రాజ్యాంగ పరిధికి లోబడి ఉమ్మడి రాజధాని: దిగ్విజయ్ | Hyderabad is Joint Capital as per Constitution:Digvijaya Singh | Sakshi
Sakshi News home page

రాజ్యాంగ పరిధికి లోబడి ఉమ్మడి రాజధాని: దిగ్విజయ్

Published Wed, Nov 27 2013 11:52 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

రాజ్యాంగ పరిధికి లోబడి ఉమ్మడి రాజధాని: దిగ్విజయ్ - Sakshi

రాజ్యాంగ పరిధికి లోబడి ఉమ్మడి రాజధాని: దిగ్విజయ్

రాజ్యాంగ పరిధికి లోబడి హైదరాబాద్ను ఉమ్మడి రాజధాని చేస్తామని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ చెప్పారు.

న్యూఢిల్లీ: రాజ్యాంగ పరిధికి లోబడి హైదరాబాద్ను ఉమ్మడి రాజధాని చేస్తామని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు  దిగ్విజయ్ సింగ్ చెప్పారు. ఆ అవకాశం రాజ్యాంగంలో ఉందని తెలిపారు.  ఉమ్మడి రాజధానికి రాజ్యాంగ సవరణ అవసరంలేదన్నారు. ఈరోజు ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు సంబంధించి ఆంటోని కమటీ సీఫార్సులు జిఓఎంకు అందించినట్లు తెలిపారు. జిఓఎం ఈ రోజు  నివేదిక సిద్ధం చేస్తుందని చెప్పారు. అన్ని అంశాలను జిఓఎం పరిశీలిస్తుందన్నారు. జిఓఎం నివేదిక కేంద్ర మంత్రి మండలి మందుకు వస్తుందని చెప్పారు. తెలంగాణ బిల్లు త్వరలో అసెంబ్లీకి ముందుకు వస్తుందన్నారు. ఈ శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెడతామని  దిగ్విజయ్ చెప్పారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి  తన అభిప్రాయాలను అధిష్టానానికి  తెలియజేయడంలో తప్పులేదన్నారు. అధిష్టానం నిర్ణయాన్ని ముఖ్యమంత్రి గౌరవిస్తారని చెప్పారు.  సిడబ్ల్యూసి నిర్ణయానికి కట్టుబడి ఉండాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement