పొంగమంచు కారణంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది.
న్యూఢిల్లీ: పొంగమంచు కారణంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. పొంగ మంచు దట్టంగా అలముకోవడంతో వెలుతురు మందగించి విజిబిలిటి 50 మీటర్ల దిగువనకు పడిపోయింది.
ఫలితంగా ఆరు గంటల పాటు విమాన రాకపోకలు స్తంభించాయి. 173 విమానాలు ఆలస్యంగా నడిచాయని విమానాశ్రయ అధికారులు తెలిపారు. ప్రతికూల వాతావరణంగా రెండు విమాన సర్వీసులు రద్దు చేశారు.