహ్ తాస్, అర్వాల్, జహనాబాద్, ఔరంగాబాద్, గయా జిల్లాల్లోని మొత్తం 32 నియోజకవర్గాల్లో వివిధ పార్టీలకు చెందిన 456 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలు కావడంతో 11 నియోజకవర్గాల్లో సాయంత్ర 3 గంటలకే పోలింగ్ ప్రక్రియ నిలిపివేయనున్నట్లు అడిషనల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆర్. లక్ష్మణణ్ తెలిపారు. మరో 12 నియోజకవర్గాల్లో సాయంత్ర 4 గంటల వరకు, కేవలం 9 నియోజవర్గాల్లో మాత్రమే సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామన్నారు. మొత్తం 86, 13, 870 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ మేరకు 9, 119 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటయ్యాయి. 10 జిల్లాల్లోని 49 నియోజకవర్గాల్లో ఈ నెల 12 న జరిగిన మొదటి దశ పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. మూడో దశ 28న, నాలుగో దశ నవంబర్ 1న, ఐదో దశ నవంబర్ 5న పోలింగ్ జరగనుంది.